Welcome to the official YouTube channel of Vamsikrishna Gaddam, Member of Parliament from Peddapalli, Telangana.
📌 On this channel, you'll find:
Speeches, Parliament sessions & interviews
Updates on Peddapalli development projects
Ground-level public service and citizen engagement
Insights into governance, youth empowerment & welfare initiatives
🎯 Committed to people-first leadership, transparency, and progress.
🔔 Subscribe for regular updates and follow Vamsikrishna Gaddam across platforms:
👉 Twitter (X): x.com/KakaVamsiGaddam
👉 Instagram: instagram.com/kakavamsigaddam
👉 Facebook: facebook.com/vkgaddamofficial
#VamsikrishnaGaddam #PeddapalliMP #TelanganaPolitics #PublicService #VKGaddam
Gaddam Vamsi Krishna
నేడు మంచిర్యాల పట్టణంలో పర్యటిస్తూ ప్రజలతో మమేకమయ్యాను. ఉదయం హైటెక్ సిటీలోని బ్యాడ్మింటన్ కోర్టులో యువతతో కలిసి బ్యాడ్మింటన్ ఆడి, క్రీడల ప్రాముఖ్యతపై వారితో చర్చించాను.
అనంతరం మంచిర్యాల బాయ్స్ గ్రౌండ్ను సందర్శించి అక్కడ ప్రాక్టీస్ చేస్తున్న చిన్నారులతో కలిసి క్రికెట్ ఆడాను. మైదానం అభివృద్ధికి అవసరమైన చర్యలపై వెంటనే స్పందించి, శ్రీరాంపూర్ జీఎం శ్రీనివాస్ గారితో ఫోన్లో మాట్లాడి గ్రౌండ్ అభివృద్ధికి ఉపయోగపడే విధంగా 20 ట్రిప్పుల మట్టిని ఏర్పాటు చేయాలని సూచించాను.
ఈ సందర్భంగా చిన్నారుల క్రీడా ప్రోత్సాహం కోసం రెండు క్రికెట్ కిట్లను అందజేస్తానని హామీ ఇచ్చాను. క్రీడల ద్వారా యువత శారీరకంగా, మానసికంగా దృఢంగా ఎదిగి ఉన్నత లక్ష్యాలను సాధించాలని ఆకాంక్షించాను.
తదుపరి మార్కెట్ ప్రాంతంలోని రత్నలాల్ హోటల్ వద్ద స్థానిక వ్యాపారులు, ప్రజలతో సమావేశమై వారి సమస్యలను తెలుసుకున్నాను. డ్రైనేజీ, రోడ్లు, పార్కింగ్, తాగునీటి వంటి సమస్యలను వారు నా దృష్టికి తీసుకురాగా, వెంటనే సంబంధిత అధికారులతో మాట్లాడి పరిష్కార చర్యలు చేపట్టాలని సూచించాను.
అదేవిధంగా హోటల్ యజమానులు, వ్యాపారులతో మాట్లాడి వాణిజ్య అవసరాలకు ఉపయోగించే గ్యాస్ సరఫరా పరిస్థితిని అడిగి తెలుసుకున్నాను. గ్యాస్ సరఫరా సక్రమంగా జరుగుతుందా, ఏవైనా ఇబ్బందులు ఉన్నాయా అనే విషయాలపై ఆరా తీశాను.
ఈ సందర్భంగా నేను మాట్లాడుతూ, “ప్రజల సమస్యలే నా సమస్యలు. ప్రజల మధ్యే ఉంటూ వారి అవసరాలను తెలుసుకొని, వాటి పరిష్కారానికి కృషి చేయడం నా బాధ్యత” అని పేర్కొన్నాను.
ప్రజలతో నిరంతరం మమేకమవుతూ, వారి సమస్యల పరిష్కారానికి కట్టుబడి పనిచేస్తూనే ఉంటాను.
2 weeks ago | [YT] | 19
View 0 replies
Gaddam Vamsi Krishna
నేడు మందమర్రిలో టామ్ కామ్ ఆధ్వర్యంలో, సింగరేణి సంస్థ సహకారంతో నిర్వహిస్తున్న జర్మనీ భాషా శిక్షణ తరగతులను సందర్శించాను. ఈ కార్యక్రమంలో జహీరాబాద్ పార్లమెంట్ సభ్యులు సురేష్ షెట్కర్ గారు మరియు రాష్ట్ర రైతు సమితి చైర్మన్ అవినాష్ గారు కూడా పాల్గొని, శిక్షణ తరగతులను కొద్దిసేపు పరిశీలించాము. శిక్షణ పొందుతున్న యువతతో మాట్లాడి వారి అభిప్రాయాలు తెలుసుకున్నాను.
నేను యువతకు సూచించాను, విదేశీ భాషలపై పట్టు సాధించి జర్మనీతో పాటు ఇతర దేశాల్లో ఉన్నత విద్య మరియు ఉపాధి అవకాశాలను పొందాలని. భాషా నైపుణ్యాలను పెంపొందించి విదేశాల్లో స్థిరపడేందుకు అవసరమైన సహకారం, మార్గదర్శకత్వం ఎల్లప్పుడూ అందిస్తానని హామీ ఇచ్చాను.
ఈ జర్మనీ భాషా శిక్షణ కార్యక్రమాన్ని యువతకు అందుబాటులోకి తీసుకురావడంలో రాష్ట్ర కార్మిక, ఉపాధి మరియు మైనింగ్ శాఖ మంత్రి గడ్డం వివేక్ వెంకటస్వామి గారు ప్రత్యేక చొరవ తీసుకుని, సింగరేణి సంస్థ సహకారంతో కార్యక్రమం విజయవంతం అయ్యేలా కీలక పాత్ర పోషించారని కొనియాడాను. యువతకు అంతర్జాతీయ స్థాయి ఉపాధి అవకాశాలు కల్పించాలనే దృక్పథంతో మంత్రి వివేక్ వెంకటస్వామి గారు నిరంతరం కృషి చేస్తున్నారు.
యువత భవిష్యత్తును దృష్టిలో ఉంచుకుని సింగరేణి సహకారంతో నిర్వహిస్తున్న ఇటువంటి శిక్షణ కార్యక్రమాలు ఎంతో ఉపయోగకరమని, మరిన్ని మంది యువత ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని నేను కోరాను.
2 weeks ago | [YT] | 12
View 1 reply
Gaddam Vamsi Krishna
మంచిర్యాల జిల్లా కేంద్ర లైబ్రరీని సందర్శించిన సందర్భంగా అక్కడ చదువుతున్న విద్యార్థులు తమ సమస్యలను నాకు తెలియజేశారు. వారి ఇబ్బందులను సానుకూలంగా స్వీకరించి, వెంటనే పరిష్కరించమని జిల్లా కలెక్టర్ గారికి ఆదేశించాను.
దీనిలో భాగంగా విద్యార్థులకు అవసరమైన వాష్రూమ్లు మరియు తాగునీటి సౌకర్యాలను ఏర్పాటు చేయించాము. ఈరోజు వాటి పనితీరును సంబంధిత అధికారులతో కలిసి పరిశీలించాను.
విద్యార్థులకు రాబోయే ఉద్యోగ నోటిఫికేషన్లను దృష్టిలో ఉంచుకొని కష్టపడి చదివి తమ లక్ష్యాలను సాధించాలని సూచించాను. మంచిర్యాల జిల్లా నుండి అధిక సంఖ్యలో యువత ప్రభుత్వ ఉద్యోగాలు సాధించి జిల్లాకు మంచి పేరు తీసుకురావాలని ఆకాంక్షిస్తున్నాను. అలాగే పోలీస్ ఉద్యోగ నోటిఫికేషన్లలో పోస్టులను పెంచేందుకు సీఎం రేవంత్ రెడ్డి గారితో మాట్లాడి కృషి చేస్తానని తెలిపారు.
విద్యార్థుల విద్యాభివృద్ధికి అవసరమైన అన్ని మౌలిక సదుపాయాలను అందించడానికి నేను ఎల్లప్పుడూ కృషి చేస్తానని హామీ ఇచ్చాను.
2 weeks ago | [YT] | 14
View 2 replies
Gaddam Vamsi Krishna
నేడు మంచిర్యాల జిల్లా మందమర్రి మండలంలోని గద్దెరాగడి MNR గార్డెన్స్లో నిర్వహించిన ఓటర్ల ప్రత్యేక సవరణ జాబితా (SIR)పై బూత్ లెవల్ ఏజెంట్ల అవగాహన శిక్షణ కార్యక్రమంలో పాల్గొన్నాను. ఈ కార్యక్రమంలో కార్మిక, మైనింగ్ & ఉపాధి శాఖ మంత్రి గడ్డం వివేక్ వెంకటస్వామి గారు, జహీరాబాద్ ఎంపీ సురేష్ షట్కర్ గారు కూడా ఉన్నారు.
ఈ సందర్భంగా, SIR ముసుగు వేసి బీజేపీ ప్రభుత్వం కాంగ్రెస్ పార్టీకి అనుకూలంగా ఉన్న ఓటర్లను తొలగించేందుకు కుట్రలు చేస్తున్నట్లు. దేశంలో ఓటు చోరీ అంశంపై ప్రతిపక్ష నాయకుడు రాహుల్ గాంధీ పార్లమెంట్లో గళం విప్పిన సంగతి గుర్తుచేశాను. బూత్ లెవల్ ఏజెంట్లు ఇంటింటికి వెళ్లి ఓటర్ల జాబితాలను పకడ్బందీగా పరిశీలించి, చనిపోయిన ఓటర్ల వివరాలను గుర్తించి సంబంధిత అధికారులకు తెలియజేయాలని సూచించాను.
2 weeks ago | [YT] | 17
View 1 reply
Gaddam Vamsi Krishna
తెలంగాణ రాష్ట్ర అవతరణ దినోత్సవాన్ని పురస్కరించుకుని మంచిర్యాల జిల్లా కేంద్రంలోని బైపాస్ రోడ్డులో ఉన్న తెలంగాణ అమరవీరుల స్థూపం వద్ద అమరవీరులకు ఘనంగా నివాళులర్పించడం జరిగింది. అమరవీరుల స్థూపం వద్ద పుష్పగుచ్ఛం ఉంచి తెలంగాణ రాష్ట్ర సాధన కోసం తమ ప్రాణాలను అర్పించిన వీరుల త్యాగాలను స్మరించుకున్నాను.
అనంతరం మంచిర్యాల కలెక్టరేట్లో నిర్వహించిన రాష్ట్ర అవతరణ దినోత్సవ వేడుకల్లో పాల్గొని జిల్లా కలెక్టర్, జిల్లా పోలీసు అధికారులు, ప్రజాప్రతినిధులతో కలిసి జాతీయ పతాకాన్ని ఆవిష్కరించి గౌరవ వందనం స్వీకరించాను.
ఈ సందర్భంగా నేను మాట్లాడుతూ, తెలంగాణ రాష్ట్ర సాధన వెనుక విద్యార్థులు, యువత, ప్రజల త్యాగాలు, ఉద్యమ స్పూర్తి ఉన్నాయని పేర్కొన్నాను. తెలంగాణ కోసం ప్రాణత్యాగం చేసిన అమరవీరుల సేవలు, త్యాగాలు ఎప్పటికీ మరువలేనివని, వారి ఆశయాలకు అనుగుణంగా ప్రజా సంక్షేమం, సమగ్ర అభివృద్ధే లక్ష్యంగా పనిచేయడం మనందరి బాధ్యత అని చెప్పాను.
తెలంగాణ రాష్ట్రం అన్ని రంగాల్లో అభివృద్ధి సాధిస్తూ ముందుకు సాగుతోందని, ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలను ప్రభుత్వం అమలు చేస్తోందని వివరించాను. అమరవీరులు కలలు కన్న తెలంగాణను మరింత అభివృద్ధి పథంలో నడిపించేందుకు కృషి కొనసాగించాలని పిలుపునిచ్చాను.
అనంతరం తెలంగాణ ప్రభుత్వం దివ్యాంగుల సంక్షేమం కోసం అందజేస్తున్న మోటారు వాహనాల (స్కూటీల) పంపిణీ కార్యక్రమంలో పాల్గొని లబ్ధిదారులకు శుభాకాంక్షలు తెలియజేశాను. ప్రభుత్వం అందిస్తున్న సంక్షేమ పథకాలను అర్హులైన ప్రతి ఒక్కరూ సద్వినియోగం చేసుకుని తమ జీవితాల్లో మరింత పురోగతి సాధించాలని ఆకాంక్షించాను.
తెలంగాణ అమరవీరుల త్యాగ స్ఫూర్తిని స్మరిస్తూ, వారి ఆశయ సాధన కోసం ప్రజలతో కలిసి నిరంతరం పనిచేస్తానని ఈ సందర్భంగా మరోసారి స్పష్టం చేశాను.
3 weeks ago | [YT] | 24
View 1 reply
Gaddam Vamsi Krishna
పిన్నారం గ్రామంలో నెలకొన్న తాగునీటి సమస్యను స్థానికులు నా దృష్టికి తీసుకురాగానే వెంటనే స్పందించాం. రాష్ట్ర మంత్రి గడ్డం వివేక్ వెంకటస్వామి గారితో కలిసి కొత్తగా ఏర్పాటు చేసిన బోర్వెల్ను ప్రారంభించడం ఆనందంగా ఉంది.
గ్రామంలో కొంతకాలంగా కొనసాగుతున్న నీటి ఎద్దడిని దృష్టిలో ఉంచుకుని ఈ బోర్వెల్ ఏర్పాటు కోసం చర్యలు చేపట్టాం. దీని ద్వారా గ్రామ ప్రజలకు తాగునీటి ఇబ్బందులు తీరనున్నాయని ఆశిస్తున్నాను.
ప్రజలకు అవసరమైన మౌలిక వసతులు అందించడం మా బాధ్యత. గ్రామాల్లో తాగునీటి సమస్యలు సహా ప్రజల సమస్యల పరిష్కారానికి ఎల్లప్పుడూ అందుబాటులో ఉంటూ పనిచేస్తాం.
ఈ కార్యక్రమంలో పాల్గొన్న ప్రజాప్రతినిధులు, అధికారులు, గ్రామస్థులకు ధన్యవాదాలు.
3 weeks ago | [YT] | 15
View 0 replies
Gaddam Vamsi Krishna
ఆదిలాబాద్ పార్లమెంట్ కాంగ్రెస్ ఇంచార్జ్గా బీఎల్ఏ-2 సమావేశంలో పాల్గొని పార్టీ శ్రేణులతో విస్తృతంగా చర్చించడం జరిగింది.
ఈ సందర్భంగా నేను మాట్లాడుతూ, దేశంలో ప్రజాస్వామ్యానికి మూలస్తంభమైన ఓటు హక్కును పరిరక్షించుకోవడం ప్రతి ఒక్కరి బాధ్యత అని పేర్కొన్నాను. ఎస్ఐఆర్ పేరుతో ఓట్ల తొలగింపుకు జరుగుతున్న ప్రయత్నాలను అప్రమత్తంగా గమనించాలని, రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ కల్పించిన ఓటు హక్కును కాపాడేందుకు బీఎల్ఏలు ముందుండి పోరాడాలని పిలుపునిచ్చాను.
అలాగే, దేశవ్యాప్తంగా నీట్ పరీక్షల నిర్వహణలో చోటుచేసుకుంటున్న అవకతవకలు, పేపర్ లీకేజీల కారణంగా విద్యార్థుల భవిష్యత్తు ప్రమాదంలో పడుతోందని ఆందోళన వ్యక్తం చేశాను. యువత విద్య, ఉపాధి, అభివృద్ధి అవకాశాలపై దృష్టి పెట్టాల్సిన అవసరం ఉందని పేర్కొన్నాను.
బీఎల్ఏ-2 సమావేశంలో పార్టీ బలోపేతం, సభ్యత్వ నమోదు, బూత్ కమిటీల ఏర్పాటు, ప్రజా సమస్యలపై స్పందన, రాబోయే రాజకీయ కార్యాచరణపై సమగ్రంగా చర్చించాము. పార్టీని క్షేత్రస్థాయిలో మరింత బలోపేతం చేస్తూ ప్రజల పక్షాన పోరాటాన్ని కొనసాగిస్తామని ఈ సందర్భంగా స్పష్టం చేశాను.
4 weeks ago | [YT] | 19
View 0 replies
Gaddam Vamsi Krishna
పెద్దపల్లి పట్టణంలోని ఒక చిన్న టీ షాప్ను సందర్శించే అవకాశం కలిగింది. అక్కడ తన కాళ్ల మీద తాను నిలబడి, ఎంతో ఆత్మవిశ్వాసంతో జీవనం సాగిస్తున్న మహిళను కలవడం నాకు ఆనందాన్ని కలిగించింది.
కట్టెల పొయ్యి, గ్యాస్ పొయ్యి బదులుగా ఎలక్ట్రిక్ పొయ్యితో టీ తయారు చేస్తూ పర్యావరణ కాలుష్యాన్ని తగ్గించే ప్రయత్నం చేస్తున్న ఆమె ఆలోచన నిజంగా అభినందనీయం. గ్యాస్ కొరత పరిస్థితుల్లో కూడా పొగరహిత విధానాన్ని ఎంచుకుని పర్యావరణాన్ని కాపాడుతూ జీవనం సాగించడం ప్రతి ఒక్కరికీ ఆదర్శంగా నిలుస్తుంది.
ఆమె చేత తయారైన టీని అక్కడే ఆస్వాదించాను. ఈ సందర్భంగా ఆమెను శాలువాతో సత్కరించడం నాకు సంతోషాన్ని ఇచ్చింది. కలిసి సెల్ఫీ దిగుతూ ఆమె ఆత్మస్థైర్యాన్ని, స్వయం సమర్థతను అభినందించాను.
వయస్సుతో సంబంధం లేకుండా సాంకేతిక మార్పులను స్వీకరించడం సమాజానికి ఎంతో అవసరం. ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాల్లో ఇలాంటి మార్పులు మరింత ప్రోత్సహించాలి. ప్రజలు స్వయం సమర్థతతో ముందుకు రావడం నిజమైన అభివృద్ధికి నిదర్శనం.
1 month ago | [YT] | 25
View 4 replies
Gaddam Vamsi Krishna
పెద్దపల్లి వ్యవసాయ మార్కెట్ కమిటీ కొనుగోలు కేంద్రాన్ని సందర్శించి రైతులతో నేరుగా మాట్లాడి ధాన్యం తూకం, కొనుగోలు ప్రక్రియ, చెల్లింపుల ఆలస్యం, నిల్వ సౌకర్యాలపై వారి సమస్యలను తెలుసుకున్నాను.
జిల్లా మార్కెటింగ్ అధికారితో మాట్లాడి రైతుల సమస్యల పట్ల నిర్లక్ష్యం ఎందుకు జరుగుతోందో ప్రశ్నించాను. మార్కెట్ యార్డులో అవసరమైన మౌలిక సదుపాయాలు కల్పించి, పారదర్శక తూకం విధానం మరియు వేగవంతమైన కొనుగోలు ప్రక్రియ అమలు చేయాలని అధికారులను ఆదేశించాను.
రైతులు ఇబ్బందులు పడకుండా వెంటనే చర్యలు తీసుకుని సమస్యలను పరిష్కరించాలని సూచించాను. రైతులకు న్యాయం జరగడం ఎప్పుడూ నా ప్రాధాన్యతగానే ఉంటుంది.
1 month ago | [YT] | 19
View 1 reply
Gaddam Vamsi Krishna
పెద్దపల్లి గెస్ట్ హౌస్లో జరిగిన ప్రెస్ మీట్లో నేను కేంద్ర ప్రభుత్వం తెలంగాణపై వివక్ష చూపుతోందని తీవ్రంగా విమర్శించాను. బీహార్, యూపీ రాష్ట్రాలకు భారీగా నిధులు కేటాయిస్తూనే, తెలంగాణకు రావాల్సిన నిధుల్లో కోతలు పెడుతున్నారు. తెలంగాణ నుంచి అత్యధిక పన్నులు కేంద్రానికి వెళ్తున్నప్పటికీ, రాష్ట్రానికి తిరిగి కేటాయింపుల్లో అన్యాయం జరుగుతోంది.
డిలిమిటేషన్ విషయంలో కేంద్ర ప్రభుత్వ వైఖరిని మేము గట్టిగా వ్యతిరేకించాం. తెలంగాణకు రావాల్సిన సెమీకండక్టర్ ప్రాజెక్టును ఆంధ్రప్రదేశ్కు తరలించారు.
ఇటీవల జరిగిన ఐదు రాష్ట్రాల ఎన్నికల్లో అత్యాచార కేసుల్లో విడుదలైన ఖైదీలకు బీజేపీ టికెట్లు ఇచ్చి గెలిపించుకుంది.
రామగుండం యూరియా ఉత్పత్తి విషయంలో కేంద్రం నిర్లక్ష్యం చూపుతూ కృత్రిమ కొరత సృష్టిస్తోంది.
మంచిర్యాల జిల్లాకు సంబంధించిన ధాన్యం కొనుగోలు విషయంలో పెద్దపల్లి కలెక్టర్ వివక్ష చూపుతున్నారు. దళిత రైతులు ఎక్కువగా ఉన్నారనే చిన్నచూపుతో రైతులను మోసం చేస్తున్నారు.
నేను అధికారంలో ఉన్నా లేకపోయినా పెద్దపల్లి పార్లమెంట్ ప్రజల కోసం ఎప్పుడూ ప్రశ్నిస్తాను, పోరాడుతాను. ప్రజల కోసం ఎంతదూరమైనా వెళ్లేందుకు సిద్ధంగా ఉన్నాను.
అధికారులు రాజకీయాలు చేయకుండా ప్రజా సమస్యల పరిష్కారంపై దృష్టి పెట్టాలి. పనిచేయని అధికారులపై కఠిన చర్యలు తీసుకుంటాం.
పెద్దపల్లి జిల్లాలో 6 లక్షల మెట్రిక్ టన్నుల గోదాముల సామర్థ్యం ఉన్నప్పటికీ కేవలం 2.5 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యమే దింపుకున్నారు. మంచిర్యాల, నిర్మల్ జిల్లాలకు కేటాయించిన ధాన్యం ఎత్తివేతలో నిర్లక్ష్యం జరుగుతోంది.
రైతుల బాధలు మీకు పట్టవా? రైతులను నాశనం చేయాలనుకుంటున్నారా? అందుకే రైతుల పక్షాన ప్రశ్నించేందుకు నేను ఇక్కడికి వచ్చాను.
ఈరోజు భారత్ అమెరికా నుంచే నడుస్తున్నట్టుగా కనిపిస్తోంది. వాషింగ్టన్ డీసీ నుంచి ఆదేశాలు వచ్చిన తర్వాతే మోదీ పని చేస్తున్నట్టుగా ఉంది. ట్రంప్ చెప్పినట్టే మోదీ కూర్చోవడం, లేవడం జరుగుతోందన్న భావన కలుగుతోంది.
బండి సంజయ్ కుమారుడు బండి భగీరథ విషయంలో కేటీఆర్ అనవసర రాజకీయాలు చేస్తున్నారు. గత పది సంవత్సరాల బీఆర్ఎస్ పాలనలో కేటీఆర్ హీరోయిన్లతో ఎంజాయ్ చేస్తూ కుటుంబాలను కూడా నాశనం చేశాడు.
బండి భగీరథ కేసులో చట్టం తన పని తాను చేసుకుంటూ ముందుకు వెళ్తుంది.
1 month ago | [YT] | 18
View 3 replies
Load more