TRUTH &TRUST


MAITHRI CHANNEL

ఐబొమ్మ రవికి తాము జాబ్ ఆఫర్ చేశామని వచ్చిన ఫేక్ వార్తలను కొట్టిపారేసిన సైబర్ క్రైం డీసీపీ అరవింద్ బాబు

ఐబొమ్మ రవికి మేము జాబ్ ఆఫర్ చేశామనడం అవాస్తవం

8 రోజుల కస్టడీలో రవి కొన్నిటికి మాత్రమే సమాధానం చెప్పాడు

అతనికి తప్పు చేశానన్న బాధ అసలు లేదు.. అతను 3 బెట్టింగ్ యాప్‌లను ప్రమోట్ చేసినట్లు గుర్తించాం

ఆర్థిక లావాదేవీలపై ఇంకా వివరాలు రాబట్టాల్సి ఉంది - సైబర్ క్రైం డీసీపీ అరవింద్ బాబు

1 week ago | [YT] | 5

MAITHRI CHANNEL

బ్రేకింగ్ న్యూస్

శబరిమలలో ఉద్రిక్తత

తెలుగు రాష్ట్రానికి చెందిన భక్తుడి తల పగలగొట్టిన స్థానిక వ్యాపారి

వాటర్ బాటిల్ ధర ఎక్కువగా ఉందని ప్రశ్నించడంతో, భక్తుడి తలపై గాజు సీసాతో దాడి చేసి, హైదరాబాద్ నగరానికి చెందిన ఒక భక్తుడి మాలను తెంపేసిన వ్యాపారి

షాపు వద్దకు భారీగా చేరుకుని నిరసనకు దిగిన తెలుగు రాష్ట్రాలకు చెందిన భక్తులు

భక్తులను, స్థానిక వ్యాపారులను అడ్డుకుంటున్న పోలీసులు
(File Pic)

1 week ago | [YT] | 7

MAITHRI CHANNEL

ప్రమాదంలో శ్రీశైలం డ్యామ్

డ్యామ్ దిగువన ప్లంజ్ పూల్ వద్ద ఏర్పడిన భారీ రంద్రం ప్రమాదకరంగా మారిందని నిపుణుల కమిటీ ఆందోళన

కృష్ణానదిపై ఉన్న శ్రీశైలం డ్యామ్ వద్ద అండర్ వాటర్ పరిశీలనలు చేసి, ప్లంజ్ పూల్ వద్ద ఏర్పడిన రంద్రం డ్యామ్ పునాదుల కంటే ఎక్కువ లోతుకు విస్తరించిందని తెలిపిన నిపుణుల కమిటీ

ఈ రంద్రం 35–45 మీటర్లు ఉందని, అప్రాన్ వద్ద మొదలయ్యి 150 మీటర్ల మేర, డ్యామ్ వైపు 14–15 మీటర్లు విస్తరించిందని నిపుణుల కమిటీ నివేదికలో వెల్లడి

డ్యామ్ భద్రత ప్రశ్నార్థకంగా ఉందని, ప్రభుత్వం వెంటనే స్పందించి మరమ్మత్తు పనులు చేపట్టాలని సూచించిన నిపుణుల కమిటీ

File photo

1 week ago | [YT] | 3

MAITHRI CHANNEL

బ్రేకింగ్ న్యూస్

ఈరోజు సాయంత్రం 6 గంటలకు సర్పంచ్ ఎన్నికల నోటిఫికేషన్ విడుదల చేయనున్న తెలంగాణ రాష్ట్ర ఎన్నికల కమిషనర్..

2 weeks ago | [YT] | 4

MAITHRI CHANNEL

*_Telangana Govt: రెండేళ్లలోపు చిన్నారులకు దగ్గు మందు ఇవ్వొద్దు..!!_*
*_రాష్ట్ర వైద్యశాఖ హెచ్చరిక_*
_చిన్నారులకు దగ్గు, జలుబు రాగానే సిర్‌పల వైద్యం ప్రమాదకరమని రాష్ట్ర ప్రభుత్వం హెచ్చరించింది. పిల్లలకు దగ్గు మందుల వాడకంపై జాగ్రత్తలు పాటించాలని డైరెక్టరేట్‌ జనరల్‌ ఆఫ్‌ హెల్త్‌ సర్వీసెస్‌ సూచనల మేరకు వైద్యులు, తల్లిదండ్రులకు వైద్య ఆరోగ్యశాఖ సోమవారం అడ్వయిజరీ జారీ చేసింది._
_రెండేళ్లలోపు బాలలకు దగ్గు మందు ఇవ్వొద్దని, ఐదేళ్లలోపు పిల్లలకూ సాధారణంగా సిర్‌పలు వాడొద్దని పేర్కొంది. ఐదేళ్లు దాటిన చిన్నారులకు అవసరమైన మేరకు వైద్యుల పర్యవేక్షణలో సరైన మోతాదులో తక్కువ కాలంపాటు సిర్‌పలు వినియోగించాలని సూచించింది. ప్రభుత్వ, ప్రైవేటు ఆస్పత్రులు కూడా నాణ్యమైన తయారీ ప్రమాణాలతో కూడిన ఉత్పత్తులే రోగులకందించాలని కోరింది. ఇదిలా ఉంటే, 2025 మే నుంచి 2027 ఏప్రిల్‌ వరకూ గడువు గల ఎస్‌ఆర్‌-13 బ్యాచ్‌ కోల్ర్డిఫ్‌ సిర్‌పను వాడొద్దని రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ హెచ్చరించింది._
_తమిళనాడులోని స్రేసన్‌ కంపెనీ తయారు చేసిన ఈ సిరప్‌ కలిగి ఉన్న వారు వెంటనే సమీప ఔషధ నియంత్రణ అధికారులకు అప్పగించాలని కోరింది. సంబంధిత ఫిర్యాదుల కోసం టోల్‌ ఫ్రీ నంబర్‌ 1800-599-6969 అందుబాటులోకి తెచ్చింది. అన్ని ప్రభుత్వ, ప్రైవేటు ఆస్పత్రులు, ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు, జిల్లా ఆసుపత్రులు, బోధనాస్పత్రులకు ఈ సూచనలను తెలపడంతోపాటు కఠినంగా అమలు చేయాలని డీఎంహెచ్‌వోను ఆదేశించింది. దగ్గుమందుపై ప్రజల్లో అవగాహన కార్యక్రమాలు కూడా నిర్వహించాలని కోరింది._

2 months ago | [YT] | 6

MAITHRI CHANNEL

8న టాస్క్ కేంద్రంలో జాబ్ మేళా: జిల్లా కలెక్టర్

8న టాస్క్ కేంద్రంలో జాబ్ మేళా: జిల్లా కలెక్టర్
పెద్దపల్లి జిల్లాలోని నిరుద్యోగ యువతకు టెలి పెర్ఫార్మెన్స్ ప్రైవేట్ కంపెనీ లిమిటెడ్ లో ఉద్యోగాలు కల్పించేందుకు ఈనెల 8న పెద్దపల్లి పాత ఎంపీడీఓ కార్యాలయ ఆవరణలోని టాస్క్ కేంద్రం వద్ద జాబ్ మేళా నిర్వహిస్తున్నట్లు జిల్లా కలెక్టర్ కోయ శ్రీహర్ష తెలిపారు. కస్టమర్ సర్వీస్ అసోసియేట్, కంటెంట్ మోడరేటర్, అనలిస్ట్ పోస్టులు ఖాళీగా ఉన్నాయి. ఆసక్తి గల అభ్యర్థులు సర్టిఫికేట్ జిరాక్స్ లు, రెజ్యూమ్ లతో జాబ్ మేళాకు హాజరు కావాలని సూచించారు.

2 months ago | [YT] | 5

MAITHRI CHANNEL

బ్రేకింగ్ న్యూస్

సుప్రీంకోర్టులో బీసీ రిజర్వేషన్లపై ముగిసిన విచారణ

బీసీ రిజర్వేషన్ల అంశం హైకోర్టులో తేల్చుకోవాలని పిటిషనర్‌కు తెలిపిన సుప్రీంకోర్టు

బీసీ రిజర్వేషన్లకు వ్యతిరేకంగా దాఖలైన పిటిషన్‌ను కొట్టేసిన సుప్రీంకోర్టు

2 months ago | [YT] | 6

MAITHRI CHANNEL

బీసీ రిజర్వేషన్ల జీవోపై తెలంగాణ హైకోర్టు కీలక వ్యాఖ్యలు

గవర్నర్ దగ్గర బీసీ బిల్లు పెండింగ్లో ఉండగా, మీరు GO విడుదల చేసి, ముందుకు పోతాం అంటే ఎలా?

గవర్నర్ దగ్గర బిల్లు పెండింగ్లో ఉన్నప్పుడు జీవో విడుదల చేయడం సరికాదు.

రిజర్వేషన్లు 50 శాతం మించకుండా ఉండాలి అనే నిబంధన ఉంది కదా!

బీసీ రిజర్వేషన్ల జీవో పిటిషన్‌పై విచారణను అక్టోబర్ 8కి వాయిదా వేసిన హైకోర్టు

ఈ సమయంలో ఎన్నికల నోటిఫికేషన్ ఇచ్చినా మెరిట్ ఆధారంగా విచారిస్తామన్న హైకోర్టు

2 months ago | [YT] | 7

MAITHRI CHANNEL

ఈవీఎంలపై ఎన్నికల కమిషన్ కీలక నిర్ణయం

ఈవీఎంలపై అభ్యర్థుల పేర్లు, గుర్తులతో పాటు వారి కలర్ ఫోటోలు కూడా పెట్టాలని ఈసీ నిర్ణయం

బీహార్ ఎన్నికల నుండి ఈ ప్రక్రియను ప్రారంభించనున్న ఎన్నికల కమిషన్

2 months ago | [YT] | 2

MAITHRI CHANNEL

సిరిసిల్ల కలెక్టర్ సందీప్ కుమార్ ఝాకు హైకోర్టు వారెంట్

మిడ్ మానేరులో తన ఇంటిని కోల్పోగా, అధికారులు నష్టపరిహారం చెల్లించలేదని కోర్టును ఆశ్రయించిన చీర్లవంచకు చెందిన నిర్వాసితుడు వేల్పుల ఎల్లయ్య

ఎల్లయ్యకు పరిహారం చెల్లించాలని గత జూన్‌లో తీర్పు వెల్లడించిన హైకోర్టు

పరిహారం చెల్లించకపోవడమే కాకుండా, కోర్టుకు హాజరవ్వని జిల్లా కలెక్టర్ సందీప్ కుమార్ ఝా

ఈ రోజు హాజరు కావాల్సి ఉండగా, గైర్హాజరు అవ్వడమే కాకుండా ఎలాంటి రిప్లై ఇవ్వకపోవడంతో కలెక్టర్ సందీప్ కుమార్ ఝాకు జడ్జి వారెంట్ ఇష్యూ చేసినట్లు తెలిపిన పిటిషనర్ తరపు న్యాయవాది

2 months ago | [YT] | 5