వర్తమాన అంశాల మీద లోతైన విశ్లేషణల కోసం చూస్తున్నారా? కనిపించే వార్తల వెనక కనిపించని కోణాలు తెలుసుకోవాలనుకుంటున్నారా? దశాబ్ధాల అనుభవం, అపారమైన అధ్యయనం కలిగిన జర్నలిస్టుల విశ్లేషణలను ఇక్కడ మీరు చూడొచ్చు.
రాజకీయాలతో పాటు, జీవితం, చరిత్ర, న్యాయం, ఆరోగ్యం వంటి అన్ని విషయాలు గురించి చర్చించే వేదికగా ఈ ఛానల్ ఉంటుంది. దాంతో పాటుగా వివిధ సామాజిక అంశాలపై గ్రౌండ్ రిపోర్టులు, డాక్యుమెంటరీలు, టెలి ఫిలింలకు కూడా #MahuaMedia ఒక వేదికగా ఉంటుంది.
Mahua Media is a space for social concerns run by media professionals. It also brings analysis on current affairs and talks about all aspects of people, life, literature and arts.
Paid Members గా ఛానల్ ను సపోర్ట్ చెయ్యండి. Link below 👇
Mahua Media
చలో సంసద్ లో ఏం జరిగింది? ఇప్పుడు జంతర్ మంతర్ దగ్గర ఏం జరుగుతోంది? మెయిన్ స్ట్రీమ్ మీడియా కి సిటిజెన్ మీడియా కి మధ్య ఇంత తేడా ఎందుకుంది?!
https://youtu.be/0j8xTkfyJYc
7 hours ago | [YT] | 55
View 1 reply
Mahua Media
ఢిల్లీలో చలో సంసద్ నిరసన సక్సెస్ అయిందా ?https://youtu.be/XRKObNLOsqI
1 day ago | [YT] | 51
View 2 replies
Mahua Media
వాంగ్చుక్ ని అరెస్ట్ చేస్తే ఉద్యమం ఆగిపోతుందా?https://youtu.be/hzwdh8gmVK0
3 days ago | [YT] | 44
View 2 replies
Mahua Media
Subscribe to @MahuaCinema for movie reviews and analysis
https://youtu.be/2dh50FpJhdU?si=eOlru...
4 days ago (edited) | [YT] | 6
View 1 reply
Mahua Media
1984లో, సోనమ్ వాంగ్చుక్ తండ్రి, సోనమ్ వాంగ్యాల్, లడఖ్కు షెడ్యూల్డ్ తెగ (ST) హోదా కల్పించాలని డిమాండ్ చేస్తూ నిరాహార దీక్ష చేపట్టారు. దీనికి స్పందిస్తూ, అప్పటి ప్రధాన మంత్రి ఇందిరా గాంధీ స్వయంగా లేహ్ వెళ్లి ఆయనను కలిసి, దీక్ష విరమించమని కోరుతూ పండ్ల రసం అందించారు. ఆ భేటీ జరిగిన కొన్ని నెలలకే ఇందిరా గాంధీ హత్యకు గురయ్యారు, దాంతో ఆ సమస్య అప్పట్లో పరిష్కారం కాలేదు. ఆ తర్వాత, 1989లో ప్రధాన మంత్రి రాజీవ్ గాంధీ హయాంలో, 'కాన్స్టిట్యూషన్ (జమ్మూ అండ్ కాశ్మీర్) షెడ్యూల్డ్ ట్రైబ్స్ ఆర్డర్, 1989' ద్వారా లడఖ్లోని పలు వర్గాలకు షెడ్యూల్డ్ తెగ హోదా కల్పించారు.
4 days ago | [YT] | 1,215
View 53 replies
Mahua Media
కొందరు నోరు విప్పితే చాలు దేశద్రోహులు అవుతారు. కొందరు దొమ్మీలు చేసి తగలబెట్టినా దేశద్రోహులు కారు? ఎందుకలా? https://youtu.be/vFHIYBjLZqY
4 days ago | [YT] | 7
View 0 replies
Mahua Media
నాయకులు మీడియాను తప్పించుకుని తిరగరు...
ఎడిటర్స్ గిల్డ్ ఆఫ్ ఇండియా
-----
16 జూలై, 2026 | న్యూ ఢిల్లీ: దేశంలో గానీ, విదేశాల్లో గానీ ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ అన్స్క్రిప్టెడ్ (ముందుగా సిద్ధం చేసుకోని) మీడియా సమావేశాలను నిర్వహించడానికి ఇష్టపడకపోవడాన్ని సమర్థిస్తూ ఆయన ఒక విజయవంతమైన రాజకీయ నాయకుడనీ, కాబట్టి గ్రామీణ ఓటర్లతో నేరుగా సంభాషించడానికే ఆయన ప్రాధాన్యత ఇస్తారని ఎంఈఏ (విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ) అధికారులు పేర్కొనడాన్ని ఎడిటర్స్ గిల్డ్ ఆఫ్ ఇండియా ఖండిస్తోంది.
ప్రధాన మంత్రి ఎందుకు మీడియా నుండి ప్రశ్నలను స్వీకరించడం లేదనే ప్రశ్నకు, ఎంఈఏ అధికారి ఇచ్చిన సమాధానం పూర్తి లోపభూయిష్టంగా ఉంది.
ముఖ్యంగా పశ్చిమాసియా యుద్ధం కారణంగా ప్రపంచం అపూర్వమైన ఇంధన సంక్షోభంలో చిక్కుకున్న ఈ సమయంలో, ప్రధాన మంత్రి పట్టణ, గ్రామీణ ప్రజలకు సంబంధించిన అత్యవసర రాజకీయ, ఆర్థిక అంశాలపై సమాధానాలు చెప్పాల్సి ఉంది. నిజానికి, ఈ భారీ సంక్షోభంపై ఎటువంటి మీడియా వేదికగానైనా తన అభిప్రాయాలను పంచుకోవడానికి ఆయన విముఖత చూపుతున్నారు.
ప్రపంచవ్యాప్తంగా నాయకులు ప్రజాస్వామ్య ప్రక్రియలో భాగంగా మీడియాను క్రమం తప్పకుండా సంప్రదిస్తూ, వారి ప్రశ్నలకు సమాధానాలు ఇస్తుంటారు. మీడియాను తప్పించుకుని తిరగరు. ప్రతి ప్రజాస్వామ్య వ్యవస్థలోనూ, మీడియా ప్రజల తరపున గొంతుకగా ఉంటూ, పదవుల్లో ఉన్న వారిని జవాబుదారీగా ఉంచుతుంది. ప్రజలు ఎదుర్కొంటున్న అత్యవసర సమస్యలపై వారి నుండి స్పందనను కోరుతుంది. సోషల్ మీడియా ఛానెళ్ల ద్వారా సాగే స్క్రిప్టెడ్, ఏకపక్ష కమ్యూనికేషన్లు, స్వతంత్ర మీడియాతో జరిగే ప్రజా సంభాషణలకు ప్రత్యామ్నాయం కావు.
అధికారిక పదవుల్లో ఉన్న వారు ఇటువంటి బాధ్యతారహితమైన వ్యాఖ్యలు చేయడం మానుకోవాలని ఎడిటర్స్ గిల్డ్ కోరుతోంది. ఇటువంటి వ్యాఖ్యలు భావ ప్రకటనా స్వేచ్ఛను, మీడియా స్వేచ్ఛను మరింత దెబ్బతీసేలా ఉన్నాయి.
5 days ago | [YT] | 484
View 20 replies
Mahua Media
సోనమ్ వాంగ్చుక్ నిరాహార దీక్ష మొదలు పెట్టి 19 రోజులు. గాడ్సే ను కొలిచే దేశంలో ఇలాంటి సత్యాగ్రహాలకు విలువ ఉంటుందా?
https://youtu.be/LJexxUwMYqc
5 days ago (edited) | [YT] | 28
View 1 reply
Mahua Media
జర్నలిస్ట్: ఇథనాల్ కారణంగా నా కారు మైలేజీ 11 కి.మీ/లీటర్ నుండి 7 కి.మీ/లీటర్కు పడిపోయింది.
నితిన్ గడ్కరీ: మీరు మీ కారు మైలేజీని ఎలా చెక్ చేశారు?
జర్నలిస్ట్: అందరూ ఎలా చెక్ చేస్తారో, నేను కూడా నా కారులోనే అలాగే చెక్ చేసుకున్నాను.
నితిన్ గడ్కరీ: మీరు ఇంట్లో చెక్ చేస్తే కుదరదు. కారు మైలేజీని కంపెనీ ఆథరైజ్డ్ డీలర్ వద్ద ఉన్న మెషీన్ ఉపయోగించి మాత్రమే చెక్ చేయవచ్చు.
-----
కొన్ని వేల మంది రోజూ ఇదే విషయం చెప్తున్నారు. ఒకవైపు మైలేజ్ పడిపోతోంది, ఇంకో వైపు రిపేర్లు వస్తున్నాయి. అయినా ఒప్పుకోవటానికి, తప్పు దిద్దుకోవటానికి వాళ్ళు సిద్ధంగా లేరు. ఎందుకంటారు?
1 week ago | [YT] | 1,259
View 181 replies
Load more