Welcome to Lord Shivavibes17 channel! Here, we explore the rich history and mythology surrounding Lord Shiva, one of the most revered deities in Hinduism.
Our channel features a variety of content, including stories and legends of Lord Shiva, his children, and their adventures. We also delve into the symbolism and teachings of Lord Shiva, and how they can be applied to our lives today.
We cover a wide range of topics related to Lord Shiva, including his role in the Hindu Trinity, his various avatars, and his relationship with other deities. Our channel is suitable for viewers of all ages and backgrounds, and we strive to make our content accessible and engaging for everyone.
So, if you're a fan of Lord Shiva or just curious about Hindu mythology, be sure to subscribe to our channel and hit the notification bell to never miss a video!
youtube.com/c/shivaschildren17?sub_confirmation=1
Shiva Vibes
*లింగోద్భవం...!!*
*లింగోద్భవ సమయం....*
*నిశిత కాల పూజ (లింగోద్భవ సమయం): ఫిబ్రవరి 15 అర్ధరాత్రి 11:55 నుంచి ఫిబ్రవరి 16 తెల్లవారుజామున 12:56 వరకు.*
*చతుర్దశి తిథి ముగింపు: ఫిబ్రవరి 16, సోమవారం సాయంత్రం 05:34 గంటలకు.*
*సర్వేశ్వరుడైన ఈశుడు లింగస్వరూపుడూ* *అందులోనూ తేజో లింగస్వరూపుడై అవతరించిన* *మరుక్షణంలోనే మానవాళికి గొప్ప సందేశాన్ని ఇచ్చాడని వివరించే ఈ కథా సందర్భం శివపురాణంతో పాటు ఇతర పురాణాలలో కూడా ప్రస్తావితమై ఉంది.*
ఒక్క శివలింగానికి కాసింత పూజను, అభిషేకాన్ని ఏ రోజు చేసినా పుణ్యఫలమే. అందులోనూ శివరాత్రి వేళ లింగోద్భవ సమయంగా చెప్పే సమయంలో ఇక అలాంటి పూజలు, అభిషేకాలు చేస్తే ఎంత గొప్ప పుణ్యఫలం ప్రాప్తిస్తుందో ప్రత్యేకించి చెప్పాల్సిన అవసరమేముంటుందని పురాణజ్ఞులు, పండితులు అంతా అనేమాట వాస్తవమే.
అసలు మనిషి దైవ సందేశాన్నందుకొని లోక యాత్రలో పుణ్య పురుషుడుగా మెలగాలన్నదే మన ఆర్షవాణి, సంప్రదాయ పర్వదినాల అవతరణలో అసలు విషయం. ఇక లింగోద్భవ సమయంలో శివుడిచ్చిన సందేశమేమిటి? ఆ భవుడికి, భవనాశనుడికి, శంకరుడికి నచ్చనిది ఏది? అనే విషయం కూడా ఇక్కడ ప్రస్తావితమై కనిపిస్తుంది.
పూర్వం ఓసారి బ్రహ్మకు, విష్ణువుకు తాను గొప్పంటే తాను గొప్పన్న అహంకారం కలిగింది. అది కాస్త తీవ్ర రూపం దాల్చి యుద్ధ స్థాయికి చేరింది. లోకాలన్నీ ఆ తగవులాటవల్ల భీతిల్లుతున్న తరుణంలో చంద్ర శేఖరుడు హరిబ్రహ్మలకు జ్ఞానాన్ని ప్రసాదించాలనుకున్నాడు. వెంటనే వారి ముందు ఒక దివ్యతేజోరాశిని ఆద్యంతాలు తెలియని స్తంభలింగరూపంలో అవతరించేలా చేశాడు. అప్పటిదాకా అక్కడ లేని ఆ దివ్యతేజోస్తంభం ఏమిటా అని హరి, బ్రహ్మలు యుద్ధంమాని విస్తుపోతూ చూశారు. వెంటనే పార్వతీ వల్లభుడు తన దివ్యలీలా విలాసంతో వారికి ఓ పరీక్ష పెడుతున్నానని, ఆ స్తంభం (లింగం) అగ్రభాగాన్ని ఒకరు, అడుగు భాగాన్ని మురొకరు చూసి రావాలని, ఎవరు ముందుగా వస్తే వారే గొప్పని, వారికే సర్వాధిపత్యం అని చెప్పాడు. వెంటనే బ్రహ్మ హంసరూపుడై ఆ తేజోలింగం అగ్రభాగానికి చేరటానికి వెళ్ళాడు. విష్ణువు వరాహరూపుడై ఆ లింగం మూలం ఎక్కడుందో తెలుసుకోవటానికి పాతాళం వైపు ప్రయాణం చేశాడు.
హరి, బ్రహ్మలకు ఆ దివ్యతేజో రాశి ఆద్యంతాలు ఎంతకీ అంతు పట్టలేదు. ఇంతలో పై నుండి ఒక కౌతకి (మొగలిపువ్వు) రావటం హంస రూపంలో ఉన్న బ్రహ్మ చూశాడు. బ్రహ్మ మొగలి పువ్వును ప్రలోభపెట్టి తాను ముందుగా తేజో రాశి అగ్రభాగాన్ని చూశానని చెప్పుకోవటానికి సాక్ష్యంగా ఉండమని కోరాడు. పాతాళం వైపు వెళ్ళిన విష్ణువుకు తేజోరాశి పీఠభాగం ఎంత దూరం వెళ్ళినా కనిపించలేదు. ఇంతలో అబద్ధపు సాక్ష్యం చెప్పేందుకు మొగలి పువ్వును వెంట పెట్టుకొని శివుడి దగ్గరకొచ్చాడు. బ్రహ్మ, ఆ తర్వాత కొద్ది సేపటికి విష్ణువు తేజోలింగం అడుగు భాగం తాను కనుక్కోలేకపోయానని బాధపడుతూ పై కొచ్చాడు. శివుడికి బ్రహ్మ తేజోరాశి అగ్రభాగాన్ని తాను చూశానని అందుకు సాక్ష్యంగా కేతకిని కూడా వెంటపెట్టుకొచ్చానన్నాడు. ఆ అసత్య మాటలకు శివుడికి కోపం ముంచుకువచ్చిది. వెంటనే భైరవుడిని సృష్టించి అసత్యమాడినందుకు బ్రహ్మను దండించమన్నాడు.
భైరవుడు అప్పటిదాకా బ్రహ్మకున్న ఐదుతలలలో అబద్ధం ఆడిన తలను తుంచేశాడు. తరువాత తప్పును తెలుసుకున్న బ్రహ్మ ఈశుడిని శరణు వేడుకొన్నాడు. పక్కనే ఉన్న విష్ణువు కూడా అప్పటికే శివుడి గొప్పప్పతనాన్ని గ్రహించి శివుడికి నమస్కరించాడు. బ్రహ్మ తప్పును క్షమించమని కూడా వేడుకున్నాడు. శరణాగత వత్సలుడైన శంకరుడు చల్లబడ్డాడు. ఇంతకు ముందు లాగానే బ్రహ్మకు సృష్టి అధికారం ఉంటుందని, అయితే ఇతర దేవతల్లాగా బ్రహ్మకు ఆలయాలు, పూజలు ఏవీ ఉండవని చెప్పాడు. అబద్ధం ఆడకుండా వాస్తవాన్ని తెలిపిన విష్ణువు అందరి చేత పూజలందుకుంటాడని, స్థితి కారకుడిగా వెలుగొందుతాడని అన్నాడు.
మొగలిపువ్వును చూసి అసత్యమాడిన పాపానికి తన పూజలో మొగలిపువ్వుకు చోటుండదని అన్నాడు. అయితే ఆ కేతకి శివుడికి పరిపరివిధాల ప్రణమిల్లింది. భక్తవత్సలుడైన శివుడు అప్పుడు కొంత శాంతించి శివపూజకు పనికి రాకపోయినా శివభక్తులు మాత్రం మొగలిపువ్వును ధరిస్తారని, అలా జన్మను చరితార్థం చేసుకోమని చెప్పి అంతర్థానమయ్యాడు. ఈ కథా సందర్భంలో ఎంతటి వారైనా అసత్యమాడితే పాపఫలితాన్ని అనుభవించాల్సి ఉంటుందని తెలియజెప్పే సందేశం ఇమిడి ఉంది. మానవులాంతా సత్యమార్గంలోనే నడుచుకోవాలన్న ఈశ్వర సందేశం ఇక్కడ కనిపిస్తోంది.
🪷⚛️✡️🕉️🪷
3 days ago | [YT] | 437
View 2 replies
Shiva Vibes
శివుని యొక్క ప్రతినామం పాప సంహారకం. సామాన్యం కాదు. వేదాలనే కల్పవృక్షపు పళ్ళు శివనామాలన్నీ కూడా. శివరాత్రి నాడు ఆరాధించవలసిన శివనామాలు ధర్మశాస్త్రం కొన్ని చెప్పాంది -
4 శివాయ నమః;
4 రుద్రాయ నమః;
4 పశుపతయే నమః;
కుష్పరంట్
నీలకంఠాయ నమః;
మహేశ్వరాయ నమః;
4 హరికేశాయ నమః;+
అ విరూపాక్షాయ నమః;
4 పినాకినే నమః;
అ త్రిపురాంతకాయ నమః;
ఆ శంభవే నమః;
ఆ శూలినే నమః;
ఆ మహా దేవాయ నమః.
ఈ పన్నెండు నామాలతో శివారాధన చేస్తే చాలు. ఈ పన్నెండు నామాలు మనస్సులో అనుకున్నా చాలు.
3 days ago | [YT] | 143
View 1 reply
Shiva Vibes
మహాదేవుని కాశీ క్షేత్రంలో మహాశివరాత్రి
తెలుగు పంచాంగం ప్రకారం మాఘ మాసం, కృష్ణ (శుక్ల) పక్షం, చతుర్దశి నాడు మహాశివరాత్రి జరుపుకుంటారు. చతుర్దశి తిథి రాత్రిపూట శివ పూజకు ఉత్తమమైనదిగా పరిగణించబడుతుంది. మహాశివరాత్రి రోజున ఉపవాసం, రాత్రి జాగరణ చేస్తారు. ప్రదోష కాలంలో శివుడికి రుద్రాభిషేకం చేయడం విశేష ఫలితాలను ఇస్తుంది అని శాస్త్రంలు చెప్పుచున్నాయి. మహా శివరాత్రి గురించి స్కాంద పురాణం, లింగ పురాణం, పద్మ పురాణాలతో సహా అనేక పురాణాలలో ప్రస్తావించబడింది. వివిధ పురాణాలు మహా శివరాత్రి యొక్క ప్రాముఖ్యతను వివరిస్తాయి. శైవ సంప్రదాయంలో ఒక పురాణం ప్రకారం, సృష్టి, స్థితి, లయ కారకుడైన శివుడు తాండవం చేసే రాత్రిని మహాశివరాత్రిగా పేర్కొంది. మరొక పురాణం ప్రకారం శివుడు మరియు పార్వతి వివాహం చేసుకున్న రాత్రి. వేరొక పురాణం ప్రకారం శివరాత్రి అనేది సంవత్సరానికొకసారి శివలింగాన్ని పూజించడం, గతంలో చేసిన పాపాలను ప్రక్షాళన చేసుకోవడానికి, పుణ్యమార్గంలో జీవించి కైలాసాన్ని చేరుకోవడానికి శుభప్రదం అని చెప్పుతుంది.
కాశీ (వారణాసి) పంచాంగం ప్రకారం, ఉత్తర ప్రాంతపు ఫాల్గుణ మాస, కృష్ణ పక్ష ,చతుర్దశి తిథి సందర్భంగా మహాశివరాత్రి వేడుకలు ఆధ్యాత్మిక శోభతో అత్యంత వైభవంగా, శివనామస్మరణ మధ్య జరుగుతాయి. కాశీలో శివరాత్రి రోజున శివుడు లింగాకారంలో ఆవిర్భవించాడని, ఈ రోజు ఉపవాసం, జాగరణ, మరియు అభిషేకం చేయడం వల్ల విశేష పుణ్యఫలితాలు, మోక్షం లభిస్తాయని నమ్ముతారు. తెల్లవారుజామున గంగానదిలో పవిత్ర స్నానం ఆచరించి, విశ్వేశ్వరుని పూజించడం మహాపుణ్యంగా భావిస్తారు. విశ్వనాథ ఆలయంలో జ్యోతిర్లింగ దర్శనం కోసం తెల్లవారుజాము నుండే భక్తులు బారులు తీరుతారు. భక్తులు బిల్వదళాలతో (మారేడు దళాలు) శివుని పూజిస్తారు, అభిషేకాలు చేస్తారు. శివాలయాల్లో రాత్రంతా భజనలు, స్తోత్ర పఠనాలతో జాగరణ నిర్వహిస్తారు. ఆ రాత్రంతా అభిషేకాలు, భజనలతో వారణాసి నగరం శివమయమవుతుంది.
వారణాసి వీధుల్లో జరిగే శివ-పార్వతుల కళ్యాణోత్సవ యాత్ర (శివ బారాత్) ప్రధాన ఆకర్షణ. తిల్భండేశ్వర్ ఆలయం నుండి వివాహ ఊరేగింపులు ఉంటాయి. వివిధ ప్రాంతంలు నుంచి కూడ శివ బారాత్ ఊరేగింపులు బయలుదేరుతాయి. వారణాసి నగరం అంతటా ఇటువంటి అనేక ఊరేగింపులు నిర్వహించబడతాయి. కాల భైరవాలయంలో మహాశివరాత్రి సందర్భంగా ప్రత్యేక వేడుకలు జరుగుతాయి. వారణాసి లోని అన్ని మహాదేవ ఆలయలలో మహాశివరాత్రిని ప్రధాన పండుగగా నిర్వహించుతారు. ఇతర ఆలయాల్లో కూడ మహాశివరాత్రి వేడుకలు జరుగుతాయి. మహాశివరాత్రి సందర్భంగా చాలా మంది యాత్రికులు సుమారు 80 కి.మీ చెప్పులు లేకుండా పంచక్రోషి తీర్థయాత్ర చేస్తారు. కర్దమేశ్వర్ వంటి ఆధ్యాత్మిక ప్రదేశాలలో సాంప్రదాయ సంగీతం కూడిన సాంస్కృతిక ఉత్సవాలు జరుగుతాయి. యాత్రలో రాత్రిపూట జరిగే ఉత్సాహభరిత వేడుకలు వైభవంగా ఉంటాయి. కాశీ విశ్వనాథుని ఆలయంతో పాటు, ఘాట్ల వద్ద జరిగే ప్రత్యేక పూజలు, హారతులు పర్యాటకులను, భక్తులను ఆకట్టుకుంటాయి. మణికర్ణికా ఘాట్ వంటి ప్రదేశాలలో ప్రత్యేక పూజలు, హర హర మహాదేవ్ నినాదాలు వినిపిస్తాయి. మహాశివరాత్రి పవిత్ర సమయాల్లో భక్తులు ఉత్సాహంగా 'హర హర మహాదేవ్', 'ఓం నమః శివాయ' నినాదాలు చేస్తారు. ఈ నినాదాలు శివునిపై భక్తిని, శివ శంభు జపంతో ఆధ్యాత్మిక అనుభూతిని కలిగిస్తాయి. భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని, లింగాలుకు అభిషేకాలు మరియు గంగ ఒడ్డున దీపారాధన చేస్తారు.
కాశీ లోని శృంగేరి శంకర మఠం, కంచి కామకోటి పీఠం, పంచ దశనామ్ జునా అఖారా వంటి మఠంలల్లో, వివిధ ఆశ్రమంలో మరియు గంగా ఘాట్ తీరాన గల లింగాలు వద్ధ ప్రత్యేక హోమాలు, లింగార్చనలు నిర్వహిస్తారు. ప్రతి ఆలయం వద్ద రుద్రాభిషేకం, ప్రత్యేక హోమాలు, లింగార్చనలు జరుగుతాయి. శ్రీ రామ తారకాంధ్ర ఆశ్రమంలో అన్నపూర్ణ సమేత మానసేశ్వర స్వామి వారికి రుద్రాభిషేకం చేస్తారు. తెలుగు రాష్ట్రాల నుండి వేలాదిమంది భక్తులు తరలివచ్చి, కాశీలో ప్రత్యేక హోమాలు, లింగార్చనలు నిర్వహిస్తారు. దేశం నలుమూల నుంచి వేలాదిమంది భక్తులు, ముఖ్యంగా తెలుగు రాష్ట్రాల నుండి వచ్చిన వారు విశ్వనాథుని దర్శించుకుని, కాశీ ఘాట్లలో స్నానాలు ఆచరించి, మహాశివరాత్రి పర్వదినాన్ని భక్తిశ్రద్ధలతో జరుపుకుంటారు. కాశీలో మహాశివరాత్రి అనుభూతి చెందడం జన్మజన్మల పుణ్యంగా భావిస్తారు.
ఓం నమః శివాయ. ఇది అత్యంత ముఖ్యమైన మంత్రం.
శివపంచాక్షర స్తోత్రం మరియు లింగాష్టకం వంటివి భక్తిని, శాంతిని ఇస్తాయి. శివుని గొప్పతనాన్ని, తత్వాన్ని తెలిపే శివ సూక్తులు మరియు మంత్రాలు మానసిక ప్రశాంతతను, సానుకూల శక్తిని ఇస్తాయి.
"శివుడు కళ్యాణ స్వరూపుడు"
3 days ago | [YT] | 83
View 1 reply
Shiva Vibes
ఓం నమోవెంకటేశాయ 🙏🌹🙏🥰
ఏడుకొండల వాడా... గోవిందా!
నీలి మేఘాల ఛాయా... నీ రూపం,
నిత్య కళ్యాణ శోభితం... నీ నామం!
శంఖు చక్రాల ధారి... ఓ శ్రీనివాసా,
శరణన్న వారిని కాచే... జగదీశా!
అలిపిరి మెట్లు ఎక్కి వస్తుంటే,
అలసట మరిపించే అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడివి!
కనురెప్ప వేయని ఆ నిలువెత్తు విగ్రహం,
కడతేర్చును మాకున్న కష్టాల సముద్రం!
వడ్డీ కాసుల వాడా... వనజ నాభా, భక్తుల గుండెల్లో కొలువైన మాధవా!
నీ నామ స్మరణే మోక్షానికి మార్గం,
నీ పాద సేవయే మా జన్మకు సార్థకం!
గోవిందా... గోవిందా!🙏🙏🙏🙏🥰🥰🥰🥰
తిరుమల శ్రీవారి ఆలయంలో #విమాన #వెంకటేశ్వర #స్వామి అత్యంత విశిష్టమైన మరియు పవిత్రమైన మూర్తి. ఆనంద నిలయం అని పిలువబడే ప్రధాన గోపురం (విమానం) పై వెలసిన ఈ స్వామి వారి గురించి కొన్ని ముఖ్యమైన విశేషాలు ఇక్కడ ఉన్నాయి:
1. విమాన వెంకటేశ్వరుడు అంటే ఎవరు?
తిరుమల గర్భాలయంలోని మూలవిరాట్టుకు సరిగ్గా పైన, ఆనంద నిలయ విమానం (బంగారు గోపురం) యొక్క రెండో అంతస్తులో వాయువ్య దిశలో ఈ చిన్న విగ్రహం కొలువై ఉంటుంది. గర్భాలయంలోని స్వామివారిని దర్శించుకోలేని వారు లేదా ఆలయ ప్రదక్షిణ చేసే భక్తులు ఈ విమాన వెంకటేశ్వరుడిని దర్శించుకోవడం ఆచారంగా వస్తోంది.
2. చారిత్రక ప్రాముఖ్యత
* ప్రత్యామ్నాయ దర్శనం: పూర్వ కాలంలో గర్భాలయంలోకి అందరికీ ప్రవేశం ఉండేది కాదు. అప్పట్లో భక్తులు ఈ విమాన వెంకటేశ్వరుడిని దర్శించుకుని, గర్భాలయంలోని స్వామిని దర్శించుకున్నంత ఫలితాన్ని పొందేవారని ప్రతీతి.
* పునరుద్ధరణ: విజయనగర చక్రవర్తి కృష్ణదేవరాయల కాలంలో ఈ గోపురానికి బంగారు పూత పూయించారు. అప్పటి నుండి ఈ విగ్రహం మరింత ప్రాచుర్యంలోకి వచ్చింది.
3. ఆధ్యాత్మిక విశిష్టత
* పాప పరిహారం: విమాన వెంకటేశ్వరుడిని దర్శించుకోవడం వల్ల తెలిసి చేసిన, తెలియక చేసిన పాపాలు తొలగిపోతాయని భక్తుల నమ్మకం.
* ముక్తి మార్గం: వైకుంఠ ఏకాదశి వంటి పర్వదినాల్లో ఈ స్వామిని దర్శించడం అత్యంత పుణ్యప్రదమని చెప్తారు.
* బ్రహ్మలోక ప్రాప్తి: శాస్త్రాల ప్రకారం, గర్భాలయ విమానంపై ఉన్న దైవాన్ని దర్శించడం వల్ల పునర్జన్మ ఉండదని భావిస్తారు.
4. దర్శించుకోవడం ఎలా?
తిరుమల ప్రధాన ఆలయం చుట్టూ ప్రదక్షిణ చేసే సమయంలో, ఉత్తర-పశ్చిమ మూల (వాయువ్య దిశ) వద్ద ఆగి పైన ఉన్న గోపురాన్ని గమనిస్తే, బంగారు కవచంలో మెరిసిపోతున్న విమాన వెంకటేశ్వర స్వామి కనిపిస్తారు.
> ముఖ్య గమనిక: తిరుమలలో "అంగప్రదక్షిణ" చేసేవారు మరియు "శ్రీవారి దర్శనం" చేసుకునే భక్తులు తప్పనిసరిగా విమాన వెంకటేశ్వరుడిని దర్శించుకుని మొక్కులు చెల్లించుకుంటారు.
ఓం నమోవెంకటేశాయ 🙏🙏🙏
4 days ago | [YT] | 383
View 8 replies
Shiva Vibes
42 రోజుల శివ దీక్ష (మండల దీక్ష) అత్యంత పవిత్రమైనది. నిత్యం ఉదయం, సాయంత్రం స్నానం, రుద్రాక్ష మాల ధారణ, విభూతి, చందనం, కుంకుమ నుదుట పెట్టుకోవాలి. 42 రోజులు శాఖాహారం మాత్రమే తీసుకుంటూ, బ్రహ్మచర్యం పాటిస్తూ, నేలపై నిద్రించాలి. ఎవరితో చెప్పకుండా ప్రదోష వేళల్లో శివాలయం దర్శించి శివ నామస్మరణ (ఓం నమశ్శివాయ) చేయడం ద్వారా దరిద్రాలు, కష్టాలు తొలగిపోతాయని నమ్ముతారు.
42 రోజుల శివ దీక్షా నియమాలు (42 Days Shiva Deeksha Rules):
శుచి & ఆహారం: ప్రతిరోజూ స్నానం చేసి చందన/కాషాయ రంగు వస్త్రాలు ధరించాలి. శాఖాహారం (సాత్విక ఆహారం) మాత్రమే తీసుకోవాలి.
శివ పూజ: ఉదయం, సాయంత్రం (త్రికాలం) శివునికి పూజ, అభిషేకం చేయాలి.
నమశ్శివాయ జపం: నిరంతరం 'ఓం నమశ్శివాయ' అనే పంచాక్షరీ మంత్రాన్ని జపించాలి.
1 week ago | [YT] | 3
View 0 replies
Shiva Vibes
https://youtu.be/-uEYpOLz4_A?si=iORsr...
🕉️ శివ శంకరా… శరణం శరణం 🕉️
చరణం 1:
కైలాస శిఖరాన వెలసిన దేవా
కరుణా సాగరా, కాపాడే స్వామీ
జటలలో గంగను ధరించిన నాథా
నీలకంఠుడా, నిత్య శివా
పల్లవి:
శివ శంకరా… శరణం శరణం
సోమశేఖరా… శరణం శరణం
హర హర మహాదేవా…
హృదయంలో నీవే దేవా
చరణం 2:
డమరుక ధ్వనిలో నాదం పుట్టే
నాట్యమాడే నీలలోహితా
భక్తుల కష్టాలు తొలగించే
భోళా శంకరా, భవభయ హరా
పల్లవి:
శివ శంకరా… శరణం శరణం
సోమశేఖరా… శరణం శరణం
హర హర మహాదేవా…
హృదయంలో నీవే దేవా
బ్రిడ్జ్:
ఓం నమః శివాయ… ఓం నమః శివాయ
ప్రాణంలో జపమై వినిపించు స్వామీ
అజ్ఞాన అంధకారం తొలగించి
జ్ఞాన దీపం వెలిగించు స్వామీ
చరణం 3:
భస్మ భూషిత దేహముతో నీవు
వైరాగ్య రూపమై నిలిచావా
అమ్మ పార్వతీతో కలసి
సృష్టి లయకు కారణమయ్యావా
పల్లవి (ముగింపు):
శివ శంకరా… శరణం శరణం
కరుణా సిందూరా… శరణం శరణం
హర హర మహాదేవా…
జయ జయ శివ శంభో దేవా 🙏
1 week ago | [YT] | 5
View 0 replies
Shiva Vibes
శివ రుద్ర గాయత్రి మంత్రం
ఓం సర్వేశ్వరాయ విద్మహే స్థూలహస్తాయ ధీమహి తన్నో రుద్రః ప్రచోదయాత్
అతి శక్తివంతమైన శివ మంత్రం
ప్రతి రోజు 11 సార్లు జపించండి
1 week ago | [YT] | 468
View 3 replies
Shiva Vibes
ఓం సీతాదేవీముద్రాప్రదాయకాయ నమః
ఓం అశోకవనికాచ్ఛేత్రే నమః
ఓం సర్వమాయావిభంజనాయ నమః 🙏🙏🙏
అంజనానందం వీరం
జానకీ శోక నాశనం|
కపీషమక్ష హంతారం
వందే లంకాభయంకరం !!
భావము:- అంజనాదేవి కుమార,జానకీ మాతా శోకాన్ని పోగొట్టినవాడా,వానరమూక రాజా, లంక రాజుకు భయం పుట్టించిన వాడా, రావణుని రెండవ కుమారుడైన అక్షను సం హరించిన ఆంజనేయ నీకు వందనాలు.
2 weeks ago | [YT] | 592
View 4 replies
Shiva Vibes
ఈ శివ నామాలు చదివితే జీవితంలో తిరుగుండదు..
ఓం శర్వాయ దేవాయ నమః (పృద్వి లింగం)
ఓం భవాయ దేవాయ నమ : (జల లింగం)
ఓం రుద్రాయ దేవాయ నమ: (అగ్ని లింగం)
ఓం దేవాయ నమ ఉగ్రాయ : (వాయు లింగం)
ఓం భీమాయ దేవాయ నమ : (ఆకాశ లింగం)
ఓం ఈశానాయదేవాయ నమః (సూర్య లింగం)
ఓం మహా దేవాయ నమ: (చంద్ర లింగం)
ఓం పశుపతయే దేవాయ నమ: (ఆత్మలింగం)
ప్రదోష కాలం అనేది శివారాధనకు అత్యంత పవిత్రమైన సమయం అని హిందూ ధర్మ శాస్త్రం చెబుతుంది.
ఈ సమయంలో చేసే శివపూజ అత్యంత విశిష్టమైనదిగా, పవిత్రమైనదిగా భావిస్తారు.
हरहर महादेव
2 weeks ago | [YT] | 423
View 3 replies
Shiva Vibes
మొక్కిన వారికి దిక్కు నీవు
అడిగినవారికి ఆపద్బాంధవు నీవు
పిలిచిన వారికి పరమాత్మవూ నీవు
ఆర్తి కలిగిన వారికి అంతరాత్మ నీవు
ముక్తి కోరేవారికి గమ్యం నీవు
అన్నిటికి నీవే కదా దిక్కు గోవిందా
ఒకనాడు నిన్ను దైవంగా కొల్చాను
మర్నాడు నిన్ను సర్వంగాభావించాను
నేడు నా తండ్రిగా నిలుపుకున్నాను
ఆ బంధం కన్నా గొప్ప బంధం ఏముంది #స్వామి #గోవింద
ఆపదమొక్కులవాడు
అడుగడుగున దండాల వాడు
ఏడుకొండలస్వామి తిరుమల తిరుపతి శ్రీ వెంకటేశ్వర స్వామి వారు నమో నమః గోవింద హరి గోవిందా
2 weeks ago | [YT] | 823
View 7 replies
Load more