Sriram Dal Dharma Jagaran

Sriram Dal Dharma Jagaran

అందరికి జై శ్రీరామ్ 🙏🏻
నిన్న అనగా 18 జులై 2025 శుక్రవారం సాయంత్రం 5:00 గం. లకు రామచందరావు బంజర్ శివాలయంలో జరిగిన "హిందూ ఐఖ్యత" పేరిట సమావేశ కార్యక్రమం అద్భుత విజయం సాధించింది.
ఇందులో భాగం అయిన ప్రతిఒక్కరికి ప్రత్యేక ధన్యవాదాలు 🙏🏻.
ఈ సమావేశ ముఖ్య ఉద్దేశం :-
కొన్ని సంవత్సరాలుగా రామచందరావు బంజర్ శివాలయాన్ని అక్కడి SC కాలనీ వాసులు నిర్మాణం చేయడం ఒక అద్భుతం అయితే, ఈ శివాలయంలో ఒక దళిత వ్యక్తి పూజారిగా ఉండటం నిజంగా గొప్పవిషయం. ఈ విషయాన్ని తెలుసుకున్న హిందూ సైన్యం అక్కడికి వెళ్లి, వీళ్ళు గుడి నిర్మాణం చేసి నిత్య పూజలు చేయడమే కాక, సనాతనధర్మ పరిరక్షణలో భాగం అవుతున్నారు అనేవిషయాన్ని తెలుసుకొని మరీ వీళ్ళను శాలువతో సత్కరించడం జరిగింది.
ఇంకా ధర్మ పరిరక్షణలో అందరూ కలిసికట్టుగా ముందుకు నడవాలి అని తెలియచేయడం జరిగింది.
రాబోయే రోజుల్లో మరిన్ని గ్రామాలు తిరిగి హిందువులను చైతన్యం పరిచే కార్యక్రమంలో మేము పాల్గొంటాం అని ఈ కాలనీ వాసులు తెలియచేశారు. దీనికి గాను అక్కడికి వెళ్లి మేము మీకు తోడుగా ఉంటాం అని భరోసా ఇస్తూ, వారిని అభినందించడమే దీని ముఖ్య ఉద్దేశంగా ఈ సమావేశ ఏర్పాటు జరిగింది.

ఈ కార్యక్రమంలో :-
శ్రీరామ్ ధళ్,
RSS,
బీజేపీ,
హిందూ సైన్యం మరియు గ్రామ పెద్దలు పాల్గొని ఈ యొక్క కార్యక్రమాన్ని జయప్రదం చేయడం జరిగింది.

జై శ్రీరామ్ 🚩
ఓం నమశ్శివాయ 🙏🏻

8 months ago | [YT] | 11

Sriram Dal Dharma Jagaran

తొర్రుర్ బజరంగ్ యూత్ ఆధ్వర్యంలో (మెండిస్ గారు, సతీష్ గారు మరియు శివ గారు)మొన్న నవంబర్ 06 2024 బుధవారం రోజున జరిగిన క్రికెట్ టోర్నమెంట్ కి ముఖ్య అతిధిగా విచ్చేసిన జన సంఘం రాష్ట్ర అధ్యక్షులు వేణుగారు మరియు ప్రసాద్ గారు.
వివిధ ప్రాంతాల నుండి క్రికెట్ ఆడడానికి విచ్చేసిన మన యువతకు, వేణుగారు చాలా ముఖ్యమైన విషయాలను సూచించడం, జన సంఘం యొక్క ముఖ్య విధి విధానాలగురించి వివరించడం జరిగింది.
అలాగే తొర్రుర్లో కార్యక్రమం ముగిసిన అనంతరం, అమ్మాపురం గ్రామం వెళ్లి అక్కడి యువతకు కూడా కొన్ని ముఖ్య విషయాలను తెలియచేసిన వేణుగారు మరియు ప్రసాద్ గారు మొన్న జరిగిన DSC పరీక్షలో ఉత్థిర్ణత సాధించి, ఉపాధ్యాయ ఉద్యోగాన్ని పొందిన సీరపాటి రాజేందర్ గారికి శ్రీరామ్ దళ్ మరియు జన సంగం నాయకులు కలిసి శాలువాతో సత్కరించడం మంచి పరిణామంగా అక్కడి వారు భావించడం జరిగింది.
ఇంకా మున్ముందు చాలా కార్యక్రమాలలో పాల్గొని యువతను, మన హిందూ సమాజాన్ని సరైన మార్గంలో నడిపించే విధంగా వేణు గారు మరియు ప్రసాద్ గారు కృషి చేస్తారని, చేయాలని ఆశిద్దాం 🙏🏻🙏🏻.

జై శ్రీరామ్ 🚩
జై జై శ్రీరామ్ 🚩

1 year ago | [YT] | 15

Sriram Dal Dharma Jagaran

మానుకోట జిల్లా, దంతాలపల్లి మండలంలోని రేపుణి గ్రామంలో 13 మే 2024 న రాబోయే ఎలక్షన్స్ ని దృష్టిలో పెట్టుకొని, కార్యకర్తలకు సలహాలు సూచనలు ఇస్తున్న రాజ్ కుమార్ గారు. బీజేపీ విజయం కోసం ఎలా ముందుకు వెళ్ళాలి, మన శ్రీరామ్ ధళ్ కార్యకర్తలు గ్రౌండ్లో దిగి ఎలా పనిచేయాలి అనేవిషయంపై రసవత్తర చర్చ నిర్వహించడం జరిగింది.
అలాగే శ్రీరామ్ ధళ్ ధర్మ జాగరణ సంస్థ భవిష్యత్ కార్యాచరణ కోసం కూడా చర్చించడం జరిగింది. రాబోయే రోజుల్లో కార్యకర్తలు బలంగా ముందుకు పోవాలి అంటే సమావేశ కార్యక్రమాలు ప్రతిచోటా నిర్వహించాలి అని అధ్యక్షుడు కృష్ణమూర్తి గారు తెలియచేయడం జరిగింది.
దేశం కోసం ధర్మం కోసం శ్రీరామ్ ధళ్ ధర్మ జాగరణ కృషి ఎల్లవేళలా ఉంటుంది అని విశాల్ గారు తెలియచేశారు.

Now Vote for BJP 👍🏻

1 year ago | [YT] | 36

Sriram Dal Dharma Jagaran

మన హైందవ వీరుడు దేశం కోసం ధర్మం కోసం అహర్నిశలు కృషిచేస్తూ, ధర్మమే నా ధ్యేయం, దేశమే నా సర్వస్వం అంటూ... ప్రతిక్షణం ధర్మో రక్షతి రక్షితః ధర్మ హింస తదే వచా! అనే మార్గంలో నడుస్తూ ఎంతోమంది భారత పౌరులను హైందవ వీరులుగా తీర్చిదిద్దిన ధర్మ పరిరక్షకుడైన మన కిన్నెర ప్రసాద్ గారి పెళ్లి రోజు ఈ రోజు.
అదేవిధంగా రామభక్తుడు అయినటువంటి శ్రీవీర హనుమాన్ జయంతి కూడా కావడం నిజంగా ఈ దంపతులకు అదృష్టకర పరిణామం. కనుక ఈరోజు మన ప్రసాద్ గారికి మరియు సోనమ్మకు హృదయపూర్వక పెళ్లిరోజు శుభాకాంక్షలు తెలియజేసుకుంటుంది మన శ్రీరామ్ దళ్ ధర్మజాగరణ సంస్థ 🚩🕉

శ్రీరామ్ దళ్ ధర్మ జాగరణ తెలంగాణ రాష్ట్రా కన్వీనర్,
మీ...
కిన్నెర రాజ్ కుమార్ గారు,
అమ్మాపురం గ్రామం.

1 year ago | [YT] | 19

Sriram Dal Dharma Jagaran

ఉగాది నుంచి శ్రీరామ నవమి వరకు,

చైత్ర శుద్ధ పాడ్యమి నుంచి…అంటే ‘ఉగాది’ నుంచి మనకు నూతన సంవత్సరం ప్రారంభమవుతుంది. అలాగే ఋతువులలో తొలి ఋతువైన వసంతఋతువు మొదలవుతుంది. ఈ వసంతఋతువుకు ఎంతో ప్రముఖ్యత ఉంది. శిశిరంలో …. ఆకులు రాల్చి సర్వస్వం కోల్పోయిన ప్రకృతికాంత…నవ పల్లవాలతో చిగిర్చి , పూల సోయగాలతో కనువిందులు చేస్తూ , సుగంథాల సేవలతో ప్రకృతి పురుషునకు మకరందాల విందులు అందించే.. ఈ వసంతఋతువు అంటే గుణరహితుడైన ఆ పరమాత్మనకు కూడా ఇష్టమే. అందుకే… ‘ఋతూనా కుసుమాతరః’ అని ‘గీత’లో చెప్పాడు పరమాత్ముడైన శ్రీకృష్ణుడు. అనంతమైన కాలంలో , కేవలం ఏడాదికో రెండు నెలలు ఆయుష్షు ఉండే ఈ వసంతఋతువుకు ఎందుకంత ప్రాధాన్యత ?

ఈ వసంత ఋతువులోనే దేవదేవుడైన శ్రీమహావిష్ణువు పరిపూర్ణ మానవునిగా అవనిపై అవతరించాడు. అదే శ్రీరామావతారం. అంతవరకూ రాక్షసుల యుద్ధాలతో విసిగి వేసారిన సర్వలోకాలు శ్రీరామ జననంతో మంచి రోజులు వచ్చాయని సంతోషించాయి. పుడుతునే సకల జీవకోటికీ ఆనందాన్ని కలిగించినవాడు శ్రీరాముడు. అందుకే.. సంవత్సరంలో తొలి పండుగ అయిన ఉగాది నుంచి శ్రీరామనవమి వరకూ ‘వసంత నవరాత్రులు’ సంబరంగా జరుపుకోవడం ఆచారమైంది. అయితే… తొమ్మిది రాత్రులే ఎందుకు జరుపుకోవాలి ? పదిరాత్రులు జరుపుకోకూడదా ? ఏమిటీ లెక్క ? అనే సందేహం చాలామందికి కలుగుతుంది. ‘నవ’ అంటే ‘తొమ్మిది’ అని ‘కొత్త’ అని రెండు అర్థాలు ఉన్నాయి. ‘కొత్త’ అంటే…

అంతవరకూ రాక్షస బాధలతో శోకమయంగా గడిపిన రాత్రులు పోయి ఆనందమయ నవరాత్రులు వచ్చాయి అని అర్థం. ఇక తొమ్మి రాత్రులు ఎందుకుచేయాలంటే….

భగవంతుని ఆరాధనలో ‘భక్తి’ తొమ్మిది రకాలు

శ్రవణం కీర్తనం విష్ణోః స్మరణం పాదసేవనం

అర్చనం వందనం దాస్యం సఖ్య మాత్మనివేదనం

శ్రవణం – కీర్తనం – స్మరణం – పాదసేవనం – అర్చనం – వందనం – దాస్యం – సఖ్యం – ఆత్మనివేదనం. ఇవి నవవిధ భక్తిమార్గాలు. భాగవతోత్తములుగా ప్రసిద్ధిగాంచిన ఎందరో భక్తులు ఈ నవవిధ భక్తి మార్గలలో ఏదో ఒక మార్గాన్ని ఎంచకుని పరమాత్మని సన్నిధి చేరుకున్నవారే.

నవరాత్రులు తొమ్మిది రోజులు ఒక్కొక్క రోజు , ఒక్కొక్క భక్తి మర్గాన్ని ఎంచుకుని , అలా తొమ్మిది రోజులు తొమ్మిది భక్తి మార్గాలతో భగవంతుని సేవించి తరించడానికే… ఈ నవరాత్రులను ఏర్పాటు చేసారు మన ఋషులు.

వసంత నవరాత్రి మహిమ

ద్వాఋతూ యమదంష్ట్రాఖ్యౌ నృణాం రోగకరావుభౌ|
శరద్వసంత నామానౌ తస్మాత్‌ దేవీం ప్రపూజయేత్‌||

సంవత్సర చక్రంలో వసంత శరదృతువులు
రెండూ ప్రాణులకు రోగకారకమైనవి. కోరలతో భయంకరంగా ఉన్న తన నోరు తెరుచుకొని వికటాట్టాహాసం చేస్తూ , ప్రాణులను మృత్యుదేవత కబళించడానికి ప్రయత్నిస్తూ ఉంటుంది. అలా మృత్యుముఖంలో పడకుండా తప్పించుకోదలచిన వారు పరమేశ్వరిని సేవించి ఆమె అనుగ్రహాన్ని పొందాలి. అపమృత్యు వినాశినియై , సర్వాపద్లినివారిణియై విరాజిల్లే ఆ జగన్మాతను ప్రార్థించిన వారు ఆ యా ఋతువుల్లో రోగభాధలను , మృత్యుభయాన్ని జయించగలుగుతారని , ఇందుకై నవరాత్రులలో పరమేశ్వరిని పూజించాలని వ్యాసుడు జనమేజయునకు నవరాత్రి పూజా విధానాన్ని వివరించాడు.

సంవత్సరారంభంలో చైత్ర శుద్ధ పాడ్యమి నుండి నవమి వరకు గల తొమ్మిది రోజులూ వసంత నవరాత్రాలు అని , అర్థ సంవత్సరం గడచిన తర్వాత శరదృతువు ఆరంభంలో ఆశ్వయుజు శుద్ధ పాడ్యమి నుండి నవమి వరకు గల తొమ్మిది రోజులూ శరన్నవరాత్రులు అని వ్యవహరింప బడతాయి. వసంత నవరాత్రులలో శ్రీరామచంద్రుని మనం ఆరాధిస్తాం. రామచంద్రుడు పురుష రూపంలో ఉన్న లలిలతాదేవి అని సాధకుల విశ్వాసం. “శ్రీరామో లలితాంబికా” అని పురాణాలు వివరిస్తున్నాయి. నేటికీ ఉత్తర భారతదేశంలో రామలీలా మహోత్సవాలు అనే పేరుతో నవరాత్రులలో దేవీ పూజలు నిర్వహించే సంప్రదాయం ఆచరణలో ఉన్నది. శరన్నవరాత్రులలో దేవిని ఆరాధించడం అనూచారంగా వస్తున్న ఆచారం.

మానవునికి మళ్ళీ మళ్ళీ మాతృగర్భంలో నరకయాతనలు రాకుండా ఉండడానికి , తొమ్మిది నెలలు జీవుడు పడవలసిన బాధలు పునరావృతం కాకుండా ఉండడానికి , ప్రశాంత స్థితిని అనుభవించడానికి , నవరాత్రులలో ఆదిశక్తిని ఆరాధించాలని వ్యాసమహర్షి లోకానికి వెల్లడించాడు.

వసంత నవరాత్రులలో , శరన్నవరాత్రులలో పరాశక్తిని అరాధించి అబీష్టసిద్ధిని పొందినవారు ఎందరో ఉన్నారు.

రామచంద్రమూర్తి సీతాన్వేషణ ప్రయత్నంలో ఉండగా ఋష్యమూక పర్వతంపై సుగ్రీవునితో స్నేహం కలిసిన తర్వాత దేవిని ఆరాధించి సత్ఫలితం పొందాడు. దుర్భరమైన దారిద్ర్యంతో బాధపడుతున్న ఒక వైశ్యుడు దారిద్ర్య నివారాణోపాయం చెప్పవలసిందిగా ఒక విప్రుని ప్రార్థించి , దేవీ నవరాత్రి పూజలను గురించి తెలుసుకొని , దేవిని ఆరాధించి , సకల సంపదలనూ పొంది, దారిద్ర్యం నుండి విముక్తుడయ్యాడు. అజ్ఞాతవాసం ఆరంభించబోతూ , పాండవులు విరాట నగరంలో ప్రవేశించే ముందు జగన్మాతను సేవించి నిర్విఘ్నంగా అజ్ఞాతవాసం నిర్వహించి కృతార్థులయ్యారు.

శ్రీ మాత్రే నమః..🙏

సేకరణ :
మీ...
శ్రీరామ్ ధళ్ ధర్మ జాగరణ 🚩

2 years ago | [YT] | 5

Sriram Dal Dharma Jagaran

శ్రీరామ్ ధళ్ ధర్మ జాగరణ 🚩 గ్రూప్ సభ్యులకు, కార్యకర్తలకు మరియు గ్రూపులో ఉన్న నా హిందూ బంధువులకు శుభోదయం🙏🏻, ఈ రోజు అనగా ఫిబ్రవరి 14 Cows Hug Day (గోవులతో ఉండే రోజు) & శ్రీరామ్ ధళ్ ధర్మ జాగరణ ఆవిర్భావ దినోత్సవ శుభాకాంక్షలు 🙏🏻 తెలియచేస్తూ, ఈ రోజు ఎంతో బాధాకరమైన రోజు కూడా అని చెప్పడానికి చింతిస్తున్న 😢😢. అదేంటంటే ఇదే ఫిబ్రవరి 14 న పుల్వామాలో మన వీర సైనికులను, పాకిస్థాన్ ఉగ్రవాదులు దొంగచానుట బాంబుదాడిలో హతమార్చిన రోజు, కనుక ఈ రోజును Black Day ⚫️ గా ప్రకటించడం జరిగింది 😢😢.
ఈ వీర జవానుల ఆత్మకు శాంతి చేకూరాలని ఒకసారి శ్రీరామ్ ధళ్ ధర్మ జాగరణ🚩 గ్రూపు సభ్యులందరు మీ మీ చోట ఒక నిమిషం పాటు మవనం 🧎🏻పాటించండి.
మిత్రులు చాలా మంది ఈ రోజు ఫిబ్రవరి 14 th అనగానే అదేదో రోజు అని పనికిమాలిన పనులు చేస్తూ పట్టుబడుతుంటారు. ఇలాంటి వాళ్లకు మనం తెలియచేయాల్సింది ఏంటంటే..? అరె నాయనా ఈ రోజు పండగ చేసుకునే రోజు కాదురా బాబు, ఈ రోజు మన దేశ వీర
సైనికులను కీర్తించే రోజు. అంతగా మీకు పండగ చేసుకోవాలి అనిపిస్తే, గోశాలకు వెళ్లి గోమాతలకు... నీకు చేతనైన గ్రాసాన్ని అందించు అని మనమే తెలియచేయాలి.

మీకు అర్ధమైందని నమ్ముతున్న 🙏🏻.

జై జవాన్ ✊🏻,
జై గోమాత 🙏🏻,
భరత్ మాతాకి జై 🇮🇳

మీ...
శ్రీరామ్ ధళ్ ధర్మ జాగరణ🚩
mo.no. 9016068257.

జై శ్రీరామ్ 🚩

2 years ago | [YT] | 13

Sriram Dal Dharma Jagaran

మా వియం బంజర్ శివాజీ బస్తీలో ఉంటున్న కొంతమంది పిల్లలు వొచ్చి, మేము క్రికెట్ ఆడడానికి ఒక బ్యాట్ ఇమ్మని నన్ను అడిగితే, వాళ్ళు చదువుతో పాటుగా, ఆటల్లో కూడా ఒకగొప్పస్థాయికి రావాలనే ఆలోచనతో మన శ్రీరామ్ ధళ్ ధర్మ జాగరణ సంస్థ తరుపునుండి ఒక బ్యాట్ కొనివ్వడం జరిగింది.
ఈ విషయాన్ని ఎందుకు చెబుతున్నానంటే పిల్లలను మన దారిలో ఉంచుకుంటే రేపు ఎలాంటి మతమార్పిడిగాళ్ళు బజారులో తిరగకుండా వీళ్ళే అడ్డుకుంటారు అనే ఆలోచనతో.
నేటి బాలలే రేపటి పౌరులు అని మహనీయులు చెప్పిన మాటలను దృష్టిలో ఉంచుకొని ప్రతిచోటా పిల్లలను బలవంతులుగా తయారు చేయండి.

జై శ్రీరామ్ 🚩

2 years ago | [YT] | 17

Sriram Dal Dharma Jagaran

ఖమ్మం జిల్లా, పెనుబల్లి మండలం, వీయం బంజార్ గ్రామంలోని రింగ్ సెంటర్లో శ్రీరామ్ ధళ్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన అయోధ్య బాలరాముని విగ్రహ ప్రతిష్ట మహోత్సవ సమాచారం మన కోసం.

అందరికి అయోధ్య బాలరాముని విగ్రహప్రతిష్ఠ శుభాకాంక్షలు.

జై శ్రీరామ్ 🚩
జై జై శ్రీరామ్ 🚩

2 years ago | [YT] | 19

Sriram Dal Dharma Jagaran

వియం బంజర్ గ్రామంలో 02 జనవరి 2024 మంగళవారం రోజున ఉదయం 8:00 గం.లకు అయోధ్య అక్షితల వితరణ కార్యక్రమం జయప్రదంగా నిర్వహించడం జరిగింది.
ఈ కార్యక్రమంలో ఆర్ఎస్ఎస్, శ్రీరామ్ ధళ్ ధర్మ జాగరణ కార్యకర్తలు మరియు స్థానిక హిందువులతో కలిసి అక్షితల వితరణ చేయడం జరిగింది.

ఇంకా చాలా చోట్ల శ్రీరామ్ ధళ్ కార్యకర్తలు అక్షితల వితరణ కార్యక్రమంలో పాలుపంచుకోవడం జరిగింది.

#జై #శ్రీరామ్

2 years ago | [YT] | 36

Sriram Dal Dharma Jagaran

వియం బంజర్ కనకపూడి ఇస్త్రరయ్య గారి పరిస్థితి గత కొంతకాలంగా అనారోగ్య పరిస్థితి క్షీణించి, పూట గడవడం కూడా కష్టంగా ఉన్నదన్న విషయం తెలుసుకున్న శ్రీరామ మాతృ సేవా సంస్థ వారు 'శ్రీరామ్ దళ్ ధర్మ జాగరణ' సంస్థను కలవడం, ఈ చిరు సాయం చేయడానికి 'శ్రీరామ్ ధళ్ ధర్మ జాగరణ' సంస్థ ముందుకురావడం జరిగింది.

గతంలో అంటే 2013 జూన్ 18 న 'శ్రీరామ్ ధళ్ సేవ' అనే పేరుతో లెక్కకట్టలేనన్ని సహాయ, సహకారాలు అనాధలకు, పేదవారికి, భర్తలేని స్త్రీలకూ, పేదవారి ఇంట్లో చనిపోయిన వారి దినకార్యాలకి, చిన్న పిల్లల హాస్పిటల్ ఖర్చులకు, అనాధ ముసలివారికి ఇలా చెప్పుకుంటూపోతే ఎంతో మందికి సాయం చేసిన చేతులు ఈ రోజు ధర్మం కోసం పనిచేవారికోసం అందించాలని నిర్ణయం తీసుకుంది.
ఇలాంటి ఎన్నో ఎన్నెన్నో సహాయ, సహకారాలు అందిస్తున్న 'శ్రీరామ మాతృ సేవా సంస్థ' వారికి శ్రీరామ్ ధళ్ ధర్మ జాగర సంస్థ తరుపునుండి ప్రత్యేక అభినందనలు 🌺💐👏🏻👏🏻👏🏻 తెలియచేసుకుంటున్నాం.
సంప్రదించవల్సిన నెంబర్ - 9016068257, 9948228674.

2 years ago | [YT] | 15