IMPORTANT NOTE :
Telugu Tv Channel,Village Entertainments,Short films,Folk Songs Latest,News update, Live,Live Shows, Entertainment, Video Songs, Audio Songs, Interviews published on our 69 Tv Telugu Channel
All kinds of programs are not meant to humiliate anyone.
We are broadcasting. If there are any comments, compliant, copyrights on these please pre-mail my mail
Can give information.our mail : www.69tvnews@gmail.com
THANK YOU
Copyright Notice: Please feel free to leave me a notice if you find this upload inappropriat

69Tv Telugu Channel is one of the leaders in the production and un-biased and comprehensive news and entertainment programmes in India and abroad
69Tv Telugu delivers reliable information across all platforms:TV, Internet and Mobile.
Thank U For Watching


69Tv

అమెరికాలో సమ్మక్క, సారక్క జాతర..
సమ్మక్క, సారలమ్మ జాతర ఖండాతరాలు దాటింది. కొందరు యువకులు అగ్రరాజ్యం అమెరికాలో జాతర నిర్వహించారు కొందరు యువత. అందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. అమ్మలకు ఇష్టమైన బెల్లాన్ని వారి ప్రతిరూపాలుగా భావించి పూజలు చేసి దీపధూప నైవేధ్యాలు సర్పించారు. ఈ వీడియో చూసిన నెటిజన్లు.. ఇక అక్కడ గద్దెలు కడితే సెట్టూ అని ఫన్నీగా కామెంట్లు పెడుతున్నారు.

7 hours ago | [YT] | 12

69Tv

సీఎం రేవంత్ రెడ్డికి బండి సంజయ్ లేఖ...
రాష్ట్రంలోని ప్రభుత్వ ఉద్యోగులకు సంబంధించిన పెండింగ్ డీఏలు, పీఆర్సీలు, రిటైర్మెంట్ బెనిఫిట్స్‌ను వెంటనే చెల్లించాలని.. కేంద్రమంత్రి బండి సంజయ్ సీఎం రేవంత్ రెడ్డిని డిమాండ్ చేశారు. రాష్ట్రంలోని లక్షలాది మంది ఉద్యోగులు, రిటైర్డ్ ఉద్యోగులకు 5 డీఏలు పెండింగ్‌లో ఉన్నాయని పేర్కొన్నారు. రాష్ట్ర ప్రభుత్వ నిర్లక్ష్యంతో 61 మంది ప్రాణాలు తీసుకున్నారని తెలిపారు. మొత్తం బకాయిలు రూ.12 వేల కోట్లకుపైనే ఉన్నట్లు బండి సంజయ్ వెల్లడించారు.

7 hours ago | [YT] | 0

69Tv

ఓటుకు రూ.30 వేలు, గెలిస్తే అర తులం బంగారం..
మరికొన్ని గంటల్లో మున్సిపల్ ఎన్నికల పోలింగ్ ప్రారంభం కానుండటంతో.. ఓటర్లను తమవైపు తిప్పుకునేందుకు అభ్యర్థులు, పార్టీలు భారీగా హామీలు ఇస్తున్నారు. తాజాగా చేవెళ్లలో ఓ అభ్యర్థి తాను గెలిస్తే ఏకంగా ఓటర్లకు అర తులం బంగారం ఇస్తానని ప్రకటించడం ఇప్పుడు రాష్ట్రవ్యాప్తంగా పెను సంచలనంగా మారింది. మరోవైపు.. ఒక్కో ఓటుకు గరిష్ఠంగా రూ.30 వేల వరకు కూడా డబ్బులు పంచుతూ ప్రలోభాల పర్వానికి తెరలేపుతున్నారు.

7 hours ago | [YT] | 2

69Tv

హైదరాబాద్‌లో కంపించిన భూమి..
హైదరాబాద్‌లో భూమి కంపించింది. దీంతో జనం భయంతో పరుగులు తీశారు. భారీ శబ్దంతో భూమి కంపించినట్లు అనిపించడంతో.. స్థానికులు తీవ్ర భయాందోళనలకు గురయ్యారు. నగరంలోని గాజురామారంలో భూమి కంపించినట్లు అక్కడి ప్రజలు పేర్కొన్నారు. అయితే ఇది భూకంపానికి సంబంధించిన ప్రకంపనలా కాదా అనేది ఇంకా తేలాల్సి ఉంది. రంగంలోకి దిగిన అధికారులు ఎలాంటి నష్టం సంభవించలేదని స్పష్టం చేశారు.

7 hours ago | [YT] | 8

69Tv

అభ్యర్థులకు బిగ్‌ అలర్ట్.. లాసెట్ షెడ్యూల్ విడుదల..
తెలంగాణలో విద్యార్థులు ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న న్యాయశాస్త్ర కోర్సులైన 3/5 ఏళ్ల LLB, 2 ఏళ్ల LLM ప్రవేశాల కోసం TG లాసెట్, TG పీజీ లాసెట్ 2026-27 నోటిఫికేషన్ విడుదలయింది. ఫిబ్రవరి 10 నుండి దరఖాస్తులు ప్రారంభం కానున్నట్టు ఉస్మానియా వర్సిటీ పేర్కొంది. ఇక మే 12 హాట్‌ టికెట్స్, మే 18న పరీక్షలు జరగున్నట్టు నోటిఫికేషన్‌లో స్పష్టం చేసింది.

3 days ago | [YT] | 6

69Tv

Mutharam : ముత్తారం గ్రామంలోని శ్రీ సరస్వతీ విద్యాలయం హై స్కూల్ విద్యార్ధినులు మండల స్థాయి ఖో-ఖో పోటీలలో ప్రథమ స్థానం సాధించి అందరి మన్ననలను,ప్రశంసలను అందుకున్నారు...

5 days ago (edited) | [YT] | 42

69Tv

సుచిన్ఇండియా ఫౌండేషన్ వారు నిర్వహించిన సర్ సి. వి. రామన్ యంగ్ జీనియస్ మ్యాథ్స్ ఒలంపియడ్ పరీక్షలో స్టేట్ 5వ ర్యాంకు సాధించిన మా విద్యార్థి కే.సాయి స్కందకు(5వ తరగతి) ఈరోజు హైదరాబాద్ లోని రవీంద్రభారతిలో శ్రీ ఘంటా శ్రీనివాసరావు గారు, శ్రీ చింతమనేని ప్రభాకర్ రావు గారు,సినీ ప్రముఖులు హీరో శ్రీకాంత్,శివాజీ రాజా, సుచీర్ ఇండియా గ్రూప్ వ్యవస్థాపకులు డాక్టర్ వై కిరణ్ గారు చేతులమీదుగా అవార్డు, సర్టిఫికెట్ అందుకున్నారు. ఈ విద్యార్థిని పాఠశాల ప్రిన్సిపాల్ ఏ.శ్రీనివాస్, డైరెక్టర్లు పి. సుదర్శన్ రెడ్డి, జాఫర్ హుస్సేన్,నరేష్ మరియు ఉపాద్యాయులు, తల్లిదండ్రులు అభినందించారు.

5 days ago | [YT] | 22

69Tv

రాత్రికి రాత్రే సీన్ రివర్స్.. బంగారం ధరల్లో ఊహించని మార్పు..
పసిడి ప్రియులకు మరోసారి బిగ్ షాక్ తగిలింది. కొత్త సంవత్సరంలోనూ బంగారం ధరలు ఆరంభంలో బారీగా పెరిగి గత 2 రోజులుగా తగ్గాయనుకుంటే మళ్లీ ధరలు భారీ స్థాయిలో పెరుగుతున్నాయి. ఇవాళ రాత్రికి రాత్రే బంగారం ధరల్లో భారీ మార్పు సంభవించింది. ఒక దశలో ఇంటర్నేషనల్ మార్కెట్లో ఇంట్రాడేలో కిందటి రోజుతో పోలిస్తే దిగొచ్చిన స్పాట్ గోల్డ్ రేటు మళ్లీ ఊహించని స్థాయిలో పెరిగింది. అంతర్జాతీయంగా ఉద్రిక్తతలే దీనికి కారణం. వెండి ధరలు కూడా అంతర్జాతీయ మార్కెట్లో రికార్డు స్థాయిలో పుంజుకున్నాయి. దీంతో మళ్లీ గోల్డ్, సిల్వర్ రేట్లు ఆల్ టైమ్ గరిష్ఠ స్థాయిలకు చేరువయ్యాయి. దేశీయంగా చూస్తే బంగారం ధర పెరగ్గా.. వెండి ధర తగ్గింది. ఇవాళ (శనివారం) ఉదయం 10 గంటల తర్వాత ఈ రెండింటి ధరలు మళ్లీ భారీ స్థాయిలో పెరగనున్నాయని చెప్పొచ్చు.

1 month ago | [YT] | 0

69Tv

గుమ్మడి గింజలు ఎందుకు తినాలో చెప్పిన ఎక్స్‌పర్ట్...

గుమ్మడికాయ గింజలు రక్తంలో చక్కెరను నియంత్రించడంలో సాయపడతాయి. వాటిలో ఇన్సులిన్ స్థాయిలను మెరుగుపరిచే, టైప్ 2 డయాబెటిస్ ప్రమాదాన్ని తగ్గించే సమ్మేళనాలు ఉంటాయి. ఇది డయాబెటిక్ రోగులకు ప్రయోజనకరంగా ఉంటుంది. డయాబెటిస్ ఉన్న పురుషులు ఈ విత్తనాలు తినడం మంచిది.
గుమ్మడి గింజల్లో ప్రోటీన్, ఫైబర్ పుష్కలంగా ఉంటాయి. ఇవి ఆకలిని నియంత్రించడానికి, అతిగా తినకుండా నిరోధించడానికి సాయపడతాయి. వీటిని తీసుకోవడం వల్ల శరీరం తీసుకునే ఆహారం తగ్గుతుంది. దీంతో బరువు తగ్గాలనుకునేవారికి మంచి ఆప్షన్.

1 month ago | [YT] | 5

69Tv

విద్యాబోధన నుంచి వసతి దాకా.. అన్నీ ఫ్రీ..
సిద్దిపేట జిల్లా కొండపాకలోని శ్రీసత్యసాయి ప్రశాంతి నికేతనం బాల మందిర ట్రస్టు పేద విద్యార్థులకు ఉచిత విద్య, వసతిని అందిస్తోంది. 'వన్ వరల్డ్ వన్ ఫ్యామిలీ మిషన్' ద్వారా 6వ తరగతి నుంచి ఇంటర్ వరకు ఇంగ్లీష్ మీడియంలో నియోస్ (NIOS) విధానంలో బోధన సాగుతుంది. అకడమిక్ విద్యతో పాటు సంగీతం, నాట్యం, డ్రైవింగ్, వంటలు, జీవన నైపుణ్యాల్లో శిక్షణ ఇస్తారు. ఉన్నత చదువుల కోసం డిగ్రీ, పీజీ, పీహెచ్‌డీ కోర్సులను కూడా ఉచితంగా పూర్తి చేయవచ్చు. ఈ నెల 20వ తేదీ వరకు ప్రవేశాలకు అవకాశం ఉంది. ఆసక్తి గల విద్యార్థులు ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాలని ప్రిన్సిపల్ పూర్ణిమ సూచించారు.

1 month ago | [YT] | 8