Power Telugu TV is an official YouTube channel where you can watch the latest breaking news, political updates, trending topics, exclusive interviews, and viral stories, with a primary focus on Andhra Pradesh and Telangana politics.
Our channel delivers timely news, insightful political discussions, and exclusive interviews that keep viewers informed about the latest developments. We also feature celebrity interviews and other engaging content, produced by an experienced team committed to delivering reliable and relevant information.
Subscribe to Power Telugu TV and never miss the latest news, political updates, exclusive interviews, trending stories, and special programs.
Power Telugu TV
సూపర్ సిక్స్... సూపర్ హిట్...
రాష్ట్ర వ్యాప్తంగా తల్లికి వందనం నిధులు విడుదల. అర్హులైన విద్యార్థుల తల్లుల ఖాతాల్లో నిధులు జమ. తమ నలుగురు బిడ్డలకు సంబంధించి "తల్లికి వందనం" డబ్బులు తన భార్య ఖాతాల్లో పడ్డాయని సంతోషం వ్యక్తం చేస్తూ మెసేజ్ చేసిన లబ్దిదారుడు వి.సుబ్బారావు.
#TallikiVandanam
#Super6SuperHit
#IdhiManchiPrabhutvam
#ChandrababuNaidu
#NaraLokesh
#AndhraPradesh
5 days ago | [YT] | 36
View 1 reply
Power Telugu TV
ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ను పరామర్శించిన మంత్రి లోకేష్
ఇటీవల ముంబైలో భుజానికి శస్త్రచికిత్స చేయించుకున్న పవన్ కల్యాణ్
హైదరాబాద్ నివాసంలో విశ్రాంతి తీసుకుంటున్న డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ను నారా లోకేష్ పరామర్శించారు. ఈ సందర్భంగా ఆయన ఆరోగ్యం గురించి అడిగి తెలుసుకున్నారు. @naralokeshofficial @PawanKalyanAPDeputyCM
1 week ago | [YT] | 638
View 6 replies
Power Telugu TV
గుటుపల్లి రైతులకు పట్టాలు :
• ఈ ఏడాది మార్చి 9న గౌరవ ముఖ్యమంత్రి...డోన్ మండలం కొత్తబురుజు గ్రామ పర్యటన సందర్భంగా వినతిపత్రం సమర్పించిన రైతులు.
• బేతంచెర్ల మండలం గుటుపల్లి గ్రామంలోని 215 సర్వే నంబర్లలో ఉన్న 2,669 ఎకరాల పట్టా, సర్వీస్ ఇనాం భూములు రిజిస్ట్రేషన్ చట్టం, 1908లోని సెక్షన్ 22A(1)(C) కింద వక్ఫ్ ఆస్తులుగా పొరపాటున నిషేధిత జాబితాలో చేర్చారని రైతుల ఆవేదన
• భూములపై లావాదేవీలు చేయలేక పోతున్నామని, సమస్య పరిష్కరించాలని నాడు రైతుల వినతి.
• సమగ్ర పరిశీలన తర్వాత 426 ఎకరాల వక్ఫ్ భూములతో పాటు రైతుల పట్టా భూములు కూడా 2023 ఫిబ్రవరిలో నిషేధిత జాబితాలో చేర్చినట్లు గుర్తింపు. విచారణలో పట్టా భూములుగా నిర్ధారణ.
• అనంతరం మైనారిటీ సంక్షేమ శాఖ కార్యదర్శి, వక్ఫ్ బోర్డు సీఈఓకు ప్రతిపాదనలు..
• వక్ఫ్ బోర్డు 2,074 ఎకరాల పట్టా భూమిని 22A(1)(C) జాబితా నుంచి తొలగించాలని తీర్మానం. దీని ద్వారా 897 మంది రైతులకు ఉపశమనం.
• గౌరవ ముఖ్యమంత్రి ఆమోదంతో IGRS వెబ్సైట్ నుంచి 2,074 ఎకరాలను తొలగించాలని జిల్లా రిజిస్ట్రార్కు ఉత్తర్వులు ఇవ్వనున్న జిల్లా కలెక్టర్.
• గౌరవ ముఖ్యమంత్రి సమక్షంలో IGRS నుంచి సంబంధిత భూములను తొలగించి, ఉత్తర్వులను రైతులకు అందజేయనున్న జిల్లా రిజిస్ట్రార్.
బనగానపల్లె మండలంలో రైతులకు పట్టాలు :
• బనగానపల్లె నియోజకవర్గంలో 23 మంది రైతులకు సంబంధించిన 101 ఎకరాల చుక్కల భూములు క్రమబద్ధీకరించి నిషేధిత ఆస్తుల జాబితా నుంచి తొలగించాలని నిర్ణయం.
• ఇందులో బనగానపల్లె మండలంలోని 10 మంది రైతులకు చెందిన 50 ఎకరాల చుక్కల భూముల క్రమబద్ధీకరణ, తొలగింపు ఉత్తర్వులు అందించనున్న గౌరవ ముఖ్యమంత్రి.
2 weeks ago | [YT] | 291
View 2 replies
Power Telugu TV
పాదరక్షలు, షూ లేసులు, మెటల్ హార్డ్వేర్, అనుబంధ పరికరాల తయారీలో పేరెన్నికగన్న బూ యంగ్ గ్రూప్ (Boo Young Group) సీఈవో & ప్రెసిడెంట్ డైరెక్టర్ ర్యాన్ కాంగ్ (Mr. Ryan Kang), బిజినెస్ స్ట్రాటజీ & ప్లానింగ్ మేనేజర్ మిల్లీ రిచర్డ్సన్లతో రాష్ట్ర విద్య, ఐటీ, ఎలక్ట్రానిక్స్ శాఖల మంత్రి నారా లోకేష్ బుసాన్ లో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా నారా లోకేష్ మాట్లాడుతూ... ఆంధ్రప్రదేశ్ లో బూ యంగ్ గ్రూప్ పాదరక్షలు, విడిభాగాల తయారీ యూనిట్ ఏర్పాటు చేయాలని విజ్ఞప్తి చేశారు.
#ChooseSpeedChooseAP
#JobCreatorInChiefLokesh
#LokeshinSouthKorea
#NaraLokesh
2 weeks ago | [YT] | 283
View 0 replies
Power Telugu TV
తిరుపతి జిల్లా : రైల్వేకోడూరు నియోజకవర్గం, ముక్కావారిపల్లెలో 'వికసిత్ భారత్ గ్యారెంటీ ఫర్ రోజ్ గార్ అజివికా మిషన్'ను ప్రారంభించిన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, కేంద్ర మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్.
3 weeks ago | [YT] | 294
View 0 replies
Power Telugu TV
విద్య, ఐటీ శాఖల మంత్రి నారా లోకేష్ గురువారం ఉదయం కలియుగ ప్రత్యక్షదైవం తిరుమల శ్రీ వేంకటేశ్వర స్వామి వారిని దర్శించుకున్నారు. రంగనాయకుల మండపంలో పండితులు ఆశీర్వచనం చేసి శ్రీవారి తీర్థప్రసాదాలు అందజేశారు.
#Tirumala
#NaraLokesh
#AndhraPradesh
3 weeks ago | [YT] | 245
View 1 reply
Power Telugu TV
ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు బుధవారం నెల్లూరు జిల్లా గూడూరు నియోజకవర్గం పున్నపువారిపాలెం గ్రామంలో పేదల సేవలో కార్యక్రమంలో పాల్గొని ఎన్టీఆర్ భరోసా పింఛన్లను పంపిణీ చేశారు. గ్రామంలోని ఎస్సీ కాలనీకి వెళ్లిన సీఎం చంద్రబాబు పద్మమ్మకు వితంతు పింఛను రూ.4 వేలు, దివ్యాంగురాలు తులశమ్మకు రూ.15,000 అందించారు. అనంతరం వారి కుటుంబ సభ్యులతో సమావేశమై ఇబ్బందులను అడిగి తెలుసుకున్నారు.
#పేదలసేవలో
#PensionsPandugalnAP
#NTRBharosaPension
#IdhiManchiPrabhutvam
#ChandrababuNaidu
#AndhraPradesh
3 weeks ago | [YT] | 113
View 1 reply
Power Telugu TV
ఏపీ సెంట్రల్ యూనివర్సిటీ తొలి స్నాతకోత్సవంలో మంత్రి నారా లోకేష్ యువ పట్టభద్రులకు స్ఫూర్తిదాయక సందేశం ఇచ్చారు. "ఇది మీ సమయం.. ఇది మీ అవకాశం" అంటూ కలలు, కఠోర శ్రమ, వ్యక్తిత్వంతో భవిష్యత్తును నిర్మించుకోవాలని పిలుపునిచ్చారు. యువతే దేశ భవిష్యత్ నిర్మాతలని పేర్కొన్నారు. ఈ కార్యక్రమానికి రాష్ట్రపతి శ్రీమతి ద్రౌపతి ముర్ము, గవర్నర్ అబ్దుల్ నజీర్ హాజరయ్యారు.
#NaraLokesh
#AndhraPradesh
3 weeks ago | [YT] | 140
View 0 replies
Power Telugu TV
ఈయన సీఎం,ఈయన ఆదేశాలు జారీ చేస్తే ఐఎఎస్ లు రిసీవ్ చేసుకొని,తరువాత ఓ నమస్కారం పెట్టి పంపేయోచ్చు.
ఓ దిగ్గజ కంపెనీ ఎయిర్టెల్ ఇండియా ,భారతీ ఎంటర్ప్రైజెస్ వ్యవస్థాపకులు మరియు ఛైర్మన్ అయిన శ్రీ సునీల్ భారతీ మిట్టల్ గారిని రాష్ట్ర పెట్టుబడులు కోసం ఆహ్వనించారు.
ఆంధ్రప్రదేశ్ డిజిటల్ మౌలిక సదుపాయాలను బలోపేతం చేయడం మరియు మన ప్రజలకు కనెక్టివిటీని మెరుగుపరచడంపై చర్చించారు,
లాస్ట్-మైల్ ఇంటర్నెట్ మరియు మొబైల్ టవర్ కనెక్టివిటీని విస్తరించడం, డేటా సెంటర్లు మరియు సముద్రగర్భ ఇంటర్నెట్ కేబుల్ ల్యాండింగ్ స్టేషన్లో పెట్టుబడులను ప్రోత్సహించడం, మరియు మన రాష్ట్రంలోని మొబైల్ సర్వీస్ ఆపరేటర్లకు వ్యాపారం చేసే సౌలభ్యాన్ని మరింత మెరుగుపరచడం వంటి అంశాలపై మాట్లాడారు.
ప్రజలకు మరింత దగ్గరయ్యే మార్గాలను దాదాపు ఓ మూడు గంటలు చర్చించుకున్నారు.
ఇదంతా జరిగాక ఓ సాలువా కప్పి పంపేయోచ్చు,కాని అన్నీ తానై దగ్గర ఉండి,గేటు బయట కారు ఎక్కేవరకు స్వయంగా బాబు గారే వచ్చి కారు ఎక్కించారు.
వెళ్లే వరకు అక్కడే ఉండి నమస్కారం చేసి పంపారు..! మనకి ఆదివారం సెలవు కాని రోజుకి 16 గంటలు పని చేసే వారికి వారాలతో పనేముంది..?
ఇది ఆయన స్వలాభం కాదు,రాష్ట్ర భవిష్యత్తు కోసం
4 weeks ago | [YT] | 386
View 10 replies
Power Telugu TV
కర్ణాటకలోని హోస్పేట వద్ద ప్రతిష్టాత్మక తుంగభద్ర ప్రాజెక్టుకు నూతనంగా ఏర్పాటు చేసిన 33 క్రస్ట్ గేట్ల ప్రారంభోత్సవ కార్యక్రమం కేంద్ర జలశక్తి శాఖ మంత్రి శ్రీ సీఆర్ పాటిల్ గారి సమక్షంలో ఘనంగా జరిగింది.
✳️ ప్రాజెక్టుకు సంబంధించిన మొత్తం 33 క్రస్ట్ గేట్లను కొత్తగా ఏర్పాటు చేయగా, మీట నొక్కి 17వ గేటును శ్రీ సీఆర్ పాటిల్ గారు ప్రారంభించారు. 18వ గేటును కర్ణాటక ముఖ్యమంత్రి శ్రీ డీకే శివకుమార్ గారు, 19వ గేటును ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు, 20వ గేటును తెలంగాణ ముఖ్యమంత్రి శ్రీ రేవంత్ రెడ్డి గారు ప్రారంభించారు.
✳️ 2024 ఆగస్టులో సంభవించిన వరదల కారణంగా 19వ గేటు దెబ్బతినడంతో, నిపుణుల కమిటీ సిఫార్సుల మేరకు రూ.51 కోట్ల వ్యయంతో మొత్తం 33 కొత్త గేట్లను ఏర్పాటు చేశారు.
✳️ తుంగభద్ర జలాల సమర్థ నిర్వహణ, సాగు మరియు తాగునీటి అవసరాల భద్రతను మరింత బలోపేతం చేయడంలో ఈ గేట్ల పునరుద్ధరణ కీలక మైలురాయిగా నిలవనుంది.
1 month ago | [YT] | 493
View 5 replies
Load more