Mana Paleru News | Telangana Politics & Local Updates
Mana Paleru News brings you the latest news, political updates, Paleru constituency developments, Telangana state politics, and local issues with truth and clarity. Stay updated with breaking news, live coverage, and analysis on leaders, elections, and public voices.

👉 Subscribe for Paleru politics, Telangana updates, Revanth Reddy, Congress and more!




Mana Paleru News

ఏదులాపురంలో కాంగ్రెస్ జయకేతనం..

నూతన మున్సిపల్ చైర్ పర్సన్ గా ఎన్నికైన పోకబత్తిన అనిత గారికి, వైస్ చైర్మన్ తమ్మినేని నవీన్ గారికి, నూతన కౌన్సిలర్లు అందరికీ హృదయపూర్వక శుభాకాంక్షలు.




#Edulapuram #MunicipalChairperson #ViceChairman #CongressVictory #JaiCongress

2 days ago | [YT] | 105

Mana Paleru News

సత్తుపల్లి మున్సిపాలిటీపై కాంగ్రెస్ జెండా...
నూతన మున్సిపల్ చైర్ పర్సన్ గా ఎన్నికైన ఎండీ రెహానా బేగం గారికి, వైస్ చైర్ పర్సన్ బొంతు సుమలత గారికి, నూతన కౌన్సిలర్లు అందరికీ హృదయపూర్వక శుభాకాంక్షలు.

#Sathupalli #SathupalliMunicipality#MunicipalChairperson #NewCouncillors #ViceChairman #CongressVictory #JaiCongress

2 days ago | [YT] | 77

Mana Paleru News

కొలువుదీరిన పురపాలక 'పాలకులు': నూతన మేయర్, చైర్మన్లకు మంత్రి పొంగులేటి శుభాకాంక్షలు

ఉమ్మడి ఖమ్మం జిల్లాలోని మున్సిపల్ కార్పొరేషన్, మున్సిపాలిటీలకు నూతనంగా ఎన్నికైన మేయర్, చైర్మన్లతో పాటు, డిప్యూటీ మేయర్, వైస్ చైర్మన్లు , నూతనంగా ప్రమాణ స్వీకారం చేసిన కౌన్సిలర్లు, కార్పొరేటర్లకు తెలంగాణ రెవెన్యూ, గృహ నిర్మాణం, సమాచార శాఖల మంత్రి పొంగులేటి శ్రీనివాస రెడ్డి గారు శుభాకాంక్షలు తెలిపారు. ప్రజాస్వామ్యబద్ధంగా ఎన్నికైన ఈ నూతన సారథులు ప్రజల నమ్మకాన్ని నిలబెట్టుకుంటూ పట్టణాల అభివృద్ధిలో క్రియాశీలక పాత్ర పోషించాలని ఆయన ఆకాంక్షించారు. ఈ మేరకు ఓ ప్రకటన విడుదల చేశారు.

కొత్తగూడెం మున్సిపల్ కార్పొరేషన్ తొలి మేయర్‌గా బాధ్యతలు చేపట్టిన మూడ్ గణేష్ (సీపీఐ), డిప్యూటీ మేయర్‌గా ఎన్నికైన సిరిపురపు లలిత (కాంగ్రెస్)లకు మంత్రి ప్రత్యేక అభినందనలు తెలియజేశారు. వీరితో పాటు ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా ఎన్నికైన మున్సిపల్ చైర్మన్లు, వైస్ చైర్మన్లను ఆయన అభినందించారు. మధిర మున్సిపల్ చైర్మన్ సామినేని సుజాత, వైస్ చైర్మన్ కోట ధనమూర్తి, సత్తుపల్లి చైర్మన్ రెహానా బేగం, వైస్ చైర్మన్ బొంతు సుమలత, వైరా చైర్మన్ కాపా చంద్రకళ, వైస్ చైర్మన్ కట్ల సంతోష్, అశ్వారావుపేట చైర్మన్ జూపల్లి శశికళ, వైస్ చైర్మన్ జూపల్లి రమేష్, ఏదులాపురం చైర్మన్ పోకబత్తిని అనిత, వైస్ చైర్మన్ తమ్మినేని నవీన్, కల్లూరు మున్సిపల్ చైర్మన్ ధరావత్ మోహన్ నాయక్, వైస్ చైర్మన్ శీలం కోటేశ్వరిలకు మంత్రి పొంగులేటి శుభాకాంక్షలు తెలుపుతూ.. వారంతా ప్రజలకు అందుబాటులో ఉంటూ ఆదర్శవంతమైన పాలన అందించాలని సూచించారు.

పట్టణాల్లోని ప్రతి వార్డు, డివిజన్ అభివృద్ధి చెందాలంటే కౌన్సిలర్లు, కార్పొరేటర్లతో కూడిన పూర్తి పాలకవర్గం పాత్ర అత్యంత కీలకమని పేర్కొన్నారు. ప్రజలు తమపై ఉంచిన నమ్మకాన్ని వమ్ము చేయకుండా వార్డులు, డివిజన్లలోని మౌలిక సదుపాయాల కల్పన, పారిశుధ్యం, తాగునీటి సమస్యల పరిష్కారమే ధ్యేయంగా నూతన పాలకవర్గాలు పనిచేయాలని ఆయన సూచించారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నాయకత్వంలో పట్టణ ప్రాంతాల సమగ్ర అభివృద్ధికి ప్రభుత్వం అన్ని విధాలా సహకరిస్తుందని మంత్రి పొంగులేటి హామీ ఇచ్చారు.


#MunicipalCorporation #kothagudem #Khammam #congresscorporators #municipalchairmen

2 days ago | [YT] | 63

Mana Paleru News

మైరా మురిపెంలో.. పరమశివుని చెంత మంత్రి పొంగులేటి దంపతులు
- ​ముక్కంటి సన్నిధిలో ఆధ్యాత్మిక పర్యటన
- ​తీర్థాల, కూసుమంచి, బెండాలపాడు క్షేత్రాల్లో కుటుంబ సమేతంగా పూజలు
- ​వేద ఆశీర్వచనాల మధ్య మంత్రి దంపతులకు ఆలయాల్లో ఘన స్వాగతం
మహాశివరాత్రి పర్వదినం వేళ ముక్కంటి చెంత భక్తి పారవశ్యం వెల్లివిరిసింది. తెలంగాణ రెవెన్యూ, గృహ నిర్మాణం, సమాచార శాఖల మంత్రి పొంగులేటి శ్రీనివాస రెడ్డి, మాధురి దంపతులు తమ ముద్దుల మనుమరాలు మైరాతో కలిసి ఆదివారం ఉమ్మడి జిల్లాలోని ప్రసిద్ధ శైవక్షేత్రాలను సందర్శించారు. పసిప్రాయంలోనే భక్తిభావంతో స్వామివారిని దర్శించుకుంటున్న మైరా మురిపెంలో మంత్రి కుటుంబ సభ్యులు ఆధ్యాత్మికంలో మునిగితేలారు. లోక కల్యాణాన్ని కాంక్షిస్తూ సాగిన ఈ పర్యటనలో మంత్రి దంపతులకు ఆలయ అధికారులు, అర్చకులు పూర్ణకుంభంతో స్వాగతం పలికి శేషవస్త్రాలతో ఘనంగా సత్కరించారు.
​తీర్థాల, కూసుమంచిలో ఆధ్యాత్మిక వెలుగులు
​మంత్రి కుటుంబం తొలుత పాలేరు నియోజకవర్గంలోని ఖమ్మం రూరల్ మండలం తీర్థాల శ్రీ సంగమేశ్వర స్వామి వారిని దర్శించుకుంది. త్రివేణి సంగమ క్షేత్రంలో వెలసిన స్వామివారికి అభిషేకాలు నిర్వహించి ప్రత్యేక పూజలు చేశారు. మనుమరాలు మైరాతో కలిసి మంత్రి దంపతులు పూజల్లో పాల్గొన్న దృశ్యం ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. అనంతరం చారిత్రక ప్రసిద్ధి గాంచిన కూసుమంచి శ్రీ గణపేశ్వర స్వామి ఆలయానికి చేరుకున్నారు. కాకతీయుల శిల్పకళా వైభవానికి నిలువుటద్దంగా నిలిచే ఈ క్షేత్రంలో స్వామివారిని దర్శించుకుని వేద పండితుల ఆశీర్వచనాలు అందుకున్నారు.
​బెండాలపాడు వీరభద్రుడికి నీరాజనం
​పర్యటనలో భాగంగా అశ్వారావుపేట నియోజకవర్గం చండ్రుగొండ మండలం బెండాలపాడులోని పల్లెర్లబావి శ్రీ వీరభద్రస్వామి వారిని మంత్రి దంపతులు సందర్శించారు. ఆలయ ప్రాంగణంలో మంత్రి దంపతులతో పాటు చిన్నారి మైరాకు అర్చకులు ఆత్మీయ స్వాగతం పలికారు. వీరభద్రుడి సన్నిధిలో భక్తిప్రపత్తులతో నిర్వహించిన విశేష పూజల్లో పాల్గొన్నారు.
​రాష్ట్రం సుభిక్షంగా ఉండాలి..
​దర్శనానంతరం మంత్రి పొంగులేటి శ్రీనివాస రెడ్డి మాట్లాడుతూ.. "మహాశివరాత్రి పర్వదినాన రాష్ట్ర ప్రజలందరూ ఆయురారోగ్యాలతో, ఐశ్వర్యాలతో విరాజిల్లాలని, తెలంగాణ రాష్ట్రం పాడిపంటలతో సుభిక్షంగా ఉండాలని ఆ పరమశివుడిని వేడుకున్నాను" అని తెలిపారు. ఈ పర్యటనలో స్థానిక ప్రజాప్రతినిధులు, వివిధ శాఖల అధికారులు, స్థానిక కాంగ్రెస్ పార్టీ నాయకులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.


#MahaShivaratri #harharmahadev #ministerponguletisrinivasreddy

3 days ago | [YT] | 98

Mana Paleru News

🔹పురపోరులో ‘పొంగులేటి’ మ్యాజిక్
🔹10 రోజుల్లో.. 249 వార్డుల్లో ప్రచారం
🔹70 శాతం సక్సెస్ రేటుతో 174 వార్డుల్లో గెలుపు
🔹శీనన్న వ్యూహంతో ఉమ్మడి ఖమ్మం, ఉమ్మడి వరంగల్ పురపాలికల్లో హస్తం ప్రభంజనం!
మున్సిపల్ ఎన్నికల కురుక్షేత్రంలో మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి (శీనన్న) ఒక అజేయ శక్తిగా నిలిచారు. ముఖ్యమంత్రి రేవంతన్న అప్పగించిన బాధ్యతను సవాలుగా తీసుకున్న ఆయన, తన వ్యూహ చతురతతో ఫలితాలను తలకిందులు చేశారు. కేవలం అంకెలే కాదు.. ఆ అంకెల వెనుక ఉన్న ఆయన కష్టం, ప్రచారం ఇప్పుడు రాష్ట్ర రాజకీయాల్లో హాట్ టాపిక్‌గా మారింది. కేవలం 10 రోజుల్లోనే అసాధ్యమనుకున్న సమీకరణాలను సుసాధ్యం చేసి చూపారు.
ఉమ్మడి ఖమ్మం జిల్లా: శీనన్న అడ్డాలో తిరుగులేని హవా!
తన సొంత గడ్డపై మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి గాలివాటం కాదు.. సునామీ సృష్టించారు. ఉమ్మడి ఖమ్మం జిల్లాలోని మున్సిపాలిటీల్లో ఆయన అడుగుపెట్టిన ప్రతిచోటా కాంగ్రెస్ జెండా రెపరెపలాడింది.
ఏదులాపురం: 32 వార్డుల్లో ఏకంగా 24 చోట్ల జయకేతనం ఎగురవేసి సత్తా చాటారు.
కొత్తగూడెం కార్పొరేషన్: సింగరేణి హృదయంలో 22 స్థానాలను కైవసం చేసుకున్నారు.
కల్లూరు & సత్తుపల్లి: కల్లూరులో 12, సత్తుపల్లిలో 17 వార్డులను హస్తం ఖాతాలో వేశారు.
ఇల్లందు & అశ్వారావుపేట: ఇక్కడ కూడా ఇల్లందులో 19, అశ్వారావుపేటలో 17 స్థానాల్లో గెలిచి తన పట్టును నిరూపించుకున్నారు.
ఓరుగల్లు కోటపై హస్తం జైత్రయాత్ర!
రేవంతన్న ఆశీస్సులతో ఉమ్మడి వరంగల్ జిల్లా బాధ్యతలను స్వీకరించిన శీనన్న, అక్కడ కూడా ప్రత్యర్థుల కోటలను బద్ధలు కొట్టారు.
భూపాలపల్లి: అత్యంత కీలకమైన ఈ మున్సిపాలిటీలో 16 వార్డులను గెలుచుకుని పట్టు సాధించారు.
పరకాల & స్టేషన్ ఘన్‌పూర్: పరకాలలో 13, స్టేషన్ ఘన్‌పూర్‌లో 13 స్థానాలను గెలిపించి జిల్లాలో కాంగ్రెస్ ప్రాభవాన్ని చాటారు.
గణాంకాలే సాక్ష్యం: 249 వార్డుల ప్రచారం.. 174 స్థానాల్లో విజయం!
మొత్తంగా మంత్రి పొంగులేటి ప్రచారం నిర్వహించిన 249 వార్డుల్లో కాంగ్రెస్ పార్టీ 174 స్థానాలను గెలుచుకుంది. అంటే సుమారు 70 శాతం గెలుపు రేటుతో ఆయన 'మోస్ట్ సక్సెస్‌ఫుల్' లీడర్‌గా నిలిచారు. పగలు రేయి ఏకంచేసి ఆయన సాగించిన సుడిగాలి పర్యటనలు, రేవంతన్న సంక్షేమ పథకాలపై ప్రజలకు కల్పించిన భరోసా ఓట్ల వర్షంగా కురిసింది. మాట ఇస్తే తప్పని నైజంతో, అభివృద్ధిపై ఉన్న నిబద్ధతతో శీనన్న ప్రజాప్రభుత్వంలో తన మార్క్ రాజకీయాలను మరోసారి చాటిచెప్పారు.


#CongressVictory #MunicipalElectionResults #TelanganaCongress

4 days ago | [YT] | 86

Mana Paleru News

ఈ గెలుపునకు అహర్నిశలు కృషి చేసిన నా కాంగ్రెస్ పార్టీ కుటుంబ సభ్యులు, నాయకులకు పేరుపేరునా ధన్యవాదాలు..

నా ఏదులాపురం పట్టణ ప్రజలకు హృదయపూర్వక కృతజ్ఞతలు.

-పొంగులేటి శ్రీనివాసరెడ్డి, రాష్ట్ర రెవెన్యూ, హౌసింగ్, సమాచార శాఖ మంత్రి వర్యులు


#ponguletisrinivasreddy #ministerponguleti #yedulapurammunicipality #yedulapuramcongress #TelanganaCongress

4 days ago | [YT] | 81

Mana Paleru News

పురపోరులో ప్రజాప్రభుత్వానికి పట్టం కట్టిన ప్రజలకు హృదయపూర్వక కృతజ్ఞతలు
-మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు



#ponguletisrinivasareddy #yedulapurammunicipality #yedulapuram #paleru #khammam #TelanganaCongress #Telangana

5 days ago | [YT] | 106

Mana Paleru News

బరిగీసి గెలిచిన భూపాలపల్లి ....
పొంగులేటి శీనన్న ప్రచారం పురపోరులో కాంగ్రెస్ కైవసం..


#Bhupalpally #ministerponguletisrinivasreddy #CongressVictory
#CongressWave #MassLeader

5 days ago | [YT] | 60

Mana Paleru News

షేక్ చేసిన స్టేషన్ ఘనపూర్ ఫలించిన పార్టీ వ్యూహం కలిసొచ్చిన పొంగులేటి ప్రచారం కాంగ్రెస్ దే ఘన విజయం


#StationGhanpur #PonguletiSrinivasReddy #CongressVictory
#CongressWave #MassLeader

5 days ago | [YT] | 89

Mana Paleru News

జయం మనదే..
ఏదులాపురంలో ఎదురు లేదు.. శీనన్నకు తిరుగులేదు..
పాలేరు గడ్డ.. పొంగులేటి అడ్డ


#ponguletisrinivasareddy #yedulapurammunicipality #yedulapuram #paleru #khammam #TelanganaCongress #Telangana

5 days ago | [YT] | 116