❤️❤️❤️LIFE IS BEAUTIFUL❤️❤️❤️

TELUGU EDITOR ఛానల్‌కు స్వాగతం 🙏
ఈ ఛానల్ ద్వారా
🎶 భక్తి భావంతో నిండిన తెలుగు devotional songs

✍️ నాణ్యమైన తెలుగు భాషా సేవలు
రెండింటినీ మీకు అందిస్తున్నాము.
భక్తి గీతాలు మనసుకు శాంతిని, ఆధ్యాత్మికతను అందిస్తాయి.
అలాగే, సరైన పదజాలం మరియు శుద్ధమైన భాష రచనకు అందాన్ని ఇస్తాయి.
🎶 ఈ ఛానల్‌లో మీరు పొందేది:
✔️ తెలుగు భక్తి గీతాలు
✔️ దేవుని స్తుతి పాటలు
✔️ ఆధ్యాత్మిక సందేశాలతో కూడిన పాటలు

✍️ మా భాషా సేవలు:
✔️ కంటెంట్ ఎడిటింగ్
✔️ ప్రూఫ్ రీడింగ్
✔️ ఆంగ్ల–తెలుగు అనువాదం
✔️ పుస్తక సంపాదన
✔️ రిజ్యూమ్ ఎడిటింగ్
✔️ కంటెంట్ రీరైటింగ్
✔️ వ్యాకరణ సవరణ
భక్తి, భాష — రెండింటిలోనూ నాణ్యతే మా లక్ష్యం.
📩 భాషా సేవల కోసం సంప్రదించాలంటే DM చేయండి

🙏 TELUGU EDITOR – భక్తి మరియు భాషకు నమ్మకమైన చిరునామా.

🙏తెలుగు భక్తి గీతాలు మరియు వృత్తిపరమైన తెలుగు ఎడిటింగ్ సేవలు ఒకే చోట.
🙏 భక్తి | ✍️ భాష | ✨ నాణ్యత


TELUGU EDITOR

🍀🌺🍀🌺🍀🕉️🍀🌺🍀🌺🍀

🍀🪷🍀 18తేదీ బుధవారం నుండి*ఫాల్గుణ మాసం*🍀🪷🍀
ఫాల్గుణం ప్రఖ్యాతం.....

*సూర్యతేజస్సుతో ప్రభావితమైన ప్రకృతిలో కాలాలు,ఋతువులు, మాసాలు, తిథులు, అహోరాత్రములు మొదలగునవి ఏర్పడుతున్నాయి.*

*ప్రకృతిలో ఆకురాలే కాలం. నిర్మలాకాశంలో చక్కటి శీతల పవనాలు, ఆహ్లాద వాతావరణం ఆరోగ్యపు సిరులు చిగురులు తొడిగే కాలం. వసంతం అంకురించే కాలము పచ్చదనము పరిమళించే కాలం ఆద్యంతమూ ఆనందభరితమైన, లౌకిక ఆధ్యాత్మిక సమ్మిళితమైన అనుభూతులను పంచే కాలం అదే ఫాల్గుణ మాస శుభతరుణం*

*షడృతువులలో ఆఖరిదైన శిశిర ఋతువులలో రెండవది, మాసాలలో చివరిది ఫాల్గుణం.*

*ఈ మాసంలో రవి సాధారణంగా మీనరాశిలో ప్రవేశిస్తాడు.ఈ రాశిలో ఉన్న సూర్యరశ్ముల ఫలితంగా మానవుల మనస్సు సంకల్ప వికల్పాలపై పరిగెడుతుంది. కామోద్రేకం వలన మానసికానందం తగ్గి మానవుడు ఆవేశానికి లోనవుతాడు.ఆ సమయంలో మనో నిగ్రహం కావాలి.దానిని అభ్యాస వైరాగ్యాలతో సాధించుటకు అనువైన మాసం ఫాల్గుణము.*

*వినీలాకాశంలో శ్వేతవర్ణంతో దండాకారంగా ప్రకాశిస్తున్న రెండు నక్షత్రాలతో కూడిన మండలమే ఫల్గుణీ నక్షత్రం. అందు ప్రధమం పూర్వ పల్గుణీ (పుబ్బ) ద్వితీయం ఉత్తర ఫల్గుణీ (ఉత్తర) పాండవ మధ్యముడు అర్జునుడు ఈ నక్షత్రం నాడు జన్మించుట వలన ఫల్గుణుడయ్యాడు. పూర్ణిమ నాడు ఫల్గుణీ నక్షత్రం ఉన్న చాంద్రమాసమును ఫల్గుణ మాసమని పిలుస్తారు. ఈ మాసం శిశిర ఋతువుకు వీడ్కొలు చెప్తూ వసంతాగమనానికి ఆహ్వానం పలుకుటకు స్వాగత ద్వారం వంటిది.*
*ఫల+గుణ = ఫాల్గుణంలో చేసిన దైవ కార్యక్రమాలు రెట్టింపు ఫలితాలనిస్తాయి. కావుననే ఫాల్గుణం విశిష్టమైనది, దివ్య ప్రభావం కలిగినది. అందుకే ప్రాముఖ్యత పొందింది.*

*విష్ణు సహస్రనామాలలో శిశిరఃశర్వరీ కరః నారాయణునకు ఒక నామం కలదు. నారాయణుడు ఈ మాసంలో గోవిందనామంతో నియామకుడు. ఈ కారణంచే ఫాల్గుణ మాసం విష్ణు ప్రీతికరమని చెబుతారు.*

*ఫల్గుణీ నక్షత్రం దేవతా గణం. పూర్వ ఫల్గుణీ నక్షత్రానికి సూర్యడు "ఆర్యముడు” అనే పేరుతో దేవతగా ఉంటాడు. ఈయన అధిక తేజస్సు కలవాడు కావున దేవతలందరూ అనుసరించి ఉంటారు. ఫాల్గుణ మాసంలో ఎన్నో వ్రతాలాచరించాలని శాస్త్ర వచనం.*

*నేటినుండి ఫాల్గుణ మాసం ప్రారంభమవుతుంది. ఫాల్గుణం ఆహ్లాద వాతావరణంలో బ్రహ్మీ ముహూర్త వేళలో క్రియాశీలమైన సంధ్యాకాలం దేవతార్చనలకు పవిత్రమైన మాసం. ఫాల్గుణం ఆధ్యాత్మికమయం, తపోమయం, ఆరోగ్యమయం. విజ్ఞానమయం. ఫాల్గుణ శుద్ధ పాడ్యమి నుండి ద్వాదశి వరకు చేసే వ్రతం ప్రయోవ్రతమంటారు. ఈ పన్నెండు దినాలు నదీస్నానమాచరించాలి. పాడ్యమినాడు గుణావాప్తి వ్రతం, తదియనాడు మధూక వ్రతం చేస్తారు. ఫాల్గుణ శుద్ధ చవితిని "తిల" చతుర్థి అంటారు. దీనినే పుత్రగణపతి వ్రతమని, శాంత చతుర్థీ వ్రతమని అంటారు. ఈ రోజున ఉపవాసం చేసి తిలాన్నంతో గణపతి హోమం చేసి అతిథులు భుజించిన తరువాత హోమం చేసినవారు తినాలి. దీని వలన సర్వవిఘ్నాలు తొలగిపోతాయి. ఈ రోజున పుత్రగణపతి వ్రతమాచరించిన వారికి సత్సంతానం కలుగుతుంది.*

*శుద్ధ పంచమినాడు అనంత పంచమి వ్రతం చేయాలి. ఈనాడు గణేశుని అర్చించి నువ్వులు కలిపి వండిన అన్నాన్ని నైవేద్యంగా పెట్టి ప్రసాదంగా తినాలి. సప్తమి నాడు అర్కసంపుట సప్తమి ఆచరించాలి. ఉషోదయ కాల స్నానానంతరం సూర్యునకు అర్ఘ్యమివ్వాలి. సూర్యనమస్కారాలు చేయాలి. ఆదిత్య హృదయం పఠించాలి. ఆరోగ్యం భాస్కరాదిచ్ఛేత్. కావున ఆరోగ్యం కొరకు సూర్యుని ప్రార్థించాలి.*

*ఈ మాసంలో లక్ష్మీదేవిని, సీతామాతను షోడశోపచారాలతో పూజించాలి. ప్రదోషకాలంలో దీపారాధన చేసిన వారికి సౌభాగ్యం, సంపద చేకూరుతుంది. లలితా కాంతి దేవి వ్రతమాచరించాలి. నవమి నాడు ఆనంద నవమి అని శ్రీలక్ష్మీ నారాయణులను తులసి దళాలతో మందార పుష్పాలతో అర్చించాలి. మీన సంక్రమణం మతత్రయ ఏకాదశి, అమలకీ ఏకాదశి, ధాత్రి ఏకాదశి, అమృత ఏకాదశి అని పిలుస్తారు. ఈ రోజున శ్రీలక్ష్మీ నారాయణులను పూజించి ఉపవాసం, జాగరణం చెయ్యాలి. ఉసిరిక చెట్టు క్రింద శ్రీలక్ష్మీ నారాయణులను పూజించిన వారికి శుభ ఫలితాలు కలుగుతాయి. ఈ రోజున చేసిన వ్రతాల వలన వేలకొలది గోదానాలు చేసిన ఫలితా కలుగుతుంది. శుద్ధ ద్వాదశి విష్ణు ప్రీతికరమైన తిథి. దీన్ని నృసింహ ద్వాదశి అంటారు. శ్రీనృసింహస్వామిని అర్చిస్తే సర్వ విఘ్నాలు తొలగి అభీష్ట సిద్ధి కలుగుతుంది. ఈ రోజున చేసే గంగానది స్నానం అత్యంత మహిమాన్విత ఫలితాన్నిస్తుంది. శుద్ధ త్రయోదశి రోజున గ్రామక్షేమం కొరకు మన్మధ విగ్రహ దహనం చేస్తారు. శుద్ధ చతుర్దశి నాడు శ్రీమహేశ్వర వ్రతమాచరించాలి. ఈ నెలలో హోళి పండుగ నిర్వహిస్తారు. పూర్ణిమను హోళికా పూర్ణిమ అని, మదన పూర్ణిమ అని, హోళి అని, 'హోల' అని, కామదహనమని వ్యవహరిస్తారు. ఈ రోజు ఉదయాన్నే ఎండిన పిడకలు రాశిగా పోసి అగ్నిని రగిల్చి దానిలో రాక్షస పీడ పోయేందుకు హోళికా అనే ఒక విధమైన శక్తిని ఆవహింపజేసి "శ్రీహోళికాయైనమః " అని పూజించి మూడుసార్లు అగ్నికి ప్రదక్షిణలు చేస్తూ "వందితాసి సురేంద్రణే బ్రహ్మణా శంకరేణ ఛ అతస్త్వాం పాహినోదేవి భూతే భూతి ప్రధోభవ" అని చదవాలి.*

*హోళి పసుపుకు, పసుపు పరిమళానికి ప్రతీక. నీటిలో కలిపిన ద్రవాన్ని "వసంతం" అని అంటారు.*

*వసంతాలాడుకోవడం వసంతమాసానికి స్వాగతం చెప్పడమే. పూర్ణిమ సాయంత్రం నృత్యగీత వాద్యాలతో బాలకృష్ణుని లేదా రాధాకృష్ణులను ఊయలలో ఉంచి ఆరాధించి డోలోత్సవం జరపాలి. ఇలా చేయడం వలన వైకుంఠ ప్రాప్తి కలుగుతుందని పెద్దల నమ్మకం.*

*ఈ పూర్ణిమనాడు మధురైలో శ్రీ మీనాక్షి సుందరేశ్వరుల కళ్యాణం, తమిళనాట శివపార్వతుల కళ్యాణం జరుపుతారు. ఈ రోజు ఉదయాన్నే అభ్యంగన స్నానమాచరించి గోమయంతో అలికిన ఇంటి ప్రాంగణంలో తెల్లటి వస్త్రాన్ని ఆసనంగా చేసుకొని తూర్పు ముఖంగా కూర్చొని ఒక ముత్తెదువచే వందన తిలకం, నీరాజనం పొంది కొత్త చందనంతో కూడిన మామిడి పూవును భక్షించడం వలన అభీష్టసిద్ధి కలుగుతుందని శాస్త్రవచనం.*

*బహుళ ఏకాదశిని విజయైకాదశి, పాప విమోచన ఏకాదశి అని అంటారు. ఈ రోజున శ్రీలక్ష్మీ నారాయణులను అర్చించి ఉపవాసముండి నియమ బద్ధంగా ఏకాదశి వ్రతం ఆచరించిన వారికి శుభఫలితాలు కలుగుతాయి. బహుళ ద్వాదశి అన్నమాచార్య వర్ధంతి కావున ఆయన కీర్తనలు పాడి స్మరించుకోవాలి.*

*బహుళ అమావాస్య కొత్త సంవత్సరానికి ముందు వచ్చే అమావాస్య కనుక దీనిని కొత్త అమవాస్య అంటారు. ఈరోజు దేవ, పితృ ఆరాధనలు చేయడం శ్రేష్ఠం, పితృదేవతలకు తర్పణాలు ఇవ్వాలి. అన్నదానం చెయ్యాలి. పాండవులు ఈ మాసంలోనే జన్మించారు. ఈ మాసంలో క్షీరసాగరమథనం జరిగింది. అయ్యప్పస్వామి అవతరణ, ఈ మాసంలోనే జరిగింది. ఈమాసంలో చేసే ప్రతి దానం గోవిందునికి ప్రీతి కలిగిస్తుంది. ఈ మాసం నారాయణునికి ప్రీతికరం. భక్తులందరికీ పావనం, ముక్తిదాయకం. అందుకే ఫాల్గుణం యింత ప్రాముఖ్యం.*✍️
. *సర్వం శ్రీకృష్ణార్పణమస్తు*
🌷🙏🌷```
🙏లోకా సమస్తా సుఖినోభవన్తు!🙏

*రేపటి తరానికి బతుకు, భద్రతలతో పాటు భారతీయత కూడా నేర్పండి.

🌺🍀🌺🍀🕉️🍀🌺🍀🌺🍀

2 days ago | [YT] | 0

TELUGU EDITOR

🍀🪷🍀అమావాస్య నాడు హనుమంతుని ప్రార్థన అమోఘం అంటున్నారు పండితులు🍀🪷🍀

ప్రతి మాసంలో వచ్చే అమావాస్య రోజున హనుమంతునిని ప్రార్థిస్తే,సకల సంపదలు చేకూరుతాయని పండితులు అంటున్నారు. రుద్రాంశ సంభూతుడైన ఆంజనేయుడిని సింధూరంతో అర్చించడం ద్వారా అష్టైశ్వర్యాలు సిద్ధిస్తాయని ప్రతీతి.

ప్రతి మాసంలో వచ్చే అమావాస్య రోజున నిష్టతో ఆంజనేయ స్వామి ఆలయాన్ని సందర్శించుకోవడం ద్వారా అనుకున్న కార్యాలను దిగ్విజయంగా పూర్తవుతాయని విశ్వాసం.

అందుచేత అమావాస్య సాయంత్రం పూట మహిళలు, పురుషులు ఆంజనేయ స్వామికి నేతితో దీపమెలిగించి,హనుమంతుడి ఆలయాన్ని 18 సార్లు ప్రదక్షిణ చేయడం ద్వారా మనోధైర్యం, సకలసంపదలు, ఉన్నత పదవులు లభిస్తాయని పండితులు అంటున్నారు.

ఇంకా
"అసాధ్య సాధక స్వామిన్ అసాధ్యం తవకిమ్ వద
రామదూత కృపాం సింధో మమకార్యమ్ సాధయప్రభో "

అనే మంత్రాన్ని 9 సార్లు పఠించి.. కర్పూర హారతులు సమర్పించుకున్న వారికి ఈతిబాధలు, గ్రహదోషాలు తొలగిపోతాయని పండితులు చెబుతున్నారు.ఆర్థిక ఇబ్బందులు తొలగిపోతాయని పురోహితులు చెబుతున్నారు.

ఆపదుద్ధారక శ్రీ హనుమత్ స్తోత్రం..
ఆపన్నాఖిలలోకార్తిహారిణే శ్రీహనూమతే ।
అకస్మాదాగతోత్పాతనాశనాయ నమోస్తు తే ॥ ౧॥

సీతావియుక్తశ్రీరామశోకదుఃఖభయాపహ ।
తాపత్రయస్య సంహారిన్నాఞ్జనేయ నమోస్తు తే ॥ ౨॥

ఆధివ్యాధిమహామారిగ్రహపీడాపహారిణే ।
ప్రాణాపహన్త్రే దైత్యానాం రామప్రాణాత్మనే నమః ॥ ౩॥

సంసారసాగరావర్తాగతసమ్భ్రాన్తచేతసామ్ ।
శరణాగతమర్త్యానాం శరణ్యాయ నమోస్తు తే ॥ ౪॥

రాజద్వారే బిలద్వారే ప్రవేశే భూతసఙ్కులే ।
గజసింహమహావ్యాఘ్రచోరభీషణకాననే ॥ ౫॥

మహాభయేఽగ్నిసంస్థానే శత్రుసఙ్గసమాశ్రితే ।
శరణాగతమర్త్యానాం శరణ్యాయ నమో నమః ॥ ౬॥

ప్రదోషే వా ప్రభాతే వా యే స్మరన్త్యఞ్జనాసుతమ్ ।
అర్థసిద్ధియశఃకామాన్ ప్రాప్నువన్తి న సంశయః ॥ ౭॥

కారాగృహే ప్రయాణే చ సఙ్గ్రామే దేశవిప్లవే ।
యే స్మరన్తి హనూమన్తం తేషాం నాస్తి విపత్తయః ॥ ౮॥

వజ్రదేహాయ కాలాగ్నిరుద్రాయామితతేజసే ।
నమః ప్లవగసైన్యానాం ప్రాణభూతాత్మనే నమః ॥ ౯॥

దుష్టదైత్యమహాదర్పదలనాయ మహాత్మనే ।
బ్రహ్మాస్త్రస్తమ్భనాయాస్మై నమః శ్రీరుద్రమూర్తయే ॥ ౧౦॥

జప్త్వా స్తోత్రమిదం పుణ్యం వసువారం పఠేన్నరః ।
రాజస్థానే సభాస్థానే వాదే ప్రాప్తే జపేద్ధ్రువమ్ ॥ ౧౧॥

విభీషణకృతం స్తోత్రం యః పఠేత్ ప్రయతో నరః ।
సర్వాపద్భ్యో విముచ్యేత నాత్ర కార్యా విచారణా ॥ ౧౨॥

మంత్రం:
మర్కటేశ మహోత్సాహ సర్వశోక నివారక |
శత్రూన్ సంహార మాం రక్ష శ్రియం దాపయ భో హరే ||
ఇతి శ్రీ విభీషణ కృతం సర్వాపదుద్ధాకర శ్రీ హనూమత్ స్తోత్రం ||

3 days ago | [YT] | 2

TELUGU EDITOR

I just hyped this amazing creator ‪@DrAsleshahOfficial‬

6 days ago | [YT] | 0

TELUGU EDITOR

🏵🍀🌺🍀రేపు విజయ ఏకాదశి🍀🌺🍀🏵

యుధిష్టర మహారాజు శ్రీ కృష్ణ భగవానుని తో ఇలా అన్నాడు..
“ఓ వాసుదేవా! ఈ మాఘ మాసం కృష్ణ పక్షం లో వచ్చేటువంటి ఏకాదశి మహత్యాన్ని వివరించమ”ని కోరగా..

*శ్రీ కృష్ణ పరమాత్మ :*
“ఓ యుధిష్టరా, ఈ మాఘ మాసం లో వచ్చేటువంటి ఏకాదశి పేరు.. ‘విజయ ఏకాదశి’.

ఈ ఏకాదశి ని ఎవరు భక్తిశ్రద్ధలతో ఆచరిస్తారో వారిని విజయం వరిస్తుంది, మరి వారి పాపాలు కూడా తొలిగిపోతాయి.

ఒకానొకసారి నారద ముని బ్రహ్మ దేవుడి దగరికి వెళ్లి తనకి ఈ విజయ ఏకాదశి యొక్క విశిష్టతను తెలుపమని కోరెను, అప్పుడు బ్రహ్మ ఈవిధంగా చెప్పనారంబించెను.

“ఓ నారద మహా మునీ! ఇంతకు ముందు ఎవరికి ఈ వ్రత మహత్యం గురించి చెప్పలేదు, నువ్వు అడిగినావు కావున నీకు తెలియ చేసెదను వినుము.‘ఈ ఏకాదశి వ్రతం అన్ని పాపాలను హరిస్తుంది. ఈ పేరు లో చెప్పిన విధంగానే ఈ ఏకాదశి వ్రతం అన్నీ విజయాలను చేకూరుస్తుంది.సందేహమే లేదు.

శ్రీ రామ చంద్రుడు పదునాలుగు సంవత్సరములు అరణ్యవాసం చేయునప్పుడు, సీత, లక్ష్మణుని తో కలిసి పంచవటి లో నివసించేవాడు. రావణడు సీతాదేవి ని అపహరించినప్పుడు శ్రీ రాముడు దిగులుతో అన్ని కోల్పోయినవాడిలా బాధతో సీతా దేవిని వెతికే క్రమంలో జటాయువు మరణించబోతుండగా చూసి ఏమయినది వివరం అడుగగా, జటాయువు సీతమ్మ ని రావణాసురుడు ఎలా అపహరించాడో, సీతామాతని కాపాడబోయి రావణుని చేతిలో రెక్కలు తెగి పడిన విషయం వివరించి మరణిస్తాడు.

శ్రీ రాముడు తన సీత కోసం జటాయువు చేసిన ప్రాణ త్యాగానికి జటాయువుకి వైకుంఠ లోక ప్రాప్తి ప్రసాదిస్తాడు.

సీతా దేవిని వెతికే క్రమం లో కబందుడిని సంహరిస్తాడు.

అటు తరువాత శ్రీ రాముడు,సుగ్రీవుడు స్నేహితులవుతారు. సుగ్రీవుడు వానర సేనకు రాజు అగుట చేత సీతమ్మవారిని వెతకడానికి పెద్ద వానర సేనని తయారు చేసి హనుమంతుని అమ్మవారిని వెతకటానికి లంక కి వెళ్లి వెతకమని ఆజ్ఞ ఇవ్వగా. హనుమ లంక లో సీతమ్మని అశోకవనం లో చూసి శ్రీరాముని ముద్రికని చూపి, అయన గుణగణాలను కొనియాడి, హితవు పలికి సీతాదేవి దగ్గర ఉంగరం తీసుకుని తిరిగి శ్రీ రాముని వద్దకు వచ్చి వివరించెను.

శ్రీ రాముడు సుగ్రీవుని సహాయం తో లంకా నగరానికి వెళ్ళడానికి సముద్రానికి చేరుకొని ఆ సముద్రాన్ని దాటడం అంత సులువు కాదని గ్రహించి, లక్ష్మణునితో ఎలా అన్నాడు,

ఓ సుమిత్ర కుమారా ఈ సముద్రాన్ని దాటడం అంత సులువు కాదే ఇప్పుడు మనం ఏమి చెయవలెను?

అందరిలోకి మంచివాడివైన శ్రీరామ, బలదలబ్య అనే ఒక గొప్ప ఋషి ఇక్కడికి దగ్గరలో ఉన్నారు. ఆ ఉత్తముడిని అడిగి మన కర్తవ్యాన్ని ఏమిటో కనుకుందాం. ఆయన మాత్రమే మనకి ఈ సమయం లో సహాయపడగలరు అని సెలవిచ్చి అయన దగ్గరకి బయల్దేరారు.

బలదలబ్య ఋషి ని చేరుతూనే నమస్కరించి కుశలములు అడిగి వారు వచ్చిన పనిని వివరించారు.

*బలదలబ్య*

శ్రీరామ నేను నీకు ఒక ఉపవాస దీక్షను వివరిస్తాను శ్రద్ధగా వినుము, దీనిని ఆచరించడం ద్వారా నీకు తప్పకుండ విజయం లబిస్తుంది.

ఏకాదశి ముందు రోజు ఒక వెండి, ఇత్తడి, లేదా, బంగారం ఏది లేకపోతే మట్టి కుండ ఒకటి తీసుకుని అందులో నీరు పోసి నవధాన్యాలు, పసుపు కుంకుమ వేసి, కుండకి తోరణాలు కట్టి అందంగా అలంకరించాలి. దీనిని శ్రీమన్నారాయణుని దగ్గర పెట్టాలి. మరునాడు ఏకాదశి ఉదయమే స్నానం చేసి భక్తిశ్రద్ధలతో శ్రీమన్నారాయణుని కి పూజ చేసి, ఈ కుండకి పసుపు కుంకుమ, గంధం, అక్షింతలు, వేసి నమస్కరించి ఉపవసించి రాత్రి కి జాగరణ చేయాలి. మరునాడు ద్వాదశి తిథి రాగానే ఆ కుండకి పూజ చేసి ఏదయినా ఒక నది లో కలిపేయాలి. తరువాత ఉత్తముడయిన బ్రాహ్మణునికి భోజనం పెట్టి తదుపరి నీవు భోజనం చేయాలి. ఈ విధంగా నువ్వు నీ సేన ఉపవాసం చేస్తే తప్పకుండ నీకు విజయం లభిస్తుంది అని చెప్పెను.

శ్రీ రామచంద్రుడు బలదలబ్య ఋషి చెప్పినట్టుగానే వ్రతం పాటించి లంక మీద విజయం సాదించాడు. ఈ వ్రతం ఎవరు అయితే ఆచరిస్తారో వారికి వైకుంఠ ప్రాప్తి కూడా కలుగుతుంది.

ఓ నారదా ఈ విధంగా ఎవరు ఈ ఏకాదశి వ్రతం నమ్మకంతో భక్తిశ్రద్ధలతో ఆచరిస్తారో వారి అతి చండాలమయిన పాపాలు హరించిపోయి విజయం లభిస్తుంది మరియు వైకుంఠలోక ప్రాప్తి కలుగుతుంది.

అని శ్రీ కృష్ణ పరమాత్మ వివరించి, యుధిష్టిరా ఎవరు ఈ ఉపవాస దీక్ష చేస్తారో, ఈ కధను వింటారో వారికీ అశ్వమేధ యాగం చేసిన ఫలితం లభిస్తుంది అని చెప్పెను.✍️
*సర్వం శ్రీకృష్ణార్పణమస్తు*
🌷🙏🌷

1 week ago | [YT] | 1

TELUGU EDITOR

🌺🍀🏵సంకల్ప బలం🏵🍀🌺

మనిషి జీవితంలో సుఖాలు, దుఃఖాలు, విజయాలు, వైఫల్యాలు అనే కొండలను, లోయలను ఎక్కుతూ దిగుతూ ముందుకు పయనించాల్సిందే! నిజానికి ఒక వ్యక్తి తన లక్ష్యాన్ని చేరుకోవడానికి అవసరమైన ప్రాథమిక ఇంధనం ఏమై ఉంటుంది అంటే- సంకల్ప బలం అని చెప్పొచ్చు. అది మనిషి లోపల దాగి ఉండే అద్భుతమైన శక్తి! మనిషిని మనిషిగా, సాధారణాన్ని, అసాధారణంగా మలిచే గొప్ప గుణం!

మహాభారతంలోని ఆనుశాసనిక పర్వంలో సంకల్ప బలం గురించి మంచి కథ ఉంది. ఉపమన్యుడు నిరుపేద కుటుంబంలో జన్మించాడు. ఆ బాలుడు ఒకరోజు తల్లితో కలిసి మేనమామ ఇంటికి చుట్టంచూపుగా వెళ్లాడు. అక్కడ మేనమామ పిల్లలు పాలు తాగుతూ ఇతడికి కూడా కొంచెం ఇచ్చారు. ఉపమన్యుడికి ఊహ వచ్చాక పాలు రుచి చూడటం అదే మొదటిసారి. దాంతో తిరిగి ఇంటికి వెళ్లాక తల్లిని పాలు కావాలని అడిగాడు. ‘మన దురదృష్టం వల్ల పేదవారిగా పుట్టాం. పాలు కొని తాగలేని నిర్భాగ్యులం’ అని బుజ్జగిస్తూ చెప్పింది తల్లి. ఉపమన్యుడు ఒక్కసారిగా బావురుమన్నాడు. పిల్లాడి ఏడుపు చూసి తల్లి తల్లడిల్లిపోయింది. వార్చిన అన్నపు గంజిలో నీళ్లు, కాస్త తీపి కలిపి ‘నాయనా ఇవిగో పాలు, తాగు’ అని ఇచ్చింది.
వాటి రుచి చూడగానే బాలుడు ‘ఇవి పాలు కానే కాదు. నాకు నిజమైన పాలే కావాలి’ అంటూ మారాం చేశాడు. ‘నా చిట్టితండ్రీ! శివుడి ఆజ్ఞ లేకుండా ఏదీ జరగదు. కాబట్టి పరమేశ్వరుణ్ని స్మరించు. అప్పుడు గిన్నెడు పాలే కాదు, ఆ క్షీరసాగరమే తరలివస్తుంది. నీ కోరికలన్నీ ఫలిస్తాయి’ అని ఉపదేశించింది.

తల్లి పలుకులు శ్రద్ధగా ఆలకించిన ఉపమన్యుడు కంటినీరు తుడుచుకుంటూ, లేత మనసును దృఢం చేసుకున్నాడు. శివుడి అనుగ్రహం కోరుతూ హిమాలయాల్లో కఠిన తపస్సు చేయనారంభించాడు. ఉపమన్యుడి భక్తికి ముగ్ధుడైన శివుడు ఇంద్రుడి వేషంలో అతడి ముందు ప్రత్యక్షమై ఏదైనా వరం కోరుకోమని అడిగాడు. పరమేశ్వరుడి అనుగ్రహం కోసం దృఢ సంకల్పంతో ఉన్న ఉపమన్యుడు తన అచంచల భక్తిని ప్రదర్శిస్తూ, ‘నాకు శివయ్య దర్శనం తప్ప మరే ఇతర వరం వద్దు’ అని నిరాకరించాడు. ఆ భక్తికి సంతోషించిన శివుడు తన నిజరూపాన్ని వెల్లడించి అపార దయా వర్షం కురిపించాడు. పార్వతీదేవి సైతం తన కరుణా కటాక్ష వీక్షణాలను అతడిపై ప్రసరింపజేసింది. ఉపమన్యుడి కథ స్వచ్ఛమైన, అచంచలమైన భక్తికి, సంకల్ప సిద్ధికి ప్రతీక!

సంకల్ప బలం అంటే ఏదైనా చేయాలనే కోరిక మాత్రమే కాదు. ఆ కోరికను కార్యరూపంలోకి మార్చేందుకు తీసుకునే దృఢ నిర్ణయం, అవిచ్ఛిన్నమైన పట్టుదల కూడా! ఏకాగ్రతతో మనసు, శరీరం మధ్య సమన్వయాన్ని సాధించి, అన్ని ఆటంకాలను అధిగమించే సామర్థ్యం! లోతైన భక్తికి, నిష్కామమైన కోరికలకు భగవానుడు తప్పకుండా దాసోహమవుతాడు. సంకల్పం సరైనదైతే దానికి బలంగా ఆయనే మారతాడన్నది సత్యం!

1 week ago | [YT] | 1

TELUGU EDITOR

🌺🏵🌺కాలసర్ప_దోషం తొలగడానికి మనసా దేవి స్త్రోత్రం🌺🏵🌺

🔥మానసాదేవి ద్వాదశనామస్తొత్రమ్🔥

ఈ శ్లోకం ఎవరు రోజు చదువుతారో వారికి సర్ప భయం ఉండదు.కాలసర్ప దోషం భాధించదు.

🙏శ్లోకం🙏

జరత్కారు జగద్గౌరీ మానసా సిద్ధయోగినీ
వైష్ణవీ నాగభగినీ శైవీ నాగేశ్వరీ తథా
జరత్కారుప్రియా ఆస్తీకమాతా విషహరేతి చ
మహాజ్ఞానయుతా చైవ సా దేవీ విశ్వపూజితా
ద్వాదశైతాని నామాని పుజాకాలేతు యఃపఠేత్
తస్య నాగభయం నాస్తి తస్య వంశోద్భవస్య చ

🔱మానసాదేవిమంత్రం🔱

" ఓం హ్రీం శ్రీం క్లీం ఐం మానసాదేవ్యై స్వాహా"

🌷మానసాదేవి చరిత్ర 🌷

మానసా దేవి వాసుకి చెల్లెలు . వాసుకి జనమేజయుడు చేస్తున్న సర్పయాగంలో సర్పాలు మరణిస్తునపుడు,మానసాదేవిని తన కుమారుడైన అస్తీకుని తో చెప్పి నాగజాతిని కాపాడమని కోరతాడు.మానసా దేవి ఆదేశానుసారం అస్తీకుడు ఆ యాగాన్ని ఆపి సర్పజాతిని కాపాడతాడు.వారు అస్తీకుడు కృతజ్ఞతలు తెలుపుతారు.అప్పుడు అస్తీకుడు వాసుకి తో, నేను నా తల్లి తపస్సు వల్ల ,అశీస్సుల వల్ల ఈ పని సాధించాను అని చెబుతాడు.అప్పుడు ఇంద్రుడు అది నిజమని పలికి.అమ్మ జరత్కారు ! నీవు జగన్మాత అయిన లక్ష్మీదేవి అంశ తో ఉదయించి ,పూర్వ జన్మలో మహాతపస్సు చేశావు .హరిహరులు నీ తపస్సు కు సంతోషించి "సిథేశ్వరి" గా నీకు వరములు ప్రసాదించారు .ఆనాడు దేవతలకు నీవు ఎన్నో ఉపకారాలు చేశావు.నన్ను కూడా నీవు రక్షించావు.నీ భర్త అయిన జరత్కారు మునీశ్వరుడిని (ఆయనలో నారాయణ అంశ ఉన్నది) ఎంతో భక్తితో సేవించి ఈ అస్తీకుడిని వరప్రసాదంగా కన్నావు .దేవతలయందు,ఆర్తుల యందు,ధర్మరక్షనయందు,మనసు పెట్టినమాతగా నిన్ను "మానసాదేవి " అని పిలిచేవారము .ఆ పేరు ఇప్పుడు కూడా సార్ధకమైనది. ఆపదలోవున్న నాగజాతిని కాపాడి నాగపూజ్యవే కాదు లోకపూజ్యవు కూడా అయినావు. ఈ నాటినుండి నిన్ను పూజించేవారు సమస్త కామ్యములను పొందుతారు .నీ నామములను ఎవరు పఠిస్తారో వారికి సర్ప భయం వుండదు అంటూ లొకపాలకుడైన ఇంద్రుడు మానసాదేవి నామములను స్తుతించాడు . నాగ ప్రముఖులందరూ మానసాదేవిని భక్తితో పూజించారు.గంగాతీరంలోని "మాయాపురి" దగ్గర వున్న కొండపైన అస్తీకుని ఆశ్రమంలో మానసాదేవి అందరిచేత పూజలు అందుకుంటుున్నది. ఈ గుడి హరిద్వార్ దగ్గర ఉంది .

🌷ఓం శ్రీ మాత్రే నమః🌷

🌿🏵🍀శుభమస్తు🌿🏵🍀
🚩లోకాసమస్తాః సుఖినోభవంతు🚩
🚩సర్వేజనాః సుఖినోభవంతు🚩

1 week ago | [YT] | 4

TELUGU EDITOR

🪷🌼🪷*"అమ్మవారికి నిమ్మకాయల మాల ఎందుకు వేస్తారో మీకు తెలుసా? దీని వెనుక ఉన్న అసలు రహస్యం ఇదీ!" నిమ్మకాయల మాల ప్రాముఖ్యత - ఎందుకు వేయాలి?* 🪷🌼🪷

🌼ఇంట్లో అమ్మవారికి నిమ్మకాయల మాల వేస్తున్నారా? అయితే ఈ జాగ్రత్తలు పాటించండి!"🌼

🍋 ​1. నిమ్మకాయల మాల ప్రాముఖ్యత - ఎందుకు వేయాలి?

అమ్మవారి స్వరూపాలైన దుర్గమ్మ, భద్రకాళి, మరియు గ్రామ దేవతలకు నిమ్మకాయల మాల అంటే ఎంతో ఇష్టం. నిమ్మకాయ "శక్తి" కి సంకేతం. మనలో ఉన్న దిష్టి, ప్రతికూల శక్తి (Negative Energy), మరియు దుష్ట ప్రభావాలను పీల్చుకునే శక్తి నిమ్మకాయకు ఉంటుంది. అందుకే అమ్మవారిని శాంతింపజేయడానికి, మనల్ని రక్షించుకోవడానికి ఈ మాల వేస్తారు.

​2. ఎన్ని నిమ్మకాయలు వేయాలి?

సాధారణంగా మీ మొక్కుబడిని బట్టి లేదా సమస్య తీవ్రతను బట్టి 11, 21, 51, లేదా 108 నిమ్మకాయలతో మాల కట్టి సమర్పిస్తారు. 108 నిమ్మకాయల మాల అత్యంత శక్తివంతమైనదిగా పరిగణించబడుతుంది.

3. ఏ రోజు వేయాలి?

✨ శుక్రవారం:- సౌభాగ్యం కోసం, లక్ష్మీ కటాక్షం కోసం.

✨ ​మంగళవారం:- రాహుకాలం (మధ్యాహ్నం 3:00 నుండి 4:30 వరకు) సమయంలో దుర్గాదేవికి వేస్తే రాహు దోషాలు, పెళ్లి సంబంధాల్లో అడ్డంకులు తొలగుతాయి.

✨ ​ఆదివారం:- తీవ్రమైన దిష్టి దోషాలు, శతృ బాధల నివారణకు.

📖 ​4. దీని వెనుక ఉన్న కథ/కారణం ఏంటి?

పురాణాల ప్రకారం, అమ్మవారు రాక్షస సంహారం చేసినప్పుడు కలిగిన ఉగ్రతను (వేడిని), శాంతింపజేయడానికి భక్తులు చలువ చేసే నిమ్మకాయలను మాలగా వేశారు. నిమ్మకాయలోని పులుపు "అహంకారాన్ని" హరిస్తుంది. అమ్మవారికి ఈ మాల వేయడం వల్ల ఆమె శాంతించి, కోరిన వరాలు ఇస్తుందని భక్తుల నమ్మకం.

​5. పూజా విధానం & ఎన్ని రోజులు ఉంచాలి?

✨ ఎలా వేయాలి:- మచ్చలు లేని, పండని (పచ్చగా లేదా పసుపుగా ఉన్న) స్వచ్ఛమైన నిమ్మకాయలను తీసుకోవాలి. ఎర్రటి దారంతో మాలగా కట్టి అమ్మవారి మెడలో వేయాలి.

✨ ​ఎన్ని రోజులు:- అమ్మవారి విగ్రహానికి వేస్తే అవి వాడిపోయే వరకు (2-3 రోజులు) ఉంచవచ్చు. ఫోటోకి అయితే మరుసటి రోజే తీసేయడం మంచిది.

6. తీసిన నిమ్మకాయలను ఏం చేయాలి?

మాల తీసిన తర్వాత ఆ నిమ్మకాయలు ఎవరి పాదాలకు తగలకుండా చూడాలి.

✨ వాటిని ప్రవహించే నీటిలో (కాలువ లేదా నది) కలపాలి.

✨ ​లేదా ఎవరూ తొక్కని చోట, ఏదైనా చెట్టు మొదట్లో వేయాలి.

​ముఖ్య గమనిక:- దేవుడి మెడలో వేసిన నిమ్మకాయలను వంటల్లో వాడకూడదు, తినకూడదు. ఎందుకంటే అవి మీలోని నెగటివ్ ఎనర్జీని గ్రహించి ఉంటాయి.

🏍️ ​7. బండికి కట్టుకోవచ్చా?

అమ్మవారి మెడలో వేసిన మాలలోని కాయలను బండికి కట్టకూడదు. కొత్తగా కోసిన నిమ్మకాయలను (దృష్టి కోసం) విడిగా బండికి కట్టుకోవచ్చు.

🛕 8. గుడిలో ఇచ్చే నిమ్మకాయ (ప్రసాదం) విశిష్టత:-

మెడలో వేసిన మాల వేరు, అమ్మవారి పాదాల చెంత ఉంచి పూజ చేసిన నిమ్మకాయ వేరు.

✨ ​అమ్మవారి పాదాల దగ్గర ఉంచి, మంత్రోచ్ఛారణతో పూజించిన నిమ్మకాయలో "సకల శక్తి" ఉంటుంది.

✨ ​పూజారి గారు ఆ కాయను మీకు ఇస్తే, అది అమ్మవారి ఆశీర్వాదంగా భావించాలి.

9. తల దగ్గర ఎందుకు పెట్టుకోవాలి?

✨ నిద్రలేమి, భయం:- రాత్రిపూట పీడకలలు వచ్చే వారికి లేదా అనవసరమైన భయాలు ఉన్నవారికి, ప్రసాదంగా వచ్చిన నిమ్మకాయను తలగడ కింద (లేదా తల పక్కన) పెట్టుకోమని చెబుతారు.

✨ ​రక్షణ:- ఇది ఒక రక్షణ కవచంలా పనిచేసి, మీ చుట్టూ ఉన్న నెగటివ్ ఎనర్జీని దరిచేరనీయదు.

🍋 10. నిమ్మరసం (Lemon Water) కలుపుకుని తాగవచ్చా?

✨ అవును, తాగవచ్చు, గుడిలో ప్రసాదంగా ఇచ్చిన నిమ్మకాయను నీళ్లలో కలుపుకుని తాగడం వల్ల శరీర శుద్ధి జరుగుతుంది.

✨ అమ్మవారి శక్తి ఆ కాయలో ఉంటుంది కాబట్టి, అది మన శరీరంలోకి వెళ్తే అనారోగ్య సమస్యలు తొలగిపోయి, మనస్సు ప్రశాంతంగా మారుతుందని నమ్మకం.

గమనిక:- మాలలోని కాయలను తాగకూడదు, కేవలం ప్రసాదంగా ఇచ్చిన ఒక్క కాయను మాత్రమే తాగాలి.

11. బయటకు వెళ్లేటప్పుడు వెంట తీసుకెళ్లడం:-

✨ ఏదైనా ముఖ్యమైన పని మీద లేదా ప్రయాణాలకు వెళ్లేటప్పుడు ప్రసాదం నిమ్మకాయను జేబులోనో లేదా బ్యాగులోనో ఉంచుకుంటే "దిష్టి" తగలకుండా ఉంటుంది.

✨ ఎదుటివారి కళ్లు మన మీద పడకుండా (Evil Eye), మనం వెళ్లే పని విజయవంతం అవ్వడానికి ఇది ఒక రక్షణగా పనిచేస్తుంది.

అయితే ఇంట్లో అమ్మవారికి నిమ్మకాయల మాల వేసేటప్పుడు కొన్ని ముఖ్యమైన నియమాలు పాటించాలి. గుడిలో వేయడానికి, ఇంట్లో వేయడానికి చిన్న తేడా ఉంటుంది.

12. ఇంట్లో వేసేటప్పుడు పాటించాల్సిన నియమాలు:-

✨ మచ్చలు లేని, కుళ్లిపోని తాజా నిమ్మకాయలను మాత్రమే వాడాలి.

✨ ఇంట్లో వేసేటప్పుడు సాధారణంగా 11 లేదా 21 కాయలతో వేయడం మంచిది. (108 అనేది గుళ్ళలో లేదా పెద్ద పూజలప్పుడు వేస్తారు).

✨ ఎర్రటి దారంతో మాల కట్టాలి. సూదితో కాయలను గుచ్చవచ్చు, కానీ ఆ సూది కొత్తదై ఉండాలి (వాడిన సూది వాడకూడదు) లేదా అమ్మవారికి సంబందించినవి spare గా వాడాలి.

✨ శుక్రవారం ఉదయం లేదా మంగళవారం రాహుకాలంలో వేయడం అత్యంత శుభప్రదం.

13. ఇంట్లో ఎన్ని రోజులు ఉంచాలి..ఎప్పుడు తీసేయాలి?

​ఇది చాలా ముఖ్యం!

✨ ఇంట్లో నిమ్మకాయల మాల ఒక్క రోజు లేదా గరిష్టంగా రెండు రోజులు మాత్రమే ఉంచాలి.

✨ కాయలు నల్లగా మారుతున్నా లేదా వాడిపోతున్నా వెంటనే తీసేయాలి. ఎందుకంటే అవి ఇంట్లోని నెగటివ్ ఎనర్జీని పీల్చుకుంటాయి. అవి అలాగే ఉంటే ఆ నెగటివ్ ఎనర్జీ మళ్ళీ ఇంట్లోనే ఉంటుంది.

ఇంట్లో అమ్మవారికి వేసిన మాలలోని కాయలను అస్సలు వంటల్లో వాడకూడదు, తినకూడదు.

ప్రసాదంగా తెచ్చుకున్న నిమ్మకాయ ఎండిపోయినా లేదా కుళ్ళిపోయినా వెంటనే దానిని నీటిలో కలిపేయాలి లేదా చెట్టు కింద వేయాలి. ఎందుకంటే అది మీలోని దోషాన్ని తీసేసుకుందని అర్థం.

"చాలామంది నిమ్మకాయలను పారేయాలి అనుకుంటారు, కానీ అమ్మవారి పాదాల దగ్గర పూజించిన నిమ్మకాయ మహా ప్రసాదం.

▪️​ భయం పోవాలంటే తల కింద పెట్టుకోండి.
▪️​ ఆరోగ్యం కోసం ప్రసాదంగా స్వీకరించండి.
▪️ ​విజయం కోసం బయటకు వెళ్లేటప్పుడు వెంట తీసుకెళ్లండి.
▪️ మాలలోని కాయలను దిష్టి నివారణకు వాడితే, ప్రసాదం కాయను మాత్రం శక్తి కోసం వాడాలి."

"మంగళ, శుక్రవారాల్లో అమ్మవారికి నిమ్మకాయల 🍋 మాల వేయడం వల్ల ఇంట్లో ఉన్న దారిద్ర్యం, దిష్టి దోషాలు తొలగిపోతాయి. ముఖ్యంగా రాహుకాలంలో దుర్గమ్మకు 21 నిమ్మకాయల మాల వేసి చూడండి.. మీ పనుల్లో ఉన్న ఆటంకాలు ఎలా తొలగిపోతాయో! గుర్తుంచుకోండి.. మాల తీశాక ఆ కాయలను వంటల్లో వాడకూడదు, వాటిని చెట్టు కింద మాత్రమే వేయాలి."

​"అమ్మవారికి నిమ్మకాయల మాల వేయడం వల్ల ఇంట్లో ఉన్న చికాకులు, దిష్టి దోషాలు తొలగిపోతాయి. అయితే, ఇంట్లో వేసిన మాలను కాయలు వాడిపోయే వరకు ఉంచకూడదు. ఒక్క రోజు ఉంచి తీసేయడం వల్ల ఫలితం ఎక్కువగా ఉంటుంది. అలాగే, మాల తీశాక ఆ కాయలను పొరపాటున కూడా వంటల్లో వాడకండి. వాటిని ప్రకృతిలో కలిపేయండి!".

🪷🌼🪷సర్వేజనా సుఖినోభవంతు🪷🌼🪷

1 week ago | [YT] | 9

TELUGU EDITOR

🪷*సీతా దేవి, ద్రౌపది ఇద్దరూ కారణజన్ములే!*🪷

కామ ప్రకోపంతో రావణుడూ,వాడివాళ్లు చావడానికి — సీత,

మోహంతో తానే బలవంతుణ్ణి, ఏమైనా చేయగలననే పొగరు, మిడిసిపాటు మితిమీరిన దుర్యోధనుడు, వాడి బంధుజనం చావడానికి — ద్రౌపది భువిలో అవతరించారు.

ద్రౌపది ఇంద్రాణీ అంశ.
సీతమ్మ పరాశక్తి అంశ.

మిత్రులు చెప్పినట్లు సతికి భర్తృ వియోగం మించిన కష్టం మరొకటి ఉండదు. అందుచేత సీతమ్మ కష్టాలు అని అనుకొంటూ ఉంటాము. సీతమ్మ ఒక్క సారి తాను మూర్ఛిల్లిన దశలో పర పురుషుడి స్పర్శ అనే దోషాన్ని పొంది, సమర్థుడైన భర్త చేత దానికి శిక్ష వేయించే వరకూ తపస్సు చేసింది,సాధించింది.

ఒక సంవత్సరకాలం కొన్ని యుగాలుగా గడిపింది.

ద్రౌపది ద్రుపదుడి ఆగ్రహానికి ఫలంగా పుట్టింది.

అత్త ఆదరణ, భర్తృప్రేమ చిరకాలం అనుభవించింది.

కుఱువృద్ధుల, మహాజనుల సమక్షంలో వస్త్రాపహరణ అవమానం పొంది, భగవంతుని దయతో రక్షిత అయింది. శాంతిని కోరే భర్తలున్నా— వాళ్ల అతిపాపమే వాళ్ల(దుర్యోధనాదుల) వినాశానికి దారితీసింది.

కృష్ణదయా పాత్రురాలై శత్రు నిర్మూలన చూడగలిగింది గానీ, పుత్రులు ఐదుమంది ఒకే సారి అన్యాయంగా చనిపోవడమనే గుండె కోతలో ఆమెకు ప్రతీకార జనిత ఆనందం అనుభవానికే రాలేదు.

సీతారాములు పాపాత్ముల నిర్మూలనచేసి ధార్మికుడైన విభీషణుడిని ఆ స్థానంలో నిలిపి, అయోధ్యలో వైభవంగా పట్టాభిషేకానందం నలుగురిలో పంచుకొని ఆనందించారు, ఋషి మాట ప్రకారం మొత్తం 11వేల సంవత్సరాలు ఆనందం లోకానికి పంచారు.

ద్రౌపది అనేక యాగాలలో అవభృథ స్నాన పుణ్య భాగ్యం తన జీవితానికి సార్ధకత— ఒక రాజకాంతగా పొందినా, ఆ విభవం మొదట 23 సంవత్సరాలు, తర్వాత 36 సంవత్సరాలు మాత్రమే.

మధ్యలో భయంకరమైన అగాధం.

బాగా బతికి, అడవుల్లో చెట్టు చేమల వెంటబడి తిరగడం, తర్వాత మారువేషాలలో ఒక సంవత్సరకాలం తలదాచుకోవలసి రావడం, అక్కడ మళ్ళీ పరాభవాలు, ప్రతి చర్యలూ... సుఖంలేని జీవితం.

సీతమ్మ 13 సంవత్సరాలు హాయిగా ప్రశాంతంగా ఋషి వాటికలు దర్శించుకొంటూ, భర్త తోపాటు వాళ్ల కు పూజలు చేసి ఆనందం పొందింది.

తర్వాత తానెక్కడో తన వాళ్లకు తెలియ రాకుండా అజ్ఞాతంలో —దుర్భాషలు, కఠిన చర్యల మధ్య — తన ఉనికి భర్త కు తెలిసినదో లేదో తెలియని ఒక విషాద స్థితిలో —అన్నీ తెలిసిన తాను ఆత్మ హత్య చేసుకోబోయిన విపరీత స్థితి, యుద్ధం లోనూ కపటి ఐన రావణుడు రాముని(మాయా) మృత శిరస్సును చూపినపుడు తన ఆశలన్నీ అడియాసలైన విషాద స్థితి—అది కొద్ది కాలమైనా దాని తీవ్రత ఎంత బలీయంగా ఉంటుందో ఊహించగలమా?

ఇంతటి కష్టం ఎవరికీ రాగూడదు

ద్రౌపది ఇలాంటి బాధలు పొందలేదు.

కొంత వరకూ అదృష్ట వంతురాలని అనుకోవచ్చు.

వీళ్ళలో ఎవరి బాధలు ఎంతటివైనా, లోక బాధలు తమ ఉనికితో తీర్చి, శాశ్వత కీర్తిని తమ భర్త లతోపాటు పొందగలిగారు వీళ్ళు.

ఈ శాశ్వత కీర్తి ముందు— పడిన కష్టాలు చాల చిన్నవే అనక తప్పదు.

శరీరం ఎపుడైనా ఎవరికైనా రాలిపోయేదే!

దీనితో లోకోపకారం చేసి అజరామరమైన కీర్తిని (మంచిపేరును) ఆర్జించుకొన్న ఆ ఇద్దరూ సార్థక జీవనులే!!✍️

1 week ago | [YT] | 1

TELUGU EDITOR

🌹🍂🌹🍂🌹🍂🌹


*🌻సరస్వతీ స్తోత్రం🌻*

🥀యా కుందేందు తుషారహారధవళా యా శుభ్రవస్త్రావృతా
యా వీణావరదండమండితకరా యా శ్వేతపద్మాసనా ।
యా బ్రహ్మాచ్యుత శంకరప్రభృతిభిర్దేవైస్సదా పూజితా
సా మాం పాతు సరస్వతీ భగవతీ నిశ్శేషజాడ్యాపహా ॥ 1 ॥

🌹దోర్భిర్యుక్తా చతుర్భిః స్ఫటికమణినిభై రక్షమాలాందధానా
హస్తేనైకేన పద్మం సితమపిచ శుకం పుస్తకం చాపరేణ ।
భాసా కుందేందుశంఖస్ఫటికమణినిభా భాసమానాzసమానా
సా మే వాగ్దేవతేయం నివసతు వదనే సర్వదా సుప్రసన్నా ॥ 2 ॥

🥀సురాసురైస్సేవితపాదపంకజా కరే విరాజత్కమనీయపుస్తకా
విరించిపత్నీ కమలాసనస్థితా సరస్వతీ నృత్యతు వాచి మే సదా ॥ 3 ॥

🌹సరస్వతీ సరసిజకేసరప్రభా తపస్వినీ సితకమలాసనప్రియా ।
ఘనస్తనీ కమలవిలోలలోచనా మనస్వినీ భవతు వరప్రసాదినీ ॥ 4 ॥

🥀సరస్వతి నమస్తుభ్యం వరదే కామరూపిణి ।
విద్యారంభం కరిష్యామి సిద్ధిర్భవతు మే సదా ॥ 5 ॥

🌹సరస్వతి నమస్తుభ్యం సర్వదేవి నమో నమః ।
శాంతరూపే శశిధరే సర్వయోగే నమో నమః ॥ 6 ॥

🥀నిత్యానందే నిరాధారే నిష్కళాయై నమో నమః ।
విద్యాధరే విశాలాక్షి శుద్ధజ్ఞానే నమో నమః ॥ 7 ॥

🌹శుద్ధస్ఫటికరూపాయై సూక్ష్మరూపే నమో నమః
శబ్దబ్రహ్మి చతుర్హస్తే సర్వసిద్ధ్యై నమో నమః ॥ 8 ॥

🥀ముక్తాలంకృత సర్వాంగ్యై మూలాధారే నమో నమః
మూలమంత్రస్వరూపాయై మూలశక్త్యై నమో నమః ॥ 9 ॥

🌹మనోన్మని మహాభోగే వాగీశ్వరి నమో నమః ।
వాగ్మ్యై వరదహస్తాయై వరదాయై నమో నమః ॥ 10 ॥

🥀వేదాయై వేదరూపాయై వేదాంతాయై నమో నమః
గుణదోషవివర్జిన్యై గుణదీప్త్యై నమో నమః ॥ 11 ॥

🌹సర్వజ్ఞానే సదానందే సర్వరూపే నమో నమః ।
సంపన్నాయై కుమార్యై చ సర్వజ్ఞే తే నమో నమః ॥ 12 ॥

🥀యోగానార్య ఉమాదేవ్యై యోగానందే నమో నమః
దివ్యజ్ఞాన త్రినేత్రాయై దివ్యమూర్త్యై నమో నమః ॥ 13 ॥

🌹అర్ధచంద్రజటాధారి చంద్రబింబే నమో నమః
చంద్రాదిత్యజటాధారి చంద్రబింబే నమో నమః ॥ 14 ॥

🥀అణురూపే మహారూపే విశ్వరూపే నమో నమః ।
అణిమాద్యష్టసిద్ధాయై ఆనందాయై నమో నమః ॥ 15 ॥

🌹జ్ఞాన విజ్ఞాన రూపాయై జ్ఞానమూర్తే నమో నమః ।
నానాశాస్త్ర స్వరూపాయై నానారూపే నమో నమః ॥ 16 ॥

🥀పద్మజా పద్మవంశా చ పద్మరూపే నమో నమః ।
పరమేష్ఠ్యై పరామూర్త్యై నమస్తే పాపనాశినీ ॥ 17 ॥

🌹మహాదేవ్యై మహాకాళ్యై మహాలక్ష్మ్యై నమో నమః
బ్రహ్మవిష్ణుశివాయై చ బ్రహ్మనార్యై నమో నమః ॥ 18 ॥

🥀కమలాకరపుష్పా చ కామరూపే నమో నమః ।
కపాలికర్మదీప్తాయై కర్మదాయై నమో నమః ॥ 19 ॥

🌹సాయం ప్రాతః పఠేన్నిత్యం షణ్మాసాత్సిద్ధిరుచ్యతే ।
చోరవ్యాఘ్రభయం నాస్తి పఠతాం శృణ్వతామపి ॥ 20 ॥

*🌼🥀ఇత్థం సరస్వతీ స్తోత్రమగస్త్యముని వాచకమ్🥀🌼।*

*సర్వసిద్ధికరం*
🌼🥀🌼🥀🌼🥀🌼

2 weeks ago | [YT] | 6

TELUGU EDITOR

🪷మనసును పరిశీలించడం ఏలా?
మనసును గెలవడం ఎలా?
మనసు మీద ఆధిపత్యం ఎలా సాధించాలి?

మన ఆలోచనలు, భావాలు, కోరికలు వాటిలో మునిగిపోకుండా “చూసే స్థితి”లో ఉండడం.

ఇది ఆధ్యాత్మిక ప్రయాణానికి
ఆత్మతత్వం, సత్యశోధన మార్గానికి దారి

1 మనసు అంటే ఏమిటి?
ముందు ఇది అర్థం కావాలి
మనసు = ఆలోచనల ప్రవాహం,భావాల అలలు.

జ్ఞాపకాలు ఆశలు, భయాలు మనసు మనం కాదు
మనసును గమనించగలిగితే “నేను” వేరని అర్థమవుతుంది

అక్కడినుంచే పరిశీలన మొదలవుతుంది.

2 మనసును పరిశీలించే మొదటి అడుగు

చాలామంది తప్పు చేస్తారు.ఆలోచనలను ఆపాలని ప్రయత్నిస్తారు.కోపం, కోరిక వచ్చినప్పుడు దాన్ని నొక్కేస్తారు.

సరైన విధానం ఏది వస్తే
అది వస్తూనే ఉండనివ్వాలి కానీ లోపల ఇలా చెప్పాలి.

ఇప్పుడు కోపం వచ్చింది.
ఇప్పుడు ఆశ పుట్టింది.
ఇప్పుడు భయం వచ్చింది.

ఇది జరగడం నేను కాదు,ఇదే పరిశీలన.

3 ప్రాక్టికల్ సాధన

రోజూ చేయాల్సిన విధానం సాధన

1.ఆలోచన గమనిక (5–10 నిమిషాలు)
నిశ్శబ్దంగా కూర్చోండి కళ్లు మూసుకోండి.

మంత్ర జపం చేయడం ఒక పద్ధతి.
శ్వాసను గమనించడం మరో పద్ధతి.
భృమధ్య స్థానంలో దేవుడి మూర్తిని భావన చేయడం మరో పద్ధతి.

ఇలా చేస్తున్నప్పుడు
మనసు మాటిమాటికి బయటకు వెళ్తుంది.

శ్వాస సహజంగా ఉండనివ్వండి.
ఆలోచనలు వస్తాయి ఆపకండి.
ప్రతీ ఆలోచనకు పేరు పెట్టండి.

ప్లాన్ ఆలోచన జ్ఞాపకం,కోరిక,భయం
విశ్లేషించవద్దు,లేబుల్ పెట్టి వదిలేయండి

సాధన 2: భావం–శరీరం సంబంధం

ఏదైనా భావం వచ్చినప్పుడు కోపం ఆనందం భయం.

3. మీరు ఇలా అడగాలి
ఇది శరీరంలో ఎక్కడ ఉంది?

ఛాతీలోనా?
కడుపులోనా?
తలలోనా?
భావం = శరీర స్పందన
గమనించిన క్షణమే దాని బలం తగ్గుతుంది

4 రోజువారి జీవితంలో పరిశీలన ఎలా?
ధ్యానం మాత్రమే కాదు జీవితమే సాధన.

ఉదాహరణ

ఎవరో అవమానిస్తే
సాధారణంగా కోపంగా మాట్లాడతాం.

పరిశీలనలో అవమానం అనిపించింది.
మనసు ప్రతిఘటన కోరుతోంది.
ఇది మనసు స్వభావం ఇలా గమనిస్తే ప్రతిచర్య తగ్గి, స్పందన వస్తుంది.

5 లోతైన స్థాయి “నన్ను ఎవరు గమనిస్తున్నారు?”

ఇది అత్యంత ముఖ్యమైన ప్రశ్న?

ఈ ఆలోచనలను గమనిస్తున్నది ఎవరు?

ఆలోచన వస్తుంది,మీరు గమనిస్తున్నారు.
భావం వస్తుంది,మీరు గమనిస్తున్నారు.

గమనించేవాడు మారడంలేదు,
మారేది మనసు మాత్రమే.

ఇక్కడే
ఆత్మ అనుభూతి మొదలవుతుంది.

6 సాధారణ అడ్డంకులు & పరిష్కారాలు

ఎక్కువ ఆలోచనలు వస్తున్నాయి ?

మంచిదే మీరు గమనించడం మొదలెట్టారు

శాంతి రావడం లేదు,
శాంతి లక్ష్యం కాదు,పరిశీలన లక్ష్యం.

“నిద్ర వస్తోంది”
కళ్లతెరిచి, నిటారుగా కూర్చోండి

7 ఫలితం ఏమిటి?

కోరికల బలం తగ్గుతుంది.
కోపం త్వరగా పోతుంది.
నిర్ణయాల్లో స్పష్టత వస్తుంది.
లోపలి స్వేచ్ఛ అనుభూతి కలుగుతుంది.
అప్పుడు మీ మనసు మీద మీకు ఆదిపత్యం వస్తుంది.

మీరు ఆలోచిస్తేనే మనసు ఆలోచించాలి
మీరు ఆలోచించడం మానేస్తే మనసు స్థిరంగా కూర్చోవాలి. ఇదే మనసును సాధించే పద్ధతి
మనసును గెలిచే స్థితి.

మనసును మీరు గెలిస్తే ఋషులవుతారు,యోగి అవుతారు.

మనసు మిమ్మల్ని గెలిస్తే
మీరు వ్యాసనపరులవుతారు లేదా
కోపాలకు తాపాలకు బానిసలవుతారు.
రాగద్వేషాలకు లొంగిపోతారు.

🌹🏵🪷🏵🙏🙏🙏🙏🙏🙏🙏🪷🏵🏵🌺

2 weeks ago | [YT] | 3