ప్రతి నిమిషం ప్రజల పక్షం


www.youtube.com/@_naanews


youtube.com/channel/UCpV_6EyivKbWKDCSUrdI15Q


Naa News

కష్టించే ప్రతి గుండెకు వందనం. కార్మిక లోకానికి మే డే శుభాకాంక్షలు
NAA NEWS

9 months ago | [YT] | 1

Naa News

ఆరోగ్య ఉప కేంద్రాన్ని తనిఖీ చేసిన_ హెల్త్ డైరెక్టర్ రవీంద్ర నాయక్

11 months ago | [YT] | 0

Naa News

అల్లు అర్జున్ బెయిల్ కాపీని అధికారికంగా అప్‌లోడ్ చేసిన హైకోర్టు

జైలు అధికారులకు అందిన అల్లు అర్జున్ బెయిల్ కాపీ

బెయిల్ కాపీని పరిశీలిస్తున్న జైల్ సూపరిండెండెంట్

అల్లు అర్జున్ మరికాసేపట్లో విడుదల అయ్యే అవకాశం?

1 year ago | [YT] | 2

Naa News

కేంద్ర విమానయన శాఖ మంత్రిని కలిసిన ఎంపీ డా. కడియం కావ్య


మామునూరు ఎయిర్పోర్ట్ పనులు త్వరితగతిన ప్రారంభించాలని కేంద్ర మంత్రిని కలిసి వినతిపత్రం అందజేసిన వరంగల్ ఎంపీ డాక్టర్ కడియం కావ్య..

కేంద్ర పౌర విమానయన శాఖ మంత్రి కింజారపు రామ్మోహన్ నాయుడు న్యూఢిల్లీలో వరంగల్ పార్లమెంట్ సభ్యురాలు డాక్టర్ కడియం కావ్య మర్యాద పూర్వకంగా కలిశారు. ఈ సందర్బంగా మామునూరు ఎయిర్పోర్ట్ పనుల ప్రారంభం గురించి కేంద్ర మంత్రితో చర్చించారు. వరంగల్ మామూనూరు విమానాశ్రయం పనులు త్వరితగతిన పూర్తి చేయాలని విమాన రాకపోకలు ప్రారంభించాలని ఎంపీ డాక్టర్ కడియం కావ్య కేంద్ర మంత్రిని కోరారు. భవిష్యత్ అవసరాల కొరకు రెండేళ్లలో ఎయిర్ పోర్ట్ పూర్తిచేసి ప్రజలకు అందుబాటులోకి తేవలని కోరారు. రాష్ట్రంలో హైదరాబాద్ తరువాత అంతటి ప్రాధాన్యం ఉన్న వరంగల్ ను రెండో రాజధానిగా డెవలప్ చేసేందుకు గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు 4వేల కోట్ల రూపాయలను విడుదల చేసినట్లు తెలిపారు. ఇప్పటికే కుడా మాస్టర్ ప్లాన్ కు ఆమోదం, కాకతీయ మెగా టెక్స్ టైల్ పార్కుకు భూములు ఇచ్చిన 863 మందికి ఇందిరమ్మ ఇళ్లు మంజూరు చేయడంతో పాటు ఎయిర్ పోర్టు పునరుద్ధరణ కోసం 205 కోట్లతో భూసేకరణకు నిధులు మంజూరు చేయడం జరిగిందన్నారు. దీనిపై సానుకూలంగా స్పందించిన పౌర విమానయన శాఖ మంత్రి రామ్మోహన్ నాయుడు రెండు సంవత్సరాలలో విమానాల రాకపోకలు ప్రారంభం అయ్యే విదంగా కృషి చేస్తానని హామీ ఇచ్చారు. అందుకు ఎంపీ కేంద్రమంత్రికి కృతజ్ఞతలు తెలిపారు.

1 year ago | [YT] | 13

Naa News

స్టేషన్ ఘనపూర్ భవిత కేంద్రంలో ఘనంగా అంతర్జాతీయ దివ్యాంగుల దినోత్సవం




స్టేషన్ ఘనపూర్ మండల కేంద్రంలోని భవిత సెంటర్లో అంతర్జాతీయ దివ్యాంగుల దినోత్సవాన్ని పురస్కరించుకొని స్థానిక మండల విద్యాశాఖ అధికారి శ్రీ జి కొమురయ్య గారి ఆధ్వర్యంలో అంతర్జాతీయ దివ్యాంగుల దినోత్సవం ఘనంగా నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా జనగామ జిల్లా విద్యాశాఖ సెక్టోరియల్ అధికారి శ్రీ బి నరసింహారావు గారు హాజరు అయ్యారు, ఈ సందర్భంగా వారు సమావేశాన్ని ఉద్దేశించి మాట్లాడుతు దివ్యాంగులైన విద్యార్థినీ విద్యార్థులు అందరూ భవిత కేంద్రంలో నిర్వహించేటువంటి అన్ని విధాలైనటువంటి ప్రత్యేక విద్య, స్పీచ్ థెరపీ, ఫిజియోథెరపీ, బిహేవియర్ మోడిఫికేషన్ మరియు సహాయ ఉపకరణాలు మొదలగు ప్రత్యేక విద్య సేవలని అదేవిధంగా ట్రాన్స్ పోర్ట్ అలవెన్స్, ఎస్కార్ట్ అలవెన్స్ మొదలగు సేవలను అర్హులైన దివ్యాంగుల అందరికీ అందుబాటులో ఉన్నాయనీ, కాబట్టి పిల్లలందరికీ ఇలాంటి సేవలు అన్ని ఉపయోగించుకోవలసిన అవసరం ఎంతో ఉందనీ, వీటన్నింటిని తల్లిదండ్రులందరూ కూడా పిల్లలకు ఎక్కువగా ఉపయోగపడే విధముగా శ్రద్ధ తీసుకోవాల్సిందిగా వారు కోరడం జరిగినది.
మండల విద్యాశాఖ అధికారి జి కొమురయ్య గారు మాట్లాడుతూ భవిత కేంద్రం ద్వారా ఎంతో మంది దివ్యాంగులైన పిల్లలు లబ్ధి పొందుతూ మెరుగైనటువంటి జీవనశైలిని ఏర్పాటు చేసుకోవడం జరుగుతుందని అదేవిధంగా ఈ విద్యా సంవత్సరం మన ఘనపూర్ స్టేషన్ మండలం నుండి పదవ తరగతి పరీక్షలలో 11 మంది సి డబ్ల్యూ ఎస్ ఎన్ పిల్లలు పరీక్షలు రాస్తున్నారని, అన్నారు.
ఈ కార్యక్రమంలో లయన్స్ క్లబ్ ఘన్పూర్ స్టేషన్ శాఖ ప్రెసిడెంట్ అంబటి కిషన్ రాజ్ గారి చేతుల మీదుగా భవిత కేంద్ర విద్యార్థిని విద్యార్థులకు స్పోర్ట్స్ మెటీరియల్ ను బహుకరించడం జరిగింది.
ఈ కార్యక్రమంలో *స్థానిక ఉన్నత పాఠశాల ప్రధానోపాధ్యాయులు
శ్రీ ఎం సంపత్,ప్రాథమిక పాఠశాల ప్రధానోపాధ్యాయులు. ఎస్ సదా మోహన్ స్థానిక లయన్స్ క్లబ్ ప్రెసిడెంట్ శ్రీ అంబటి కిషన్, దివ్యాంగులైన బాలబాలికలు వారి తల్లి తండ్రులు, ప్రత్యేక ఉపాధ్యాయులు కె రాజు,డి ప్రవీణ్ కుమార్, ఐ ఈ ఆర్ పి జి రామ తులసి MRC సిబ్బంది గిరి ,సునీత , లవన్,జ్యోతి ,శ్రీలత వెంకన్న రమేష్ ,సంధ్య తదితరులు పాల్గొన్నారు.

1 year ago | [YT] | 2

Naa News

జమ్మికుంట పట్టణంలో మాజీ ఎంపీపీ,విద్యోదయ విద్యాసంస్థల చైర్మన్ ఏభూషి రామస్వామి అనారోగ్యంతో మరణించగా వారి పార్థివ దేహానికి పూలమాల వేసి నివాళులు అర్పించి, కుటుంబ సభ్యులను పరామర్శించిన హుజురాబాద్ నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీ ఇంచార్జ్ వొడితల ప్రణవ్.

1 year ago | [YT] | 4

Naa News

‪@_naanews‬ #telangana తెలంగాణాలో MLAల పై అనర్హత వేటు పడుతుందా....?ఉప ఎన్నికలు వస్తాయా....? YES OR NO

1 year ago | [YT] | 2

Naa News

DSC పై మీ అభిప్రాయం ఏంటి ?

1 year ago | [YT] | 1

Naa News

సేవాలాల్ 283 వ జయంతి వేడుకలో పాల్గొన్న ఎమ్మెల్యే రాజయ్య ప్రత్యక్ష ప్రసారం

3 years ago | [YT] | 0