అధ్యయనం. ఆచార్య పి.బి. రవిప్రసాద్ అంతరంగ మథనంలోంచి ఆవిష్కృతమైన అనుదిన లేఖన విశ్లేషణా పథం.
పఠనం, ధ్యానం, పరివర్తనం ఈ పథ విధానాలు
దేవ గ్రంధంలోని ప్రతీ పుస్తకాన్ని వరుసగా వచనం వెంబడి వచనాన్ని భిన్నకోణాల్లోంచి దృష్టిస్తూ, వర్తమాన వాస్తవ పరిస్థితుల కనుగుణంగా విశ్లేషిస్తున్న విశిష్ట వినూత్న కార్యక్రమం.
ఇప్పటివరకు పూర్వ నిబంధనలోని దేవ సృజన గ్రంధమైన ఆదికాండాన్ని, నవ నిబంధనలో పౌలు విరచితాలైన తొలి థెస్సలోనిక, గలతీ, ఫిలిఫ్ఫీ, తొలి, తుది కొరింధీ, రోమా, ఫిలేమోను, తుది థెస్సలోనిక, కొలస్సీ, ఎఫెసీ పత్రికలు ఇంకా కాపరి పత్రికల విశ్లేషణను పూర్తి చేసికొని ప్రస్తుతం మార్కు సువార్తను ప్రాతిపదికగా చేసికొని మత్తయి, లూకా సువార్తలను సమాంతరంగా అధ్యయనం చేస్తున్నాం.
ఇలా పవిత్ర గ్రంధంలోని పుస్తకాలన్నింటినీ రచనా కాలపట్టిక ననుసరించి వరుసగా విశ్లేషించాలన్నది అధ్యయన దార్శనికులు ఆచార్య పి.బి. రవిప్రసాద్ గారి మహదాశయం.
సోమవారం నుండి శనివారం వరకు ఫేస్ బుక్ లో Babu Ravi Prasad Penke పేజీ నుండి ప్రత్యక్ష ప్రసారమయ్యే ఈ కార్యక్రమాన్ని ఉదయం 11:00 గంటలకు వీక్షించండి.
Shared 1 month ago
12 views
Shared 2 months ago
4 views
Shared 2 months ago
8 views
Shared 2 months ago
3 views
Shared 3 months ago
32 views
Shared 3 months ago
13 views
Shared 3 months ago
9 views