నీ కల ,నీ ప్రపంచం. దరిచెరని గమ్యాలు ఎన్ని ఉన్నా సాగిపో తోడున్నా లేకున్నా... గమ్యం వైపు 💜💙♥️💚🖤💚💜💚❤️💜💙🖤💚💜💙


DK TIMES

24 ఏళ్ళ సుదీర్ఘ నిరీక్షణకు తెర.. న‌టి ప్రత్యూష కేసులో నిందితుడు లొంగిపోవాలని సుప్రీం ఆదేశం !!

సుమారు రెండు దశాబ్దాల క్రితం తెలుగు చలనచిత్ర పరిశ్రమతో పాటు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో పెను సంచలనం సృష్టించిన నటి ప్రత్యూష మృతి కేసులో సుప్రీంకోర్టు కీలకమైన తుది తీర్పును వెలువరించింది. ఈ కేసులో ప్రధాన నిందితుడు గుడిపల్లి సిద్ధార్థరెడ్డికి గతంలో హైకోర్టు విధించిన రెండేళ్ల జైలు శిక్షను సుప్రీంకోర్టు సమర్థించింది. హైకోర్టు తీర్పును సవాల్ చేస్తూ సిద్ధార్థరెడ్డి దాఖలు చేసిన పిటిషన్‌ను అత్యున్నత న్యాయస్థానం కొట్టివేస్తూ.. వెంటనే ఆయన నాలుగు వారాల్లోగా సంబంధిత అధికారుల ముందు లొంగిపోవాలని స్పష్టమైన ఆదేశాలు జారీ చేసింది.

వివరాల్లోకి వెళ్తే.. నటి ప్రత్యూష, సిద్ధార్థరెడ్డి హైదరాబాద్‌లో ఇంటర్మీడియట్ చదువుతున్న సమయం నుంచి ప్రేమించుకున్నారు. ఆ తర్వాత ప్రత్యూష సినీ రంగంలో స్థిరపడగా, సిద్ధార్థరెడ్డి ఇంజినీరింగ్‌లో చేరాడు. అయితే 2002 ఫిబ్రవరి 23న వీరిద్దరూ విషం తాగిన స్థితిలో ఒక ప్రైవేటు ఆసుపత్రిలో చేరారు. మరుసటి రోజు అంటే ఫిబ్రవరి 24న చికిత్స పొందుతూ ప్రత్యూష మరణించగా, సిద్ధార్థరెడ్డి కోలుకుని మార్చి 9న డిశ్చార్జి అయ్యాడు. కూల్‌డ్రింక్‌లో పురుగుమందు కలుపుకుని తాగడం వల్లే ప్రత్యూష మరణించినట్లు వైద్య పరీక్షల్లో తేలింది. అప్పట్లో ఆమెపై లైంగిక దాడి జరిగిందన్న ఆరోపణలు వచ్చినప్పటికీ.. ప్రభుత్వం నియమించిన వైద్య బృందం వాటిని తోసిపుచ్చింది.

అయితే ఈ కేసును దర్యాప్తు చేసిన సీబీఐ.. సిద్ధార్థరెడ్డిపై ఆత్మహత్యకు పురికొల్పడం, ఆత్మహత్యకు యత్నించడం వంటి సెక్షన్ల కింద అభియోగాలు నమోదు చేసింది. దీనిపై విచారణ జరిపిన హైదరాబాద్ మెట్రోపాలిటన్ సెషన్స్ కోర్టు 2004లో ఆయనకు ఐదేళ్ల కఠిన కారాగార శిక్ష విధించింది. అనంతరం సిద్ధార్థరెడ్డి హైకోర్టును ఆశ్రయించగా, 2011లో కోర్టు ఆ శిక్షను రెండేళ్లకు తగ్గిస్తూ జరిమానాను పెంచింది. ఈ తీర్పుపై ఇటు సిద్ధార్థరెడ్డి, అటు ప్రత్యూష తల్లి సరోజినీదేవి 2012లో సుప్రీంకోర్టులో అప్పీలు చేశారు. సుదీర్ఘ కాలం పాటు సాగిన ఈ న్యాయపోరాటంలో అన్ని అంశాలను పరిశీలించిన సుప్రీంకోర్టు, చివరకు హైకోర్టు విధించిన శిక్షనే ఖరారు చేస్తూ ఈ సంచలన తీర్పును వెలువరించింది.

5 months ago | [YT] | 10

DK TIMES

Happy New Year 2026

కొత్త ఆశలు, ఆకాంక్షలతో మరో సంవత్సరం ప్రారంభానికి
ఉత్సాహంగా అడుగు వేస్తున్న ప్రజలందరికీ సుభసంతోషాలతో
ఉండేలా దీవించాలనే భగవంతుని ప్రార్థన….
తెలంగాణ రాష్ట్ర సర్వతోముఖాభివృద్ధికి జరుగుతున్న
ప్రయత్నాలు ఫలించాలని ఆకాంక్షిస్తూ…

తెలంగాణ రాష్ట్ర ప్రజలందరికీ
నూతన సంవత్సర శుభాకాంక్షలు

6 months ago | [YT] | 2

DK TIMES

కాంగ్రెస్ ప్రభుత్వం బీసీలకు ఇచ్చిన 17% రిజర్వేషన్ ను మీరు సమర్ధిస్తారా?

8 months ago | [YT] | 2

DK TIMES

కాంగ్రెస్ ప్రభుత్వం బీసీలకు ఇచ్చిన 17% రిజర్వేషన్ ను మీరు సమర్ధిస్తారా?

8 months ago | [YT] | 1

DK TIMES

జూబ్లీహిల్స్ బై ఎలక్షన్స్లో గెలువు ఎవరిది?
A- BRS
B- CONGRESS
C- BJP

9 months ago | [YT] | 2

DK TIMES

"పూల పండుగ బతుకమ్మ శోభతో తెలంగాణ ప్రతీ ఇంటా సంతోషం, శాంతి, ఐశ్వర్యం నెలకొనాలి. బతుకమ్మ పండుగ శుభాకాంక్షలు

10 months ago | [YT] | 6

DK TIMES

🕉️🕉️మీకు మీ కుటుంబ సభ్యులకు, మిత్రులకు, శ్రేయోభిలాషులకు వినాయక చవితి శుభాకాంక్షలు 🕉️🕉️💐💐💐 ‪@DKTIMESTELUGU‬

11 months ago | [YT] | 1

DK TIMES

కౌసల్య కాలనీ మద్దెలకుంట చెరువు పునరుజ్జీవానికి కాలనీ అసోసియేషన్ స్వచ్ఛంద కృషి
పార్క్ అభివృద్ధికి ప్రజల సహకారంతో ముందడుగు

కౌసల్యా కాలనీ, బాచుపల్లి:
మానవతా విలువలకు ప్రతీకగా, సామూహిక బాధ్యతకు నిదర్శనంగా, కౌసల్యా కాలనీ వాసులు మరోసారి తమ సంఘటిత శక్తిని చాటారు. ప్రభుత్వ మద్దతు లేకుండానే, స్వచ్ఛందంగా విరాళాలు సేకరించి మద్దెలకుంట చెరువును శుభ్రపరచడం, లోతు పెంచడం, పక్కనే ఉన్న పార్క్‌లో వాకింగ్ ట్రాక్ మరమ్మతులు, పచ్చదనం వృద్ధి, ఆటస్థలాల ఏర్పాట్లను విజయవంతంగా చేపట్టారు.

కౌసల్యా కమ్యూనిటీ వెల్ఫేర్ అసోసియేషన్ (KCWA) ఆధ్వర్యంలో, కాలనీలోని దాతలు మరియు అక్కడి నివాసితుల సహకారంతో ఈ కార్యక్రమం జరగడం గర్వకారణం. చెరువుకు జీవం పోసిన ఈ చర్యతో నీటి నిల్వ సామర్థ్యం పెరిగి, వర్షాకాలంలో మంచినీటి నిల్వకు ఇది ఎంతగానో దోహదపడనుంది.

ఇక పార్క్ సుందరీకరణలో భాగంగా, వాకింగ్ ట్రాక్ మరమ్మతులు, చెత్త తొలగింపు, చెట్లు మరియు మొక్కల పెంపకం, పిల్లల ఆట ప్రాంతాల అభివృద్ధి కూడా జరిగింది. పార్క్ ఇప్పుడు చిన్నాపెద్దలందరికీ ఆరోగ్యకరమైన విశ్రాంతి స్థలంగా మారింది.

గత 10 సంవత్సరాలుగా కాలనీ అసోసియేషన్ ఆధ్వర్యంలోనే పార్కుల్లో పిల్లల ఆట వస్తువుల ఏర్పాటుతో పాటు వాటి నిర్వహణ, పారిశుద్ధ్య పనులు, చెట్ల పెంపకం జరగడం విశేషం. గత 3 సంవత్సరాలలో మూడుపార్కు స్థలాలను కబ్జాలకు గురికాకుండా కాలనీవాసుల సంఘటిత చొరవతో,పోరాటాలతో కాపాడి ఆ మూడు పార్కులలో ఆట వస్తువులు ఏర్పాటు చేసి మరియూ పార్కు స్థలాలకు కంచెలు వేసి పరిరక్షించుకోవటం జరిగింది. ఒక పార్కు స్థలంలో గుడి నిర్మాణం చేసుకోవటం జరిగింది.

నగరమంతా కాంక్రీట్ మయమయీ పచ్చదనం కొరవడుతున్న సమయంలో రాజకీయ నాయకుల బెదిరింపులను, కేసులను ఎదుర్కొంటూ, కాలనీ లో ఉన్న పార్క్ స్థలాలను కాపాడుకొంటూ కౌసల్య కాలనీ అసోసియేషన్ ముందుకు వెలుతూ నగరంలోని ఇతర కాలనీలకు ఒక ఆదర్శంగా నిలుస్తోంది

1 year ago | [YT] | 1

DK TIMES

చేతి రేఖలను కాల్చితే కీడు పోతుందనే మూఢ నమ్మకంతో ఏడాదిన్నర మనవడిపై పగ పెంచుకున్న నాయనమ్మ..

ఇంట్లో ఎవరూ లేని సమయం చూసి..చేతికి హీటర్ తో వాత పెట్టింది..

గుంటురు జిల్లాలో దారుణ ఘటన వెలుగు చూసింది.

ఇతరులు చెప్పిన మాటలు విని మూడనమ్మకంతో ఓ వృద్దురాలు తన మనవడి చేతిని కాల్చేసింది.

ఆ తర్వాత హీటర్‌ పట్టుకోవడంతో బాలుడి చేతు కాలినట్టు క్రియేట్‌ చేసింది.

బాలుడి తండ్రి వైద్యులను స్పందించడంతో అసలు విషయం వెలుగులోకి వచ్చింది.

తల్లిదండ్రి ఇద్దరూ కూలీ పనిచేసుకుంటారు. గుంటూరులోని నెహ్రూ నగర్‌లో నివాసం ఉంటారు. వీరికి ఏడాదిన్నర వయస్సున్న కొడుకు ఉన్నాడు

బాలుడి పుట్టిన కొద్ది కాలానికే పెద నాన్న చనిపోయాడు. పెదనాన్న చనిపోవడానికి బాలుడి జాతకమే కారణమని ఎవరో ఆమెకు చెప్పారు. వారి చెప్పుడు మాటలను నాయనమ్మ పూర్తిగా తలకెక్కించుకుంది. అప్పటి నుండి బాలుడిపై కోపం పెంచుకుంది. తల్లిదండ్రులు ఇద్దరూ లేని సమయం చూసి పొయ్యి మంటలపై బాలుడి చేయి ఉంచింది.. చేతి రేఖలను కాల్చితే కీడు ఉండదని మూర్ఖంగా నమ్మి మంటల్లో బాలుడి చేయి కాలింది. అయితే ఈ విషయాన్ని దాచి పెట్టిన నాయనమ్మ వాటర్ హీటర్ పట్టుకోవడంతోనే బాలుడి చేయి కాలిపోయిందని ఆబద్దం ఆడింది.

కాగా హీటర్ పట్టుకోవడం వల్ల ప్రమాదం జరగలేదని, ఎవరో కాల్చినట్టు ఉందని వైద్యులు చెప్పడం

1 year ago | [YT] | 0

DK TIMES

ఈటెల వ్యాఖ్యలపై ఎవరూ స్పందించవద్దు

అన్నీ విషయాలు అధిష్టానం చూసుకుంటుంది - బండి సంజయ్

1 year ago | [YT] | 0