Vibrant AP – Voice of the People, Vision of the State.
Welcome to Vibrant AP, a dedicated Telugu news channel focusing on the heart of our community. We believe news should be more than just headlines; it should be about the people.
We bring you in-depth coverage of regional affairs, investigative reports, and stories that matter to the common man. From the fields of our farmers to the halls of the Assembly, we are there to witness and report.
Subscribe to Vibrant AP to stay connected with your roots and stay updated on the latest happenings in the Telugu world.
Follow us on Facebook & Instagram for real-time alerts!
VIBRANT AP
కర్నూలు జిల్లా జొన్నగిరిలో గౌరవ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడుకు నేడు మంత్రులు, ప్రజాప్రతినిధులు, కూటమి నేతలు, అధికారులు ఘన స్వాగతం పలికారు.
#AndhraPradesh
7 hours ago | [YT] | 691
View 4 replies
VIBRANT AP
కృష్ణా జిల్లా అవనిగడ్డ నియోజకవర్గం మోపిదేవి మండలం కొక్కిలిగడ్డలో నూతనంగా నిర్మించిన జెడ్పీ హైస్కూలు భవనాలను ప్రారంభించాను. ఈ సందర్భంగా కొక్కిలిగడ్డ హైస్కూలు ఉపాధ్యాయులతో మాట్లాడాను. సమాజంలో మార్పు తెచ్చేందుకే అత్యంత కఠినమైన విద్యాశాఖను ఎంచుకున్నాను. విద్యావ్యవస్థలో మార్పు తేవడం ఉపాధ్యాయుల సహకారంతోనే సాధ్యమవుతుంది. దేశంలోనే ఆదర్శవంతంగా ఏపీ మోడల్ ఆఫ్ ఎడ్యుకేషన్ తీసుకురావాలన్నది నా ధ్యేయం. ఉపాధ్యాయులు, తల్లిదండ్రులు, అధికారుల సమష్టి కృషితోనే ఇది సాధ్యమవుతుంది.
7 hours ago | [YT] | 149
View 2 replies
VIBRANT AP
కోల్ కతాలో కాళీమాతను
దర్శించుకున్న మంత్రి లోకేష్
కోల్ కతా పర్యటనలో మంత్రి లోకేష్ బిజీబిజీగా మారిపోయారు. ఒకవైపు ఏపీకి పెట్టుబడుల గురించి ఆలోచిస్తూనే ...మరో వైపు ఆధ్యాత్మికతకు ప్రాధాన్యత ఇస్తున్నారు. ఏపీ విద్య, ఐటీ శాఖల మంత్రి నారా లోకేష్ కోల్కతాలోని కాళీ మాత ఆలయాన్ని సందర్శించారు. ఈ సందర్బంగా ఆలయ కమిటీ ప్రతినిధులు లోకేష్కు స్వాగతం పలికారు. కాళీమాతను దర్శించుకుని, ప్రత్యేక పూజలు చేశారు. శక్తి స్వరూపిణి కోల్కతా కాళీ మాతను దర్శించుకోవడం చాలా ఆనందంగా ఉందని లోకేష్ తెలిపారు. ఆంధ్రప్రదేశ్ అన్నిరంగాల్లో అగ్రగామిగా ఉండాలని, ప్రజలందరికీ ఆయురారోగ్యాలు, ఆనందమయ జీవితం ప్రసాదించాలని కాళీమాతను వేడుకున్నానన్నారు మంత్రి లోకేష్. అమ్మవారి ఆలయ నిర్మాణం గురించి.. పూజల గురించి ఆలయ పూజారుల్ని అడిగి తెలుసుకున్నారు మంత్రి లోకేష్. భారతదేశంలోని 51 శక్తి పీఠాలలో కాళీఘాట్ దేవాలయం ఒకటి. సతీదేవి కుడి పాదం యొక్క కాలివేళ్లు పడిన ప్రదేశంగా భక్తులు విశ్వసిస్తారు. ఇది కాళీకుల ఆరాధనకు అత్యంత ప్రసిద్ధి. ఇక్కడ అమ్మవారిని కోరుకుంటే ఏ కోరికైనా సిద్దిస్తుందని భక్తులు నమ్ముతారు.
4 days ago | [YT] | 342
View 3 replies
VIBRANT AP
విజయవాడ కృష్ణ లంకకు చెందిన గాదె సాయి కృష్ణ తల్లి విజయలక్ష్మి, కుటుంబ సభ్యులతో సహా గౌరవ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబునాయుడును నేడు కలిశారు. తన కుమారుడి అదృశ్యం ఘటనపై విచారణ జరిపి న్యాయం చేయాలని ఆమె సీఎంను కోరారు. ఈ సందర్భంగా సీఎం ఆమెకు ధైర్యం చెప్పి, ఘటనపై నిష్పక్షపాతంగా దర్యాప్తు జరిపిస్తామని హామీ ఇచ్చారు. న్యాయం చేస్తామని సీఎం హామీ ఇవ్వడంపై విజయలక్ష్మి సంతృప్తి వ్యక్తం చేశారు. ముఖ్యమంత్రిని కలిసిన తర్వాత తమకు న్యాయం జరుగుతుందనే విశ్వాసాన్ని ఆమె వ్యక్తం చేశారు. సమగ్ర విచారణ జరిపి నిందితులకు శిక్ష పడేలా చూస్తామని సీఎం హామీ ఇచ్చారని గాదె విజయలక్ష్మి తెలిపారు.
#AndhraPradesh
5 days ago | [YT] | 594
View 4 replies
VIBRANT AP
కోల్ కతా టూర్ లో మంత్రి లోకేష్ బిజీబిజీ
కోల్ కతా టూర్లో మంత్రి లోకేష్ బిజీబీజీగా ఉన్నారు. వీసా స్టీల్ వైస్ చైర్మన్ & మేనేజింగ్ డైరక్టర్ విశాల్ అగర్వాల్, ఇమామీ గ్రూప్ డైరక్టర్ ఆదిత్య ఆగర్వాల్, శ్రీ సిమెంట్స్ వైస్ చైర్మన్ ప్రశాంత్ బంగూర్లతో మంత్రి లోకేష్ భేటీ అయ్యారు.ఆంధ్రప్రదేశ్ లో పారిశ్రామికాభివృద్ధి, పెట్టుబడుల ఆకర్షణ, ఉపాధి కల్పనకు వ్యూహాత్మకంగా సంస్కరణలను అమలుచేస్తున్న తీరును వివరించారు. తూర్పు తీర ప్రాంతంలో కీలక ఆర్థిక భాగస్వామిగా ఆంధ్రప్రదేశ్ పోషిస్తున్న పాత్రను ఆయన ప్రస్తావించారు. విస్తారమైన తీరప్రాంతం, ప్రపంచ స్థాయి ఓడరేవులు, మెరుగుపడుతున్న లాజిస్టిక్స్, భూమి, విద్యుత్ లభ్యత, ఇన్వెస్టర్స్ ఫ్రెండ్లీ పాలసీలు ఏపీలో సానుకూల అంశాలుగా పేర్కొన్నారు. భారతదేశంలో ఇండస్ట్రియల్, మ్యానుఫ్యాక్చరింగ్ హబ్ గా ఆంధ్రప్రదేశ్ ను తీర్చిదిద్దాలన్నది తమ లక్ష్యంగా మంత్రి లోకేష్ చెప్పారు.
5 days ago | [YT] | 478
View 2 replies
VIBRANT AP
ఉండవల్లి నివాసంలో పాఠశాల, ఉన్నత విద్య అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించాను. ప్రతి విద్యార్థికి తల్లికి వందనం పథకం కింద ఆర్థిక సాయం త్వరితగతిన అందేలా చర్యలు తీసుకోవాలని ఆదేశించాను. ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థుల ప్రవేశాల పెంపుపై ప్రత్యేక చర్యలు తీసుకోవాలని సూచించాను. రాష్ట్రంలో 12రకాల కామన్ ఎంట్రన్స్ టెస్ట్ లకు ఎలాంటి జాప్యం లేకుండా సాధ్యమైనంత త్వరగా నోటిఫికేషన్లు విడుదల చేసి, నిర్ణీత సమయంలో అడ్మిషన్లు జరిగేలా చర్యలు తీసుకోవాలని ఆదేశించాను.
1 week ago | [YT] | 532
View 0 replies
VIBRANT AP
నిడమర్రు ఆర్వో బ్రిడ్జికి మంత్రి నారా లోకేష్, కేంద్రమంత్రి పెమ్మసాని శంకుస్థాపన..
మంగళగిరి-నిడమర్రు రోడ్డులో రైల్వే ఓవర్ బ్రిడ్జికి శంకుస్థాపన.. రూ.142 కోట్లతో మంగళగిరి వాసుల దశాబ్దాల కల నెరవేర్చిన నారా లోకేష్, పెమ్మసాని..
#NaraLokesh #andhrapradesh
1 week ago | [YT] | 752
View 1 reply
VIBRANT AP
ఆంధ్రప్రదేశ్లో వరల్డ్ క్లాస్ 'సప్లై చైన్ సిటీ'.. సింగపూర్లో సీఎం చంద్రబాబు నాయుడు గారి బిగ్ ప్లాన్! 🎯✈️సింగపూర్ పర్యటనలో ఉన్న ఏపీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు నిన్న YCH గ్రూప్ హెడ్ ఆఫ్ ఆపరేషన్స్ 'సునీల్ నంబియార్' గారితో కీలక భేటీ నిర్వహించారు. ఆంధ్రప్రదేశ్లో అత్యాధునిక సాంకేతికతతో కూడిన వరల్డ్ క్లాస్ సప్లై చైన్ సిటీ (Supply Chain City), లాజిస్టిక్స్ పార్కులు, మరియు సప్లై చైన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఏర్పాటుపై ఈ సమావేశంలో సుదీర్ఘంగా చర్చించారు. అలాగే రాష్ట్రంలో ఉన్న హార్టికల్చర్, ఆక్వాకల్చర్, ఫుడ్ ప్రాసెసింగ్ మరియు ఎక్స్పోర్ట్ రంగాలలోని అపారమైన పెట్టుబడి అవకాశాలను వివరించి, ఏపీలో ఇన్వెస్ట్ చేయాల్సిందిగా YCH గ్రూప్ను సీఎం ఆహ్వానించారు. 'స్పీడ్ ఈజ్ ఏపీ' నినాదంతో నవ్యాంధ్రను గ్లోబల్ ఇన్వెస్ట్మెంట్ హబ్గా మార్చేందుకు బాబు గారు వేస్తున్న అడుగులపై మీ అభిప్రాయాన్ని కామెంట్ చేయండి! 🤝✨#ChandrababuNaidu #InvestInAP #ChooseSpeedChooseAP #YCHGroup #SingaporeVisit #APDevelopment #Amaravati #AndhraPradeshNews
1 week ago | [YT] | 688
View 3 replies
VIBRANT AP
మంత్రి నారా లోకేష్ దంపతులకు
ఏకాదశ మహాన్యాస పూర్వక రుద్రాభిషేకం
విశిష్టమైన సోమవారం విద్య, ఐటీ శాఖల మంత్రి నారా లోకేష్, బ్రాహ్మణి దంపతులు హైదరాబాద్ నివాసంలో వేద పండితుల ఆధ్వర్యంలో ఏకాదశ మహాన్యాస పూర్వక రుద్రాభిషేకం నిర్వహించారు. ఆయురారోగ్యాలు, రాష్ట్ర ప్రగతి, ప్రజా సంక్షేమం కాంక్షిస్తూ మహాశివుడికి రుద్రాభిషేకం చేశారు. రుత్వికుల వేదమంత్రాల మధ్య లోకేష్ దంపతులు భక్తిశ్రద్ధలతో పూజలు చేశారు.
1 week ago | [YT] | 1,579
View 18 replies
VIBRANT AP
స్టార్టప్ వెంచర్ కాపిటలిస్టులతో నిర్వహించిన రౌండ్ టేబుల్ సమావేశానికి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు హాజరయ్యారు. సింగపూర్లోని భారత హైకమిషనర్ శిల్పక్ అంబులే, మంత్రి పి.నారాయణ, సింగపూర్ స్టార్టప్ వెంచర్ కాపిటలిస్టులు ఈ సమావేశంలో పాల్గొన్నారు.
#ChooseSpeedChooseAP
#InvestInAP
#CBNinSingapore
#ChandrababuNaidu
1 week ago | [YT] | 288
View 3 replies
Load more