IMPORTANT NOTE :
Telugu Tv Channel,Village Entertainments,Short films,Folk Songs Latest,News update, Live,Live Shows, Entertainment, Video Songs, Audio Songs, Interviews published on our 69 Tv Telugu Channel
All kinds of programs are not meant to humiliate anyone.
We are broadcasting. If there are any comments, compliant, copyrights on these please pre-mail my mail
Can give information.our mail : www.69tvnews@gmail.com
THANK YOU
Copyright Notice: Please feel free to leave me a notice if you find this upload inappropriat
69Tv Telugu Channel is one of the leaders in the production and un-biased and comprehensive news and entertainment programmes in India and abroad
69Tv Telugu delivers reliable information across all platforms:TV, Internet and Mobile.
Thank U For Watching
Citizen 69Live
పండ్లు, కూరగాయల్లో పురుగుమందుల అవశేషాలు...తెలంగాణ టాప్...
పండ్లు, కూరగాయలలో అనుమతించిన పరిమితికి మించి పురుగుమందుల అవశేషాలు నమోదైన కేసుల్లో తెలంగాణ దేశంలోనే మొదటి స్థానంలో నిలిచినట్లు లోక్సభ గణాంకాలు వెల్లడించాయి. 2023-2026 మధ్య పరీక్షించిన 8,198 నమూనాల్లో 5.9 శాతం పరిమితి దాటినట్లు తేలింది. ఇది జాతీయ సగటు 3.1 శాతం కంటే దాదాపు రెట్టింపు. హెక్టారుకు 0.530 కిలోల క్రిమిసంహారకాలను తెలంగాణలో ఉపయోగిస్తున్నారు. పదేపదే ఈ రసాయనాలు శరీరంలోకి చేరడం వల్ల కాలేయం, మూత్రపిండాలు, నాడీ వ్యవస్థ దెబ్బతినే ప్రమాదం ఉందని.. వ్యవసాయ స్థాయిలో వీటి పరిమితిని తగ్గించడమే ఏకైక మార్గమని వైద్యులు సూచిస్తున్నారు.
4 days ago | [YT] | 3
View 0 replies
Citizen 69Live
నవ్వుల అలజడి.. గజ్జెల శబ్దాలు.. ఖాళీ అయిన హాస్టల్..
వారం రోజుల కిందట 16 మంది బాలికలు ఒక్కసారిగా ఏడ్వటం, నవ్వడం, ఆపై ఏ భావోద్వేగం లేకుండా చేష్టలుడిగిపోవడంతో ఈ ఘటన మొదలైందని అధికారులు తెలిపారు. కొందరు విద్యార్థులకు గజ్జెల శబ్దాలు వినిపించినట్లు చెప్పడంతో ఈ పుకార్లు హాస్టల్ నుంచి గ్రామానికి దావానలంలా వ్యాపించాయి.తీవ్రమైన మానసిక ఒత్తిడి, ఆందోళన వల్ల ఇలాంటి సామూహిక ప్రతిచర్యలు ఎదురవుతాయని, వైద్య పరిభాషలో దీనిని 'మాస్ సైకోజెనిక్ ఇల్నెస్' అంటారని వైద్య అధికారి డాక్టర్ అభిషేక్ నాయుడు వెల్లడించారు.
4 days ago | [YT] | 0
View 0 replies
Citizen 69Live
డ్రైనేజీ నిర్మాణం కోసం తవ్వకాలు..రూ.100 కోట్ల విలువైన బంగారు నిధి...
భూగర్భ డ్రైనేజీ నిర్మాణ పనుల కోసం తవ్వకాలు జరుపుతుండగా.. ఊహించని విధంగా భారీ మొత్తంలో బంగారు బిస్కెట్లు, అరుదైన నాణేలు బయటపడ్డాయి. వీటి విలువ దాదాపు 9 మిలియన్ యూరోలు (భారత కరెన్సీల్లో రూ.98 కోట్లు) ఉంటాయని అంచనా.నిధి బయటపడిన ప్రదేశంలో 1899లో ప్రారంభమైన బీరు తయారీ కేంద్రం 1970 వరకు నడించింది. ఇప్పటికీ భవనం ఇనుప గేట్లపై ‘VA’ అనే అక్షరాలు కనిపిస్తాయి. ప్రస్తుతం CAW ఓస్ట్-వ్లాండరెన్ అనే సామాజిక సంస్థ దీనిని కొత్త కార్యాలయాలు, నివాసాలను ఏర్పాటు చేయడానికి పునరుద్ధరిస్తోంది.
4 days ago | [YT] | 4
View 0 replies
Citizen 69Live
తెలంగాణ విద్యార్థులకు శుభవార్త.. ఏటా రూ.లక్ష స్కాలర్షిప్..
తెలంగాణ విద్యార్థులకు కాగ్ని చాంప్ సంస్థ శుభవార్త చెప్పింది. ప్రతిభ కలిగిన స్టూడెంట్స్కు స్కాలర్షిప్లు అందించనుంది. అయితే కేవలం మార్కులను బట్టి కాకుండా.. వారికి ఒక ఆన్లైన్లో ఎగ్జామ్ నిర్వహించి అందులో ప్రతిభ చూపిన వారికి ఏటా రూ.లక్ష స్కాలర్షిప్ ఇవ్వనుంది. గడువు లోగా అప్లై చేసుకుని పరీక్ష రాసి.. స్కాలర్షిప్ పొందాలని కాగ్ని చాంప్ సంస్థ వెల్లడించింది. ప్రతిభను మార్కులతో కాకుండా మేధస్సుతో గుర్తించే కొత్త స్కాలర్షిప్ అని ఆ సంస్థ తెలిపింది.
4 months ago | [YT] | 0
View 0 replies
Citizen 69Live
కాళేశ్వరం ప్రాజెక్టు అవినీతిపై హైకోర్టులో విచారణ..
కాళేశ్వరం ప్రాజెక్టుకు సంబంధించిన అవినీతి కేసు విచారణలో హైకోర్టు తీర్పు మరింత ఉత్కంఠ రేపుతోంది. జస్టిస్ పీసీ ఘోష్ కమిషన్పై చేపట్టిన విచారణను ముగించిన హైకోర్టు.. తీర్పును ఈనెల 22కు వాయిదా వేసింది. కాళేశ్వరం ప్రాజెక్టులో అవతకవకలు జరిగాయంటూ గత ప్రభుత్వంపై ఆరోపణలు గుప్పించిన ప్రస్తుత ప్రభుత్వం.. విచారణకు కమిషన్ ఏర్పాటు చేసింది. ఈ నేపథ్యంలోనే ఆ కమిషన్ రిపోర్టుపై విచారణ జరిపిన హైకోర్టు.. తీర్పును వెలువరించనుంది.
4 months ago | [YT] | 9
View 0 replies
Citizen 69Live
చెస్ లో మంత్రి కొండా సురేఖ మనవడి ప్రతిభ..రెండు ప్రపంచ రికార్డులు...
మంత్రి కొండా సురేఖ మనవడు చెస్లో రాణిస్తున్నాడు. కేవలం 3 ఏళ్ల లోపు వయసు ఉన్న ఆ బుడ్డోడు.. తన ఎత్తులు పై ఎత్తులతో చెస్ బోర్డుపై ఆధిపత్యం చూపిస్తున్నాడు. ఈ నేపథ్యంలోనే అతి చిన్న వయసులో ఒకేసారి 2 వరల్డ్ రికార్డులు సాధించి చరిత్రను నెలకొల్పాడు. ఇక ఆ బాలుడిని డిప్యూటీ సీఎం భట్టి, ఇతర మంత్రులు స్వయంగా వెళ్లి అభినందించడం విశేషం. ఇక విజేతగా నిలిచిన బాలుడికి బ్రిటన్ పార్లమెంటులో అవార్డులు అందించనున్నారు.
4 months ago | [YT] | 12
View 0 replies
Citizen 69Live
నెగటివ్ ఎనర్జీకి చెక్! అదృష్టం వరించాలంటే ఈ చిన్న చిట్కాలు ...
మీ ఇంట్లో ఎక్కడైనా వాస్తు దోషం ఉందని భావిస్తే, అక్కడ రెండు కర్పూర బిళ్ళలను ఉంచండి. అవి కరిగిపోయిన తర్వాత మళ్ళీ కొత్తవి పెట్టాలి. ఇలా చేయడం వల్ల ఆ ప్రదేశంలోని ప్రతికూల శక్తి తగ్గిపోతుంది. కర్పూరం అనేది కేవలం పూజా ద్రవ్యం మాత్రమే కాదు, అది మన ఇంటికి రక్షణ కవచంలా పనిచేస్తుంది. ప్రతిరోజూ చిన్న కర్పూర బిళ్ళను వెలిగించడం ద్వారా మీ జీవితంలో సానుకూల మార్పులను ఆహ్వానించవచ్చు.రోజూ సాయంత్రం వేళ వెలిగించే హారతిలో కర్పూరం వాడటం వల్ల ఇంట్లో లక్ష్మీ కటాక్షం కలుగుతుంది. నెయ్యితో కలిపిన కర్పూర హారతి ఇవ్వడం వల్ల కుటుంబ సభ్యుల మధ్య కలహాలు తగ్గి శాంతి లభిస్తుంది.
4 months ago | [YT] | 3
View 0 replies
Citizen 69Live
చలువ కదా అని అతిగా తాగితే కథ ముగిసినట్లే!
ఈ మధ్య కాలంలో చాలా మంది కిడ్నీ సమస్యలతో బాధపడుతున్నారు. అయితే కిడ్నీ సమస్యలతో బాధపడే వారు మజ్జిగ అస్సలే ఎక్కువగా తాగకూడదు అని చెబుతున్నారు ఆరోగ్య నిపుణులు. ఎందుకంటే? మజ్జిగలో పొటాషియం, ఫాస్పరస్ పుష్కలంగా ఉంటుంది. అయితే ఇది కిడ్నీ సమస్యలతో బాధపడే వారిలో అనేక రకాల సమస్యలకు కారణం అవుతుంది. అందుకే కిడ్నీ సమస్యలతో బాధపడే వారు మజ్జిగా ఎక్కువగా తాగకపోవడమే మంచిదంట. గుండె సమస్యలు, హై కొలెస్ట్రాల్ వంటి సమస్యలతో బాధపడే వారు కూడా అస్సలే మజ్జిగ అతిగా తాగకూదు అని చెబుతున్నారు ఆరోగ్య నిపుణులు. ఇది సమస్యను మరింత తీవ్రతరం చేస్తుందంట. నోట్ : పై సమాచారం కేవలం ఇంటర్నెట్ ఆధారంగా మాత్రమే ఇవ్వడం జరిగింది.
4 months ago | [YT] | 1
View 0 replies
Citizen 69Live
సోంపు గురించి ఈ నిజాలు...అన్నం తిన్న తర్వాత ఎందుకు తినాలంటే..?
గ్యాస్, ఉబ్బరానికి చెక్: భారీ భోజనం చేసినప్పుడు మన జీర్ణవ్యవస్థపై ఒత్తిడి పెరుగుతుంది. ఆ సమయంలో సోంపు గింజలు అద్భుతంగా పనిచేస్తాయి. డాక్టర్ సేథి ప్రకారం.. సోంపులో అనెథోల్, ఫెంచోన్, ఎస్ట్రాగోల్ వంటి ముఖ్యమైన నూనెలు ఉంటాయి. ఇవి కడుపులోని గ్యాస్ను బయటకు పంపడంలో కీలక పాత్ర పోషిస్తాయి. ముఖ్యంగా కడుపు ఉబ్బరం, అజీర్ణం, మలబద్ధకం వంటి సమస్యల నుండి ఇవి తక్షణ ఉపశమనం కలిగిస్తాయి.
4 months ago | [YT] | 3
View 0 replies
Citizen 69Live
ఇంటర్ ప్రవేశాలకు TGRJC CET 2026 దరఖాస్తులు ప్రారంభం..
తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న గురుకుల విద్యాలయ సంస్థల్లో 2026-27 విద్యా సంవత్సరానికి సంబంధించి ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్ ఇంగ్లిష్ మీడియంలో ప్రవేశాలకు నిర్వహించే టీజీఆర్జేసీ సెట్ 2026 ప్రవేశ పరీక్ష ఆన్లైన్ దరఖాస్తు ప్రక్రియ ప్రారంభమైంది. ఇందులో వచ్చిన ర్యాంకు ఆధారంగా మొత్తం 35 గురుకుల జూనియర్ కాలేజీల్లో ఇంగ్లీషు మీడియం MPC, BPC, MEC గ్రూపులలో ప్రవేశం కల్పిస్తారు. 2026 మార్చిలో పదో తరగతి పరీక్షలు రాసిన విద్యార్ధులు ఈ పరీక్షకు దరఖాస్తు చేసుకోవచ్చు.
4 months ago | [YT] | 3
View 0 replies
Load more