Vibrant AP – Voice of the People, Vision of the State.

Welcome to Vibrant AP, a dedicated Telugu news channel focusing on the heart of our community. We believe news should be more than just headlines; it should be about the people.

We bring you in-depth coverage of regional affairs, investigative reports, and stories that matter to the common man. From the fields of our farmers to the halls of the Assembly, we are there to witness and report.

Subscribe to Vibrant AP to stay connected with your roots and stay updated on the latest happenings in the Telugu world.

Follow us on Facebook & Instagram for real-time alerts!






VIBRANT AP

బళ్లారిలోని జిందాల్ విజయ్ నగర్ ఎయిర్ పోర్ట్ కు చేరుకున్న విద్య, ఐటీ శాఖల మంత్రి నారా లోకేష్‌కు కర్ణాటక మంత్రి నాగేంద్ర, ఆర్థిక మంత్రి పయ్యావుల కేశవ్, ఎంపీలు బీకే పార్థసారథి, అంబికా లక్ష్మీనారాయణ, ఎమ్మెల్యేలు దగ్గుపాటి ప్రసాద్, అమిలినేని సురేంద్రబాబు, పల్లె సింధూర రెడ్డి, టీడీపీ సీనియర్ నాయకులు పల్లె రఘునాథ్ రెడ్డి, ఏపీఐఐసీ డైరెక్టర్ చల్లా లక్ష్మీ ప్రసాద్, టీడీపీ ఆర్గనైజింగ్ సెక్రటరీ ఉమర్, టీడీపీ నాయకులు, కార్యకర్తలు ఘన స్వాగతం పలికారు.
#NaraLokesh

1 day ago | [YT] | 1,175

VIBRANT AP

విశాఖపట్నం పార్టీ కార్యాలయంలో 82వ రోజు ప్రజాదర్బార్ నిర్వహించాను. టీడీపీ కార్యకర్తలు, ప్రజలను కలిసి వివిధ సమస్యలపై వినతులు స్వీకరించాను. ఆయా విజ్ఞప్తులను పరిశీలించి సమస్యల పరిష్కారానికి కృషిచేస్తానని హామీ ఇచ్చాను.
#PRAJADARBAR

4 days ago | [YT] | 1,213

VIBRANT AP

స్మార్ట్ గవర్నెన్స్ లో ఏపీ సహకారం కోరిన ఢిల్లీ

సచివాలయంలోని ఆర్టీజీఎస్ లో రాష్ట్ర పరిశ్రమల శాఖ అధికారులతో ఢిల్లీ ప్ర‌భుత్వ ప‌రిశ్ర‌మ‌లు, అట‌వీ, ప‌ర్యావ‌ర‌ణ శాఖ మంత్రి స‌ర్దార్ మ‌న్‌జింద‌ర్ సింగ్ శిర్సా గారి నేతృత్వంలో ప్ర‌తినిధుల బృందం స‌మావేశ‌మైంది. ఈ బృందానికి ప‌రిశ్ర‌మ‌ల శాఖ మంత్రి టీజీ భ‌ర‌త్‌ గారితో కలిసి స్వాగ‌తం ప‌లికారు మంత్రి లోకేష్. అనంతరం రాష్ట్ర ప్ర‌భుత్వం అమ‌లు చేస్తున్న పారిశ్రామిక విధానం గురించి వివ‌రించారు. ఈ సందర్భంగా శిర్సా గారు మాట్లాడుతూ.. ఏపీ పారిశ్రామికాభివృద్ధి విధానం బాగుందని ప్రశంసించారు. అమరావతి రాజధాని నిర్మాణం అద్భుతమని, ప్రపంచంలోనే గొప్ప నగరంగా మారుతుందన్నారు. పెట్టుబ‌డుల ఆక‌ర్ష‌ణ‌, స్మార్ట్ గ‌వ‌ర్నెన్స్ త‌దిత‌ర రంగాల్లో ఏపీ ప్రభుత్వ స‌హ‌కారం కావాలని కోరారు. పూర్తి స‌హ‌కారం అందించ‌డానికి సిద్ధంగా ఉన్నామని చెప్పానన్నారు మంత్రి లోకేష్.

1 week ago | [YT] | 569

VIBRANT AP

ఫిన్లాండ్ పర్యటనకు ఉత్తమ టీచర్లు

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఉత్తమ ఉపాధ్యాయ పురస్కార గ్రహీతలు 29 మంది ఫిన్లాండ్‌లోని 'యూనివర్సిటీ ఆఫ్ తుర్కు'లో తమ అధ్యయన యాత్రను ప్రారంభించడం ఎంతో అభినందనీయం! ప్రపంచవ్యాప్తంగా ప్రసిద్ధి చెందిన ఫిన్లాండ్ విద్యా విధానాన్ని—పిల్లల మానసిక వికాసానికి, సృజనాత్మకతకు మరియు ఒత్తిడి లేని అభ్యసనానికి ఇచ్చే ప్రాధాన్యతను—వారు ప్రత్యక్షంగా అనుభవించేందుకు ఇది ఒక అద్భుతమైన అవకాశం.

ఈ పర్యటన ద్వారా మన విద్యా వ్యవస్థకు లభించే కొన్ని ముఖ్యమైన ప్రయోజనాలు:

ఆటపాటలతో కూడిన విద్యాబోధన (Play-Based Learning): బట్టీ పద్ధతికి దూరంగా, పిల్లల్లో జిజ్ఞాసను, ఆలోచనా శక్తిని పెంపొందించే ఆధునిక బోధనా పద్ధతులను గ్రహించడం.

విద్యార్థి కేంద్రక బోధన: ప్రతి విద్యార్థి ప్రత్యేక శైలికి మరియు వేగానికి అనుగుణంగా బోధనా వ్యూహాలను రూపొందించుకోవడం.

ఉపాధ్యాయుల స్వేచ్ఛ & నైపుణ్యాల మార్పిడి: ఫిన్లాండ్‌లో ఉపాధ్యాయులకు ఉండే స్వయంప్రతిపత్తి, వృత్తిపరమైన స్వేచ్ఛ నుండి స్ఫూర్తి పొంది మన పాఠశాలలకు తగినట్లుగా మార్పులు చేసుకోవడం.

ఈ 29 మంది ఉపాధ్యాయులు అక్కడ నేర్చుకున్న ఉత్తమ విధానాలను మన స్థానిక పరిస్థితులకు, వనరులకు అనుగుణంగా మలచుకుని, రాష్ట్రవ్యాప్తంగా ఉన్న తోటి ఉపాధ్యాయులకు మార్గదర్శనం (Mentorship) చేయడం ద్వారా మన విద్యా రంగంలో ఎంతో గొప్ప మార్పు వస్తుంది.

ఫిన్లాండ్ పర్యటనలో ఉన్న మన ఉపాధ్యాయులందరికీ శుభాకాంక్షలు!#APEducation #FinlandTour #AndhraPradesh #Teachers #EducationReforms #APNews #TrendingNews #EducationUpdate

1 week ago | [YT] | 170

VIBRANT AP

80 ఏళ్ల స్వాతంత్ర్యం.. ఐక్యత, గర్వానికి ప్రతీక!
భారతదేశ స్ఫూర్తిని గౌరవిస్తూ.. మన దేశాన్ని తీర్చిదిద్దిన మహనీయుల త్యాగాలను స్మరించుకుందాం.
ప్రతి ఒక్కరికీ గర్వకారణమైన, ఆనందభరితమైన స్వాతంత్ర్య దినోత్సవ శుభాకాంక్షలు!
#IndependenceDay! ❤️
#IndependenceDay2026 #80thIndependenceDay #VIBRANTAP

1 week ago | [YT] | 137

VIBRANT AP

అమరావతి రాజధానిలో సీడ్ యాక్సిస్ ఇ-3 రోడ్డు, స్టీల్ బ్రిడ్జీలను ముఖ్యమంత్రి చంద్రబాబు గారు ప్రారంభించారు. అనంతరం జరిగిన సభలో ప్రసంగించారు. ఈ ప్రారంభ కార్యక్రమంలో మంత్రులు నాదెండ్ల మనోహర్, నారాయణ, ఎమ్మెల్యేలు తెనాలి శ్రావణ్ కుమార్, కొలికపూడి శ్రీనివాసరావు, ఎంపీ భాష్యం రామకృష్ణ పాల్గొన్నారు. సభకు పెద్ద ఎత్తున రైతులు, స్థానిక ప్రజలు హాజరయ్యారు.
#ChandrababuNaidu
#Andhrapradesh
#AmaravatiUnstoppable
#SeedAccessRoad #E3Road
#SteelBridge
#Amaravati

1 week ago | [YT] | 1,345

VIBRANT AP

గౌరవ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి అధ్యక్షతన జరిగిన 20వ రాష్ట్రస్థాయి పెట్టుబడుల ప్రోత్సాహక బోర్డు (SIPB) సమావేశంలో సహచర మంత్రులు శ్రీ కింజరాపు అచ్చెన్నాయుడు గారు, శ్రీ పొంగూరు నారాయణ గారు, శ్రీ టీజీ భరత్ గారు, శ్రీ అనగాని సత్యప్రసాద్ గారు, శ్రీ గొట్టిపాటి రవికుమార్ గారు, శ్రీ పయ్యావుల కేశవ్ గారు, శ్రీ బీసీ జనార్ధన్ రెడ్డి గారు, శ్రీ వాసంశెట్టి సుభాష్ గారు, సీఎస్ శ్రీ సాయి ప్రసాద్‌ గారు మరియు వివిధ శాఖల ఉన్నతాధికారులతో కలిసి పాల్గొన్నాను.

రాష్ట్రాన్ని పెట్టుబడులకు అత్యంత అనుకూలమైన గమ్యస్థానంగా తీర్చిదిద్దే దిశగా గౌరవ ముఖ్యమంత్రి గారి నాయకత్వంలో కూటమి ప్రభుత్వం శరవేగంగా ముందుకు సాగుతోంది. ఈ సమావేశంలో పరిశ్రమలు, విద్యుత్, ఐటీ, పర్యాటకం, ఫుడ్ ప్రాసెసింగ్ తదితర కీలక రంగాలకు సంబంధించిన భారీ పెట్టుబడి ప్రతిపాదనలపై సమగ్రంగా చర్చించాం.

అలాగే 37 ప్రాజెక్టులకు సంబంధించి దాదాపు రూ.2.08 లక్షల కోట్ల పెట్టుబడులకు సంబంధించిన ప్రతిపాదనలు ముందుకు వచ్చాయి. ఈ పెట్టుబడులు రాష్ట్ర ఆర్థిక ప్రగతికి మరింత ఊతమివ్వడంతో పాటు పారిశ్రామిక అభివృద్ధి, భారీగా ఉపాధి అవకాశాల కల్పన, మౌలిక వసతుల బలోపేతానికి దోహదపడనున్నాయి.

గౌరవ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు, గౌరవ ఉప ముఖ్యమంత్రి శ్రీ పవన్ కళ్యాణ్ గార్ల నాయకత్వంలో ఆంధ్రప్రదేశ్‌ను పెట్టుబడులు, పరిశ్రమలు, ఉపాధి మరియు సమగ్ర అభివృద్ధికి దేశంలోనే అగ్రగామి రాష్ట్రంగా నిలపడానికి సమష్టిగా కృషి చేస్తామని తెలియజేస్తున్నాను.

#SIPB
#IdhiManchiPrabhutvam
#AndhraPradesh

2 weeks ago | [YT] | 1,090

VIBRANT AP

మగ్గంతో వస్త్రంపై తన చిత్రపటాన్ని నేసిన చేనేత కుటుంబానికి చెందిన నాగేశ్వరరావు, లక్ష్మీలను గౌరవ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబునాయుడు నేడు అభినందించారు.
#AndhraPradesh

2 weeks ago | [YT] | 2,258

VIBRANT AP

గౌరవ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు కు నేడు బాపట్ల జిల్లా నేతలు, అధికారులు చీరాలలో ఘన స్వాగతం పలికారు.
#AndhraPradesh

2 weeks ago | [YT] | 1,367

VIBRANT AP

విశాఖపట్నం అరిలోవ ప్రాంతంలోని తోటగరువులో ప్రముఖ బ్యాడ్మింటన్ క్రీడాకారిణి పీవీ సింధు గారు తలపెట్టిన సెంటర్ ఫర్ స్పోర్ట్స్ ఎక్స్ లెన్స్ నిర్మాణ పనులకు రాష్ట్ర క్రీడా శాఖ మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి గారితో కలిసి భూమిపూజ చేశాను. శిలాఫలకాన్ని ఆవిష్కరించాను. అకాడమీ భవన నమూనాతో పాటు క్రీడాకారులకు అందుబాటులోకి రానున్న అత్యాధునిక సౌకర్యాలు, వసతుల గురించి అడిగి తెలుసుకున్నాను.
@Pvsindhu1

3 weeks ago | [YT] | 977