K MEDIA Telugu LIVE is your trusted 24/7 Telugu news destination, bringing you the latest updates from Andhra Pradesh, Telangana, and around the world. Stay tuned for breaking news, political developments, entertainment buzz, sports highlights, crime reports, and business updates — all in Telugu.
As one of the most subscribed Telugu news channels on YouTube, K MEDIA is committed to delivering accurate, fast, and reliable information – anytime, anywhere.
------------------------------------------
Subscribe K MEDIA Telugu Live for Today Latest Telugu News Live
Subscribe For Telugu News ► youtube.com/@kmedia-0501?si=nS5c9WBR6O1SYnfW
Disclaimer:
All audio copyrights are property of the rightful owners.
No copyright infringement intended.
The contents of this video is only for non-commercial and non-profit use.
K MEDIA
Happy republic day 🇮🇳🇮🇳🇮🇳🇮🇳
3 weeks ago | [YT] | 5
View 0 replies
K MEDIA
మన శంకర వరప్రసాద్ గారు, రాజసాబ్ ఈ రెండు సినిమాలలో నీకు నచ్చిన సినిమా పేరు కాల్ చేయండి...?
1 month ago | [YT] | 2
View 0 replies
K MEDIA
జూబ్లీహిల్స్ బై ఎలక్షన్లలో ఏ పార్టీ గెలుస్తుంది..? ఏ పార్టీకి ఎంత మెజార్టీ వస్తుంది.? మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలుపగలరు..
3 months ago | [YT] | 119
View 23 replies
K MEDIA
*పాలకుర్తి నియోజకవర్గం తేదీ: 23-10-2025..*
======================
*అసత్య ప్రచారాలను ఎండగట్టాలి, ప్రభుత్వ పథకాలను ప్రజలకు వివరించాలి, స్థానిక ఎన్నికలలో గెలుపే లక్ష్యంగా పని చేయాలి..*
*రాయపర్తి మండల సోషల్ మీడియా కోఆర్డినేటర్లకు దిశా నిర్దేశం చేసిన టిపిసిసి వైస్ ప్రెసిడెంట్ ఝాన్సీ రెడ్డి గారు..*
నేడు రాయపర్తి మండల కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో నిర్వహించిన మండల స్థాయి సోషల్ మీడియా సమీక్ష సమావేశంలో పాల్గొన్ని రాయపర్తి మండల సోషల్ మీడియా కోఆర్డినేటర్లకు,దిశా నిర్దేశం చేసిన *గౌరవ పాలకుర్తి నియోజకవర్గ ఇన్చార్జ్ మరియు టిపిసిసి వైస్ ప్రెసిడెంట్ శ్రీమతి ఝాన్సీ రాజేందర్ రెడ్డి గారు..*
*సమావేశానికి విచ్చేసిన ఝాన్సీ రాజేందర్ రెడ్డి గారికి సోషల్ మీడియా కోఆర్డినేటర్లు శాలువాలతో సత్కరింఛీ ఘన స్వాగతం పలికారు..*
ఝాన్సీ రెడ్డి గారు ప్రభుత్వ పథకాల పై ప్రజల్లో వస్తున్న స్పందన మరియు పార్టీ బలోపేతం స్థానిక సంస్థల ఎన్నికలలో కాంగ్రెస్ పార్టీ సోషల్ మీడియా కోఆర్డినేటర్లు అనుసరించవలసిన వ్యూహాల పై దిశా నిర్దేశం చేశారు.
*ఈ సందర్భంగా టిపిసిసి వైస్ ప్రెసిడెంట్ గారు మాట్లాడుతూ...* ప్రభుత్వ పథకాలను ప్రజల్లో వివరించి,రానున్న స్థానిక సంస్థల్లో గెలుపే లక్ష్యంగా నాయకులందరూ కలిసికట్టుగా పని చేయాలని టిపిసిసి వైస్ ప్రెసిడెంట్ ఝాన్సీ రాజేందర్ రెడ్డీ అన్నారు, సోషల్ మీడియా మాధ్యమాలలో వస్తున్న అసత్య ప్రచారాలు ఎండగట్టాలని, ప్రజలందరికీ ప్రభుత్వ పథకాల వివరించాలన్నారు ,ప్రజలందరికీ ప్రభుత్వ పథకాల వివరించాలన్నారు, కాంగ్రెస్ ప్రజా ప్రభుత్వo నిజమైన లబ్దిదారులకే పథకాలు అందిస్తుందని, ఎన్నికలు ఏదైనా గెలుపు కాంగ్రెస్ పార్టీ దే అని ధీమా వ్వక్తం చేశారు..
*ఝాన్సీ రాజేందర్ రెడ్డి గారి వెంట ఈ కార్యక్రమంలో..* తొర్రూర్ బ్లాక్ అధ్యక్షుడు జాటోత్ హమ్య నాయక్, మండల పార్టీ అధ్యక్షుడు ఈదులకంటి రవీందర్ రెడ్డి, మండల సోషల్ మీడియా కోఆర్డినేటర్ బండి రాజేంద్రప్రసాద్, రాయపర్తి టౌన్ కోఆర్డినేటర్ ఉబ్బని నవీన్, మండల కోఆర్డిటర్ మండల కో కో ఆర్డినేటర్ కో కో-ఆర్డినేటర్ గుగులోత్ వెంకన్న మరియు అన్ని గ్రామాల కోఆర్డినేటర్లు పాల్గొన్నారు..
3 months ago | [YT] | 41
View 0 replies
K MEDIA
*పాలకుర్తి నియోజకవర్గం తేదీ: 22-10-2025..*
======================
*పాలకుర్తి మండలంలో సోషల్ మీడియా సమీక్షా సమావేశం..*
పాలకుర్తి మండల కేంద్రంలో ఈరోజు టీపీసీసీ వైస్ ప్రెసిడెంట్ శ్రీ రాజేందర్ రెడ్డి గారు పాలకుర్తి మరియు కొడకండ్ల మండలాల సోషల్ మీడియా కోఆర్డినేటర్లతో సమీక్షా సమావేశం నిర్వహించారు..
ఈ సందర్భంగా *టీపీసీసీ వైస్ ప్రెసిడెంట్ శ్రీమతి ఝాన్సి రాజేందర్ రెడ్డి గారు మాట్లాడుతూ..* పార్టీ బలోపేతానికి సోషల్ మీడియా ఒక ముఖ్యమైన ఆయుధమని, కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వ కార్యక్రమాలు, ప్రజా సంక్షేమ పథకాలు, ఎమ్మెల్యే శ్రీమతి యశస్విని రెడ్డి గారి ఆధ్వర్యంలో జరుగుతున్న అభివృద్ధి పనులను ప్రజలకు చేరవేయడం ప్రతి సోషల్ మీడియా కార్యకర్త ధర్మమని పేర్కొన్నారు. ప్రజలతో నిత్యం మమేకమవుతూ, వాస్తవాలను స్పష్టంగా వివరించడం ద్వారా పార్టీపై నమ్మకాన్ని పెంపొందించాలి. తప్పుడు ప్రచారాలను సమర్థంగా ఎదుర్కొని, కాంగ్రెస్ పార్టీ తీరును సజీవంగా చూపించాలి, అని సూచించారు..
సమీక్ష సమావేశంలో సోషల్ మీడియా కార్యకలాపాలపై చర్చ జరగడంతో పాటు, భవిష్యత్తు వ్యూహాలపై దిశానిర్దేశం చేశారు. ప్రతి మండలంలో సమన్వయం బలోపేతం చేస్తూ, కార్యకర్తల మధ్య సమాచార పంచుకోవడాన్ని వేగవంతం చేసే నిర్ణయాలు తీసుకున్నారు.
ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు, సోషల్ మీడియా మండల గ్రామ కోఆర్డినేటర్లు, మరియు యువకార్యకర్తలు పాల్గొన్నారు. సమావేశం ఉత్సాహభరితంగా సాగింది..
3 months ago | [YT] | 36
View 0 replies
K MEDIA
*పాలకుర్తి నియోజకవర్గం తేదీ: 21-10-2025..*
======================
*దేవరుప్పుల మండలంలో రైతులకు విత్తనాల పంపిణీ – రైతు సంక్షేమమే ప్రభుత్వ లక్ష్యం ఎమ్మెల్యే యశస్విని రెడ్డి గారు..*
పాలకుర్తి నియోజకవర్గంలోని దేవరుప్పుల మండల కేంద్రంలో రైతు వేదిక ప్రాంగణంలో జాతీయ స్థాయిలో అమలు అవుతున్న జాతీయ ఆహార భద్రత మరియు పోషణ మిషన్ (ప్యాడీ) మరియు జాతీయ నూనెగింజల మిషన్ (గ్రౌండ్నట్) కార్యక్రమాల కింద రైతులకు విత్తనాలను పంపిణీ చేసిన పాలకుర్తి శాసన సభ్యురాలు శ్రీమతి యశస్విని రెడ్డి గారు..
ఈ సందర్భంగా *ఎమ్మెల్యే యశస్విని రెడ్డి గారు మాట్లాడుతూ..* రైతుల సంక్షేమం కోసం ప్రభుత్వం నిరంతరం కృషి చేస్తోందని తెలిపారు. రైతు దేశానికి వెన్నెముక. రైతు బలంగా ఉంటేనే గ్రామీణ ఆర్థిక వ్యవస్థ బలోపేతం అవుతుంది. అందుకే ప్రభుత్వం వివిధ పథకాల ద్వారా రైతులకు మద్దతుగా నిలుస్తోంది,” అని వారు పేర్కొన్నారు. రైతులు పండించే ప్రతి గింజకు విలువ దక్కేలా చర్యలు తీసుకుంటామని యశస్విని రెడ్డి గారు హామీ ఇచ్చారు. నాణ్యమైన విత్తనాల పంపిణీతో పాటు వ్యవసాయ పద్ధతులపై రైతులకు అవగాహన కల్పించడం ద్వారా దిగుబడులు పెంచడం లక్ష్యమని తెలిపారు. అలాగే రైతులు ఈ పథకాలను సమర్థవంతంగా వినియోగించుకోవాలని, ప్రభుత్వం అందిస్తున్న సబ్సిడీలు, మద్దతు ధరలు, మరియు సాంకేతిక సాయం ద్వారా తమ వ్యవసాయాన్ని మరింత లాభదాయకంగా మార్చుకోవాలని సూచించారు. పాలకుర్తి నియోజకవర్గంలోని ప్రతి రైతు సంతోషంగా, స్వావలంబిగా ఉండడం నా లక్ష్యం. రైతులకు అవసరమైన సహకారం అందించడానికి ఎల్లప్పుడూ నేను ముందుంటాను. రైతు కష్టానికి గౌరవం దక్కేలా కృషి చేస్తాం,” అని అన్నారు.
ఈ కార్యక్రమంలో వ్యవసాయ శాఖ అధికారులు, మండల వ్యవసాయ అధికారి, స్థానిక ప్రజాప్రతినిధులు, కాంగ్రెస్ పార్టీ నాయకులు, సొసైటీ సభ్యులు, రైతు సంఘాల ప్రతినిధులు మరియు భారీ సంఖ్యలో రైతులు పాల్గొన్నారు..
3 months ago | [YT] | 36
View 0 replies
K MEDIA
జూబ్లీహిల్స్ బై ఎలక్షన్లలో అధిక మెజారిటీతో గెలిచి పార్టీ ఏది మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలుపగలరు...?
4 months ago | [YT] | 15
View 2 replies
K MEDIA
*పాలకుర్తి నియోజకవర్గం తేదీ: 12-10-2025..*
======================
*జనగామ జిల్లా కాంగ్రెస్ కమిటీ అధ్యక్ష ఎన్నికల ప్రక్రియలో భాగంగా సంఘటన్ సృజన్ అభియాన్ – తెలంగాణ కార్యక్రమం పాలకుర్తి క్యాంపు కార్యాలయంలో ఘనంగా జరిగింది..*
జనగామ జిల్లా కాంగ్రెస్ కమిటీ అధ్యక్ష ఎన్నికల ప్రక్రియలో భాగంగా, సంఘటన్ సృజన్ అభియాన్ – తెలంగాణ కార్యక్రమం థీమ్తో టీపీసీసీ ఆదేశాల మేరకు పాలకుర్తి శాసన సభ్యురాలు శ్రీమతి యశస్విని రెడ్డి గారి ఆధ్వర్యంలో ఈరోజు వారి క్యాంపు కార్యాలయంలో సమావేశం ఘనంగా నిర్వహించబడింది..
ఈ కార్యక్రమం యొక్క ముఖ్య ఉద్దేశ్యం ప్రజల నుండి వచ్చిన నాయకత్వాన్ని ప్రజల ద్వారానే ఎంపిక చేయడం. కాంగ్రెస్ పార్టీ ఆత్మలోని ఈ ప్రజాస్వామ్య స్పూర్తిని నిలబెట్టే ప్రయత్నంగా ఈ కార్యక్రమం రాష్ట్రవ్యాప్తంగా కొనసాగుతోంది..
ఈ సమావేశంలో ఏఐసీసీ అబ్జర్వర్ శ్రీ దేబాసిస్ పట్నాయక్, టీపీసీసీ అబ్జర్వర్లు ఎమ్మెల్యే శ్రీ శంకర్ గారు, శ్రీ ఎం.డి. అవేజ్, శ్రీ శ్రీకాంత్ యాదవ్ గార్లు పాల్గొన్నారు..
*పాలకుర్తి నియోజకవర్గ ఇంచార్జ్ శ్రీమతి ఝాన్సి రాజేందర్ రెడ్డి గారు కూడా జనగామ డీసీసీ అధ్యక్షుల దరఖాస్తును అబసర్వర్లకు అందజేశారు..*
*అబ్జర్వర్లు మాట్లాడుతూ..* – ప్రజలలోనుండి ప్రజానాయకులను ఎంపిక చేయడం కాంగ్రెస్ పార్టీ ప్రధాన లక్ష్యం. ప్రతి జిల్లాలో స్థానిక నాయకులతో నేరుగా మాట్లాడి వారి అభిప్రాయాలను సేకరిస్తున్నాం. జిల్లా కాంగ్రెస్ కమిటీ అధ్యక్ష పదవికి ఆసక్తి గల ఎవరైనా దరఖాస్తు చేసుకోవచ్చు. ప్రతి నాయకుడితో వ్యక్తిగతంగా చర్చించి, వారి అభిప్రాయాలను టీపీసీసీ మరియు ఏఐసీసీకి పంపుతాం. ఈ విధానంతో పార్టీ అంతర్గత ప్రజాస్వామ్యం మరింత బలపడుతుంది అని పేర్కొన్నారు..
ఈ సందర్భంగా *ఎమ్మెల్యే శ్రీమతి యశస్విని రెడ్డి గారు మాట్లాడుతూ..* – కాంగ్రెస్ పార్టీ ప్రజల మనసులో ఉన్న నిజమైన ప్రజాస్వామ్యానికి ప్రతీక. నాయకత్వం ప్రజల అభిప్రాయాలతో, ప్రజల అంగీకారంతో ఎంపిక అవుతుందంటే అదే నిజమైన ప్రజాస్వామ్యం. ఈ ‘సంఘటన్ సృజన్ అభియాన్’ కార్యక్రమం ద్వారా పార్టీని మరింత బలోపేతం చేసే దిశగా మనం ముందుకు వెళ్తున్నాం, అని అన్నారు..
తరువాత తరువాత సమక్షంలో దరఖాస్తు ఫారమ్ను విడుదల చేసి, ఏఐసీసీ మరియు టీపీసీసీ అబ్జర్వర్లకు అందజేశారు. అనంతరం జిల్లా స్థాయి నాయకులతో వ్యక్తిగతంగా (సీక్రెట్గా) అభిప్రాయ సేకరణ కార్యక్రమం నిర్వహించబడింది. సేకరించిన అభిప్రాయాలను టీపీసీసీకి సమర్పించనున్నారు..
ఈ కార్యక్రమంలో పాలకుర్తి నియోజకవర్గంలోని ముఖ్య నాయకులు, మండల మరియు పట్టణ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షులు, బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులు, అనుబంధ సంఘాల ప్రతినిధులు పాల్గొన్నారు.
4 months ago | [YT] | 66
View 0 replies
K MEDIA
*పాలకుర్తి నియోజకవర్గం తేదీ: 27-09-2025..*
======================
*పెద్దమడూరులో బతుకమ్మ సంబరాల్లో పాల్గొన్న ఎమ్మెల్యే యశస్విని రెడ్డి గారు..*
దేవరుప్పుల మండలంలోని పెద్దమడూరు గ్రామంలో ఏడవ రోజు బతుకమ్మ సంబరాలు ఉత్సాహభరితంగా జరిగాయి. ఈ కార్యక్రమంలో పాలకుర్తి శాసన సభ్యురాలు శ్రీమతి యశస్విని రెడ్డి గారు పాల్గొని గ్రామ మహిళలతో కలిసి బతుకమ్మ ఆడి, పాటలు పాడి సంబరాలను మరింత ప్రత్యేకం చేశారు..
ఈ సందర్భంగా *ఎమ్మెల్యే యశస్విని రెడ్డి గారు మాట్లాడుతూ..* – బతుకమ్మ పండుగ అనేది మహిళలకు ప్రత్యేకమైన పండుగ. ఈ పండుగలో మన తెలంగాణ సాంప్రదాయం, ఆచారాలు, ఆత్మీయత ప్రతిబింబిస్తాయి. పూలతో అలంకరించే బతుకమ్మ మన ప్రకృతిపట్ల గల ప్రేమను, గౌరవాన్ని తెలియజేస్తుంది. మహిళలు ఒక చోట చేరి పాటలు పాడుతూ, ఆడుతూ ఈ పండుగను జరుపుకోవడం సామాజిక ఐక్యతకు ప్రతీక అని అన్నారు..
అలాగే, మహిళల పాత్ర సమాజ నిర్మాణంలో ఎంతో గొప్పదని, బతుకమ్మ పండుగ వారిని మరింతగా ఏకం చేస్తుందని తెలిపారు. తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలను ఈ విధంగా తరతరాలకు అందించడం మనందరి బాధ్యత అని ఎమ్మెల్యే గారు గుర్తుచేశారు..
గ్రామంలోని పెద్దలు, మహిళలు, యువత, పిల్లలు అందరూ పెద్ద సంఖ్యలో పాల్గొని బతుకమ్మను ఘనంగా నిర్వహించారు. ఎమ్మెల్యే గారి పాల్గొనడం వల్ల గ్రామంలో పండుగ వాతావరణం మరింత ఉత్సాహంగా మారింది..
4 months ago | [YT] | 49
View 0 replies
K MEDIA
*హైదరాబాద్ తేదీ: 25-09-2025..*
======================
*పాలకుర్తి రైతుల పంటల రక్షణకు చర్యలు అవసరం..*
*మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి గారిని మర్యాదాపూర్వకంగా కలిసిన పాలకుర్తి ఎమ్మెల్యే యశస్విని రెడ్డి గారు..*
పాలకుర్తి శాసనసభ్యురాలు శ్రీమతి యశస్విని రెడ్డి గారు రాష్ట్ర పౌరసరఫరాల, నీటిపారుదల శాఖ మంత్రి శ్రీ ఉత్తమ్ కుమార్ రెడ్డి గారిని హైదరాబాద్లోని ఆయన కార్యాలయంలో మర్యాదపూర్వకంగా కలిశారు..
ఈ సందర్భంగా ఎమ్మెల్యే గారు మాట్లాడుతూ – పాలకుర్తి నియోజకవర్గంలో వర్షపాతం ఉన్నప్పటికీ చెక్డ్యామ్లు నిండకపోవడం వలన రైతులు తీవ్రమైన ఇబ్బందులు పడుతున్నారని, సాగునీటి కొరత కారణంగా పంటలు ఎండిపోతున్నాయని తెలిపారు. రైతుల సమస్యకు శాశ్వత పరిష్కారం కోసం జనగామ జిల్లా, కొడకండ్ల మండలంలోని హాట్యా తండాలోని కాకతీయ కెనాల్ వద్ద స్లూయిస్ గేట్ (OT) ఏర్పాటు చేసి నీటిని మళ్లించాలని మంత్రి గారిని ఎమ్మెల్యే యశస్విని రెడ్డి కోరారు..
ఈ OT ఏర్పాటుతో పాలకుర్తి నియోజకవర్గంలోని పోచారం, బొమ్మకల్, కర్కాల, చికటాయపాలెం గ్రామాల్లో ఉన్న చెక్డ్యామ్లు నిండిపోతాయని, ఫలితంగా రైతుల పంటలు రక్షించబడతాయని ఎమ్మెల్యే వివరించారు. చెక్డ్యామ్లు నిండితే సాగునీరు లభించి, రైతుల ఆర్థిక పరిస్థితి దృఢపడుతుందని వారు అన్నారు..
రైతుల సమస్యలను శ్రద్ధగా విన్న మంత్రి శ్రీ ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు, ఈ ప్రతిపాదనను సమగ్రంగా పరిశీలించి, త్వరితగతిన తగిన చర్యలు తీసుకుంటామని ఎమ్మెల్యే యశస్విని రెడ్డి గారికి హామీ ఇచ్చారు..
4 months ago | [YT] | 60
View 0 replies
Load more