Welcome to the official YouTube channel of Vamsikrishna Gaddam, Member of Parliament from Peddapalli, Telangana.
📌 On this channel, you'll find:
Speeches, Parliament sessions & interviews
Updates on Peddapalli development projects
Ground-level public service and citizen engagement
Insights into governance, youth empowerment & welfare initiatives
🎯 Committed to people-first leadership, transparency, and progress.
🔔 Subscribe for regular updates and follow Vamsikrishna Gaddam across platforms:
👉 Twitter (X): x.com/KakaVamsiGaddam
👉 Instagram: instagram.com/kakavamsigaddam
👉 Facebook: facebook.com/vkgaddamofficial
#VamsikrishnaGaddam #PeddapalliMP #TelanganaPolitics #PublicService #VKGaddam
Gaddam Vamsi Krishna
ప్రజల పక్షాన నిలిచి.. సంక్షేమ పాలనకు కొత్త అర్థం చెప్పిన మహానేత డాక్టర్ వై.ఎస్. రాజశేఖర రెడ్డి గారు..
పేదల జీవితాల్లో మార్పు తీసుకురావడమే లక్ష్యంగా ఆయన అమలు చేసిన సంక్షేమ పథకాలు లక్షలాది కుటుంబాలకు అండగా నిలిచాయి. రైతులకు భరోసా కల్పించడంతో పాటు, పేదలకు మెరుగైన వైద్య సేవలు, విద్యార్థులకు ఉన్నత విద్యా అవకాశాలు అందించేందుకు ఆయన తీసుకున్న నిర్ణయాలు ప్రజల జీవితాల్లో చెరగని ముద్ర వేశాయి..
అధికారం అంటే పదవి కాదని.. ప్రజల కష్టాలను అర్థం చేసుకుని వారి కోసం పనిచేయడమే నిజమైన నాయకత్వమని తన పాలనతో నిరూపించిన మహానేత వైఎస్ఆర్. ఆయన ప్రవేశపెట్టిన సంక్షేమ కార్యక్రమాలు, ప్రజల పట్ల ఆయన చూపిన అభిమానం నేటికీ కోట్లాది మంది గుండెల్లో ఆయనను సజీవంగా నిలిపాయి.
మహానేత డాక్టర్ వై.ఎస్. రాజశేఖర రెడ్డి గారి వర్ధంతి సందర్భంగా ఆ మహానేతకు హృదయపూర్వక నివాళులర్పిస్తున్నాను
1 week ago | [YT] | 15
View 0 replies
Gaddam Vamsi Krishna
I, along with Hon’ble Telangana Labour and Employment Minister Dr. G. Vivek Venkatswamy Garu, met Union Minister for Heavy Industries Shri H.D. Kumaraswamy Garu and requested the establishment of a PM-SETU ITI Cluster in the Peddapalli Parliamentary Constituency.
Considering Peddapalli’s industrial and mining potential, I highlighted the need for industry-oriented skill training in sectors like mining, metals, engineering, electrical, and mechanical fields to create better employment opportunities for local youth.
I also proposed developing government ITIs under a Hub and Spoke model to strengthen skill development, apprenticeship opportunities, and industry exposure.
The Union Minister responded positively to our request. I will continue working towards bringing more skill development initiatives and employment opportunities for the youth of Peddapalli.
1 month ago | [YT] | 19
View 0 replies
Gaddam Vamsi Krishna
రామగుండం ప్రజల ఆరోగ్య హక్కు కోసం మా పోరాటం కొనసాగుతోంది.
మంత్రి డా. జి. వివేక్ వెంకటస్వామి గారితో కలిసి కేంద్ర కార్మిక & ఉపాధి శాఖ మంత్రి డా. మన్సుఖ్ మాండవీయ గారిని కలిసి, సుమారు ₹150 కోట్లతో ఆమోదం పొందిన రామగుండం ESI మల్టీ స్పెషాలిటీ ఆస్పత్రి నిర్మాణాన్ని వెంటనే ప్రారంభించాలని కోరాము.
సింగరేణి కార్మికులు, ESI లబ్ధిదారులకు అత్యాధునిక వైద్య సేవలు అందే వరకు మా ప్రయత్నాలు నిరంతరం కొనసాగుతాయి.
జై హింద్... జై తెలంగాణ.
1 month ago | [YT] | 16
View 1 reply
Gaddam Vamsi Krishna
ఈ రోజు ఢిల్లీ పర్యటనలో భాగంగా తెలంగాణ రాష్ట్ర కార్మిక, ఉపాధి, శిక్షణ, గనులు & భూగర్భ శాఖల మంత్రి డా. జి. వివేక్ వెంకటస్వామి గారితో కలిసి పలువురు కేంద్ర మంత్రులను మర్యాదపూర్వకంగా కలిశాను.
ఈ సందర్భంగా కేంద్ర కార్మిక & ఉపాధి శాఖ మంత్రి డా. మన్సుఖ్ మాండవీయ గారు, కేంద్ర నైపుణ్యాభివృద్ధి & వ్యవసాయ పారిశ్రామికత శాఖ మంత్రి జయంత్ చౌదరి గారు, కేంద్ర బొగ్గు మరియు గనుల శాఖ మంత్రి జి. కిషన్ రెడ్డి గారితో సమావేశమై తెలంగాణ రాష్ట్ర అభివృద్ధికి సంబంధించిన పలు కీలక అంశాలపై సవివరంగా చర్చించాను.
తెలంగాణలో పెండింగ్లో ఉన్న అభివృద్ధి పనులను వేగవంతం చేయడంతో పాటు రాష్ట్రానికి అవసరమైన సహకారం అందించాలని విజ్ఞప్తి చేశాను. అలాగే ఉపాధి అవకాశాల విస్తరణ, నైపుణ్యాభివృద్ధి, గనులు, మౌలిక సదుపాయాల అభివృద్ధికి కేంద్ర ప్రభుత్వం పూర్తి సహకారం అందించాలని కోరాను.
తెలంగాణ సమగ్ర అభివృద్ధి కోసం రాష్ట్ర–కేంద్ర ప్రభుత్వాల సమన్వయంతో ప్రజలకు మరింత మెరుగైన అవకాశాలు, అభివృద్ధి ఫలాలు అందేలా నా వంతు కృషిని నిరంతరం కొనసాగిస్తాను.
జై హింద్... జై తెలంగాణ.
1 month ago | [YT] | 15
View 0 replies
Gaddam Vamsi Krishna
Save Lives, Stop NEET... ‘మన పిల్లల భవిష్యత్తు అమ్మకానికి కాదు’ అనే నినాదాలతో మేము కాంగ్రెస్ అగ్రనేత శ్రీమతి ప్రియాంక గాంధీ గారితో కలిసి నిర్వహించిన నిరసనలో పాల్గొన్నాము.
దేశంలోని లక్షలాది మంది విద్యార్థులు, వారి తల్లిదండ్రులు ఆందోళనలో ఉన్న ఈ సమయంలో వారి గొంతుకగా నిలవడం మా బాధ్యతగా భావిస్తున్నాము. అందుకే నల్ల దుస్తులు ధరించి కేంద్ర ప్రభుత్వ వైఖరికి వ్యతిరేకంగా మా నిరసనను తెలియజేశాము.
నీట్ పరీక్షల నిర్వహణ, విద్యార్థుల భవిష్యత్తు, వైద్య విద్యలో నెలకొన్న సమస్యలపై కేంద్ర ప్రభుత్వం వెంటనే స్పందించాలి. దేశవ్యాప్తంగా విద్యార్థులు, తల్లిదండ్రులు వ్యక్తం చేస్తున్న ఆందోళనలను ఇకపై నిర్లక్ష్యం చేయకూడదు.
‘మన పిల్లల భవిష్యత్తు అమ్మకానికి కాదు’ అనే మా నినాదం కేవలం ఒక మాట కాదు... దేశ యువత భవిష్యత్తును కాపాడాలనే మా సంకల్పం.
విద్యార్థుల హక్కుల కోసం, పారదర్శకమైన పరీక్షా వ్యవస్థ కోసం, ప్రతి విద్యార్థికి న్యాయం జరిగే వరకు మా పోరాటం కొనసాగుతుంది. కాంగ్రెస్ పార్టీ ఎల్లప్పుడూ విద్యార్థుల పక్షాన నిలుస్తుంది... మేము వారి పక్షాన పార్లమెంట్లోనూ, ప్రజల మధ్యనూ పోరాడుతూనే ఉంటాము.
@INCIndia @INCTelangana @priyankagandhi
1 month ago | [YT] | 5
View 0 replies
Gaddam Vamsi Krishna
శాంతియుతంగా నిరసన తెలుపుతున్న విద్యార్థులకు సంఘీభావంగా నిలిచిన శ్రీ రాహుల్ గాంధీ గారిని, ఇతర నాయకులను అరెస్ట్ చేయడాన్ని నేను తీవ్రంగా ఖండిస్తున్నాను.
ప్రజాస్వామ్యంలో భిన్నాభిప్రాయం వ్యక్తం చేయడం నేరం కాదు. న్యాయం కోసం తమ గొంతును వినిపిస్తున్న విద్యార్థులను అణచివేయడం కాదు, వారి మాటను వినాలి. ఇది మన రాజ్యాంగం ఆకాంక్షించిన భారతదేశం కాదు.
విద్యార్థులకు మా పూర్తి సంఘీభావం ఉంది. ప్రజాస్వామ్యం, భావ ప్రకటనా స్వేచ్ఛ, అలాగే శాంతియుత నిరసన తెలిపే రాజ్యాంగబద్ధమైన హక్కును పరిరక్షించేందుకు మేము ఎల్లప్పుడూ కట్టుబడి ఉంటాము.
@RahulGandhi @INCIndia @INCTelangana @revanth_anumula
#RahulGandhi #JantarMantar #NEET #StudentProtest #Democracy #FreedomOfExpression
1 month ago | [YT] | 4
View 0 replies
Gaddam Vamsi Krishna
దేశ రాజకీయం లో విశిష్ట సేవలు అందించిన సీనియర్ నాయకులు, కాంగ్రెస్ పార్టీ జాతీయ అధ్యక్షులు శ్రీ మల్లికార్జున ఖర్గే గారికి జన్మదిన శుభాకాంక్షలు.
ఆయురారోగ్యాలతో, సుఖసంతోషాలతో నిండి ప్రజాసేవలో మరెన్నో మైలురాళ్లు అధిరోహించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను.
1 month ago | [YT] | 7
View 0 replies
Gaddam Vamsi Krishna
పెద్దపల్లి పార్లమెంటరీ నియోజకవర్గం గౌరవ పార్లమెంట్ సభ్యులు మరియు సైన్స్ & టెక్నాలజీ స్టాండింగ్ కమిటీ సభ్యులు అయిన శ్రీ జి. వంశీ కృష్ణ గడ్డం గారు, న్యూఢిల్లీలోని CSIR–సెంట్రల్ రోడ్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ (CRRI)లో స్థానిక అధ్యయన పర్యటనకు హాజరయ్యారు.
ఈ పర్యటన "రోడ్లు మరియు వంతెనల రూపకల్పన, నిర్మాణం మరియు నిర్వహణలో పురోగతి"పై దృష్టి సారించింది, ఇక్కడ కమిటీ రోడ్డు మౌలిక సదుపాయాల అభివృద్ధిలో తాజా ఆవిష్కరణలు మరియు పరిశోధనలను సమీక్షించింది.
2 months ago | [YT] | 13
View 0 replies
Gaddam Vamsi Krishna
నేడు పార్లమెంటరీ స్టాండింగ్ కమిటీ ఆధ్వర్యంలో నిర్వహించిన అణుశక్తి విభాగం (Department of Atomic Energy) సమావేశంలో పాల్గొన్నాను. ఈ సమావేశంలో దేశంలో అణుశక్తి రంగ అభివృద్ధి, శాస్త్రీయ పరిశోధనలు, సాంకేతిక ఆవిష్కరణలు, ఇంధన భద్రత, అలాగే భవిష్యత్ కార్యాచరణపై సమగ్రంగా చర్చించాము.
అణుశక్తి విభాగం చేపడుతున్న వివిధ కార్యక్రమాలు, దేశాభివృద్ధిలో వాటి పాత్ర, స్వావలంబన సాధనలో శాస్త్ర సాంకేతిక రంగ ప్రాధాన్యత వంటి అంశాలపై నా అభిప్రాయాలను వెల్లడించాను. శాస్త్రీయ పరిశోధనలు, సాంకేతిక పురోగతి, స్వదేశీ ఆవిష్కరణలు దేశ ప్రగతికి కీలకమని నేను విశ్వసిస్తున్నాను.
పార్లమెంట్ సభ్యుడిగా కమిటీ సమావేశాల ద్వారా ప్రజల ప్రయోజనాలను ప్రతిబింబిస్తూ, దేశ అభివృద్ధికి దోహదపడే విధానాలకు నా వంతు సహకారాన్ని అందిస్తూ నిరంతరం కృషి చేస్తూనే ఉంటాను.
@INCIndia @INCTelangana
2 months ago | [YT] | 7
View 0 replies
Gaddam Vamsi Krishna
సింగరేణి అధికారులతో కలిసి తాడిచెర్ల కోల్ బ్లాక్-2 ప్రాజెక్టు ప్రాంతాన్ని సందర్శించి పనుల పురోగతి, ప్రాజెక్టు పరిస్థితులను ప్రత్యక్షంగా పరిశీలించాను. ఈ సందర్భంగా ప్రాజెక్టు వల్ల ఎన్ని గ్రామాలు ప్రభావితమవుతున్నాయి, ఎంత మంది భూములు కోల్పోతున్నారు, పునరావాసం, పునరుద్ధరణ చర్యలు ఎలా చేపడుతున్నారనే అంశాలపై అధికారులను అడిగి వివరాలు తెలుసుకున్నాను.
సింగరేణి భరోసా పేరుతో పెద్దపల్లి జిల్లాకు వస్తున్న కేంద్ర బొగ్గు శాఖ మంత్రి శ్రీ కిషన్ రెడ్డి గారికి నా స్వాగతం. ఈ సందర్భంగా సింగరేణి కార్మికులకు, ముఖ్యంగా రిటైర్డ్ కార్మికులకు ఉపయోగపడే ఒక గొప్ప నిర్ణయం తీసుకోవాలని కోరుతున్నాను.
తాడిచెర్ల కోల్ బ్లాక్-2కు అవసరమైన పర్యావరణ అనుమతులను అత్యవసరంగా మంజూరు చేసి, మూడు నెలల్లోనే మైన్ పనులు ప్రారంభమయ్యేలా చర్యలు తీసుకోవాలని కేంద్ర ప్రభుత్వాన్ని విజ్ఞప్తి చేస్తున్నాను.
తాడిచెర్ల మైన్ పేరుతో రాజకీయాలు చేయకుండా, అభివృద్ధినే లక్ష్యంగా పెట్టుకొని త్వరితగతిన అన్ని అనుమతులు పూర్తి చేసి పనులు ప్రారంభిస్తే ఈ ప్రాంతానికి ఎంతో మేలు జరుగుతుంది.
ఈ మైన్ ప్రారంభమైతే వేలాది మందికి ఉద్యోగ, ఉపాధి అవకాశాలు లభించడమే కాకుండా, సింగరేణి సంస్థ మరింత బలోపేతం అవుతుంది. ఈ ప్రాజెక్టు ద్వారా సుమారు ₹50,000 కోట్ల టర్నోవర్ పెరిగే అవకాశం ఉంది, ఇది తెలంగాణ పారిశ్రామికాభివృద్ధికి కీలకంగా మారుతుంది.
అలాగే తాడిచెర్ల కోల్ బ్లాక్-2 ప్రారంభాన్ని పురస్కరించుకుని సింగరేణి రిటైర్డ్ కార్మికులకు పెన్షన్ పెంపుపై కేంద్ర ప్రభుత్వం స్పష్టమైన హామీ ఇవ్వాలని నేను కోరుతున్నాను.
ప్రజల అభివృద్ధి, సింగరేణి పరిరక్షణ, కార్మికుల సంక్షేమం కోసం నేను నిరంతరం కృషి చేస్తూనే ఉంటాను.
@INCIndia @INCTelangana
2 months ago | [YT] | 19
View 0 replies
Load more