📌 English
Welcome to Medak Fast News
Your trusted source for daily latest news, breaking updates, and important local & national stories. Stay informed with fast, fair, and accurate news anytime, anywhere.
👉 Subscribe now and never miss an update!

📌 اردو
میدک فاسٹ نیوز میں خوش آمدید
یہ آپ کا معتبر پلیٹ فارم ہے جہاں آپ کو روزانہ کی تازہ خبریں، بریکنگ نیوز اور اہم مقامی و قومی خبریں ملتی ہیں۔
👉 ابھی سبسکرائب کریں اور ہر خبر سے باخبر رہیں!

📌 తెలుగు (Telugu)
Medak Fast News కి స్వాగతం
ఇది మీ నమ్మకమైన వార్తా వేదిక. ఇక్కడ మీరు ప్రతిరోజూ తాజా వార్తలు, బ్రేకింగ్ న్యూస్ మరియు ముఖ్యమైన స్థానిక & జాతీయ వార్తలు తెలుసుకోవచ్చు.
👉 ఇప్పుడే సబ్‌స్క్రైబ్ చేయండి మరియు ప్రతి అప్డేట్‌ను మిస్ కాకండి!

📌 Roman Urdu
Medak Fast News mein Khush Aamdeed
Yeh aap ka bharosa mand platform hai jahan aap ko rozana taaza khabrein, breaking news aur aham maqami aur qaumi updates milte hain.
👉 Abhi subscribe karein aur har update se ba khabar rahen!


MEDAKFASTNEWS

ప్రెస్ నోట్
తేదీ:22.08.2026

గౌరవ తెలంగాణ రాష్ట్ర న్యాయ సేవాధికార సంస్థ ఆదేశాల మేరకు జిల్లా ప్రధాన న్యాయమూర్తి, జిల్లా న్యాయ సేవాధికార సంస్థ చైర్మన్ శ్రీమతి G. నీలిమ గారు ముఖ్యఅతిథిగా నేడు అనగా తేదీ: 22–08–2026 రోజున వచ్చే నెల 12వ తేదీన జరగనున్న జాతీయ లోక్ అదాలత్ దృష్ట్యా పోలీస్, రెవెన్యూ, ఎక్సైజ్, అటవీ శాఖల అధికారులతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా ప్రధాన న్యాయమూర్తి, జిల్లా న్యాయ సేవాధికార సంస్థ చైర్మన్ శ్రీమతి G. నీలిమ గారు మాట్లాడుతూ వచ్చే నెల 12వ తేదీన జరగబోయే జాతీయ లోక్ అదాలత్ లో ఎక్కువ సంఖ్యలో రాజీ పడదగ్గ కేసుల పరిష్కారానికి చొరవ చూపాలని కోరారు. ఈ మేరకు సలహాలు, సూచనలు ఇచ్చారు. ఈ కార్యక్రమంలో ఫస్ట్ అడిషనల్ డిస్టిక్ అండ్ సెషన్స్ జడ్జ్ శ్రీమతి ఆర్.ఎం. సుభవల్లి గారు, ఫస్ట్ అడిషనల్ జూనియర్ సివిల్ జడ్జ్ శ్రీ సాయి ప్రభాకర్ గారు, మెదక్ డిఎస్పి శ్రీ ప్రసన్నకుమార్ గారు, తూప్రాన్ డిఎస్పి శ్రీ నరేందర్ గౌడ్ గారు, డిఆర్ఓ అంబదాస్ రాజేశ్వర్ గారు, ప్రభుత్వ ప్లీడర్లు, పబ్లిక్ ప్రాసిక్యూటర్లు, సిఐలు, ఎస్సైలు, అటవీ, ఎక్సైజ్ శాఖల అధికారులు తదితరులు పాల్గొన్నారు.

1 day ago | [YT] | 1

MEDAKFASTNEWS

ప్రచురణార్థం
మెదక్ 22 ఆగస్టు 2026
*ప్రెస్ నోట్*

దివ్యాంగులకు UDID ప్రత్యేక క్యాంపు తేదీలో మార్పు

ఈనెల 25 th ఆగస్టు దివ్యాంగులకు ప్రభుత్వ ప్రధాన ఆసుపత్రి మెదక్ నందు యూ డి ఐ డి శిబిరం

జిల్లా గ్రామీణ అభివృద్ధి అధికారి శ్రీనివాసరావు

దివ్యాంగులకు యూ.డిఐ.డి శిబిరం క్యాంపు ఏర్పాటుపై జిల్లా గ్రామీణ అభివృద్ధి అధికారి శ్రీనివాసరావు మాట్లాడుతూ గతంలో ఇచ్చిన ప్రకటన ఆధారంగా ఈనెల 26 తేదీన దివ్యాంగుల యూ డి ఐ డి క్యాంప్ నిర్వహించబడునని ప్రకటన జారీ చేయడం జరిగిందని. చెప్పారు. ఈనెల 26 వ తేదీన మిలాద్ ఉన్ నబి పండుగ సందర్భంగా ప్రభుత్వ సెలవు ఉన్న నేపథ్యంలో దివ్యాంగుల యు డి ఐ డి శిబిరాన్ని
ఆగస్టు 25వ తేదీన ప్రభుత్వ ప్రధాన ఆసుపత్రి మెదక్ నందు నిర్వహించే విధంగా చర్యలు తీసుకున్నామన్నారు. నూతన చేయూత పెన్షన్ల దరఖాస్తులు ఈనెల 31న ముగుస్తున్న నేపథ్యంలో
దివ్యాంగులు ఇంకా UDID ధృవీకరణ పత్రం రానివారు, ఆదివారం ఆగష్టు 25 సాయంత్రం వరకు మీ సేవలో దరఖాస్తు చేసుకోవాలన్నారు. వారికి సోమువారం స్లాట్ బుక్ అవడం జరుగుతుందని మంగళవారం (25.08.2026) నాడు మెదక ప్రభుత్వ ప్రధాన ఆసుపత్రి నందు శిబిరం జరుపబడునన్నారు.

యు డి ఐ డి దరఖాస్తు చేసుకున్న వారికి డి ఆర్ డి ఎ కార్యాలయం నుండి, మండల ఏపీఎం నుండి క్యాంపు నిర్వహణ సమాచారం తెలపబడునని శ్రీనివాసరావు పేర్కొన్నారు.

1 day ago | [YT] | 0

MEDAKFASTNEWS

ప్రెస్ నోట్
తేదీ:22.08.2026

గౌరవ తెలంగాణ రాష్ట్ర న్యాయ సేవాధికార సంస్థ ఆదేశాల మేరకు జిల్లా ప్రధాన న్యాయమూర్తి, జిల్లా న్యాయ సేవాధికార సంస్థ చైర్మన్ శ్రీమతి G. నీలిమ గారు ముఖ్యఅతిథిగా నేడు అనగా తేదీ: 22–08–2026 రోజున వచ్చే నెల 12వ తేదీన జరగనున్న జాతీయ లోక్ అదాలత్ దృష్ట్యా పోలీస్, రెవెన్యూ, ఎక్సైజ్, అటవీ శాఖల అధికారులతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా ప్రధాన న్యాయమూర్తి, జిల్లా న్యాయ సేవాధికార సంస్థ చైర్మన్ శ్రీమతి G. నీలిమ గారు మాట్లాడుతూ వచ్చే నెల 12వ తేదీన జరగబోయే జాతీయ లోక్ అదాలత్ లో ఎక్కువ సంఖ్యలో రాజీ పడదగ్గ కేసుల పరిష్కారానికి చొరవ చూపాలని కోరారు. ఈ మేరకు సలహాలు, సూచనలు ఇచ్చారు. ఈ కార్యక్రమంలో ఫస్ట్ అడిషనల్ డిస్టిక్ అండ్ సెషన్స్ జడ్జ్ శ్రీమతి ఆర్.ఎం. సుభవల్లి గారు, ఫస్ట్ అడిషనల్ జూనియర్ సివిల్ జడ్జ్ శ్రీ సాయి ప్రభాకర్ గారు, మెదక్ డిఎస్పి శ్రీ ప్రసన్నకుమార్ గారు, తూప్రాన్ డిఎస్పి శ్రీ నరేందర్ గౌడ్ గారు, డిఆర్ఓ అంబదాస్ రాజేశ్వర్ గారు, ప్రభుత్వ ప్లీడర్లు, పబ్లిక్ ప్రాసిక్యూటర్లు, సిఐలు, ఎస్సైలు, అటవీ, ఎక్సైజ్ శాఖల అధికారులు తదితరులు పాల్గొన్నారు.

1 day ago | [YT] | 1

MEDAKFASTNEWS

ప్రెస్ నోట్
తేదీ:22.08.2026

గౌరవ తెలంగాణ రాష్ట్ర న్యాయ సేవాధికార సంస్థ ఆదేశాల మేరకు జిల్లా ప్రధాన న్యాయమూర్తి, జిల్లా న్యాయ సేవాధికార సంస్థ చైర్మన్ శ్రీమతి G. నీలిమ గారు ముఖ్యఅతిథిగా నేడు అనగా తేదీ: 22–08–2026 రోజున వచ్చే నెల 12వ తేదీన జరగనున్న జాతీయ లోక్ అదాలత్ దృష్ట్యా పోలీస్, రెవెన్యూ, ఎక్సైజ్, అటవీ శాఖల అధికారులతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా ప్రధాన న్యాయమూర్తి, జిల్లా న్యాయ సేవాధికార సంస్థ చైర్మన్ శ్రీమతి G. నీలిమ గారు మాట్లాడుతూ వచ్చే నెల 12వ తేదీన జరగబోయే జాతీయ లోక్ అదాలత్ లో ఎక్కువ సంఖ్యలో రాజీ పడదగ్గ కేసుల పరిష్కారానికి చొరవ చూపాలని కోరారు. ఈ మేరకు సలహాలు, సూచనలు ఇచ్చారు. ఈ కార్యక్రమంలో ఫస్ట్ అడిషనల్ డిస్టిక్ అండ్ సెషన్స్ జడ్జ్ శ్రీమతి ఆర్.ఎం. సుభవల్లి గారు, ఫస్ట్ అడిషనల్ జూనియర్ సివిల్ జడ్జ్ శ్రీ సాయి ప్రభాకర్ గారు, మెదక్ డిఎస్పి శ్రీ ప్రసన్నకుమార్ గారు, తూప్రాన్ డిఎస్పి శ్రీ నరేందర్ గౌడ్ గారు, డిఆర్ఓ అంబదాస్ రాజేశ్వర్ గారు, ప్రభుత్వ ప్లీడర్లు, పబ్లిక్ ప్రాసిక్యూటర్లు, సిఐలు, ఎస్సైలు, అటవీ, ఎక్సైజ్ శాఖల అధికారులు తదితరులు పాల్గొన్నారు.

1 day ago | [YT] | 2

MEDAKFASTNEWS

మాజీ డిప్యూటీ స్పీకర్‌ పద్మా దేవేందర్‌రెడ్డికి వివాహ ఆహ్వానం.

మెదక్‌పట్టణంలోని ద్వారకానగర్‌ కాలనీకి చెందిన సాయినేని సునీల్‌రావు ప్రసన్న దంపతుల కుమార్తె అభిజ్ఞ వివాహం సతీష్‌రావుతో ఈ నెల 26న కొంపల్లిలోని హైందవ నిమంత్రణ్‌లో జరగనుంది. ఈ సందర్భంగా శనివారం మాజీ డిప్యూటీ స్పీకర్‌ ఎం. పద్మా దేవేందర్‌రెడ్డిని వారి నివాసంలో మర్యాదపూర్వకంగా కలిసి వివాహ ఆహ్వాన పత్రికను అందజేశారు. వివాహ వేడుకకు హాజరై వధూవరులను ఆశీర్వదించాలని కోరారు.ఈ కార్యక్రమంలో మెదక్‌ మున్సిపల్‌ మాజీ చైర్మన్‌ ఆరేళ్ల మల్లికార్జున్‌గౌడ్‌,మాజీ కౌన్సిలర్‌ ఆర్‌.కె. శ్రీనివాస్‌, బీఆర్‌ఎస్‌ నాయకులు ప్రభురెడ్డి తదితరులు ఉన్నారు.

1 day ago | [YT] | 9

MEDAKFASTNEWS

ప్రచురణార్థం
మెదక్ 21 ఆగస్టు 2026


నూతన చేయూత పింఛన్ల కొరకు లబ్ధిదారు దరఖాస్తులు చేసుకోవాలి.

చివరి తేదీ:31.08.2026

చేయత పింఛన్ల దరఖాస్తుల సమస్యల పరిష్కారం కోసం హెల్ప్ డెస్క్ ఏర్పాటు


8008556112 చేయూత పెన్షన్లు హెల్ప్ డెస్క్ నెంబర్

ఈనెల 26వ తేదీన దివ్యాంగులకు ప్రభుత్వ ప్రధాన ఆసుపత్రి GGH లో ప్రత్యేక యు. డి .ఐ .డి శిబిరం

నూతన చేయూత పింఛన్ల దరఖాస్తులు మండల మరియు గ్రామపంచాయతీ కార్యాలయాల్లో స్వీకరించబడుతున్నాయి


నూతన చేయూత పింఛన్ల దరఖాస్తుల కోసం జిల్లా యంత్రాంగం సహాయకారిణిగా పనిచేస్తుంది.

---మెదక్ జిల్లా కలెక్టర్ ప్రతిమా సింగ్



చేయూత పింఛన్ల దరఖాస్తుల పరిష్కారం కోసం కలెక్టరేట్ కార్యాలయంలో హెల్ప్ డెస్క్ ఏర్పాటు చేసినట్లు, అలాగే ఈనెల 26వ తేదీన దివ్యాంగుల కొరకు ప్రత్యేక యు డి ఐ డి శిబిరం నిర్వహిస్తున్నట్లు
చేయూత పింఛన్ల దరఖాస్తులు మండల మరియు గ్రామపంచాయతీ కార్యాలయాల్లో సమర్పించాలని
జిల్లా కలెక్టర్ ప్రతిమా సింగ్ శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపారు.
చేయూత పింఛన్ల దరఖాస్తుల స్వీకరణ పై జిల్లా కలెక్టర్ ప్రతిమ సింగ్ మాట్లాడుతూ కొత్త చేయూత పింఛన్లు దరఖాస్తులు మండల మరియు గ్రామపంచాయతీ కార్యాలయాల్లో దరఖాస్తులు స్వీకరించబడుతున్నాయని , తెలిపారు. దరఖాస్తుల స్వీకరణలో ఏమైనా సమస్యలు ఉత్పన్నమైన ఎడల వెంటనే దరఖాస్తుదారులు జిల్లా కలెక్టర్ కార్యాలయంలో గల హెల్ప్ డెస్క్ ను సంప్రదించాలన్నారు.
8008556112 చేయూత పెన్షన్లు హెల్ప్ డెస్క్ నెంబర్ ను సంప్రదించాలన్నారు.
ఇంకా ఎవరైనా దివ్యాంగులు యూ డి ఐ డి ధ్రువీకరణ పత్రం లేనియెడల వారు తక్షణమే మీసేవ సెంటర్లో దరఖాస్తు చేసుకున్న ఎడల ఆగస్టు 26వ తేదీన మెదక్ ప్రభుత్వ ఆసుపత్రిలో GGH లో ప్రత్యేక శిబిరం నిర్వహిస్తున్నట్లు తెలిపారు ఇంకా మిగిలి ఉన్న వారు మీసేవ సెంటర్లో దరఖాస్తు చేసుకోవాలని జిల్లా కలెక్టర్ తెలిపారు.
పింఛన్ల కొరకు దరఖాస్తు చేసుకునే లబ్ధిదారులు
ఏదైనా ధృవీకరణ పత్రం లేనియెడల వెంటనే సంబంధిత అధికారుల దగ్గరకు వెళ్లి తక్షణమే తీసుకునే విధంగా అన్ని ఏర్పాట్లు చేశామన్నారు. ధ్రువీకరణ పత్రాలు తీసుకునేటప్పుడు ఏదైనా సమస్యలు ఉత్పన్నమైతే వెంటనే కలెక్టరేట్లో ఉన్న హెల్ప్ డెస్క్ సహాయకారిణిగా పనిచేస్తుందని,సమస్య ఉన్నట్లయితే
వెంటనే హెల్ప్ డెస్క్ ను సంప్రదించాలన్నారు.
అర్హులైన వారు
చేయూత పింఛన్ల కొరకు దరఖాస్తు చేసుకోవాలని వీరికి ప్రభుత్వ యంత్రాంగం సహాయకారిణిగా పనిచేస్తుందన్నారు.
లబ్ధిదారుల చేసుకున్న దరఖాస్తులను సకాలంలో తీసుకొని వెంటనే ఆన్లైన్లో అప్లోడ్ చేయాలని సంబంధిత ఎంపీడీఓ లను కలెక్టర్ ఆదేశించారు.

2 days ago | [YT] | 0

MEDAKFASTNEWS

ప్రచురణార్థం
మెదక్ 21 ఆగస్టు 2026
*ప్రెస్ నోట్*

రైల్వే ఓవర్ బ్రిడ్జి (ROB) నిర్మాణ పనులు తేది: 23.08.2026 అర్ధరాత్రి 12.00 గంటల నుండి
ప్రారంభం కలెక్టర్

వాహనదారులు రహదారి ప్రత్యామ్నాయ మార్గాలను వినియోగించుకోవాలి

వాహనదారులు పోలీసుల సూచనలను పాటించాలి


జిల్లా కలెక్టర్ ప్రతిమా సింగ్

రైల్వే ఓవర్ బ్రిడ్జి (ROB) నిర్మాణ పనులు తేది: 23.08.2026 అర్ధరాత్రి 12.00 గంటల నుండి
ప్రారంభమవుతున్న నేపథ్యంలో వాహనదారులు పోలీసుల సూచనలను పాటిస్తూ వాహనదారులు రహదారి ప్రత్యామ్నాయ మార్గాలను వినియోగించుకోవాలని జిల్లా కలెక్టర్ ప్రతిమా సింగ్
శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపారు.

వాహనదారులు ఉద్దేశించి జిల్లా కలెక్టర్ ప్రతిమసింగ్ మాట్లాడుతూ చేగుంట (గాంధీ చౌక్) నుండి మెదక్ వెళ్ళు రోడ్డు నకు గల రైల్వే ఓవర్ బ్రిడ్జి (ROB) నిర్మాణ పనులు తేది: 23.08.2026 అర్ధరాత్రి 12.00 గంటల నుండి ప్రారంభమగుననీ, ఈ కారణంగా చేగుంట నుండి మెదక్ (LC NO.228T) వద్ద రహదారి రాకపోకలను నిర్మాణ పనులు పూర్తి అయ్యా వరకు తాత్కాలికముగా నిలిపివేయడం జరుగుతుందని వాహనదారులు ఈ దిగువ చూపబడిన ప్రత్యామ్నయ మార్గాలను వినియోగించుకోవాలని కలెక్టర్ వెల్లడించారు. ద్వి మరియు త్రి చక్ర వాహనములు వినియోగించుకోవలసిన మార్గం గురించి కలెక్టర్ వివరిస్తూ LC గేటు వద్ద ఉన్న CC రోడ్ నుండి పాత నేషనల్ హైవే చేగుంట పట్టణ సరిహద్దు అనగా ప్రస్థుత RUB నుండి బస్సు స్టాప్ ఎదురుగా గల వెంచర్ మీదుగా వెళ్ళవలనని చెప్పారు.
. కార్లు, బస్సులు, డి.సి. యం. వ్యాన్లు మరియు ఇతర వాహనములు నార్సింగి నుండి శంకరంపేట (ఆర్) (వయ మిర్జాపల్లి) డబుల్ రోడ్డు మార్గము ద్వారా వెళ్ళుటకు నిర్దేశించామని తెలిపారు . ట్రాక్కులు మరియు భారీ వాహనములు రామాయంపేట నుండి లేదా నర్సాపూర్ మార్గము నుండి వెళ్ళవలెనని చెప్పారు, అలాగే కార్లు, బస్సులు మరియు డి.సి.యం. వ్యాన్లు ఇతర వాహనములు ఇతర మార్గాలను గలను ద్వారా కూడా వినియోగించుకోవాలన్నారు.మాసాయిపేట నుండి మెదక్ ప్రయాణించే వాహనములు శంకరంపేట(ఆర్) వయా ధర్పల్లి రోడ్ నుండి వెళ్ళుటకు సూచించడం జరిగిందన్నారు. తూప్రాన్ నుండి మెదక్ ప్రయాణించే వాహనములు వెల్దుర్తి - ఉప్పులింగాపూర్ - గవ్వలపల్లి ద్వారా వెళ్ళుటకు నిర్ణయించామన్నారు.

కావున జిల్లా ప్రజలు ఇట్టి ప్రత్యామ్నయ మార్గాలను వినియోగించుకోగలరు. పోలీసుల సూచనలను పాటించాలని జిల్లా కలెక్టర్ ప్రతిమా సింగ్ వాహనదారులకు విజ్ఞప్తి చేశారు.

2 days ago | [YT] | 2

MEDAKFASTNEWS

ప్రెస్ నోట్
తేదీ 20-8-2026
మెదక్ జిల్లా

రహదారి ప్రత్యామ్నాయ మార్గాలను వినియోగించుకోవాలి
జిల్లా రెవెన్యూ అధికారి ---అంబదాస్ రాజేశ్వర్

చేగుంట (గాంధీ చౌక్) నుండి మెదక్ వెళ్ళు రోడ్డు నకు గల రైల్వే ఓవర్ బ్రిడ్జి (ROB) నిర్మాణ పనులు తేది: 23.08.2026 అర్ధరాత్రి 12.00 గంటల నుండి ప్రారంభమగుననీ,
ఈ కారణంగా చేగుంట నుండి మెదక్ (LC NO.228T) వద్ద రహదారి రాకపోకలను నిర్మాణ పనులు పూర్తి అయ్యా వరకు తాత్కాలికముగా నిలిపివేయడం జరుగుతుంది. కావున వాహనదారులు ఈ దిగువ చూపబడిన ప్రత్యామ్నయ మార్గాలను వినియోగించుకోవాలని సూచించనైనది.

1. ద్వి మరియు త్రి చక్ర వాహనములు వినియోగించుకోవలసిన మార్గము :

LC గేటు వద్ద ఉన్న CC రోడ్ నుండి పాత నేషనల్ హైవే చేగుంట పట్టణ సరిహద్దు అనగా ప్రస్థుత RUB నుండి బస్సు స్టాప్ ఎదురుగా గల వెంచర్ మీదుగా వెళ్ళవలెను.

2. కార్లు, బస్సులు, డి.సి. యం. వ్యాన్లు మరియు ఇతర వాహనములు వినియోగించుకోవలసిన మార్గము :

నార్సింగి నుండి శంకరంపేట (ఆర్) (వయ మిర్జాపల్లి) డబుల్ రోడ్డు మార్గము ద్వారా వెళ్ళుటకు గాను సూచించనైనది.

3. ట్రాక్కులు మరియు భారీ వాహనములు వినియోగించుకోవలసిన మార్గము :

రామాయంపేట నుండి లేదా నర్సాపూర్ మార్గము నుండి వెళ్ళవలెను.

4. కార్లు, బస్సులు మరియు డి.సి.యం. వ్యాన్లు ఇతర వాహనములు ఇతర మార్గాలను గలను ద్వారా కూడా

వినియోగించుకోగలరు :

a) మాసాయిపేట నుండి మెదక్ ప్రయాణించే వాహనములు శంకరంపేట(ఆర్) వయా ధర్పల్లి రోడ్ నుండి వెళ్ళుటకు సూచించనయినది.

b) తూప్రాన్ నుండి మెదక్ ప్రయాణించే వాహనములు వెల్దుర్తి - ఉప్పులింగాపూర్ - గవ్వలపల్లి ద్వారా వెళ్ళుటకు సూచించనయినది.

కావున జిల్లా ప్రజలు ఇట్టి ప్రత్యామ్నయ మార్గాలను వినియోగించుకోగలరు. పోలీసుల సూచనలను పాటించాలని జిల్లా రెవెన్యూ అధికారి అంబదాస్ రాజేశ్వర్ గురువారం ఒక ప్రకటనలో తెలిపారు.

2 days ago | [YT] | 1

MEDAKFASTNEWS

ప్రచురణార్థం
మెదక్ 20 ఆగస్టు 2026
*ప్రెస్ నోట్*

జిల్లా కలెక్టరేట్ కార్యాలయంతో పాటు , అన్ని ప్రభుత్వ కార్యాలయాల్లో టి ఫైబర్ ఇంటర్నెట్ ఏర్పాటు డెడ్ లైన్ ఆగస్టు 31

జిల్లాలోని అన్ని ప్రభుత్వ కార్యాలయాల్లో టీ-ఫైబర్ సేవలకు అందుబాటులోకి తీసుకురావాలని సంబంధిత అధికారులను జిల్లా కలెక్టర్ ప్రతిమసింగ్ ఆదేశించారు.

కలెక్టర్ క్యాంపు కార్యాలయంలో మెదక్ జిల్లాలో ప్రభుత్వ కార్యాలయాల్లో టీ ఫైబర్ ఇంటర్నెట్ ఏర్పాటు చేయడంపై కలెక్టర్ సమీక్షించారు.
ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ తెలంగాణ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ) సంజయ్ జాజు ప్రత్యేక ఆదేశాలతో,ప్రైవేట్ ఇంటర్నెట్లను తొలగించి టి ఫైబర్ ఇంటర్నెట్ మారాలని సంబంధిత అధికారులతో సమీక్షించడం జరిగిందన్నారు టీ ఫైబర్ ఇంటర్నెట్ ఏర్పాటు చేయడం గురించి ప్రత్యేక నోడల్ ఆఫీసర్ నియమించి సమగ్ర ప్రణాళిక రూపొందించి త్వరలో కలెక్టరేట్లో అన్ని శాఖల తో పాటు అన్ని ప్రభుత్వ కార్యాలయంలో ఇంటర్నెట్ అందుబాటుకు తీసుకువచ్చే విధంగా పగడ్బందీగా చర్యలు చేపడుతున్నట్లు కలెక్టర్ వివరించారు.
ఇంటర్నెట్ వినియోగం, వాటి సామర్థ్యం అన్ని ప్రభుత్వ కార్యాలయాలనుంచి సమగ్ర అంచనాల రూపొందించుకొని ఇంటర్నెట్ ఏర్పాటు చేస్తున్నట్లు చెప్పారు. ఈనెల 31 వరకు. డి ఫైబర్ ఇంటర్నెట్
ఏర్పాటు చేసే విధంగా అన్ని శాఖల ఉన్నతాధికారులు
సహకరించాలన్నారు.

ఈ కార్యక్రమంలో ఇన్చార్జి అదనపు కలెక్టర్ అంబదాస్ రాజేశ్వర్ ,ఈ.డీ.ఎం సందీప్, టి .ఫైబర్ ఇంటర్నెట్ మెదక్ జోనల్ మేనేజర్ ఈశ్వర్, టి .ఫైబర్ ఇంటర్నెట్ డీ.ఈ వినోద్ తదితరులు పాల్గొన్నారు.

2 days ago | [YT] | 0

MEDAKFASTNEWS

English

New Field Vehicle Inaugurated for Forest Department in Medak
MLA Dr. Mynampally Rohith Rao’s Initiative Strengthens Forest & Environmental Protection

A new field vehicle provided to the Forest Department in Medak was formally inaugurated, following the initiative of MLA Dr. Mynampally Rohith Rao. The vehicle will help forest officials improve field-level operations, forest protection and environmental conservation. Congress district president Anjaneyulu Goud, Municipal Chairperson Radhika Bhupathi Raju, Vice Chairman Donthi Naresh Goud, councillors, party leaders and workers attended the programme.

🇮🇳 اردو

میدک میں محکمہ جنگلات کے لیے نئی فیلڈ گاڑی کا افتتاح
ایم ایل اے ڈاکٹر مائنم پلی روہت راؤ کی کوشش سے جنگلات و ماحولیات کے تحفظ کو تقویت

میدک میں محکمہ جنگلات کے لیے فراہم کردہ نئی فیلڈ گاڑی کا باقاعدہ افتتاح کیا گیا۔ ایم ایل اے ڈاکٹر مائنم پلی روہت راؤ کی کوشش سے فراہم کی گئی یہ گاڑی جنگلات کے تحفظ، ماحولیاتی سلامتی اور فیلڈ سطح پر محکمہ جنگلات کے مؤثر کام میں معاون ثابت ہوگی۔ اس موقع پر کانگریس ضلع صدر انجنیلو گوڑ، میونسپل چیئرپرسن رادھیکا بھوپتی راجو، وائس چیئرمین دونتی نریش گوڑ، کونسلرس اور کانگریس قائدین و کارکنان موجود تھے۔

🇮🇳 తెలుగు

మెదక్‌లో ఫారెస్ట్ శాఖకు నూతన ఫీల్డ్ వెహికల్ ప్రారంభం
ఎమ్మెల్యే డా. మైనంపల్లి రోహిత్ రావు చొరవతో అటవీ, పర్యావరణ పరిరక్షణకు మరింత బలం

మెదక్ ఫారెస్ట్ శాఖకు నూతనంగా సమకూరిన ఫీల్డ్ వెహికల్‌ను ప్రారంభించారు. ఎమ్మెల్యే డా. మైనంపల్లి రోహిత్ రావు చొరవతో అందుబాటులోకి వచ్చిన ఈ వాహనం అటవీ సంరక్షణ, పర్యావరణ పరిరక్షణతో పాటు క్షేత్రస్థాయిలో అధికారులు మరింత సమర్థవంతంగా సేవలందించేందుకు ఉపయోగపడనుంది. కార్యక్రమంలో జిల్లా కాంగ్రెస్ అధ్యక్షులు అంజనేయులు గౌడ్, మున్సిపల్ చైర్‌పర్సన్ రాధిక భూపతి రాజు, వైస్ చైర్మన్ దొంతి నరేష్ గౌడ్, కౌన్సిలర్లు, కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

🇮🇳 Roman Urdu

Medak Mein Forest Department Ke Liye Nayi Field Vehicle Ka Aaghaz
MLA Dr. Mynampally Rohith Rao Ki Koshish Se Jungle Aur Maholiyat Ke Tahaffuz Ko Mazbooti

Medak Forest Department ke liye nayi field vehicle ka baqaida aaghaz kiya gaya. MLA Dr. Mynampally Rohith Rao ki koshish se faraham ki gayi yeh vehicle jangalat ke tahaffuz, maholiyati hifazat aur field level par forest officials ki behtar khidmaat mein madadgar sabit hogi. Is mauqe par Congress Zila President Anjaneyulu Goud, Municipal Chairperson Radhika Bhupathi Raju, Vice Chairman Donthi Naresh Goud, councillors aur Congress qaidin o karkunan maujood the.

3 days ago | [YT] | 3