This channel is a proof of our love and responsibility for the village. Its main purpose is to bring the village to the front of the room. Even if you are not in the village, everyone can watch the celebrations here through this channel. Experiences can be shared. You can swim in the lakes of memories. Its purpose is to make the concept of who we are, no matter where we are, from our minds.
The aim of this is to protect our mother town from being separated... 🙏


మన మహిమలూరు

🚩జై శ్రీరామ్ 🚩

8 hours ago | [YT] | 15

మన మహిమలూరు

Today Darshan from ​⁠our ‪@mahimaluru‬ Shivalayam

1 day ago | [YT] | 26

మన మహిమలూరు

Bands are OUT! 📣 Performance ratings for TCS FY 2025-26 have landed.

#TCS #LifeAtTCS #PerformanceBand #Appraisal2026 #tcsers

3 days ago | [YT] | 1

మన మహిమలూరు

ఐఐటీ హైదరాబాద్ గౌరవ సలహాదారుగా డిఆర్డిఒ మాజీ ఛైర్మెన్ డాక్టర్ జి. సతీష్ రెడ్డి గారు

- నాలుగు దశాబ్దాల పాటు భారత రక్షణ మరియు ఏరోస్పేస్ రంగాలలో అపార అనుభవం.
- రక్షణ రంగంలో సరికొత్త ఆవిష్కరణలు చేపట్టే విద్యార్థులకు మరియు పరిశోధకులకు మార్గదర్శకత్వం.

హైదరాబాద్ (IITH) పరిశోధన మరియు అభివృద్ధి (R&D) విభాగాన్ని మరింత బలోపేతం చేసే దిశగా ఒక కీలక అడుగు పడింది. భారత జాతీయ భద్రతా సలహా మండలి (NSAB) సభ్యులు మరియు రక్షణ పరిశోధన అభివృద్ధి సంస్థ (DRDO) మాజీ ఛైర్మన్ డాక్టర్ జి. సతీష్ రెడ్డి గారు ఐఐటీ హైదరాబాద్‌కు గౌరవ సలహాదారుగా నియమితులయ్యారు.
​దాదాపు నాలుగు దశాబ్దాల పాటు భారత రక్షణ మరియు ఏరోస్పేస్ రంగాలలో డాక్టర్ సతీష్ రెడ్డి గారు అందించిన సేవలు అజరామరం. దేశ రక్షణ వ్యవస్థ స్వయం సమృద్ధి సాధించడంలోనూ, అత్యాధునిక క్షిపణి సాంకేతికతను అభివృద్ధి చేయడంలోనూ డాక్టర్ సతీష్ రెడ్డి గారు పోషించిన పాత్ర అద్వితీయం. ఇప్పుడు ఆయన అపారమైన అనుభవం ఐఐటీ హైదరాబాద్‌లోని పరిశోధనలకు కొత్త జవజీవాలను అందించనుంది. రక్షణ రంగంలో సరికొత్త ఆవిష్కరణలు చేపట్టే విద్యార్థులకు మరియు పరిశోధకులకు ఆయన మార్గదర్శకత్వం కొండంత స్ఫూర్తినిస్తుందని ఐఐటీ హైదరాబాద్ పేర్కొంది. సాంకేతిక రంగంలో గ్లోబల్ హబ్‌గా ఎదుగుతున్న ఐఐటీ హైదరాబాద్‌కు డాక్టర్ సతీష్ రెడ్డి గారి వంటి దిగ్గజ శాస్త్రవేత్త సలహాదారులుగా నియామకంపై విద్యా మరియు పారిశ్రామిక వర్గాలు హర్షం వ్యక్తం చేస్తున్నారు.

5 days ago (edited) | [YT] | 14

మన మహిమలూరు

ఒంటిమిట్ట సీతారాముల వారి కళ్యాణo
#Vontimitta
#ChandrababuNaidu
#AndhraPradesh

1 week ago (edited) | [YT] | 87

మన మహిమలూరు

ఒంటిమిట్ట శ్రీకోదండ_రామాలయం_విశేషాలు

ఏకశిలానగరి.. విశేషాల ఝరి.. ఇక్కడి కోదండ రామయ్య ఆలయం ప్రత్యేకతలకు నిలయం. చారిత్రక , రాచరిక ఘట్టాలకు నిలువెత్తు దర్పణం. ఒకే శిలపై కొలువైన సీతారామలక్ష్మణుల మూలమూర్తుల దివ్య దర్శనం.. ఓ అద్భుతం. ఎత్తయిన గోపురాలు.. విశాలమైన ఆలయ రంగమంటపం.. శిల్పకళా వైభవం.. మహాద్భుతం. రామ , లక్ష్మణ తీర్థాలు జలసిరికి నిదర్శనం. హనుమ లేని రాముడి కోవెల.. పండువెన్నెల్లో సీతారాముల కల్యాణం.. విదేశీయులు మెచ్చిన దేవాలయం.. ఇలా చెప్పుకుంటూ పోతే ఒంటిమిట్ట దివ్య క్షేత్రంలో ప్రతీదీ అపురూపమే..

రామతీర్థం.. నేటికీ పదిలం
రామయ్య ఒంటిమిట్ట ప్రాంతంలో పర్యటించే సమయంలో పశుపక్షాదులు దాహం తీర్చుకునేందుకు నీరెట్టని సీతమ్మ ప్రశ్నించింది. సీతాదేవికి దప్పిక ఉన్నట్లు దాశరథి భావించాడు. తన చేతిలో ఉన్న విల్లు నుంచి భూమిలోకి బాణం వదిలాడు. పుడమి ఒడి నుంచి బుగ్గ ఉవ్వెత్తున ఎగసిపడింది.

కంపరాయుల పాలనలో ఆలయం రూపుదిద్దుకున్న తరువాత బుగ్గను రామతీర్థంగా , పక్కనే ఉన్న చిన్న కోనేరును లక్ష్మణ తీర్థంగా ప్రసిద్ధి చెందాయి. బ్రహ్మోత్సవాల వేళ చక్రస్నానం ఇక్కడే వేడుకగా నిర్వహించడం కొన్ని ఏళ్లుగా ఆనవాయితీగా వచ్చింది. కానీ ఈ రామతీర్థంలో స్వామికి చక్రస్నానం చేయించుటకు స్థలం సరిపోకపోవడంతో కోదండ రామాలయం ఎదురుగానే నూతనంగా నిర్మించిన పుష్కరిణిలో ఈ ఏడాది బ్రహ్మోత్సవాల నుంచి చక్రస్నానం జరుపుతారు.

జాంబవంతుడి ప్రతిష్ట
ఒంటిమిట్ట కోదండ రామాలయానికి పురాతన ప్రాశస్త్యం ఉంది. జాంబవంతుడు ఇక్కడ ఒక కొండపై ఆశ్రమం నిర్మించాడు. ఉత్తర దిశలో కూర్చుని రామతారక మంత్రాన్ని జపిస్తూ తప్పస్సు చేశాడు. జాంబవంతుడికి ఎదురుగా ఉన్న మరో గుట్టమీద నుంచి రఘురాముడు దివ్యదర్శనం ఇచ్చి వరాలు ప్రసాదించాడు. రామయ్యపై భక్తితో సీతారామలక్ష్మణ మూర్తులను ఒకే శిలపై మలచి.. జాంబవంతుడు ఇక్కడ ప్రతిష్టించినట్లు స్థలపురాణం చెబుతోంది.

రామయ్య నడయాడిన నేల
శ్రీరామచంద్రుడు తండ్రిమాట కోసం అరణ్యవాసం చేయాలని నిర్ణయం తీసుకున్నాడు. రామయ్య వెంట ధర్మ పత్ని సీతమ్మ , సోదరుడు లక్ష్మణుడు కదలి వచ్చారు. వనవాస కాలంలో దండకారణ్యంలో ఉన్న ఒంటిమిట్ట ప్రాంతంలో శ్రీ రాముడు పర్యటించాడు. ఆ దివ్య స్వరూపుడు పాద స్పర్శతో ఆధ్యాత్మిక క్షేత్రం పునీతమైంది. మృకుండ మహాముని ఆశ్రయంలో యజ్ఞాలు , యాగాలు జరిగేవి. రాక్షసులు ఆటంకాలు సృష్టించేవారు. ఆ రాక్షస బాధల నుంచి రామయ్య విముక్తి కల్పించినట్లు పురాణగాథ వాడుకలో ఉంది.

హనుమ లేని రాముడి కోవెల
హనుమంతుడు ఆగమనానికి మునుపే ఈ ప్రాంతంలో శ్రీ రామచంద్రమూర్తి సంచరించినట్లు పురాణాల ద్వారా అవగతమవుతోంది. అందుకే ఇక్కడి కోవెలలో ఆంజనేయస్వామి రామయ్య చెంత కనిపించలేదు.

విదేశీ మెచ్చుకోలు
సా.శ. 1652లో భారత యాత్ర చేసిన టావెర్నియర్‌ అనే ఫ్రెంచి యాత్రికుడు భారత దేశంలోని గొప్ప (పెద్దదైన) ఆలయ గోపురాల్లో ఒంటిమిట్ట కోదండ రామాలయం ఒకటి అని మెచ్చుకుని ప్రశంసించారు. ఇది అద్భుతమైన క్షేత్రమని ఆయన పేర్కొన్నారు.

వెన్నెల్లో కల్యాణం
శ్రీరాముని కల్యాణం పగలు జరగడంతో ఆ అపురూప దృశ్యాన్ని చూసే అదృష్టం లభించలేదని విచారిస్తున్న చంద్రునికి ఒంటిమిట్టలో జరిగే కల్యాణం తిలకించే అవకాశం కల్పిస్తానని రాముడు మాట ఇచ్చినట్లు పురాణ కథనం. పురాణ వేత్తల ప్రకారం వాల్మీకి రామాయణం బాలకాండ చివర సీతారాముల వివాహ ఘట్టం ఉంది. చైత్ర మాసంలో ఉత్తర ఫల్గుణి నక్షత్రంలో రాముడితోపాటు లక్ష్మణ , భరత , శత్రఘ్నల వివాహాలు కూడా జరిగాయి. అవన్నీ పగటిపూట జరిగాయి.

*చరిత్ర ప్రకారం బుక్కరాయులు ఒంటిమిట్టలో ఈ బ్రహ్మోత్సవాలను ప్రారంభించాడు. ఉత్సవాల్లో భాగంగా శ్రీరామ కల్యాణోత్సవం నిర్వహించాలి. రామాయణంలో శ్రీరామచంద్రుని కల్యాణం జరిగిన నక్షత్రానికే ఒంటిమిట్ట బ్రహ్మోత్సవాలలో రామయ్య కల్యాణం నిర్వహించేందుకు నిర్ణయం తీసుకున్నారు. అప్పట్లో ఉత్సవాల్లో తొలిసారిగా ఈ కల్యాణం నిర్వహించేందుకు తలపెట్టిన ఉత్తర ఫల్గుణి నక్షత్రం రాత్రి పూట వచ్చింది. లగ్నశుద్ది చూసుకుని బుక్కరాయలు రాత్రిపూటే తొలిసారిగా బ్రహ్మోత్సవాల్లో శ్రీ సీతారాముల కల్యాణోత్సవం నిర్వహించారు. ఆ సంప్రదాయమే నేటికీ కొనసాగుతుండడం విశేషం*.

రాత్రి వేళ కల్యాణం జరగడంతో చంద్రునికి ఈ ఉత్సవాన్ని వీక్షించే భాగ్యం లభించింది. బుక్కరాయలు చంద్రవంశానికి చెందిన వారు. తమ వంశ మూల పురుషుడు చంద్రుడు చూస్తూ ఆనందిస్తుండగా శ్రీ సీతారామ కల్యాణ నిర్వహణ సంతోషాన్ని పొందేందుకు బుక్కరాయలు రాత్రి కల్యాణాలను ఆ తర్వాత కూడా కొనసాగించారు.

ఒంటిమిట్ట చెరువు
జిల్లాలోని పెద్ద చెరువులలో ఒంటిమిట్ట చెరువుకు ప్రత్యేకత ఉంది. ఒంటిమిట్టకు వచ్చిన వారితోపాటు ఆ రోడ్డున వెళ్లే వారు ఈ చెరువును చూసే ఉంటారు. మెయిన్‌రోడ్డునుంచి కనుచూపుమేర విశాలంగా కొండల వరకు విస్తరించి ఉన్న ఆ చెరువుకు గొప్ప చరిత్ర ఉంది.కడప కైఫీయత్తుల సమాచారం మేరకు .. 1340లో కంపరాయులు విజయనగర సామ్రాజ్యంలో ఒక భాగమైన ఉదయగిరికి పాలకుడిగా ఉన్నారు.

2 weeks ago | [YT] | 5

మన మహిమలూరు

పాకనాటి రెడ్డిగార్ల గరుడసేవ- మహిమలూరు #శ్రీరామ్ #sriramanavami #sriramnavami #mahimaluru

2 weeks ago | [YT] | 83