Hi friends I am from konaseema.
I newly started YouTube channel here you will find beautiful konaseema places and aquatic .
If you like this video like,share and subscribe my channel


Babu Tenneti

తుఫాన్ సమయం లో ఆక్వా రైతులు తీసుకో వలసిన జాగ్రత్తలు

A. తుఫాన్ ముందుగానే చేయవలసిన సిద్ధతలు

1. చెరువు లోతు పరిశీలన

నీరు అధికమవకుండా పండ్‌ నీటి మట్టం 20–30 సెం.మీ. తగ్గించండి.

2. గట్లుల/డైక్‌ల బలపరచడం

పగుళ్లు, బలహీన స్థానాలు ఉంటే ముందుగానే మట్టి/రాళ్లతో పటిష్టం చేయాలి.

3. విద్యుత్ పోయే అవకాశం ఎక్కువ. కాబట్టి డీజిల్ ఎరియేటర్లు, జనరేటర్లు, సరిగా పని చేస్తున్నాయో లేదో పరిశీలించాలి. తగిన ఇంధనం నిల్వలో ఉంచాలి.

4. చెరువు నీటిలో ఆక్సిజన్ లెవల్ పెంచండి

తుఫాన్‌కు ముందు రెండు రోజులు ఆక్సిజన్ బూస్టర్ / హైడ్రోజన్ పెరాక్సైడ్ ఉపయోగించడం మంచిది.

5. ఫీడ్ తగ్గించడం మంచిది.

తుఫాన్‌కు ముందు రోజు నుండే ఫీడ్ మొత్తాన్ని 30–40% తగ్గించండి, నీటిలో వ్యర్థాలు తగ్గి నీటి నాణ్యత చెడకుండా ఉంటుంది.

B. తుఫాన్ సమయంలో పాటించాల్సిన జాగ్రత్తలు

1. సిబ్బంది సురక్షితంగా ఉండాలి

చెరువు చుట్టూ తిరుగుతూ నీరు లెవెల్ చూడటం ప్రమాదం; భారీ గాలి, వర్షంలో చెరువువద్దకు రావద్దు.
అవసరం కాని పనులు చేయవద్దు

2. పాండ్ లోకి వల వేసే పని మరియు లైమ్ వేసే పనులు నిలిపెయ్యాలి.

3. నీటి స్థాయి క్రమంగా తగ్గడం

చెరువులోకి నీరు బాగా ఎక్కితే ఒక్కసారిగా తీసేయకండి; 3-4 గంటల వ్యవధితో నెమ్మదిగా బయటకు పంపాలి.

C. తుఫాన్ అనంతరం తీసుకోవాల్సిన చర్యలు

1.నీటి నాణ్యత పరీక్ష

చెరువు నీటిలో pH, సెలినిటీ, ఆల్కలనిటి , DO, అమెనియా చెక్ చేయండి.

2.నీటి నాణ్యత సరిదిద్దడం

pH తగ్గిపోయితే → లైమ్ (కాల్సియం కార్బోనేట్) 25–30 కిలో/ఏకరం

అమెనియా పెరిగితే → యుక్కా ప్రోడక్ట్స్ ను ఉపయోగించి నియంత్రణ

3. ఫీడ్‌ను నెమ్మదిగా ప్రారంభించండి

వెంటనే ఎక్కువ ఫీడ్ వేయవద్దు. మొదటి 2-3 రోజులు తక్కువ మోతాదు.

4. మరణాలు కనపడితే వెంటనే చేపలు/రొయ్యల ను పంపండి

దగ్గర్లోని ఫిషరీస్/ఆక్వా క్లినిక్ కేంద్రం లో నీరు, చేపలు / రొయ్యలు టెస్ట్ చేయించండి.

రొయ్యల రైతుల కోసం ప్రత్యేక సూచనలు

తుఫాన్ తరువాత చర్యలు

ఆక్సిజన్ తగ్గడం ఎరియేషన్ పెంచండి + H₂O₂

అమెనియా అధికం జియోలైట్ 20–25 kg + ప్రోబయోటిక్స్
రొయ్య అలసట, రెడ్ బాడీ విటమిన్ C & ఇమ్యునోబూస్టర్ 3 రోజులు
వైరల్ రిస్క్ (WSSV) నీరు చల్లగా ఉన్నప్పుడు ఫీడ్ తగ్గించి pH ను 7.5–8.5 లో ఉంచండి

చేపల రైతుల కోసం ప్రత్యేక సూచనలు

భారీ వర్షాల వల్ల కొత్త నీరు వస్తే చేపలు దూకి బయటపడే ప్రమాదం ఉంటుంది.
→ పొండి పైభాగాన సేఫ్టీ నెట్ / మగ్గు అమర్చండి.

నీరు చల్లబడినపుడు చేపలకు మీదకి రావడం / అలసట / స్లో స్విమ్మింగ్ కనిపిస్తుంది.
→ మినరల్ + లైమ్ + ప్రోబయోటిక్ ఇవ్వాలి.

ముఖ్యంగా గుర్తుంచుకోవలసింది

ప్రాణాలు కాపాడుకోవడం ముందుగా ముఖ్యం– ఆస్తులు తరువాత

ఫిష్/రొయ్యల ఆరోగ్యం → నీటి నాణ్యతపై ఆధారపడి ఉంటుంది
తుఫాన్ తర్వాత తొందరగా ఫీడ్ వేయడం → పెద్ద నష్టం

9 months ago | [YT] | 2

Babu Tenneti

జాతీయ సైన్స్ దినోత్సవం - 28-02-2025

సర్ సి వి రామన్ చంద్రశేఖర్ వెంకట్రామన్
మద్రాసులోని తిరుచినాపల్లికి దగ్గరలో ఉన్న అయ్యా అయ్యాన్ పేటాన్ అనే గ్రామంలో చంద్రశేఖర్ అయ్యార్ పార్వతి అమ్మాళ్ అనే దంపతులకు రెండవ కుమారునిగా సివి రామన్ 7 -11-1888న జన్మించాడు.

సి.వి.రామన్ విద్యాభ్యాసం విశాఖపట్నంలోనే ప్రారంభమైంది. సెయింట్ ఓయూసీఎస్ ఆంగ్లో ఇండియన్ హై స్కూల్లో విద్య పూర్తి చేశాడు.
తండ్రి ద్వారా భారత దేశ చరిత్రను తెలుసుకునేవాడు. అన్ని తరగతుల్లోనూ రామన్ మొదటి స్థానంలో ఉండేవాడు.11 సంవత్సరాలకే మెట్రిక్యులేషన్ పూర్తి చేశాడు.13 సంవత్సరాల వయసు వచ్చేసరికి ఉపకార వేతనం లభించింది.
మద్రాసు రెసిడెన్సీ కళాశాలలో చేరాడు.1903 వ సంవత్సరంలో రామన్ బి ఏ పరీక్షల్లో ఉత్తీర్ణుడైనాడు.1907 సంవత్సరంలో ఎంఏ పట్టా పొందాడు. ఏం ఏ పరీక్షలో మద్రాస్ యూనివర్సిటీలోనే ప్రథముడిగా ఉత్తీర్ణుడైనాడు.

సివి రామన్ స్పెక్ట్రోమీటర్ ఉపయోగించి ప్రయోగం చేస్తున్నప్పుడు అతడు కొన్ని విక్షేపణ పట్టికలను గమనించాడు. రామన్ మిగిలిన విద్యార్థుల వలే కాక ఆ పట్టీల గురించి ఆలోచించాడు. వాటిని గురించి ఎన్నో గ్రంథాలు చదివి చివరకు వాటిని విశ్లేషించాడు. తాను పరిశీలించి తెలుసుకున్న విషయాలను ఫిలాసఫికల్ పత్రికలకు పంపాడు. ఆ పత్రిక లండన్ నుండి వెలువడేది. రామన్ రాసిన పరిశోధన వ్యాసమును ఆ పత్రిక ప్రచురించింది.
తరువాత రామన్ ద్రవాల తలతన్యతను గణించే నూతన విధానం గురించి రాశాడు. ఫిలాసఫికల్ పత్రిక ప్రచురించింది. ఆ వ్యాసాలతో రామన్ విద్యార్థి దశలోనే శాస్త్రవేత్తల దృష్టిని ఆకర్షించాడు. ఈ విషయాలను గమనించిన అధ్యాపకులు అతడిని ఇంగ్లాండ్ వెళ్ళమన్నారు ఇంగ్లాండులో ప్రయోగాలు చేసి ఉన్నత స్థాయికి వెళ్లగలడని వారి ఉద్దేశం.
1907లో రామన్ లోక సుందరి తో వివాహం జరిగింది.1917లో రామన్ కలకత్తా విశ్వవిద్యాలయంలో అధ్యాపకునిగా చేరారు. రామన్ తరగతి గదిలో విద్యార్థులను నవ్విస్తూ పాఠాలు చెప్పేవాడు. రామన్ తరగతులకు అందరూ హాజరయ్యేవారు. విద్యార్థులందరి హృదయాలను గెలిచిన ఆచార్యును సివి రామన్.1918 వ సంవత్సరంలో వీణ ఫిడేలు లోని తీగలను కదిలించడం వలన ఏర్పడే కంపనాలను వివరించాడు. తరువాత మృదంగం తబలాల నుండి వెలుబడే ధ్వనుల లక్షణాలను కనుగొన్నాడు.
1921లో లండన్ లో సివి రామన్ ఉపన్యాసించాడు,ఆ ఉపన్యాసంలో సంగీత పరికరాలు వెలువరించే శబ్దాలు మీద తను చేసిన పరిశోధనల గురించి ఫలితాల గురించి చెప్పాడు. ఆ ఉపన్యాసం విన్న ఒక విదేశీ శాస్త్రవేత్త అసూయ చెందాడు. తన ద్వేషాన్ని బయటకు కట్టేశాడు. శబ్దాలపై పరిశోధన చేసి రాయల్ సొసైటీ సభ్యుడివి కావాలని కలలు కంటున్నావా అంటూ ఎగతాళి చేశాడు. ఆ క్షణంలోనే రామన్ రాయల్ సొసైటీ సభ్యునిగా ఎంపిక కావాలనే నిశ్చయానికి వచ్చాడు.
రామన్ భారతదేశానికి ఓడలో ప్రయాణమయ్యాడు. ఆకాశం సముద్రం రెండూ నీలిరంగులో ఉండటానికి గమనించాడు.
ఆ రోజులలో చాలామంది శాస్త్రవేత్తలు నీలిరంగు ఆకాశం సముద్రంలోని నీటి లో ప్రతిబింబించటం వలన సముద్రం కూడా నీలంగా కనిపిస్తున్నది అనుకునేవారు. కానీ రామన్ కొత్త ఆలోచన వచ్చాయి. నీలంగా ఎందుకు కనిపిస్తున్నది అనే ప్రశ్న వేసుకున్నాడు.ఇలా అనేక ప్రశ్నలు రామన్ మదిలో మెలిగాయి. అతడు కాంతి వలన సముద్రం నీలంగా కనిపిస్తుంది అనుకున్నాడు. ఆ దశగా ప్రయోగాలు చేయాలని అనుకున్నాడు. కలకత్తా చేరగానే రామన్ కాంతి పై తన పరిశోధన ప్రారంభించాడు. ద్రవాలు వాయువులు పారదర్శక పదార్థాలలో కాంతి పరిక్షేపణం గురించి పరిశోధనలు చేశాడు.ఈ పరిశోధనలలో రామన్ కి కె ఎస్ కృష్ణన్ కె ఆర్ రామనాథన్ అనే శాస్త్రవేత్తలు సహకరించారు.
కాంతి ధర్మాలపై పరిశోధనలు చేసిన రామన్ మేధాశక్తిని ప్రపంచ శాస్త్రవేత్తలు గుర్తించారు.1924లో సివి రామన్ ను రాయల సొసైటీ సభ్యునిగా ఎంపిక చేశారు. మన ప్రపంచంలో ఇంగ్లాండ్ లోనే రాయల్ సొసైటీలో సభ్యుడు కావడం అత్యున్నత గౌరవము లభించినట్లు అనుకునేవారు.
ఒకరోజు రామన్ ప్రయోగశాలలో గురించి ఒక వ్యక్తికి వివరిస్తున్నాడు. ఆ సమయంలో కేఎస్ కృష్ణన్ పరిగెత్తుకుంటూ వచ్చి ఒక శుభవార్త తెచ్చాను అన్నాడు. రామన్ ఏమిటి అని అడిగాడు. ప్రొఫెసర్ కామ్టన్ కు నోబుల్ బహుమతి వచ్చింది అని కృష్ణన్ సంతోషంగా చెప్పాడు. రామన్ చాలా మంచి వార్తన్ని సంతోషించాడు. అంతలోనే రామన్ ఆలోచనలో పడ్డాడు. అతనికి కాప్టన్ ఎఫెక్ట్ గా పేరుపొందిన సిద్ధాంతం గుర్తుకు వచ్చింది.
కేవలం 200 రూపాయలు ఖరీదు చేసే పరికరాలతో ప్రయోగాలు చేశాడు .పారదర్శకంగా ఉండే ఘన ద్రవ వాయు పదార్థాల గుండా కాంతిని ప్రసరింపజేసి దాని స్వభావాన్ని పరిశీలించాడు. చివరకు కాంతి తను ప్రయాణించే పదార్థాన్ని బట్టి తన స్వభావాన్ని మార్చుకుంటుంది అని నిరూపించాడు. ఈ విధంగా సివి రామన్ 16 ఫిబ్రవరి 1928న రామన్ ఎఫెక్ట్ అనే పేరు పొందిన కాంతి రేడియేషన్ సిద్ధాంతాన్ని కనుగొన్నాడు. బెంగళూరులో జరిగిన శాస్త్రవేత్తల సమావేశంలో కొత్త సిద్ధాంతాన్ని వివరించాడు,. రామన్ కనుగొన్న ఈ నూతన సిద్ధాంతాన్ని ఉపయోగించుకొని రంగుల ఫోటోలు, సింథటిక్ రబ్బరు, ప్లాస్టిక్ తేలికగా తయారు చేశారు. రసాయన పరిశ్రమలు కూడా ఈ సిద్ధాంతాన్ని ఉపయోగించుకొని అభివృద్ధి చెందాయి. ప్రపంచంలోనే శాస్త్రవేత్తలు అందరి దృష్టి రామన్ ఎఫెక్ట్ మీద పడింది. భారతీయ వైజ్ఞానిక రంగంలోనే గాక ప్రపంచ ప్రసిద్ధి శాస్త్రవేత్తల్లో ఒకరిగా రామన్ కీర్తింపబడ్డాడు. ఈ పరిశోధనతో రామన్ కు బహుమతి వస్తుందని అనుకున్నారు. అయితే 1928లో ఓవెన్ రిచర్సన్ 1929లో లూయిస్ డి బ్రోగ్లీ నోబుల్ బహుమతి పొందారు, చివరకు 1930లో రామన్ కు నోబెల్ బహుమతి వచ్చింది. భౌతిక శాస్త్రంలో నోబుల్ బహుమతి పొందిన మొదటి భారతీయుడు చంద్రశేఖర్ వెంకట్రామన్
ఆసియా ఖండంలోనే మొదటి నోబుల్ బహుమతి భౌతిక శాస్త్రంలో రామనకు దక్కింది.

భారత ప్రభుత్వం 1986 సంవత్సరంలో జాతీయ సైన్స్ దినోత్సవం జరపాలని నిర్ణయించింది.1987 సంవత్సరం నుండి ప్రతి ఏటా ఫిబ్రవరి 28వ తేదీన జాతీయ సైన్స్ దినోత్సవాన్ని జరుపుకుంటున్నారు. సివి వెంకట్రామన్ రామన్ ఎఫెక్ట్ కనుగొన్న పరిశోధన ఫలితాన్ని ధ్రువీకరించిన రోజునే ఫిబ్రవరి 28,1928 జ్ఞాపకార్థంగా జాతీయ సైన్స్ దినోత్సవం జరుపుకుంటున్నాము. భారతదేశ ప్రభుత్వం1954 సంవత్సరం భారతరత్న అని బిరుదు కూడా సత్కరించారు.19-11-1970 ఉదయాన సివి రామన్ నిద్ర నుండి లేవలేదు. ఆ ఉదయం శాశ్వత విశ్రాంతి తీసుకున్నాడు. రామన్ మరణ వార్త భారతీయులనే కాక ప్రపంచ విజ్ఞాన శాస్త్రవేత్తల అందర్నీ దుఃఖానికి గురిచేసింది.

నా మతమే సైన్స్ అన్నారు.
నా కులమే సైన్స్ అన్నారు.

1 year ago | [YT] | 2

Babu Tenneti

పుష్ప 2 :

ఒక కూలీగా జీవితాన్ని మొదలుపెట్టి శక్తివంతమైన స్మగ్లర్ గా ఎదిగిన యువకుడి కధతో గతంలో పుష్ప మొదటి పార్ట్ వస్తే , స్మగ్లింగ్ సామ్రాజ్యానికి తిరుగులేని శక్తిగా ఎదిగిన పుష్ప తన ఆధిపత్యాన్ని ఎలా నిలుపుకున్నాడు , రెండోభార్యకి పుట్టినందుకు ఇంటిపేరు కూడా లేకుండా ఎన్నో అవమానాలకు గురైన పుష్ప తిరిగి తన ఇంటిపేరుని ఎలా తెచ్చుకున్నాడు అనే కధతో ఇప్పుడు పుష్ప 2 రిలీజైంది. నిన్న రాత్రి స్పెషల్ షో చూసాను. సినిమా చాలా బావుంది.

తన బాడీలాంగ్వేజ్, మేనరిజం , డైలాగ్స్ తో అల్లు అర్జున్ మరొకసారి పుష్ప పాత్రలో అభిమానులను ఆకట్టుకున్నాడు. డైలాగ్స్ కూడా బావున్నాయి. ఇంటర్వెల్ ముందు వచ్చే సీన్స్ బాగా ఎంజాయ్ చేస్తారు. ఇంటర్వెల్ తరువాత నుండి ఎండ్ కార్డ్ పడే వరకూ ప్రతీ సీన్ ప్రేక్షకుడ్ని ఊపిరి బిగబట్టి చూసేలా చేస్తుంది. సినిమా ఎక్కడా బోర్ కొట్టదు.

జాతరలో ఆడవేషంతో నటించిన పాట, చెప్పిన డైలాగ్స్ , చేసిన ఫైట్ లతో పాటు సెకండాఫ్ లో వచ్చే కామెడీ, సెంటిమెంట్ , ఫైట్ ఇలా ప్రతీ సీన్లో చాలా అద్భుతంగా నటించి అల్లు అర్జున్ తన కెరీర్ మొత్తంలో బెస్ట్ పెర్ఫార్మెన్స్ ఇచ్చాడనిపించింది.

పుష్ప కేరెక్టర్ ని సుకుమార్ చాలా చక్కగా రాసుకోవడమే కాదు చాలా అద్భుతంగా ప్రెజెంట్ చేసాడు. హీరోయిజాన్ని ఎలివేట్ చేసే సీన్లు ఎక్కువగా ఉండడంతో ప్రేక్షకులు తమకి తెలీకుండానే పుష్ప కేరెక్టర్ ని ఓన్ చేసేసుకుంటారు. పోలీసులకి, ప్రత్యర్ధులకి దొరకకుండా ఎత్తుకి పైఎత్తులు వేస్తూ పుష్ప గెలిచే ఒక్కో సీన్ వావ్ అనిపిస్తుంది. విలన్స్ అన్నకూతుర్ని కిడ్నాప్ చేసినపుడు పుష్ప సృష్టించిన విధ్వంసాన్ని ఆడియెన్స్ ఎంజాయ్ చేస్తారు. ఇది పూర్తిగా అల్లు అర్జున్ ఒన్ మేన్ షో లా అనిపుస్తుంది. ఈ స్ధాయి నటనని అతని నుండి ఊహించలేదు. ఎమోషన్స్ ని కూడా చాలా బాగా పండించగలిగాడు. పుష్ప మొదటి పార్ట్ తో పోలిస్తే ఈ రెండోపార్ట్ ఇంకా బెటర్ గా అనిపించింది.

సినిమాలో కంటెంట్ బావుంటే జనాలు ట్రోల్స్ నే కాదు టిక్కెట్ రేట్లను కూడా పట్టించుకోరు. ఎవరేమనుకున్నా ఈ సినిమాతో అల్లు అర్జున్ మరోసారి తనని తాను ప్రూవ్ చేసుకున్నాడు. కొన్ని కొన్ని సీన్లలో సెటైర్లు కూడా వేసాడు. రష్మిక, అజయ్, ఫహద్ ఫాజిల్, జగదీష్, రావురమేష్ , జగపతిబాబు లకి మంచి కేరెక్టర్స్ లభించాయి. క్లైమాక్స్ కి వచ్చేసరికి సినిమాలో ఉన్న విలన్స్ అంతా ఒక బ్యాచ్ గా ఫార్మ్ పుష్పని చంపడానికి స్కెచ్ వేస్తారు. ఆ స్కెచ్ వేసి వీరిని వెనక ఉండి నడిపిస్తున్న ఒక అజ్నాతవ్యక్తి ఎవరనేది చూపించకుండా పుష్ప పార్ట్ 3 కి లీడ్ ఇచ్చారు.

యాక్షన్ సీన్లు ఎక్కువగానే ఉన్నాయి. ఒకటి రెండు రొమాంటిక్ సీన్లు కూడా ఉన్నాయి. సినిమా ఎంత సీరియస్ గా నడుస్తున్నా రష్మిక స్క్రీన్ మీద కనిపించినపుడల్లా మళ్ళీగాని ఫీలింగ్స్ వచ్చి పుష్పని లాక్కెళిపోతుందేమో అనే డౌట్ మనసులోకి వచ్చేస్తుంది. పుష్పరాజైనా మహరాజైనా ఒకో మగాడి జీవితం అంతే. తరువాత రష్మికతో కొన్ని మంచి డైలాగ్స్ చెప్పించి మంచిగా ఆ కేరెక్టర్ ని కవర్ చేసారు

ఓవరాల్ గా సినిమా బావుంది. ఫ్యామిలీ ఆడియెన్స్ కి, పిల్లలకి నచ్చుతుంది. ఫ్యామిలీతో కలిసి చూడొచ్చు. ....పార్ధు వేణుగోపాలరాజు.

1 year ago | [YT] | 4

Babu Tenneti

Aquaculture expo 2024

1 year ago | [YT] | 3

Babu Tenneti

1 year ago | [YT] | 3

Babu Tenneti

Happy independence day to all

1 year ago | [YT] | 5

Babu Tenneti

బ్రతకాలి అనే కోరిక.... తిరిగి ఫలాలు ఇస్తుందేమో 😍

2 years ago | [YT] | 5

Babu Tenneti

For sale

2 years ago | [YT] | 3

Babu Tenneti

రొయ్యలు తినండి

2 years ago | [YT] | 5