Vibrant AP – Voice of the People, Vision of the State.

Welcome to Vibrant AP, a dedicated Telugu news channel focusing on the heart of our community. We believe news should be more than just headlines; it should be about the people.

We bring you in-depth coverage of regional affairs, investigative reports, and stories that matter to the common man. From the fields of our farmers to the halls of the Assembly, we are there to witness and report.

Subscribe to Vibrant AP to stay connected with your roots and stay updated on the latest happenings in the Telugu world.

Follow us on Facebook & Instagram for real-time alerts!






VIBRANT AP

విశాఖపట్నం అరిలోవ ప్రాంతంలోని తోటగరువులో ప్రముఖ బ్యాడ్మింటన్ క్రీడాకారిణి పీవీ సింధు గారు తలపెట్టిన సెంటర్ ఫర్ స్పోర్ట్స్ ఎక్స్ లెన్స్ నిర్మాణ పనులకు రాష్ట్ర క్రీడా శాఖ మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి గారితో కలిసి భూమిపూజ చేశాను. శిలాఫలకాన్ని ఆవిష్కరించాను. అకాడమీ భవన నమూనాతో పాటు క్రీడాకారులకు అందుబాటులోకి రానున్న అత్యాధునిక సౌకర్యాలు, వసతుల గురించి అడిగి తెలుసుకున్నాను.
@Pvsindhu1

2 hours ago | [YT] | 168

VIBRANT AP

ఉండవల్లి నివాసంలో జాబ్ కేలండర్-2026పై మంత్రుల బృందం సమీక్ష నిర్వహించింది. ఈ సందర్భంగా వివిధ శాఖల్లో భర్తీ చేయాల్సిన పోస్టుల గురించి అధికారులు వివరించారు. వివిధ విభాగాల్లోని ఖాళీలను డిపార్ట్ మెంట్ అవసరాలను దృష్టిలో ఉంచుకుని భర్తీ చేయాలని సీఎం గారు నిర్దేశించారని, ఆ దిశగా అధికారులు చర్యలు చేపట్టాలని మంత్రుల బృందం ఆదేశించింది. మొత్తంగా 10,060 పోస్టుల భర్తీకి చర్యలు తీసుకోవాలని, ఉద్యోగాల భర్తీ ప్రక్రియలో ఎలాంటి వివాదాలకు ఆస్కారం లేకుండా సకాలంలో పోస్టులు భర్తీ చేసి, ప్రతి ఏడాది జాబ్ కేలండర్ విడుదల చేయాలని ఆదేశించడం జరిగింది.

5 days ago | [YT] | 552

VIBRANT AP

కుప్పం నియోజవర్గంలోని విజిలాపురం చెరువును నారా భువనేశ్వరి గారు పరిశీలించారు. హంద్రీనీవా ద్వారా కృష్ణా జలాలతో చెరువును నింపారని, దీంతో సాగు, తాగునీటి ఇబ్బందులు తొలిగాయని రైతులు, స్థానికులు భువనేశ్వరికి వివరించారు.
#Kuppam
#NaraBhuvaneswari
#AndhraPradesh

1 week ago | [YT] | 1,267

VIBRANT AP

సంజీవని కార్యక్రమంలో భాగంగా కర్నూలు జిల్లా ఆలూరు నియోజకవర్గంలోని ఆస్పరికి చేరుకున్న గౌరవ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు కు నేడు మంత్రులు, స్థానిక ప్రజా ప్రతినిధులు, నేతలు, కర్నూలు జిల్లా అధికారులు ఘన స్వాగతం పలికారు.
#AndhraPradesh

1 week ago | [YT] | 1,306

VIBRANT AP

ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ తో ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు నేడు పార్లమెంట్ హౌస్ లో భేటీ అయ్యారు. ఆగస్ట్ 1వ తేదీన జరిగే శ్రీ అల్లూరి సీతారామరాజు అంతర్జాతీయ విమానాశ్రయం ప్రారంభోత్సవానికి ప్రధానిని ఆహ్వానించారు.
@narendramodi

@ncbn

@PMOIndia

2 weeks ago | [YT] | 1,504

VIBRANT AP

మంగళగిరి కొండపనేని టౌన్ షిప్ పార్క్ లో మంగళగిరి నియోజకవర్గ తల్లికి వందనం పథకం లబ్ధిదారులతో ముఖాముఖి కార్యక్రమం నిర్వహించాను. తల్లికి వందనం పథకం అందుతున్న తీరు, ప్రభుత్వం అందిస్తున్న ఆర్థిక సాయం ఏ విధంగా ఉపయోగపడుతోందనే విషయాలపై ఆరా తీశాను. విద్యార్థుల తల్లుల నుంచి సలహాలు, సూచనలు స్వీకరించాను. ఈ నెల 22 నుంచి 24వ తేదీలోగా తల్లికి వందనం పథకం కింద ఆర్థికసాయం తల్లుల ఖాతాల్లో జమఅవుతాయని వివరించాను. ప్రభుత్వ పాఠశాలల బలోపేతమే లక్ష్యమని, ప్రభుత్వ పాఠశాలలను చూసి అసూయపడేలా చేస్తామని చెప్పాను. మంగళగిరి నియోజకవర్గాన్ని నెం.1గా తీర్చిదిద్దుతామని తెలిపాను.#TallikiVandanam

2 weeks ago | [YT] | 1,148

VIBRANT AP

మాతా శిశు సంక్షేమానికి అత్యున్నత ప్రాధాన్యత ఇస్తున్న రాష్ట్ర ప్రభుత్వం, గర్భిణి స్త్రీలు, బాలింతలు, నవజాత శిశువులకు మరింత నాణ్యమైన, సురక్షితమైన రవాణా సేవల్ని అందించేందుకు 'తల్లి–బిడ్డ ఎక్స్‌ప్రెస్' వాహనాలను అందుబాటులోకి తెస్తోంది. ఈ వాహనాలను గౌరవ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబునాయుడు నేడు సీఎం క్యాంపు కార్యాలయంలో పరిశీలించారు. ఈ సందర్భంగా వాహనాల రూపకల్పన, భద్రతా ప్రమాణాలు, తల్లి–శిశువులకు కల్పించిన ప్రత్యేక సౌకర్యాలు, వాహనాలపై రూపొందించిన బ్రాండింగ్ నమూనాలను క్షుణ్ణంగా పరిశీలించారు. ప్రజలకు ఈ సేవలపై స్పష్టమైన అవగాహన కలిగేలా, ప్రభుత్వ సంక్షేమ కార్యక్రమాన్ని ప్రతిబింబించేలా రూపొందించిన బ్రాండింగ్ డిజైన్లకు ఆమోదం తెలిపారు. ఈ కార్యక్రమం కోసం రాష్ట్రవ్యాప్తంగా 500 ప్రత్యేక SUV/MUV వాహనాలను వినియోగించనున్నారు. ప్రతి సంవత్సరం సుమారు 2.75 లక్షల మందికి ప్రయోజనం చేకూరునన్నది. ఈ కార్యక్రమంలో వైద్య, ఆరోగ్య-కుటుంబ సంక్షేమ శాఖ కార్యదర్శి శ్రీ వీరపాండ్యన్, ఆ శాఖ ఉన్నతాధికారులు, జాతీయ ఆరోగ్య మిషన్ (NHM) అధికారులు పాల్గొన్నారు.
#AndhraPradesh

2 weeks ago | [YT] | 455

VIBRANT AP

ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారితో కేంద్ర ఆర్థిక శాఖామంత్రి నిర్మిలా సీతారామన్ గారు మర్యాదపూర్వకంగా భేటీ అయ్యారు. తమ నివాసానికి వచ్చిన నిర్మాలా సీతారామన్‌కు సీఎం చంద్రబాబు, మంత్రి నారా లోకేష్ సాదర స్వాగతం పలికారు.
#NirmalaSitharaman
#ChandrababuNaidu
#NaraLokesh
#AndhraPradesh

2 weeks ago | [YT] | 1,903

VIBRANT AP

ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కి
గవర్నర్ అబ్దుల్ నజీర్ పరామర్శ

హైదరాబాద్‌లోని పవన్ నివాసానికి వెళ్లిన గవర్నర్ జస్టిస్ అబ్దుల్ నజీర్ పవన్ ఆరోగ్య పరిస్థితిపై ఆరా తీశారు. వైద్యుల సూచనలు తప్పకుండా పాటించాలని పవన్‌కు సూచించారు గవర్నర్ అబ్దుల్ నజీర్. డిప్యూటీ సీఎం పవన్ గత కొంతకాలంగా భుజం నొప్పితో ఇబ్బంది పడుతున్నారు. ఈ క్రమంలో ముంబైలోని కోకిలాబెన్ ధీరూభాయ్ అంబానీ ఆస్పత్రిలో కుడి భుజానికి ఆపరేషన్ చేయించుకున్నారు. ముంబైనుంచి వచ్చిన పవన్ హైదరాబాద్ లో విశ్రాంతి తీసుకుంటున్నారు. పవన్ కళ్యాణ్ త్వరగా కోలుకుని పూర్తి ఆరోగ్యంతో విధుల్లోకి రావాలని గవర్నర్ ఆకాంక్షించారు.పవన్ స్వగృహంలోని లైబ్రరీని గవర్నర్ నజీర్ సందర్శించారు. లైబ్రరీలోని పలు పుస్తకాలను పరిశీలించారు. రచయితలు, స్కాలర్స్, పబ్లిక్ పాలసీ నిపుణుల పుస్తకాలపై చర్చించారు. పవన్ అభ్యర్థనపై ఓ పుస్తకంపై గవర్నర్ ఆటోగ్రాఫ్ చేశారు. ఆప్యాయంగా వచ్చి పరామర్శించిన గవర్నర్‌కు పవన్ కల్యాణ్ కృతజ్ఞతలు తెలిపారు.

2 weeks ago | [YT] | 510

VIBRANT AP

'ఎక్స్‌ప్రెస్ అడ్డా' (Express Adda) వేదికగా ఆంధ్రప్రదేశ్ పరివర్తన, రియల్-టైమ్ గవర్నెన్స్ (real-time governance) శక్తి, ప్రపంచ స్థాయి పెట్టుబడులను ఆకర్షించడం మరియు నాయుడు-మోదీ భాగస్వామ్యం రాష్ట్ర అభివృద్ధిని ఎలా వేగవంతం చేస్తోంది అనే అంశాలపై జరిగిన విస్తృతమైన చర్చను నేను ఎంతో ఆస్వాదించాను. నన్ను ఆహ్వానించినందుకు ధన్యవాదాలు!

3 weeks ago | [YT] | 276