Vibrant AP – Voice of the People, Vision of the State.
Welcome to Vibrant AP, a dedicated Telugu news channel focusing on the heart of our community. We believe news should be more than just headlines; it should be about the people.
We bring you in-depth coverage of regional affairs, investigative reports, and stories that matter to the common man. From the fields of our farmers to the halls of the Assembly, we are there to witness and report.
Subscribe to Vibrant AP to stay connected with your roots and stay updated on the latest happenings in the Telugu world.
Follow us on Facebook & Instagram for real-time alerts!
VIBRANT AP
మహారాష్ట్ర సీఎం దేవేంద్ర ఫడ్నవీస్ తో
మంత్రి లోకేష్ ఆత్మీయ భేటీ
ఒకవైపు మంత్రిగా క్షణం తీరిక లేని మంత్రి లోకేష్ ముంబైలో పర్యటించారు. మహారాష్ట్ర సీఎం దేవేంద్ర ఫడణవీస్తో ముంబయిలో భేటీ అయ్యారు. సాదర స్వాగతం పలికిన సీఎంను మంగళగిరి చేనేత శాలువాతో సత్కరించి, శ్రీవారి ప్రతిమను లోకేశ్ అందజేశారు. గణేశ్ ప్రతిమను లోకేశ్కు సీఎం దేవేంద్ర బహూకరించారు. ఏపీకి వచ్చిన పెట్టుబడులు, స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ గురించి మహారాష్ట్ర సీఎంకి ఆయన వివరించారు. ఏపీ విద్యా శాఖలో తీసుకువచ్చిన సంస్కరణలు, స్కిల్ డెవలప్మెంట్ విధానాలు ఆయన తెలియజేశారు. మహారాష్ట్ర ఐటీ, విద్యా శాఖలో అమలవుతున్న అత్యుత్తమ విధానాలను మంత్రి లోకేష్ ...సీఎం ఫడ్నవీస్ ని అడిగి తెలుసుకున్నారు.#naralokesh #maharastra #mahendrafadnavis
8 hours ago | [YT] | 589
View 5 replies
VIBRANT AP
తమిళనాడు రాష్ట్రం రాణిపేట జిల్లా షోలింగర్ పట్టణంలోని ప్రసిద్ధ అమృతవల్లి తాయారు యోగ నరసింహస్వామి వారిని విద్య, ఐటీ శాఖల మంత్రి నారా లోకేష్ దర్శించుకున్నారు. అనంతరం రోప్ వే మార్గంలో కొండపై ఉన్న ఆలయానికి చేరుకుని యోగ నరసింహస్వామి వారిని దర్శించుకున్నారు. ఈ సందర్భంగా వేద పండితులు మంత్రికి వేదాశీర్వచనం చేసి, స్వామివారి తీర్థప్రసాదాలు అందజేశారు.
#NaraLokesh
3 days ago | [YT] | 1,423
View 3 replies
VIBRANT AP
ఎన్టీఆర్ స్ఫూర్తితో ముందుకు సాగుదాం
తెలుగు ప్రజల ఆరాధ్య దైవం స్వర్గీయ శ్రీ నందమూరి తారక రామారావు గారి 103వ జయంతి సందర్భంగా హైదరాబాద్లోని ఎన్టీఆర్ మెమోరియల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో నిర్వహించిన ఎన్టీఆర్ గారి జయంతి వేడుకల్లో ట్రస్ట్ మేనేజింగ్ ట్రస్టీగా పాల్గొని, స్వర్గీయ ఎన్టీఆర్ గారి విగ్రహానికి పూలమాలలు వేసి ఘన నివాళులు అర్పించాను.
ఎన్టీఆర్ మెమోరియల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో నిర్వహించిన ఉచిత మెడికల్ క్యాంపుకు జ్యోతి ప్రజ్వలన చేసి కార్యక్రమాన్ని ప్రారంభించిన అనంతరం రక్తదాన శిబిరాన్ని సందర్శించి, రక్తదానం చేస్తున్న దాతలను అభినందించాను. ఎన్టీఆర్ జయంతి రోజున ఈ విధమైన సేవా కార్యక్రమాల్లో పాల్గొనడం ఎంతో ఆనందంగా వుంది. ఈ కార్యక్రమంలో పాల్గొని సేవా స్పూర్తిని చాటిన ప్రతి కార్యకర్తకు, అభిమానులకు అభినందనలు. ఎన్టీఆర్ గారి ఆశయాలు చిరస్థాయిగా ప్రజల్లో నిలిచేలా మనందరం కలిసి ముందుకు సాగుదాం.#JoharNTR #NTRJayanthi #NTR103 #NTRMemorialTrust #NTRLegacy #SocialService #BloodDonation #MedicalCamp #NandamuriTarakaRamaRao #AndhraPradesh #Telangana #Hyderabad
4 days ago | [YT] | 1,413
View 12 replies
VIBRANT AP
ఎన్టీఆర్ జయంతి సందర్భంగా పార్టీ కేంద్ర కార్యాలయంలో ఆయన విగ్రహానికి పూలమాల వేసి నివాళులు అర్పించిన టీడీపీ జాతీయ అధ్యక్షులు, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు. ఎన్టీఆర్ విగ్రహానికి పుష్పాంజలి ఘటించిన నేషనల్ వర్కింగ్ ప్రెసిడెంట్ నారా లోకేష్ గారు, సీనియర్ నేతలు, మంత్రులు, పొలిట్ బ్యూరో సభ్యులు.
#Mahanadu2026
#NTRLivesOn
#NaaTDPNaaBadhyata
#SthreeShakti
#TeluguDesamParty
#నాతెలుగుదేశంనాబాధ్యత
4 days ago | [YT] | 868
View 2 replies
VIBRANT AP
అమరావతి వేదికగా జరుగుతున్న మహానాడు కార్యక్రమంలో పాల్గొని, మహిళా రిజర్వేషన్ ప్రవేశపెట్టే తీర్మానంపై ప్రసంగించడం జరిగింది. స్త్రీశక్తి ప్రధాన థీమ్గా కొనసాగుతున్న మహానాడు వేదికగా రాబోయే 2029 ఎన్నికల్లో మహిళలకు 33% సీట్లు కేటాయించాలని నిర్ణయం తీసుకున్న గౌరవనీయులు నారా చంద్రబాబు నాయుడు గారికి, ఈ ప్రతిపాదన చేసిన నారా లోకేష్ గారికి హృదయపూర్వక ధన్యవాదాలు.
@ncbn
@naralokesh
#Mahanadu2026 #NaaTDPNaaBadhyata #SthreeShakti #TeluguDesamParty #నాతెలుగుదేశంనాబాధ్యత
5 days ago (edited) | [YT] | 666
View 6 replies
VIBRANT AP
మహానాడు సభలో ప్రసంగించిన టీడీపీ అధినేత, ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు. మంత్రి, తెలుగుదేశం పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ నారా లోకేష్ గారు
#Mahanadu2026
#NaaTDPNaaBadhyata
#SthreeShakti
#TeluguDesamParty
#నాతెలుగుదేశంనాబాధ్యత
5 days ago | [YT] | 538
View 4 replies
VIBRANT AP
మంగళగిరి తెలుగుదేశం పార్టీ కేంద్ర కార్యాలయంలో టీడీపీ జాతీయ అధ్యక్షుడు నారా చంద్రబాబునాయుడు, జాతీయ కార్యనిర్వాహక అధ్యక్షుడు నారా లోకేష్తో కలిసి పార్టీ జెండా ఆవిష్కరణతో మహానాడు 2026 పండుగ ప్రారంభమైంది. ఈ సందర్భంగా ఎన్టీఆర్ విగ్రహానికి నివాళులు అర్పించారు.
#Mahanadu2026
#NaaTDPNaaBadhyata
#SthreeShakti
#TeluguDesamParty
#నాతెలుగుదేశంనాబాధ్యత
#ChandrababuNaidu
#NaraLokesh
5 days ago | [YT] | 746
View 13 replies
VIBRANT AP
కోనసీమ నుండి హైదరాబాద్కు తరలిన ఎన్టీఆర్ భారీ కాంస్య విగ్రహం
కొత్తపేట వడయార్ శిల్పశాలలో ప్రముఖ శిల్పి రాజ్కుమార్ వడయార్ చేతిలో రూపుదిద్దుకున్న నందమూరి తారకరామారావు కాంస్య విగ్రహాన్ని సోమవారం హైదరాబాద్కు తరలించారు.
అన్నగారి జయంతిని పురస్కరించుకుని ఈ నెల 28న అమీర్పేట మైత్రీవనం కూడలిలో తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చేతుల మీదుగా ఈ విగ్రహాన్ని ఆవిష్కరించనున్నారు.
రాష్ట్ర విభజన తర్వాత హైదరాబాద్ నడిబొడ్డున ఏర్పాటు చేస్తున్న తొలి ఎన్టీఆర్ విగ్రహం ఇదే కావడం విశేషం.
#IconNewsBreakings
6 days ago | [YT] | 536
View 3 replies
VIBRANT AP
ఢిల్లీలో‘అప్నాపన్’పుస్తకావిష్కరణ
స్పెషల్ అట్రాక్షన్ గా నిలిచిన మంత్రి లోకేష్
ఒకవైపు మంత్రిగా, మరోవైపు టీడీపీ వర్కింగ్ ప్రెసిడెంట్ గా క్షణం తీరిక లేకున్నా.. ఢిల్లీ పర్యటనకు వెళ్లారు మంత్రి నారా లోకేష్. ప్రధానమంత్రి నరేంద్ర మోడీతో తనకు ఉన్న అనుబంధంపై కేంద్ర వ్యవసాయ, గ్రామీణాభివృద్ధి శాఖల మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ రచించిన “అప్నాపన్: మై ఎక్స్ పీరియెన్సెస్ విత్ నరేంద్ర మోదీ” పుస్తకావిష్కరణ కార్యక్రమంలో విద్య, ఐటీ శాఖల మంత్రి నారా లోకేష్ పాల్గొన్నారు.ప్రధానమంత్రి నరేంద్ర మోదీతో తనకు ఉన్న 35 ఏళ్ల సుదీర్ఘ అనుభవాలను, ఆత్మీయ ప్రయాణాన్ని మరియు జ్ఞాపకాలను శివరాజ్ సింగ్ చౌహాన్ ఈ పుస్తకంలో పొందుపరిచారు. ఢిల్లీలోని భారతీయ వ్యవసాయ పరిశోధన మండలి ఆవరణలో ‘అప్నాపన్’ పుస్తక ఆవిష్కరణ కార్యక్రమం ఘనంగా జరిగింది. ఈ వేడుకలో మాజీ ప్రధాని హెచ్ డీ దేవగౌడ, మాజీ ఉపరాష్ట్రపతి ఎం.వెంకయ్యనాయుడు ముఖ్య అతిథులుగా పాల్గొన్నారు. హెచ్ డీ దేవెగౌడ, కుమారస్వామిలను పలకరించారు మంత్రి లోకేష్. ‘అప్నాపన్’ పుస్తకావిష్కరణలో మంత్రి లోకేష్ అందరినీ ఆప్యాయంగా పలకరిస్తూ ప్రధాన ఆకర్షణగా నిలిచారు. ఈ కార్యక్రమంలో ఢిల్లీ ముఖ్యమంత్రి రేఖా గుప్తాతో పాటు పలువురు కేంద్ర మంత్రులు రామ్మోహననాయుడు, పెమ్మసాని చంద్రశేఖర్, ఎంపీలు, బీజేపీ నాయకులు, పలువురు సాహితీ ప్రముఖులు పాల్గొన్నారు.
6 days ago | [YT] | 679
View 12 replies
VIBRANT AP
తిరుమల శ్రీవారిని దర్శించుకున్న
కేంద్రమంత్రి రామ్మోహననాయుడు
తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామి వారిని కుటుంబ సభ్యులతో పాటుగా దర్శించుకున్నారు కేంద్రమంత్రి కింజరాపు రామ్మోహననాయుడు. దేశ ప్రజలందరూ సుభిక్షంగా, ఆయురారోగ్యాలతో ఉండాలని ఆయన వేడుకున్నారు. వెంకటేశ్వర స్వామి దర్శనం ఎప్పుడూ గొప్ప ఆధ్యాత్మిక చింతనను అందిస్తుందన్నారు.
1 week ago | [YT] | 587
View 4 replies
Load more