ప్రజాస్వామ్యం లో ప్రజలే ప్రభువులు. మరి ప్రభువులైన ప్రజలు ఈ ప్రజాస్వామ్యాన్ని శాసిస్తున్నారా? ఐదేళ్లకు ఒకసారి ఓటు వేసి తరువాత ఐదేళ్ళూ అర్భకులుగా మిగిలి పోతున్నారు. ఓట్లకొరకు ఒకసారి ప్రజల దగ్గరికి రాజకీయ నాయకులు తిరుగుతారు. మిగిలిన ఐదేళ్ళూ ప్రజలు నాయకుల వద్దకు తిరుగుతారు. నిజానికి ప్రజాప్రతినిధులు ప్రజాసేవకులు. కానీ నిజంగా సేవ చేసే నాయకులు ఒక్క శాతం మాత్రమే వుంటారేమో . "యథారాజా తథాప్రజ" అన్నది ఆర్యోక్తి పాలకుడు ఎలా వుంటాడో ప్రజలు అలా వుంటారు అని దీని అర్థం. యుద్ధాల కాలం గతించి పోయింది. ఇప్పుడు అధికారం కొరకు జరుగుతున్నది "మేధోయుద్ధం". మనిషి మస్తిష్కం నుండి ఉద్భవించే ఈ రాజనీతి, కుట్రలు, కుయుక్తుల సమాహారం. తనను తాను హెచ్చించుకోవడానికి, ప్రత్యర్థిని తగ్గించడానికి రాజకీయం పన్నే వ్యూహాలే ఆధునిక యుద్ధం. సమాచార ప్రసార సాధనాలే నేడు ఆధునిక యుద్ధభూములుగా మారిపోయాయి. తొలినాళ్ళలో ప్రజా సమస్యల పై గళమెత్తిన మాధ్యమాలు కాలక్రమేణా రాజకీయ గొంతుకలుగా మారి పోయాయి. మరి సామాన్యుల పక్షాన నిలిచేదేవరు? వారి గళాన్ని వినిపించేదేవరు? ఆ ప్రజాగళాన్ని వినిపించడానికి చేస్తున్న ఈ చిన్ని ప్రయత్నమే ఈ "సివిక్ వాయిస్".


civic voice

మేడారం జాతర లో కోవా బన్ లో కల్తీ జరిగింది అని మీరు అనుకుంటున్నారా ? వివాదం వెనుక కారణం ఏమిటని మీరు అనుకుంటున్నారు?

3 months ago | [YT] | 0

civic voice

లడ్డు కల్తీపై వైసీపీ దుష్ప్రచారాన్ని ఖండిస్తూ జనసేన ప్రెస్ మీట్

తిరుమల **లడ్డు కల్తీ అంశంపై** వైసీపీ నాయకులు చేస్తున్న దుష్ప్రచారాన్ని ఖండిస్తూ, ఈరోజు నెల్లూరు నగరంలోని **గాంధీ బొమ్మ సెంటర్** వద్ద జనసేన పార్టీ నెల్లూరు జిల్లా ఆధ్వర్యంలో విలేకరుల సమావేశం నిర్వహించారు.

ఈ సమావేశంలో జనసేన పార్టీ JanaSena Party సీనియర్ నాయకులు **నూనె మల్లికార్జున యాదవ్, గునుకుల కిషోర్**,*కృష్ణారెడ్డి* మాట్లాడుతూ, పరమ పవిత్రంగా భావించే **తిరుపతి లడ్డూ ప్రసాదంపై జరిగిన కల్తీ క్షమించరాని నేరమని** అన్నారు. ఇది కేవలం అవినీతి కాకుండా, కోట్లాది మంది భక్తుల విశ్వాసాలపై జరిగిన దాడిగా పేర్కొన్నారు.

వైసీపీ పాలనలో లడ్డూ తయారీలో **ఆవు నెయ్యి ఉపయోగించలేదని సిట్ నివేదిక స్పష్టంగా సూచిస్తున్నా**, ఆ నిజాన్ని పక్కనపెట్టి వైసీపీ నేతలు ప్రజలను తప్పుదోవ పట్టించే విధంగా దుష్ప్రచారం చేస్తున్నారని విమర్శించారు.
నిబంధనలను అడ్డగోలుగా మార్చి, **పామాయిల్ మరియు రసాయనాలతో తయారైన నూనెను నెయ్యిగా చూపించి లడ్డూలు తయారు చేయడం ఘోరమైన అపచారమని** అన్నారు.

తప్పులు చేసి, ఇప్పుడు వాటిని కప్పిపుచ్చుకునేందుకు అబద్ధపు ప్రచారానికి దిగడం వల్లే ప్రజల్లో తీవ్ర ఆగ్రహం వ్యక్తమైందని, **సిట్ రిపోర్ట్‌ను వక్రీకరిస్తూ వైసీపీ నాయకులు చేసిన ప్రచారమే ఈ పరిస్థితికి కారణమని** పేర్కొన్నారు.

రాష్ట్ర డిప్యూటీ సీఎం **శ్రీ పవన్ కళ్యాణ్ Pawan Kalyan గారు సనాతన ధర్మ పరిరక్షణకు కట్టుబడి పనిచేస్తున్నారని**, ఆయన నాయకత్వంలో లడ్డు కల్తీపై నిజాలను ప్రజల్లోకి తీసుకెళ్లడం జనసేన పార్టీ బాధ్యత అని స్పష్టం చేశారు.
ఈ అపచారంలో బాధ్యులైన వారిని **ఎంతటి వారైనా కఠినంగా శిక్షించాలని**, కూటమి ప్రభుత్వంపై బురదజల్లే ప్రయత్నాలను జనసేన కార్యకర్తలు ధీటుగా ఎదుర్కొంటారని తెలిపారు.
ఈ కార్యక్రమంలో జనసేన పార్టీ నాయకులు కార్యకర్తలు వీర మహిళలు అధిక సంఖ్యలో పాల్గొని ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేశారు
Naga Babu Nadendla Manohar Ajaya Kumar Vemulapati Surendra Pillella Janasena Yuvatha AP

3 months ago | [YT] | 2

civic voice

రైల్వే కోడూరు జనసేన ఎమ్మెల్యే ఆరవ శ్రీధర్ తనను లైంగికంగా వేధించి వాడుకున్నాడని ఒక మహిళ ఆరోపించింది. దీనిని వైఎస్సార్సీపీ తన మీడియాలో తీవ్ర స్థాయి లో విమర్శిస్తోంది. దీనిపై మీరేమంటారు ..?

4 months ago | [YT] | 0

civic voice

నా అన్వేషణ అన్వేష్ పై సోషల్ మీడియాలో వ్యతిరేకత కు కారణం ఏమిటని మీరు అనుకుంటున్నారు?

4 months ago | [YT] | 0

civic voice

ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి శ్రీ పవన్ కళ్యాణ్ గారికి ఉడిపి మఠాధిపతి "అభినవ శ్రీకృష్ణదేవరాయ" బిరుదు ఇచ్చి సత్కరించారు. దీని పై మీరేమంటారు ..?

5 months ago | [YT] | 2

civic voice

పవన్ కళ్యాణ్ గారు తెలంగాణా ను కించపరిచారని తెలంగాణా నాయకులు ధ్వజమెత్తుతున్నారు. మీరేమంటారు ?

5 months ago | [YT] | 0

civic voice

దుబాయ్ ఎయిర్ షో లో మన తేజస్ యుద్ధ విమానం కూలి పోయింది దీనికి వాడిన ఇంజన్ అమెరికా సరఫరా చేసింది. కూలి పోవడానికి కారణం ఏమిటని మీరు అనుకుంటున్నారు ?

6 months ago | [YT] | 1

civic voice

కుప్పం నియోజకవర్గం తుమ్మిసి పెద్ద చెరువులో జరిగిన జలహారతి కార్యక్రమంలో నారా భువనేశ్వరి గారు పాల్గొన్నారు.
కుప్పంతో పాటు రాష్ట్రంలో ఉన్న రైతులకు సాగునీరు ఇబ్బంది లేకుండా సీఎం చంద్రబాబు నాయుడు గారు కృషి చేస్తున్నారని తెలిపారు.
#kuppam
#NaraBhuvaneswari
#AndhraPradesh

6 months ago | [YT] | 1

civic voice

మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ఈ రోజు కోర్టుకు హాజరయ్యారు. 30 కి పైగా కేసులు ఆయన పై పెండింగ్ లో వున్నాయి. ప్రతి కేసులోనూ వాయిదాలకు హాజరావుతారా లేదా మీరేమంటారు ?

6 months ago | [YT] | 4

civic voice

నిబద్దతతో పనిచేసి పోలీసు శాఖకు మంచిపేరు తీసుకొనిరావాలి....

హోంగార్డు గా నియామకపత్రాలను అందించిన.....జిల్లా ఎస్పీ శ్రీ సునీల్ షొరాన్ IPS గారు

నంద్యాల జిల్లాలో ఆళ్లగడ్డ యూనిట్ ఖజాపీర్ మరియు నంద్యాల యూనిట్ లలో జాఫర్ వలి హోంగార్డ్ గా విధులు నిర్వహిస్తు అనారోగ్య కారణాలవల్ల హాస్పిటల్ లో చికిత్స పొందుతు మరణించడం జరిగింది.వారి కుటుంబ సభ్యులకు ఆర్ధికంగా ఇబ్బంది పడకూడదు అనే ఉద్దేశ్యంతో ప్రభుత్వం నుండి వారికి రావసిన బెన్ఫిట్స్ అందించడం జరిగింది

అనంతరం నేడు ఖజాపీర్ భార్య జహీర్ బీ గారికి మరియు జాఫర్ వలి భార్య తయాబా బేగమ్ గారికి హోంగార్డ్ గా నియమిస్తు ఉత్తర్వులు జారీ చెయ్యడం జరిగింది.ఈ సందర్భంగా నేడు జిల్లా ఎస్పీ శ్రీ సునీల్ షొరాన్ IPS గారి చేతుల మీదుగా నంద్యాల జిల్లా పోలీసు ప్రదాన కార్యాలయం నందు హోంగార్డ్ గా నియమించిన దృవపత్రాన్ని అందించడం జరిగింది.

ఈ సందర్భంగా జిల్లా ఎస్పీ గారు మాట్లాడుతూ విధినిర్వహణలో అలసత్వం వహించకుండా నిబద్దతతో పనిచేయాలని, పోలీస్ శాఖకు మీ యూనిట్ కి మంచి పేరు తీసుకురావాలని, మీకు ఏ సహాయం కావాలన్నా పోలీస్ డిపార్ట్మెంట్ అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు.

ఈ కార్యక్రమంలో జిల్లా ఎస్పీ గారి తో పాటు స్పెషల్ బ్రాంచ్ ఇన్స్పెక్టర్ మోహన్ రెడ్డి గారు, ఆర్మూడ్ రిజర్వ్ ఇన్స్పెక్టర్ మంజునాథ్ గారు పాల్గొన్నారు.

జిల్లా పోలీసు కార్యలయం,నంద్యాల
#APDeputyCMPawanKalyan #nandyalpolice #AndhraPradeshPolice #APPOLICE100 #ipsofficer #APPolice #awareness #indianpolice #NaraLokesh

6 months ago | [YT] | 4