IMPORTANT NOTE :
Telugu Tv Channel,Village Entertainments,Short films,Folk Songs Latest,News update, Live,Live Shows, Entertainment, Video Songs, Audio Songs, Interviews published on our 69 Tv Telugu Channel
All kinds of programs are not meant to humiliate anyone.
We are broadcasting. If there are any comments, compliant, copyrights on these please pre-mail my mail
Can give information.our mail : www.69tvnews@gmail.com
THANK YOU
Copyright Notice: Please feel free to leave me a notice if you find this upload inappropriat
69Tv Telugu Channel is one of the leaders in the production and un-biased and comprehensive news and entertainment programmes in India and abroad
69Tv Telugu delivers reliable information across all platforms:TV, Internet and Mobile.
Thank U For Watching
Citizen 69Live
తెలంగాణ విద్యార్థులకు శుభవార్త.. ఏటా రూ.లక్ష స్కాలర్షిప్..
తెలంగాణ విద్యార్థులకు కాగ్ని చాంప్ సంస్థ శుభవార్త చెప్పింది. ప్రతిభ కలిగిన స్టూడెంట్స్కు స్కాలర్షిప్లు అందించనుంది. అయితే కేవలం మార్కులను బట్టి కాకుండా.. వారికి ఒక ఆన్లైన్లో ఎగ్జామ్ నిర్వహించి అందులో ప్రతిభ చూపిన వారికి ఏటా రూ.లక్ష స్కాలర్షిప్ ఇవ్వనుంది. గడువు లోగా అప్లై చేసుకుని పరీక్ష రాసి.. స్కాలర్షిప్ పొందాలని కాగ్ని చాంప్ సంస్థ వెల్లడించింది. ప్రతిభను మార్కులతో కాకుండా మేధస్సుతో గుర్తించే కొత్త స్కాలర్షిప్ అని ఆ సంస్థ తెలిపింది.
2 months ago | [YT] | 0
View 0 replies
Citizen 69Live
కాళేశ్వరం ప్రాజెక్టు అవినీతిపై హైకోర్టులో విచారణ..
కాళేశ్వరం ప్రాజెక్టుకు సంబంధించిన అవినీతి కేసు విచారణలో హైకోర్టు తీర్పు మరింత ఉత్కంఠ రేపుతోంది. జస్టిస్ పీసీ ఘోష్ కమిషన్పై చేపట్టిన విచారణను ముగించిన హైకోర్టు.. తీర్పును ఈనెల 22కు వాయిదా వేసింది. కాళేశ్వరం ప్రాజెక్టులో అవతకవకలు జరిగాయంటూ గత ప్రభుత్వంపై ఆరోపణలు గుప్పించిన ప్రస్తుత ప్రభుత్వం.. విచారణకు కమిషన్ ఏర్పాటు చేసింది. ఈ నేపథ్యంలోనే ఆ కమిషన్ రిపోర్టుపై విచారణ జరిపిన హైకోర్టు.. తీర్పును వెలువరించనుంది.
2 months ago | [YT] | 9
View 0 replies
Citizen 69Live
చెస్ లో మంత్రి కొండా సురేఖ మనవడి ప్రతిభ..రెండు ప్రపంచ రికార్డులు...
మంత్రి కొండా సురేఖ మనవడు చెస్లో రాణిస్తున్నాడు. కేవలం 3 ఏళ్ల లోపు వయసు ఉన్న ఆ బుడ్డోడు.. తన ఎత్తులు పై ఎత్తులతో చెస్ బోర్డుపై ఆధిపత్యం చూపిస్తున్నాడు. ఈ నేపథ్యంలోనే అతి చిన్న వయసులో ఒకేసారి 2 వరల్డ్ రికార్డులు సాధించి చరిత్రను నెలకొల్పాడు. ఇక ఆ బాలుడిని డిప్యూటీ సీఎం భట్టి, ఇతర మంత్రులు స్వయంగా వెళ్లి అభినందించడం విశేషం. ఇక విజేతగా నిలిచిన బాలుడికి బ్రిటన్ పార్లమెంటులో అవార్డులు అందించనున్నారు.
2 months ago | [YT] | 12
View 0 replies
Citizen 69Live
నెగటివ్ ఎనర్జీకి చెక్! అదృష్టం వరించాలంటే ఈ చిన్న చిట్కాలు ...
మీ ఇంట్లో ఎక్కడైనా వాస్తు దోషం ఉందని భావిస్తే, అక్కడ రెండు కర్పూర బిళ్ళలను ఉంచండి. అవి కరిగిపోయిన తర్వాత మళ్ళీ కొత్తవి పెట్టాలి. ఇలా చేయడం వల్ల ఆ ప్రదేశంలోని ప్రతికూల శక్తి తగ్గిపోతుంది. కర్పూరం అనేది కేవలం పూజా ద్రవ్యం మాత్రమే కాదు, అది మన ఇంటికి రక్షణ కవచంలా పనిచేస్తుంది. ప్రతిరోజూ చిన్న కర్పూర బిళ్ళను వెలిగించడం ద్వారా మీ జీవితంలో సానుకూల మార్పులను ఆహ్వానించవచ్చు.రోజూ సాయంత్రం వేళ వెలిగించే హారతిలో కర్పూరం వాడటం వల్ల ఇంట్లో లక్ష్మీ కటాక్షం కలుగుతుంది. నెయ్యితో కలిపిన కర్పూర హారతి ఇవ్వడం వల్ల కుటుంబ సభ్యుల మధ్య కలహాలు తగ్గి శాంతి లభిస్తుంది.
2 months ago | [YT] | 3
View 0 replies
Citizen 69Live
చలువ కదా అని అతిగా తాగితే కథ ముగిసినట్లే!
ఈ మధ్య కాలంలో చాలా మంది కిడ్నీ సమస్యలతో బాధపడుతున్నారు. అయితే కిడ్నీ సమస్యలతో బాధపడే వారు మజ్జిగ అస్సలే ఎక్కువగా తాగకూడదు అని చెబుతున్నారు ఆరోగ్య నిపుణులు. ఎందుకంటే? మజ్జిగలో పొటాషియం, ఫాస్పరస్ పుష్కలంగా ఉంటుంది. అయితే ఇది కిడ్నీ సమస్యలతో బాధపడే వారిలో అనేక రకాల సమస్యలకు కారణం అవుతుంది. అందుకే కిడ్నీ సమస్యలతో బాధపడే వారు మజ్జిగా ఎక్కువగా తాగకపోవడమే మంచిదంట. గుండె సమస్యలు, హై కొలెస్ట్రాల్ వంటి సమస్యలతో బాధపడే వారు కూడా అస్సలే మజ్జిగ అతిగా తాగకూదు అని చెబుతున్నారు ఆరోగ్య నిపుణులు. ఇది సమస్యను మరింత తీవ్రతరం చేస్తుందంట. నోట్ : పై సమాచారం కేవలం ఇంటర్నెట్ ఆధారంగా మాత్రమే ఇవ్వడం జరిగింది.
2 months ago | [YT] | 1
View 0 replies
Citizen 69Live
సోంపు గురించి ఈ నిజాలు...అన్నం తిన్న తర్వాత ఎందుకు తినాలంటే..?
గ్యాస్, ఉబ్బరానికి చెక్: భారీ భోజనం చేసినప్పుడు మన జీర్ణవ్యవస్థపై ఒత్తిడి పెరుగుతుంది. ఆ సమయంలో సోంపు గింజలు అద్భుతంగా పనిచేస్తాయి. డాక్టర్ సేథి ప్రకారం.. సోంపులో అనెథోల్, ఫెంచోన్, ఎస్ట్రాగోల్ వంటి ముఖ్యమైన నూనెలు ఉంటాయి. ఇవి కడుపులోని గ్యాస్ను బయటకు పంపడంలో కీలక పాత్ర పోషిస్తాయి. ముఖ్యంగా కడుపు ఉబ్బరం, అజీర్ణం, మలబద్ధకం వంటి సమస్యల నుండి ఇవి తక్షణ ఉపశమనం కలిగిస్తాయి.
2 months ago | [YT] | 3
View 0 replies
Citizen 69Live
ఇంటర్ ప్రవేశాలకు TGRJC CET 2026 దరఖాస్తులు ప్రారంభం..
తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న గురుకుల విద్యాలయ సంస్థల్లో 2026-27 విద్యా సంవత్సరానికి సంబంధించి ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్ ఇంగ్లిష్ మీడియంలో ప్రవేశాలకు నిర్వహించే టీజీఆర్జేసీ సెట్ 2026 ప్రవేశ పరీక్ష ఆన్లైన్ దరఖాస్తు ప్రక్రియ ప్రారంభమైంది. ఇందులో వచ్చిన ర్యాంకు ఆధారంగా మొత్తం 35 గురుకుల జూనియర్ కాలేజీల్లో ఇంగ్లీషు మీడియం MPC, BPC, MEC గ్రూపులలో ప్రవేశం కల్పిస్తారు. 2026 మార్చిలో పదో తరగతి పరీక్షలు రాసిన విద్యార్ధులు ఈ పరీక్షకు దరఖాస్తు చేసుకోవచ్చు.
2 months ago | [YT] | 3
View 0 replies
Citizen 69Live
ఈ వారంలోనే ఇంటర్మీడియట్ ఫలితాలు విడుదల..
తెలంగాణ ఇంటర్మీడియట్ ఫస్ట్, సెంకడ్ ఇయర్ పబ్లిక్ పరీక్షల 2026 సమాధాన పత్రాల మూల్యాంకనం మార్చి 30తో ముగిసిన సంగతి తెలిసిందే. రాష్ట్రవ్యాప్తంగా అన్ని కేంద్రాల్లో మూల్యాంకనం ముగియడంతో ఫలితాల క్రోడీకరణ పనుల్లో అధికారులు మునిగిపోయారు. ఈ ప్రక్రియను ఏప్రిల్ రెండో వారం నాటికి పూర్తి చేసి.. ఏప్రిల్ 12 నాటికి ఫలితాలు విడుదల చేయాలని ఇంటర్ బోర్డు అధికారులు భావిస్తున్నారు. అంతా సవ్యంగా జరిగితే అంతకంటే ముందే అంటే ఏప్రిల్ 10వ తేదీనే ఫలితాలు వెల్లడించాలని అధికారులు భావిస్తున్నారు. లేదంటే ఏప్రిల్ 12వ తేదీన విడుదలయ్యే అవకాశం ఉంది. ఈ మేరకు ఏప్రిల్ రెండో వారంలో విడుదల చేసేందుకు అధికారులు కసరత్తు చేస్తున్నారు. నిజానికి తొలుత ఏప్రిల్ 6న అంటే ఈ రోజు ఫలితాలు విడుదల చేయాలనుకున్నప్పటికీ బడ్జెట్ సమావేశాలు ఇతర పనులతో రెండో వారానికి వాయిదా వేశారు.
2 months ago | [YT] | 9
View 0 replies
Citizen 69Live
జూన్ 2లోపు కొత్త ఎయిర్పోర్టు.. : సీఎం రేవంత్
తెలంగాణలో కొత్త ఎయిర్పోర్టుపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కీలక ప్రకటన చేశారు. ఈ ఏడాది జూన్ 2వ తేదీలోపు ఆదిలాబాద్ కొత్త ఎయిర్పోర్టు నిర్మాణానికి శిలాఫలకం వేస్తామని హామీ ఇచ్చారు. ఎయిర్పోర్టుతో పాటు జిల్లాలో దేశంలోనే అతిపెద్ద పారిశ్రామికవాడను ఏర్పాటు చేసి ఆదివాసీలకు, నిరుద్యోగులకు ఉపాధి కల్పిస్తామని చెప్పారు. అలాగే.. జిల్లా ప్రజల చిరకాల వాంఛ అయిన కొత్త యూనివర్సిటీని కూడా మంజూరు చేస్తున్నట్లు ప్రకటించారు. త్వరలోనే అందుకు సంబంధించిన భూసేకరణ చేపట్టనున్నట్లు స్పష్టం చేశారు.
2 months ago | [YT] | 7
View 0 replies
Citizen 69Live
తెలంగాణ ప్రభుత్వ ఆస్పత్రుల్లో హెల్త్ ఏటీఎంలు..
తెలంగాణలోని ప్రభుత్వ ఆస్పత్రుల్లో హెల్త్ ఏటీఎంలు త్వరలోనే అందుబాటులోకి రానున్నాయి. కేవలం 2 నిమిషాల్లోనే ఏకంగా 132 రకాల వైద్య పరీక్షలను చేయనున్నారు. ఇప్పటికే పైలట్ ప్రాజెక్టు కింద అమలు చేస్తున్న ఈ హెల్త్ ఏటీఎంలు సక్సెస్ కావడంతో.. మరిన్ని ఆస్పత్రులకు విస్తరించేందుకు సర్కార్ ప్రణాళికలు సిద్ధం చేస్తోంది. ఓపీ రోగులు ఎక్కువగా వచ్చే ఆస్పత్రుల్లో ఈ హెల్త్ ఏటీఎంలను ఏర్పాటు చేయనున్నారు.
2 months ago | [YT] | 0
View 0 replies
Load more