Forum for RTI


SR24 NEWS

మొంథా తుఫాన్ నేపథ్యంలో అధికారులు అప్రమత్తంగా ఉండాలి - డీఐజీ శ్రీ గోపీనాథ్ జట్టి
SR24 NEWS విశాఖపట్నం, అక్టోబర్ 29: విశాఖపట్నం రేంజ్ డీఐజీ శ్రీ గోపీనాథ్ జట్టి, ఐపీఎస్ , మొంథా తుఫాన్ ప్రభావం నేపథ్యంలో రేంజ్ పరిధిలోని అన్ని జిల్లాల అధికారులను అప్రమత్తంగా ఉండాలని ఆదేశించారు. ఈ సందర్భంగా అనకాపల్లి జిల్లా దేవరపల్లి మండలం, రైవాడ జలాశయం పరిసర ప్రాంతాలు, శ్రీకాకుళం జిల్లా ఇచ్చాపురం మండలంలోని బహుదా నది పరివాహక గ్రామాలు, అలాగే అల్లూరి సీతారామరాజు జిల్లా ఏజెన్సీ ప్రాంతాలు ముంపు, కొండచరియలు విరిగిపడే ప్రమాదాలకు గురయ్యే అవకాశం ఉందని పేర్కొన్నారు.వర్షాల తీవ్రత పెరిగే అవకాశం ఉన్నందున ప్రజలు అప్రమత్తంగా ఉండి, తుఫాన్ హెచ్చరికలు, వాతావరణ సూచనలు గమనించాలని, లోతట్టు ప్రాంతాల ప్రజలు అవసరమైతే సురక్షిత ప్రదేశాలకు తరలించాలన్నారు.సంబంధిత జిల్లా పోలీస్ అధికారులు, రెవెన్యూ, అగ్నిమాపక, పంచాయతీ మరియు విద్యుత్ శాఖలతో సమన్వయం చేసుకుని ప్రజల భద్రత, రక్షణ చర్యలు పటిష్టంగా అమలు చేయాలని ఆదేశించారు.రైవాడ జలాశయంలో నీటి మట్టం పెరుగుతున్న నేపథ్యంలో స్థానిక అధికారులు, పోలీసులు నిత్యం పర్యవేక్షణ చేయాలని సూచించారు.ప్రజలు వాతావరణ పరిస్థితులను గమనిస్తూ భద్రతా సూచనలు పాటించాలి. అవసరం లేకుండా బయటకు వెళ్లరాదు. తుఫాన్ ప్రభావిత ప్రాంతాల్లో పోలీసులు, ప్రభుత్వ యంత్రాంగం ఎప్పటికప్పుడు ప్రజల సేవలో సిద్ధంగా ఉంది” అని పేర్కొన్నారు.

బహుదా నది పరివాహక గ్రామాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు.

అల్లూరి సీతారామరాజు జిల్లా ఏజెన్సీ ప్రాంతాలు:
కొండచరియలు విరిగిపడే అవకాశం ఉన్నందున ముఖ్యంగా
1.చత్రపల్లి గ్రామం (జి.కె. వీధి మండలం),
2.పులుసు మామిడి గ్రామం (అనంతగిరి పంచాయతీ పరిధి),
3.మాధిగమల్లు గ్రామం (గుమ్మరేవుల పంచాయతీ – సీలేరు పోలీస్ స్టేషన్ పరిధి) ప్రజలు, అధికారులు అప్రమత్తంగా ఉండాలని సూచించారు.

9 months ago | [YT] | 1

SR24 NEWS

ఉధృతంగా ప్రవహిస్తున్న వెంకుపాలెం వెదుళ్ల గెడ్డను, శారదా నది పరివాహక ప్రాంతాలను పరిశీలించిన అనకాపల్లి డిఎస్పి శ్రీమతి M.శ్రావణి

SR24NEWSఅనకాపల్లి రూరల్: మోంథా తుఫాన్ దాటికి అధిక నీటి ప్రవాహంతో ప్రవహిస్తున్న వెదుళ్ల గడ్డ రోడ్డు పై నుండి ప్రవహిస్తున్నందు వలన వెంకుపాలెం మరియు కుంచంగి గ్రామాల మధ్యన రాకపోకలు నిలిచిపోయాయి. ఎగువ ప్రాంతాల నుంచి వర్షపు నీరు ఉదృతంగా ప్రవహిస్తునందున ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా నీటి ప్రవాహానికి రెండు వైపుల పోలీస్ సిబ్బందిని పెట్టి వాహనాలు, ప్రజలు ఆ మార్గం ద్వారా వెల్లంకుండా అనకాపల్లి రూరల్ పోలీసులు ఏర్పాటు చేసిన పోలీస్ బృందాలను తనకీ చేసి సూచనలు ఇచ్చారు.ప్రస్తుత శారదా నది వరద పరిస్థితిని పరిశీలించి, రైవాడ మరియు పెద్దేరు జలాశయాలలో అధిక మొత్తంలో నీటిని విడుదల చేస్తున్నందున శారదా నది ప్రవాహ పరిస్థితి ఇంకా ఎక్కువగా ఉంటుందని, తగరంపూడి, సీతానగరం మరియు వెంకిపాలెం గ్రామాల్లో గ్రామస్తులతో మీటింగ్ పెట్టి నదీ ప్రవాహ పరిస్థితిని వారికి వివరించి, గ్రామస్తులు ఎవరు నది పరివాహ ప్రాంతాలకు వెళ్ళొద్దని, నదులు పక్కన ఉన్న పంట పొలాలకు పశువుల పాకల వద్దకు వెళ్లవద్దని, వరద ప్రవాహం మరో రెండు రోజులపాటు ఉంటుంది కావున జాగ్రత్తగా ఉండమని తెలియజేశారు. అదేవిధంగా అనకాపల్లి రూరల్ పోలీసు వారికి వెదుళ్ల గడ్డ వల్ల రోడ్డు మీద ప్రవహిస్తున్న ప్రవాహాల వైపు ఎవరు వెళ్లకుండా పోలీస్ సిబ్బందిని పెట్టి ఆపాలని సూచించారు. శారదా నది వరద ఉధృతి సమాచారాన్ని గ్రామస్తులకు దండోరా ద్వారా మరియు మైకుల ద్వారా తెలియపరచడం జరిగింది. అత్యవసర సమయంలో అనారోగ్య బారిన పడిన వారిని ముందుగానే హాస్పిటల్ వద్దకు కానీ దగ్గర్లో ఉన్న పునరావాసు కేంద్రానికి గాని తరలించే ఏర్పాటు చేయాలని ఆదేశించారు. హెచ్చరిక బోర్డు లను ఏర్పాటు చెయ్యాలని ఆదేశించారు. సమీప గ్రామాల్లో యువకులు వాలంటీర్లుగా ఏర్పడి పోలీసుల సహాయక చర్యల లో సహకరించాలని పిలుపునిచ్చారు. తుఫాను కారణంగా ప్రజలకు ఎటువంటి ఇబ్బందులు ఉన్న అనకాపల్లి రూరల్ పోలీస్ స్టేషన్ కాని కంట్రోల్ రూమ్ గాని తెలియజేయాలని చెప్పారు. DSP వెంట అనకాపల్లి రూరల్ సీఐ జి అశోక్ కుమార్, ఎస్సై రవికుమార్, సిబ్బంది, గ్రామస్థులు ఉన్నారు.

9 months ago | [YT] | 1

SR24 NEWS

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర హైకోర్టు సీనియర్ న్యాయవాది మరియు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర న్యాయవాదుల ఫోరం ఫర్ సోషల్ జస్టిస్ సీనియర్ నాయకుడు *కేశన* రామకోటేశ్వరరావు
సన్మానం

గురుదేవ్ ఎడ్యుకేషనల్ సొసైటీ (Regd.) కరస్పాండెంట్ కమ్ సెక్రటరీ, M/S శ్రీ గురుదేవ్ ఎలక్ట్రికల్ అండ్ ఇంజనీర్స్ మేనేజింగ్ డైరెక్టర్ ఆధ్వర్యం లో సామాజిక న్యాయం, మహిళా సాధికారత, పిల్లల సంక్షేమం, విద్యా హక్కు, క్రీడలు మరియు సాంస్కృతిక కార్యకలాపాలు మరియు నేషనల్ క్యాడెట్ కార్ప్స్ (NCC) రంగానికి ఆయన చేసిన సేవను ఈ కార్యక్రమంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర న్యాయవాదుల ఫోరం ఫర్ సోషల్ జస్టిస్ బృందం సభ్యులు, A.P హైకోర్టు న్యాయవాదులు పడమట యుగంధర్ గౌడ్ మరియు బొర్రా నాగంజనేయులు గౌడ్, పశ్చిమ గోదావరి జిల్లా మరియు పాలకొల్లు సామాజిక కార్యకర్తలు, సీనియర్ మహిళా విభాగం నాయకురాలు శ్రీమతి పులి మధురై మరియు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం మొదలైన వారు గుర్తించారు. స్నేహితులు పాల్గొన్నారు.

10 months ago | [YT] | 1

SR24 NEWS

నిస్వార్థ సేవా యాత్రకు గౌరవ డాక్టరేట్ పురస్కారం

ఆకర్ష్ రూరల్ డెవలప్మెంట్ వెల్ఫేర్ సొసైటీ అధ్యక్షుడు కొమ్మోజు రమేష్

సమాజానికి చేసిన ఈ విశేష సేవలను గుర్తించి, 2025 ఆగస్టు 16 న పుదుచ్చేరి లోని షెన్బాగా హాల్ లో జరిగిన ఇంటర్నేషనల్ పీస్ యూనివర్సిటీ కాన్వొకేషన్ లో విశ్వవిద్యాలయ ప్రతినిధులు చేతులమీదుగా కొమ్మోజు రమేష్ కి “హానరరీ డాక్టరేట్ ఆఫ్ సోషియల్ సర్వీస్" బహూకరించడం జరిగింది. ఈ సందర్భంగా రమేష్ మాట్లాడుతూ "ఈ గౌరవం తన ఒక్కడిది మాత్రమే కాదు, ఆకర్ష్ కుటుంబం అంతటిది అదే విధంగా వాలంటీర్లుగా సహకరించిన ప్రతి ఒక్కరికి చెందుతుందని అన్నారు. ఇది మాకు మరింత బాధ్యతను, మరింత కృషి చేయాలనే ఉత్సాహాన్ని ఇస్తుంది" అని అన్నారు. అదేవిధంగా "జీవితంలో ఎదురైన వ్యక్తిగత వేదన, సమాజానికి వెలుగునిచ్చే మార్గం అవుతుంది"

అనే ధ్యేయంతో 2010 డిసెంబర్ 31 న తన సోదరి నాగ పద్మావతి అనూహ్యంగా ఈ లోకం విడిచిపెట్టడం, తన జీవితాన్ని పూర్తిగా మార్చేసింది అని అన్నారు, ఆ వేదనను తట్టుకుని, తన సోదరి జ్ఞాపకార్థం సమాజానికి ఏదో చేయాలనే సంకల్పంతో పుట్టినదే ఈ ఆకర్ష్ రూరల్ డెవలప్మెంట్ వెల్ఫేర్ సొసైటీ అన్నారు. 2012 ఆగస్టు 28న "ఆకర్ష్ రూరల్ డెవలప్మెంట్ వెల్ఫేర్ సొసైటీ" అనే స్వచ్ఛంద సంస్థను అధికారికంగా రిజిస్టర్ చేసి, పది మందితో మొదలైన ఈ ప్రయాణం నేటికి కూడా వాలంటీర్ల మద్దతుతో ముందుకు సాగుతుందని తెలియజేశారు ఆకర్ష్ రూరల్ డెవలప్మెంట్ వెల్ఫేర్ సొసైటీ సంస్థ పర్యావరణ పరిరక్షణ, పేద విద్యార్థుల విద్య, ఆరోగ్య సేవలు, మహిళా సాధికారిత, చట్ట అవగాహన, క్రీడల ప్రోత్సాహం, అనాధల సంరక్షణ వంటి మొదలు కార్యక్రమాలు నిర్వహించడంలో ఆకర్ష సంస్థ సఫలీకృతమైందని తెలియజేశారు. అదేవిధంగా టీచింగ్ ప్రొఫెషన్ లో ఉన్నప్పుడు కూడా ప్రతి విద్యార్థిని తన పుట్టినరోజుకి తన కుటుంబంలో ఉన్నటువంటి ముఖ్యమైన రోజులకు సంబంధించి మొక్కలు నాటే కార్యక్రమం చేయాలని విద్యార్థులను మరియు విద్యార్థులు తల్లిదండ్రులను అవగాహన పెంచడం ద్వారా అత్యధిక మొక్కలు నాటడం జరిగిందని అన్నారు, ఉచిత వైద్య శిబిరాలు, రక్తదాన కార్యక్రమాలు, హుదూద్ తుఫాన్ బాధితులకు సహాయం, గ్రామీణ ప్రాంతాల్లో చట్ట అవగాహన సదస్సులు, యువతలో నైతిక విలువల పెంపు, పర్యావరణ హితం, నీటి సంరక్షణ, ఎయిడ్స్ అవగాహన, క్రీడాకారుల ప్రోత్సాహం వంటి అనేక కార్యక్రమాలు విజయవంతంగా నిర్వహించడం జరిగిందని తెలియజేశారు అదేవిధంగా ఆకర్ష్ రూరల్ డెవలప్మెంట్ వెల్ఫేర్ సొసైటీ తన స్థాపన నుండి నేటి వరకు "సేవే మాకు శ్వాస, సమాజమే మా బలం" అనే నినాదంతో ముందుకు సాగుతూ, కొత్త తరాలకు స్ఫూర్తిగా నిలుస్తుందని అన్నారు. అదేవిధంగా రాబోయే రోజుల్లో మరిన్ని గ్రామీణ ప్రాంతాలకు చేరుకుని, విద్య, ఆరోగ్యం, పర్యావరణ పరిరక్షణ, యువత అభివృద్ధి రంగాల్లో విస్తృత సేవా కార్యక్రమాలు చేపట్టాలని రమేష్ సంకల్పించారు. అదేవిధంగా 2021-22 లో అఖిల భారత అవార్డు యువాచార్య అవార్డు, 2022-23 లో అఖిల భారత అవార్డు కల్పాచార్య అవార్డు, 2024 లో వాసవీ స్వయం సేవా ట్రస్ట్ వారి అద్వర్యంలో అనంత సేవా స్మృతి పురస్కారం, 2024 లో SKVB సహకార సంఘం వారి అద్వర్యంలో ఉత్తమ సామాజిక సేవా పురస్కారం, 2025 లో ఆర్టిఐ మరియు సోషల్ యాక్టివిస్ట్ విభాగంలో మాజీ రాష్ట్రపతి బ్రహ్మశ్రీ “జ్ఞాని జైల్ సింగ్ జాతీయ అవార్డు” పొందినట్లు తెలియజేశారు.

11 months ago | [YT] | 1

SR24 NEWS

దీనస్థితిలో ఉన్న అన్నమయ్య పార్కును పునరుద్ధరించండి - బల్లా నాగభూషణం

అనకాపల్లి ఎస్ ఆర్ 24 న్యూస్ : అనకాపల్లి పట్టణంలో శారదా నది వంతెన కి ఆనుకొని ఉన్న అన్నమయ్య పార్కును పునరుద్ధరించాలంటూ సిద్ధార్థ సోషల్ సర్వీస్ మరియు కల్చరల్ అసోసియేషన్ అధ్యక్షులు బల్లా నాగభూషణం తో పాటు అసోసియేషన్ సభ్యులు దీనస్థితిలో ఉన్న పార్క్ ని పునరుద్ధరించాలంటూ ప్లేకార్డ్స్ ప్రదర్శించి నిరసన తెలియజేశారు. అనంతరం అనకాపల్లి జీవీఎంసీ జోనల్ కమిషనర్ చక్రవర్తికి వినతి పత్రాన్ని అందజేశారు ఈ సందర్భంగా నాగభూషణం మాట్లాడుతూ అనకాపల్లి శారదా నది ఒడ్డున ఉన్న ఆహ్లాదకరమైన వాతావరణం, పచ్చని మొక్కలతో నిండి ఉన్నటువంటి పార్కులో 21 అడుగులు ఎత్తైనటువంటి తిరుమల తిరుపతి వెంకటేశ్వర స్వామి పరమ భక్తుడైనటువంటి తాళ్లపాక అన్నమాచార్య విగ్రహాన్ని పెట్టి ప్రస్తుతం ఆ విగ్రహాన్ని సైతం అధికారులు ఎవరూ పట్టించుకోలేదని ఆవేదన వ్యక్తం చేశారు అదేవిధంగా ఆ పార్కు ప్రస్తుతం అసాంఘిక కార్యక్రమాలకి అడ్డాగా మారిందని దీనిని తక్షణమే జిల్లా కలెక్టర్ మరియు జీవీఎంసీ ప్రధాన కమిషనర్, అధికారులు వెంటనే దృష్టి సారించి ఈ పార్కును వెంటనే పునరుద్ధరించి ప్రజలకి వాడుకులోకి తీసుకురావాలని కోరారు. ఈ కార్యక్రమంలో అసోసియేషన్ కార్యదర్శి విన్నకోట నీలేష్ గుప్తా, ఉపాధ్యక్షులు కృష్ణ, రామారావు, రమణ మూర్తి, లక్ష్మి, సత్యనారాయణ తదితరులు పాల్గొన్నారు

11 months ago | [YT] | 0

SR24 NEWS

అనకాపల్లి ఎస్ ఆర్ 24 న్యూస్ : SINGERS FEST – 2025 ఘనంగా శనివారం ఏలూరులో తెలుగు సంగీత ప్రతిభకు వేదికగా నిలిచిన శ్రీ శ్రీ కళావేదిక ఆధ్వర్యంలో అంగరంగ వైభవంగా జరిగింది. గిన్నీస్ వరల్డ్ రికార్డ్స్, వరల్డ్ బుక్ ఆఫ్ రికార్డ్స్ వంటి ప్రతిష్టాత్మక గుర్తింపులతో సాగే ఈ వేడుకలో, 151వ ఈవెంట్ సందర్భంగా అనకాపల్లి పట్టణం కిచెందిన గాయకుడు, స్నేహశీలి, స్వర్ణకారుడు అయిన యండకుర్తి అప్పలరాజు గారికి “స్వర కిరీటి” జాతీయ ప్రతిభా పురస్కారం ప్రదానం చేశారు. ఈ సందర్బంగా అధ్యక్షులు పి.కల్యాణ్ మాట్లాడుతూ “సంగీతం అనేది సమాజానికి ఆనందం, ఐక్యతను అందించే శక్తివంతమైన కళ, ప్రతిభావంతులైన గాయకులను గుర్తించి సత్కరించడం ద్వారా మరింత ప్రోత్సాహం కలిగిస్తాం” అని అన్నారు. ఈ వేడుకలో పలు రాష్ట్రాల నుండి ప్రముఖ గాయకులు, సంగీత విద్వాంసులు పాల్గొని తమ గానంతో ప్రేక్షకులను అలరించారు.ఈ జాతీయ పురస్కారం కైవసం చేసుకున్నందుకు గాను పలువురు రాజకీయ ప్రముఖులు, మిత్రులు తోటి గాయకులు ఎండకుర్తి అప్పలరాజు భవిష్యత్తులో మరిన్ని ఉన్నత శిఖరాలు అధిరోహించాలని ఆకాంక్షిస్తూ అభినందనలు తెలియజేశారు.

11 months ago (edited) | [YT] | 1

SR24 NEWS

ఆపరేషన్ సిందూర్ విజయవంతం చేసిన సైనిక దళాలకు సంఘీభావంగా సీఎం చంద్రబాబు గారి నేతృత్వంలో ఘనంగా తిరంగా యాత్ర నిర్వహించనున్నారు. విజయవాడ మున్సిపల్ స్టేడియం నుంచి బెంజ్ సర్కిల్ వరకూ ర్యాలీ సాగనుంది.
#TirangaYatra
#OperationSindoor
#ChandrababuNaidu
#AndhraPradesh

1 year ago | [YT] | 7

SR24 NEWS

ఆపరేషన్ సిందూర్ అనే పేరు ఎందుకు?

బైసరాన్ లోయలోని పహల్గామ్ సమీపంలోని పర్యాటక శిబిరంపై జరిగిన ఉగ్రదాడిలో తీవ్రవాదులు కుటుంబాల్లోని పురుషులను మాత్రమే లక్ష్యంగా చేసుకున్నారు. ఈ దాడిలో ప్రాణాలు కోల్పోయిన 26 మందిలో అందరూ పురుషులే. ఈ ఘటనతో అనేక మంది మహిళలు వితంతువులుగా మిగిలిపోయారు.ఈ దారుణానికి ప్రతీకారంగా భారత సైన్యం చేపట్టిన ఆపరేషన్‌కు ‘ఆపరేషన్ సిందూర్’ అనే పేరు పెట్టడం వెనుక గొప్ప సంకేతార్థం ఉంది. “సిందూర్” భార్యగా ఉన్న మహిళ ధరించే పవిత్ర చిహ్నం. పురుషులను టార్గెట్ చేసిన దాడి వల్ల భార్యలు సింధూరాన్ని కోల్పోయినట్టైంది.ఈ నేపథ్యంలో, భారత సైన్యం ఆ మహిళలకు న్యాయం చేయడం కోసం, వారి భర్తల ప్రాణాలను పోగొట్టిన వారిపై ప్రతీకారం తీర్చడంలో భాగంగా ఈ ఆపరేషన్‌కు ‘ఆపరేషన్ సిందూర్’ అనే భావప్రధానమైన పేరు ఇచ్చింది.

1 year ago | [YT] | 4

SR24 NEWS

ఆపరేషన్ సిందూర్ లైవ్ అప్‌డేట్స్: 7-5-2025

జమ్మూలోని 5 సరిహద్దు జిల్లాల్లోని పాఠశాలలు, కళాశాలలు బుధవారం మూసివేయబడతాయి.
జమ్మూలోని ఐదు సరిహద్దు జిల్లాల్లోని అన్ని విద్యాసంస్థలు బుధవారం మూసివేయబడతాయని అధికారులు తెలిపారు. పహల్గామ్ ఉగ్రవాద దాడికి ప్రతీకారంగా, భారత సాయుధ దళాలు బుధవారం తెల్లవారుజామున పాకిస్తాన్ మరియు పాకిస్తాన్ ఆక్రమిత కాశ్మీర్‌లోని తొమ్మిది ఉగ్రవాద లక్ష్యాలపై క్షిపణి దాడులు నిర్వహించాయి, వీటిలో జైష్-ఎ-మొహమ్మద్ బలమైన బహవల్పూర్ మరియు మురిడ్కేలోని లష్కరే-ఎ-తోయిబా స్థావరం ఉన్నాయి.

"ప్రస్తుత పరిస్థితిని దృష్టిలో ఉంచుకుని, జమ్మూ, సాంబా, కథువా, రాజౌరి మరియు పూంచ్‌లోని అన్ని పాఠశాలలు, కళాశాలలు మరియు విద్యాసంస్థలు ఈ రోజు మూసివేయబడతాయి" అని డివిజనల్ కమిషనర్ రమేష్ కుమార్ Xలో తెలిపారు.

1 year ago | [YT] | 4

SR24 NEWS

భారతదేశం ఆపరేషన్ సిందూర్‌ను ప్రారంభించింది

ఇటీవల పహల్గామ్‌లో జరిగిన ఉగ్రవాద దాడిలో 25 మంది భారతీయులు మరియు ఒక నేపాలీ పౌరుడు మరణించిన నేపథ్యంలో, పాకిస్తాన్ మరియు పాకిస్తాన్ ఆక్రమిత జమ్మూ & కాశ్మీర్‌లోని ఉగ్రవాద మౌలిక సదుపాయాలను లక్ష్యంగా చేసుకుని భారతదేశం ఆపరేషన్ సిందూర్‌ను ప్రారంభించింది. తొమ్మిది ప్రదేశాలను లక్ష్యంగా చేసుకున్నట్లు ఇది పేర్కొంది మరియు న్యాయం పట్ల భారతదేశం యొక్క నిబద్ధతను నొక్కి చెబుతుంది.

1 year ago | [YT] | 1