Bharat Today 24x7

Bharat Today Telangana, Dedicated to the Telangana Regions. Bharat Today Telangana Cater All Regional News from Telangana, National & International Updates







Bharat Today 24x7

రతన్ టాటా ఇక లేరు 🙏

1 year ago | [YT] | 13

Bharat Today 24x7

విజయనగరం జిల్లా పోలీసు

ఉత్సవాలు, పండగను శాంతియుతంగా నిర్వహించేందుకు అన్ని కోణాల్లో భద్రత చర్యలు చేపడుతున్నాం
- విశాఖపట్నం రేంజ్ డిఐజి గోపీనాధ్ జట్టి, ఐపిఎస్

🌀 బందోబస్తు ఏర్పాట్లను క్షేత్ర స్థాయిలో పరిశీలించిన విశాఖపట్నం రేంజ్ డిఐజి గోపీనాధ్ జట్టి, ఐపిఎస్

విజయనగరం ఉత్సవాలు, శ్రీ పైడితల్లమ్మ అమ్మవారి తొలేళ్ళు, సిరిమానోత్సవం పండుగ సందర్భంగా జిల్లా పోలీసుశాఖ ఏర్పాటు చేస్తున్న బందోబస్తు, భద్రత ఏర్పాట్లును విశాఖపట్నం రేంజ్ డిఐజి గోపీనాధ్ జట్టి అక్టోబరు 8న క్షేత్ర స్థాయిలో పరిశీలించారు. ఇందులో భాగంగా జిల్లా ఎస్పీ వకుల్ జిందల్, అదనపు ఎస్పీ పి.సౌమ్యలత మరియు ఇతర పోలీసు అధికారులతో కలిసి శ్రీ పైడితల్లమ్మ దేవాలయం, క్యూ లైన్లు, దేవాలయం వెనుక భాగం, కమాండ్ కంట్రోల్ రూం, మూడు లాంతర్లు, గురజాడ అప్పారావు రోడ్డు, కోట జంక్షను ప్రాంతాలను, గుర్తించిన పాత భవనాలను స్వయంగా సందర్శించి, క్షేత్ర స్థాయిలో భద్రత ఏర్పాట్లును పరిశీలించారు.

ఈ సందర్భంగా విశాఖపట్నం రేంజ్ డిఐజి గోపీనాధ్ జట్టి, ఐపిఎస్ మాట్లాడుతూ - అమ్మవారి పండగ, ఉత్సవాలకు పెద్ద సంఖ్యలో భక్తులు వస్తున్న నేపధ్యంలో ప్రజలకు ఎటువంటి అసౌకర్యం కలగకుండా 2000మందితో భద్రత ఏర్పాటు చేస్తున్నామన్నారు. వాహనాల రెగ్యులేషను, మళ్ళింపులు చేపడుతున్నామని, వాహనాల పార్కింగు చేసేందుకు ప్రత్యేకంగా పార్కింగు ప్రాంతాలను ఏర్పాటు చేస్తున్నామని, చైన్ స్నాచింగ్, ఈవ్ టీజింగు జరగకుండా ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేస్తున్నామన్నారు. సిరిమాను మరియు ఇతర రధాలు తిరిగే మార్గంలో ఎక్కువ సంఖ్యలో భక్తులు రాకుండా ఐరన్ బ్యారికేడింగు ఏర్పాటు చేయాలని, ముఖ్య కూడళ్ళలో మూడు అంచెల్లో ఐరన్ బ్యారికేడింగు ఏర్పాటు చేస్తున్నామన్నారు. పెద్ద సంఖ్యలో, ఎటువంటి ఇబ్బందులు తలెత్తకుండా భక్తులు సిరిమానోత్సవంను తిలకించే విధంగా భద్రత చర్యలు చేపడుతున్నామని, ప్రజలు కూడా పోలీసుశాఖ చేపట్టే చర్యలకు సహకరించాలని కోరారు. ఉత్సవాల్లో భాగంగా సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించే ప్రాంతాల్లో కూడా భద్రత ఏర్పాట్లు చేపడుతున్నామని విశాఖపట్నం రేంజ్ డిఐజి గోపీనాధ్ జట్టి అన్నారు.

ఈ కార్యక్రమంలో జిల్లా ఎస్పీ వకుల్ జిందల్, అదనపు ఎస్పీ పి.సౌమ్యలత, విజయనగరం డిఎస్పీ ఎం.శ్రీనివాసరావు, బొబ్బిలి డిఎస్పీ పి.శ్రీనివాసరావు, చీపురుపల్లి డిఎస్పీ ఎస్.రాఘవులు, సిఐలు ఎ.వి.లీలారావు, ఆర్.వి.ఆర్.కె చౌదరి, ఎస్.శ్రీనివాస్, టి.శ్రీనివాసరావు, ఎస్.లక్ష్మణరావు, సూరి నాయుడు, దేవాదాయ అధికారులు, ఆర్ అండ్ బి అధికారులు, పలువురు ఎస్ఐలు, ఇతర పోలీసు అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.

జిల్లా పోలీసు కార్యాలయం,
విజయనగరం.

1 year ago | [YT] | 3

Bharat Today 24x7

పార్వతిపురం మన్యం జిల్లా:ఎమ్మెల్యే బోనెల విజయ్ చంద్రను కలిసిన మాజీ సైనికులు..


ఎమ్మెల్యే బోనెలవిజయ్ చంద్ర నివాసం వద్ద మర్యాదపూర్వకంగా కలిసిన మాజీ సైనిక. సంక్షేమ సంఘం...

పార్వతిపురం మాజీ సైనిక సంక్షేమం తరఫున రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం - ఎమ్మెల్యే విజయ్ చంద్రకు శాలువాతో సత్కరించిన మాజీ సైనికులు...

అనంతరం మాజీ సైనిక నాయకుడు కోరాడ నారాయణరావు మాట్లాడుతూ...

సూపర్ సిక్స్ పథకాలే కాకుండా మాజీ సైనికులుకు ఇచ్చే మాట కూడా హామీలు చేసే విధంగా నిర్వహించాలంటూ ప్రభుత్వానికి తెలిపే విధంగా ఎమ్మెల్యేకు వినత పత్రం అందజేశారు...

రాష్ట్రంలో ఎక్కడ లేని విధంగా మాజీ సైనిక కార్పొరేషన్ ఏర్పాటు చేయడంలో ప్రభుత్వం సహకరించడంలో మాజీ సైనికులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు

ఈ కార్యక్రమం మాజీ సైనికుడు అధ్యక్షులు నారాయణరావు ప్రెసిడెంట్ చంద్రశేఖర్ శంకర్రావు కార్యదర్శి శివచలం తదితరులు సైనికులు పాల్గొన్నారు.

1 year ago | [YT] | 5

Bharat Today 24x7

విజయనగరం జిల్లా ఫీడర్ అంబులెన్స్లోనే ప్రసవం - తల్లి బిడ్డలు క్షేమం

శృంగవరపుకోట నియోజవర్గం

ఒక గిరిజన మహిళ ఫీడర్ అంబులెన్స్ లోనే ప్రసవించిన సంఘటన అర్ధరాత్రి 12గంటలకు య చోటుచేసుకుంది. ఇందుకు సంబంధించి వివరాలు ఇలా ఉన్నాయి.మండలంలోని మూల సెంటర్ బొడ్డవర గిరిజన పంచాయతీ కొండ ప్రాంతంలో ఉన్న శనగపాడు గ్రామానికి చెందిన జన్ని సన్యాసమ్మకు గత రెండు రోజులుగా చిన్న చిన్న ప్రసవం నొప్పులు ప్రారంభమయ్యాయి. అయితే రాత్రి 11గంటల ప్రాంతంలో సన్యాసమ్మకు ప్రసవం నొప్పులు ఎక్కువ అవడంతో బొడ్డవర గిరిజన ప్రాంతం హెల్త్ అసిస్టెంట్ తాతారావుకు ఆమె బంధువులు ఫోన్ ద్వారా సమాచారం తెలిపారు. దీంతో తాతారావు ఫీడర్ అంబులెన్స్ (108) కు ఫోన్ చేసి సమాచారం అందించారు. వెంటనే ఫీడర్ అంబులెన్స్ ఈఎంటీ (ఎమర్జెన్సీ మెడికల్ టెక్నీషియన్) దాలిబాబు వాహనాన్ని తీసుకుని శనగపాడు వెళుతుండగా సన్యాసమ్మను ఆమె బంధువులు కలిసి అప్పటికే డోలిమొత సహయంతో 12గంటల ప్రాంతంలో మెట్టపాలెం ప్రాంతానికి తీసుకువచ్చారు. ఇక సన్యాసమ్మనువెంటనే ఫీడర్ అంబులెన్స్ లో ఎక్కించి ఎస్.కోట ప్రభుత్వ ఆశుపత్రికి తరలిస్తుండగా ఆమెకు ప్రసవం నొప్పులు మరింత తీవ్ర మవడంతో బొడ్డపాడు ప్రాంతంలో ఫీడర్ అంబులెన్స్ ను నిలిపివేశారు.ఇక ఆలస్యం చేయకుండా దాలిబాబు ఆమె బంధువులు కలిసి ఫీడర్

అంబులెన్స్ లోనే సన్యాసమ్మ కాన్పుకు ఏర్పాట్లు చేశారు. దీంతో ఆమెకు ప్రశాంతంగా కాన్పు జరిగింది. సన్యాసమ్మ ఆడ బిడ్డకు జన్మనిచ్చింది. ఆమెకు ఇది మూడో కాన్పు. తల్లి బిడ్డ ఇద్దరూ క్షేమంగా ఉన్నట్లు తెలిసింది. అనంతరం దాలిబాబు తల్లి బిడ్డలను ఫీడర్ అంబులెన్స్ లో ఎస్.కోట ప్రభుత్వ ఆశుపత్రికి తరలించారు.

1 year ago | [YT] | 5

Bharat Today 24x7

పవన్ కళ్యాణ్ ఫై మాజీ హోంమంత్రి సుచరిత సంచలనం వ్యాఖ్యలు | ExHome Minister | PawanKalyan | BharatToday

3 years ago | [YT] | 0

Bharat Today 24x7

విద్యాశాఖ మంత్రి స‌బితాపై మాజీ ఎమ్మెల్యే తీగ‌ల కృష్ణారెడ్డి భూక‌బ్జా ఆరోప‌ణ‌ల్లో నిజ‌మేనా..? మీ స‌మాధానం అవును కాదు తెలియ‌జేయండి.

3 years ago | [YT] | 4

Bharat Today 24x7

Telugu NRI Janatha About Immigration Law Issues | Bharat Today

3 years ago | [YT] | 0

Bharat Today 24x7

మలేషియా వెళ్ళడానికి ఇది తప్పనిసరి..ఎడ్యుకేషన్ మరియు బెస్ట్ కంపెనీలో జాబ్

3 years ago | [YT] | 0

Bharat Today 24x7

THE DEBATE: గోవిందా.. గోవిందా..! | Temple Land Grabs | Bharat Today

3 years ago | [YT] | 2