BHAKTHI TV is a 24x7 satellite devotional channel in Telugu which caters to everyone following Hinduism and interested in Spirituality. It was launched on August 30, 2007. It is also one of the NTV (24x7 News) Product. It's South India's first Telugu devotional channel comprising Daily devotional news, Horoscope, Poojas, Stotra Parayanas and many other Special devotional programs relating to major Hindu festivals


Bhakthi TV

భక్తి టీవీ కోటి దీపోత్సవం 2025🙏🕉️
Bhakthi TV Koti Deepotsavam 2025 begins on 1st November!

Venue:📍NTR stadium, Hyderabad

#KotiDeepotsavam2025 #KarthikaMasam #Hyderabad #KotiDeepotsavam

14 hours ago | [YT] | 354

Bhakthi TV

భక్తి టీవీ కోటి దీపోత్సవం 2025🙏🕉️
Bhakthi TV Koti Deepotsavam 2025 begins on 1st November!

Venue:📍NTR stadium, Hyderabad

#KotiDeepotsavam2025 #KarthikaMasam #Hyderabad #KotiDeepotsavam

1 day ago | [YT] | 315

Bhakthi TV

భక్తి టీవీ కోటి దీపోత్సవం 2025🙏🕉️
Bhakthi TV Koti Deepotsavam 2025 begins on 1st November!

Venue:📍NTR stadium, Hyderabad

#KotiDeepotsavam2025 #KarthikaMasam #Hyderabad #KotiDeepotsavam

2 days ago | [YT] | 232

Bhakthi TV

భక్తి టీవీ కోటి దీపోత్సవం 2025🙏🕉️
Bhakthi TV Koti Deepotsavam 2025 begins on 1st November!

Venue:📍NTR stadium, Hyderabad

#KotiDeepotsavam2025 #KarthikaMasam #Hyderabad #KotiDeepotsavam

2 days ago | [YT] | 411

Bhakthi TV

10th October 2025
సంకష్టహరచతుర్థి :
పౌర్ణమి తరువాత వచ్చే చతుర్థి రోజున చేసే వ్రతంను సంకష్టహర చతుర్థి / సంకటహర చతుర్థి వ్రతం అంటారు. సంకష్టహర చతుర్థి రోజున అరమీటరు పొడవు ఉన్న తెలుపు లేదా ఎరుపు రవికల గుడ్డముక్క తీసుకుని వినాయకుడి ముందు పెట్టి దానిని పసుపు, కుంకుమలతో అలంకరణను చేయాలి. మనస్సులోని కోరికను తలచుకొని మూడు గుప్పిళ్ళ బియ్యాన్ని గుడ్డలో వేసిన తరువాత తమలపాకులో రెండు ఎండు ఖర్జూరాలు, రెండు వక్కలు, దక్షిణ పెట్టి మనసులోని కోరికను మరొకసారి తలచుకుని మూటకట్టాలి. సంకటనాశన గణేశ స్తోత్రం, సంకట హర చతుర్థి వ్రత కథను చదవవలెను. ఆ మూటను స్వామి ముందు పెట్టి ధూపం వెలిగించి కొబ్బరికాయ లేదా పళ్ళు స్వామికి నివేదించాలి. తదుపరి గణపతి ఆలయానికి వెళ్ళి 3 లేక 11 లేక 21 ప్రదక్షిణాలు చేయాలి. శక్త్యానుసారము గరిక పూజను కాని, గణపతి హోమమును కాని చేయిన్చుకోనవచ్చును. సూర్యాస్తమయం వరకూ పూజ చేసిన వినాయకుడిని కడపరాదు. సూర్యుడు అస్తమించిన తరువాత స్నానం చేసి దీపం వెలిగించి తిరిగి వినాయకుడికి లఘువుగా పూజ చేయాలి. నియమం పూర్తయిన తరువాత వినాయకుడికి కట్టిన ముడుపు బియ్యంతో పొంగలి చేసి స్వామికి నివేదించి సాయంత్రం తినాలి. ఈ వ్రతం చేయటం వలన ధనప్రాప్తి, పుత్రప్రాప్తి, ఆరోగ్యప్రాప్తి, విద్యాప్రాప్తి అంతేకాకుండా చాలా పుణ్యం పొందుతారని భావన. ఈ వ్రత మహత్యం వలన ఈ వ్రతం ఆచరించిన వారు ఎవరైనా స్వనంద లోకానికి వెడతారని అక్కడ భగవంతుని ఆశిస్సుల వల్ల ఎంతో ఆనందాన్ని అనుభవిస్తారని అంటారు.

2 days ago | [YT] | 1,604

Bhakthi TV

9th October 2025
అట్ల తద్దియ :
అచ్చ తెలుగుదనం ఉట్టిపడేలా పట్టు పావడాలు కట్టిన పల్లె పడుచులు. తమ ఆశలు ప్రతిఫలించేలా, నవవధువులు ముత్తైదు భాగ్యాలు సిద్ధించేలా, కరచరణాలకు నఖరంజని ధరిస్తారు. తెలుగు లోగిళ్లకు, తోటలకు సరికొత్త అందాలు తెస్తారు. ఆధ్యాత్మిక శోభకు పట్టం కడతారు. కన్నెలు, నవవధువులు చేసే సరదాల సందళ్లు చూసే కన్నులు వెలుగులై, మనసు ముగ్ధమయ్యే కమనీయ రమణీయ పర్వం అట్లతద్ది. అట్లతద్ది ఆశ్వయుజ మాసంలో పౌర్ణమి వెళ్లిన మూడో రోజు వస్తుంది. పెళ్లైన స్త్రీలు ఐదవతనం కోసం, కన్నె పిల్లలు మంచి భర్త కోసం అట్లతద్ది నోము నోచుకోవడం ఆనవాయితీగా కనిపిస్తుంది. అట్లతద్ది రోజున తెల్లవారు జామునే లేచి, స్నానాలు చేసి చద్దిభోజనం చేస్తారు. పగలంతా భోజనం చేయరు. పగలంతా తోటలవెంట చెలులతో ఆట పాటలతో గడిపి సాయంవేళకు ఇళ్లకు చేరుకుంటారు. పొద్దువాలిన తరువాత పదకొండు మంది ముత్తైదువులను ఆహ్వానిస్తారు. పూజగదిలో కలశం ప్రతిష్టించి గౌరీదేవిని ఆవాహన చేసి పూజిస్తారు. పూజలో తులసీదళం, తమలపాకులు తప్పనిసరిగా వినియోగిస్తారు. ఆ ఆకులతో 11 ముళ్లు వేసి చేతులకు తోరాలు కట్టుకుంటారు. అనంతరం అట్లతద్ది కథ చదువుకుంటారు. కథ పూర్తైన తర్వాత అమ్మవారికి కుడుములు, పాలతాలికలు, పులిహోర నైవేద్యంగా సమర్పిస్తారు. ముత్తైదువులకు ఒకొక్కరికీ 11 అట్లు చొప్పున పెట్టి, గౌరీ దేవికి నివేదించిన కుడుముల్లోనుంచి ఒకటి ఉంచిన తాంబూలంతో వాయనం ఇస్తారు. ఆ తర్వాత చంద్రుణ్ణి దర్శించుకుంటారు. తరువాత అట్లు ఆరగించి ఉపవాసం విరమిస్తారు.

3 days ago | [YT] | 812

Bhakthi TV

7th October 2025
విజయనగరం పైడితల్లి సిరిమానోత్సవం :
విజయనగరం పైడిమాంబ ఉత్తరాంధ్ర ప్రజలకు ఇలవేల్పు. పైడిమాంబ సిరిమానోత్సవానికి దేశ విదేశాల నుంచి లక్షలాది భక్తులు విచ్చేస్తారు. ఆశ్వయుజ శుద్ధ పాడ్యమి నుంచి పదహారు రోజుల పాటు పైడితల్లి అమ్మవారి ఉత్సవం కన్నులపండువగా జరుగుతుంది. ఈ ఉత్సవాల్లో విజయదశమి తరువాత వచ్చే మంగళవారంనాడు నిర్వహించే సిరిమానోత్సవం ప్రధానం. పైడితల్లి అమ్మవారికి తొలి సిరిమానోత్సవాన్ని 1758లో నిర్వహించారు. 50 అడుగులు పొడవుండే సిరిమానుకు చివర.. అమ్మవారి రూపంలో పూజారి కూర్చునే విధంగా ఆసనం ఏర్పాటు చేస్తారు. సిరిమానును ఒకబండిపై అమర్చుతారు. సిరిమానుపై అధిష్టించిన పైడితల్లి తిరువీధుల్లో విహరిస్తూ ముమ్మారు కోటశక్తికి ప్రణమిల్లుతుంది. సిరిమానోత్సవం ప్రధానంగా రైతుల ఉత్సవం. అమ్మవారి వద్ద ఉంచిన విత్తనాలు రైతులందరికీ ఇస్తారు. బెస్తవారి వల, ఈటెలు - బల్లేలు, తెల్లఏనుగు వంటివి సిరిమానోత్సవం చూడదగిన విశేషాలు. సిరిమానోత్సవం తరువాతి మంగళవారంనాడు పెద్ద చెరువులో తెప్పోత్సవం నిర్వహిస్తారు. ఆ తరువాత వచ్చే మంగళవారం రాత్రి ఉయ్యాల కంబాలతో పదహారు రోజుల ఉత్సవం పూర్తవు తుంది. ముగింపు వేడుకలో భాగంగా అమ్మవారిని రైల్వేస్టేషన్ వద్ద వనంగుడికి ఊరేగింపుగా తీసుకువెళతారు. అప్పటినుంచి వైశాఖ శుద్ధ నవమి వరకు వనంగుడిలో ఉంచుతారు. దశమినాడు మూడులాంతర్ల సెంటర్ వద్దనున్న చదురుగుడికి చేర్చుతారు. విజయనగర వాసుల కోర్కెలను తీర్చేందుకు సాక్షాత్తూ జగన్మాతయే ఇక్కడికి పైడిమాంబగా వచ్చిందని భక్తుల విశ్వాసం.

5 days ago | [YT] | 733

Bhakthi TV

7th October 2025
వాల్మీకి జయంతి :
నేడు వాల్మీకి మహర్షి జయంతి. ఏ యుగాల నాటిది రామకథ. ఇప్పటిదా! నేటికీ నిత్యనూతనంగానే ఉంది. మౌఖికంగానూ, అక్షరాకృతిలోనూ రామాయణం లేని భాష లేదు. రామకథకు ఎల్లలు లేవు. భాష, ప్రాంతం వంటి స్థాయీ భేదాలు లేవు. ఏమి రామకథా మహత్తు! కోట్లాది ప్రజల మనసులు గెలిచింది. నిత్యపారాయణ గ్రంథంగా మారింది. అంతగొప్ప సాహిత్యాన్ని సృష్టించిన వాల్మీకి కవి హృదయం ఎంత గొప్పది!

5 days ago | [YT] | 635

Bhakthi TV

7th October 2025
ఆశ్వియుజ పూర్ణిమ :
ఆశ్వీయుజ పూర్ణిమకే 'శరత్ పూర్ణిమ' అని పేరు. అమ్మవారి ఆరాధనకు చాలా విశేషమైన రోజు. సాధారణంగా అందరూ దేవీ నవరాత్రులు 9 రోజులు చేస్తే, దేవీ ఉపాసకులు అమ్మవారి ఆరాధన ఆశ్వీయుజ శుద్ధ పాడ్యమి నుంచి పూర్ణిమ వరకు 15 రోజుల పాటు చేస్తారు. ఏడాదిలో ఈ పూర్ణిమనాడు మాత్రమే చంద్రుడు పూర్తి 16 కళలతో ప్రకాశిస్తాడు. అందువల్ల ఈరోజు చంద్రుడిని పూజిస్తే ఎంతో పుణ్యం. ఈ శరత్ పూర్ణిమ రోజున చంద్రకిరణాలకు విశేషమైన శక్తి ఉంటుంది. ఈ కిరణాలు శారీరక, మానసిక రుగ్మతలను దూరం చేస్తాయి. అందువల్ల చంద్రకాంతిలో కూర్చుని లలితా సహస్రనామ పారాయణం చేయడం, ఆవుపాలతో చేసిన పరమాన్నం చంద్రుడికి నివేదన చేసి రాత్రంతా చంద్రకాంతిలో ఉంచి, ఉదయాన్నే దాన్ని ప్రసాదంగా స్వీకరిస్తారు. చంద్రకాంతి నుంచి ఈ పౌర్ణమి రోజున అమృతం కురుస్తుందని శాస్త్రం చెబుతోంది. చంద్రకాంతిలో ఉంచిన పరమాన్నం చంద్రకిరణాలలో ఉన్న ఓషధీతత్త్వాన్ని తనలో ఇముడ్చుకుంటుంది. మర్నాడు ఉదయం పరమాన్నాన్ని కుటుంబసభ్యులందరూ నైవేద్యంగా స్వీకరించాలి. శ్రీకృష్ణుడు పరిపూర్ణావతారం. ఆయనలో 16 కళలున్నాయి. అందుకే ఈ శరత్ పూర్ణిమను బృందావనంలో 'రాసపూర్ణిమ' అంటారు. శ్రీకృష్ణుడు ఈరోజే మహారాసలీల సలిపాడని అంటారు. కృష్ణుడి వేణుగానం విన్న గోపికలు, అన్నీ వదిలేసి ఆయన కోసం అడవిలో పరుగెత్తగా, కొన్ని వేలమంది కృష్ణులు వేలమంది గోపికలతో ఈ పున్నమి రాత్రి మొత్తం నాట్యం చేశారట. ఈ పూర్ణిమక కోశాగరి పూర్ణిమ అనే పేరు కూడా ఉంది. కోజాగరి పూర్ణిమ రోజున లక్ష్మీదేవిని పూజిస్తారు.

5 days ago | [YT] | 769

Bhakthi TV

భక్తి టీవీ కోటి దీపోత్సవం 2025🙏🕉️
Bhakthi TV Koti Deepotsavam 2025 begins on 1st November!

Venue:📍NTR stadium, Hyderabad

#KotiDeepotsavam2025 #KarthikaMasam #Hyderabad #KotiDeepotsavam

6 days ago | [YT] | 492