మహారాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ దేవేంద్ర ఫడ్నవీస్ గారితో శ్రీ పవన్ కళ్యాణ్ గారు భేటీ • తూర్పు కనుమల్లో పులుల సంరక్షణ చర్యలపై చర్చ • ఆంధ్రప్రదేశ్ కి రెండు ఆడ పులులు ఇస్తున్నందుకు కృతజ్ఞతలు
మహారాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ దేవేంద్ర ఫడ్నవిస్ గారిని రాష్ట్ర ఉప ముఖ్యమంత్రివర్యులు శ్రీ పవన్ కళ్యాణ్ గారు మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ భేటీలో ఇరు రాష్ట్రాల మధ్య పరస్పర ప్రయోజనాలకు సంబంధించిన పలు అంశాలపై చర్చించారు. మంగళవారం ముంబైలోని మహారాష్ట్ర ముఖ్యమంత్రి వారి క్యాంపు కార్యాలయంలో జరిగిన ఈ భేటీలో తూర్పు కనుమల్లో పులుల సంరక్షణ, మహారాష్ట్ర నుంచి రాష్ట్రానికి రెండు ఆడ పులులు ఇచ్చే అంశాలపై ఇరువురు నేతల మధ్య ఫలవంతమైన చర్చలు సాగాయి. ఉమ్మడి ప్రయోజనాలకు సంబంధించి భవిష్యత్తులో మరింత సహకరించుకోవాలని నిర్ణయించారు. ఈ సందర్భంగా శ్రీ పవన్ కళ్యాణ్ గారు మాట్లాడుతూ “ఆంధ్ర ప్రదేశ్లోని తూర్పు కనుమల ప్రాంతంలో ఆడ పులుల సంఖ్య గణనీయంగా తగ్గడంతో జన్యుపరమైన సమస్యలు తలెత్తాయి. ఈ క్రమంలో పులుల సంఖ్య పునరుద్ధరణకు మహారాష్ట్ర ప్రభుత్వ సహకారం తీసుకుంటున్నాం. ఆంధ్రప్రదేశ్ కు రెండు ఆడ పులులు ఇచ్చేందుకు మహారాష్ట్ర ప్రభుత్వం అంగీకరించింది. వారు అందిస్తున్న సహకారానికి మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. తూర్పు కనుమలలో పులుల సంరక్షణ చరిత్రలో ఒక ముఖ్యమైన మైలురాయిగా నిలిచిపోతుంది. తూర్పు కనుమల్లో ఆడ పులుల ప్రవేశంతో అంతరసంతానోత్పత్తి (Inbreeding) సమస్యలను అధిగమించడంతోపాటు, జన్యు వైవిధ్యం పెరిగి, పులుల సంఖ్య దీర్ఘకాలిక స్థిరత్వానికి దోహదపడుతుంది. తద్వారా తూర్పు కనుమలలో ఆరోగ్యకరమైన, స్వయం సమృద్ధి కలిగిన పులుల ఆవాస వ్యవస్థ ఏర్పడుతుంది. శాస్త్రీయ విధానాలు, స్థిరమైన వన్యప్రాణి నిర్వహణ ఆధారంగా జీవ వైవిధ్య పరిరక్షణకు ఇరు రాష్ట్రాలు కట్టుబడి ఉన్నాయన్న అంశాన్ని ఈ సంయుక్త సంరక్షణ కార్యచరణ ప్రతిబింబిస్తోంది. ఆంధ్రప్రదేశ్–మహారాష్ట్ర రాష్ట్రాల మధ్య ఏర్పడిన ఈ భాగస్వామ్యం తూర్పు కనుమలలో పులుల దీర్ఘకాలిక సంరక్షణకు విశేషంగా దోహదపడుతుందని విశ్వసిస్తున్నాం. ఈ కార్యక్రమాన్ని ముందుకు తీసుకెళ్లడంలో మాకు నిరంతరం మార్గదర్శకత్వం అందిస్తున్న కేంద్ర అటవీ, పర్యావరణ, వాతావరణ మార్పుల శాఖ మంత్రి శ్రీ భూపేందర్ యాదవ్ గారికి కూడా ఈ సందర్భంగా ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. వన్యప్రాణి సంరక్షణ, జీవ వైవిధ్య పరిరక్షణ లక్ష్యాల సాధనలో మహారాష్ట్ర ప్రభుత్వం, కేంద్ర ప్రభుత్వం, ఇతర భాగస్వామ్య సంస్థలతో కలిసి మరింత సమన్వయంతో ముందుకు వెళ్తామ”న్నారు.
వాక్ స్వాతంత్ర్యం… సోషల్ మీడియా దుర్వినియోగంపై ఉప ముఖ్యమంత్రి శ్రీ Pawan Kalyan గారు సోషల్ మీడియాలో సందేశం ఇచ్చారు. ఈ సందేశంలో ముఖ్యాంశాలు
• సోషల్ మీడియా అనేది ఇప్పుడు మన రోజువారీ జీవితంలో ఒక భాగమైపోయింది. మన అభిప్రాయాలను చెప్పడానికి, ప్రజా సమస్యలను ప్రభుత్వ దృష్టికి తీసుకురావడానికి, ఒకరితో ఒకరు అనుసంధానమవ్వడానికి, ప్రభుత్వాన్ని ప్రశ్నించడానికి ఇది ఒక శక్తివంతమైన వేదిక. • భావ ప్రకటన స్వేచ్ఛ అనేది మన రాజ్యాంగం కల్పించిన ప్రాథమిక హక్కు. ఆ హక్కును నేను గౌరవిస్తాను... మా ప్రభుత్వం కూడా గౌరవిస్తుంది. కానీ మనం గుర్తుంచుకోవాల్సిన ఒక ముఖ్యమైన విషయం ఉంది. భావ ప్రకటన స్వేచ్ఛ అనేది పూర్తిగా అపరిమితమైన హక్కు కాదు. దానికి కొన్ని పరిమితులు ఉన్నాయి. ఒకరి హక్కులను మరొకరు ఉల్లంఘించే స్థాయికి వెళ్లినప్పుడు, చట్టపరమైన పరిణామాలు తప్పవు. • భారత రాజ్యాంగంలోని ఆర్టికల్ 19(2) ప్రకారం దేశ సమగ్రత, జాతీయ భద్రత, ప్రజా శాంతి, మర్యాద, నైతిక విలువలు, పరువు నష్టం, నేరాలకు ప్రేరేపించడం వంటి అంశాల్లో చట్టపరమైన పరిమితులు ఉన్నాయి. • సింపుల్ గా చెప్పాలంటే ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ అంటే ఫ్రీడమ్ టూ అబ్యూజ్ కాదు. ప్రభుత్వాన్ని విమర్శించే హక్కు మీకు ఉంది. మమ్మల్ని ప్రశ్నించే హక్కు మీకు ఉంది. మా నిర్ణయాలతో విభేదించే హక్కు మీకు ఉంది. అదే ప్రజాస్వామ్యం... దాన్ని మేము స్వాగతిస్తాము • కానీ ఒకరిని తిట్టడం, ప్రాణ భయానికి గురి చేస్తూ బెదిరింపులకు పాల్పడటం, ఆధారాలు లేకుండా ఆరోపణలు చేయడం, మహిళలను టార్గెట్ చేయడం, మత విశ్వాసాలను అవమానించడం, ఒక వ్యక్తి గౌరవాన్ని దెబ్బతీయడం, హింసకు ప్రేరేపించడం... ఇవన్నీ రాజ్యాంగం కల్పించిన స్వేచ్ఛలోకి రావు. ఇవి చట్టపరంగా నేరాలు. • గత కొన్నేళ్లుగా సోషల్ మీడియా దుర్వినియోగం ఆందోళన కలిగించే స్థాయికి చేరుకుంది. చాలామంది ఫేక్ అకౌంట్స్ వెనుక దాక్కొని అసభ్య పదజాలం ఉపయోగించడం, వ్యక్తిగత దూషణలు చేయడం, పరువు తీసే ప్రయత్నాలు చేయడం, ఆధారాలు లేని ఆరోపణలు చేయడం, తప్పుడు ప్రచారాలు, ఫోటోలను అసభ్యంగా మార్చడం, వేధింపులు, బెదిరింపులు వంటి చర్యలకు పాల్పడుతున్నారు. మహిళలను అత్యంత అసభ్యంగా టార్గెట్ చేస్తున్నారు. • దేవుళ్లు, దేవతలపై కూడా ఉద్దేశపూర్వకంగా అవమానకర వ్యాఖ్యలు చేస్తున్నారు. ఇది భావ ప్రకటన స్వేచ్ఛ కాదు, ఆరోగ్యకరమైన విమర్శ కాదు. ఇది ప్రజాస్వామ్యయుతం అంతకంటే కాదు. • నిర్మాణాత్మక విమర్శలు, ఫెయిర్ కామెంట్స్, సెటైర్స్ , విభిన్న అభిప్రాయాలను వ్యక్తం చేసే హక్కును మేము పూర్తిగా గౌరవిస్తాము. కానీ ఉద్దేశపూర్వకంగా తప్పుడు ప్రచారాలు చేయడం, ద్వేషపూరిత ప్రసంగాలు, నేరపూరిత బెదిరింపులు, సైబర్ వేధింపులు , దూషణలు, ఒకరి పరువును ఉద్దేశపూర్వకంగా దెబ్బతీయాలనే ప్రయత్నాలు... ఇవన్నీ భావ ప్రకటన స్వేచ్ఛ పేరుతో సమర్థించబడవు. • నేరానికి కులం లేదు ... మతం లేదు... రాజకీయ పార్టీ లేదు. తప్పు చేసిన తర్వాత కులం, మతం, ప్రాంతం లేదా రాజకీయాల వెనుక దాక్కోవాలని ఎవరూ ప్రయత్నించకండి. చట్టం ముందు ప్రతి పౌరుడు సమానమే. నేరం చేసిన ప్రతి ఒక్కరిపై చట్టప్రకారం చర్యలు తీసుకోబడతాయి. • సోషల్ మీడియా దుర్వినియోగం వల్ల ఇబ్బందులు ఎదుర్కొంటున్న ప్రతి ఒక్కరికీ నేను ఒక మాట చెబుతున్నాను... మీరు ఒంటరివారు కాదు. మీకు ప్రభుత్వం అండగా ఉంటుంది. • ఉప ముఖ్యమంత్రి కార్యాలయంలో ఫిర్యాదులు స్వీకరించేందుకు ప్రత్యేక వ్యవస్థను ఏర్పాటు చేస్తాము. స్క్రీన్షాట్లు, లింక్లు, వీడియోలు వంటి డిజిటల్ ఆధారాలతో ఫిర్యాదులు చేయవచ్చు. ప్రతి జెన్యూన్ ఫిర్యాదును పరిశీలించి సంబంధిత అధికారులకు పంపించి చట్టపరమైన చర్యలు తీసుకునేలా చూస్తాము. • అలాగే, పదే పదే ఫేక్ అకౌంట్స్ ద్వారా సోషల్ మీడియా దుర్వినియోగానికి పాల్పడుతున్న వారిని గుర్తించి, వారి వివరాలను ప్రభుత్వానికి అందించాలని బాధ్యతగల పౌరులను కోరుతున్నాను. ఇది కేవలం ప్రభుత్వ బాధ్యత మాత్రమే కాదు... మనందరి బాధ్యత. • ఇలాంటి నేరాలకు పాల్పడిన వారిపై భారతీయ న్యాయ సంహిత (బిఎన్ఎస్), భారతీయ నాగరిక్ సురక్షా సంహిత (బిఎన్ఎస్ఎస్), సమాచార సాంకేతిక చట్టం 2000, ఇతర సంబంధిత చట్టాల ప్రకారం కఠిన చర్యలు తీసుకుంటాము. • అవసరమైతే సోషల్ మీడియా దుర్వినియోగాన్ని అరికట్టేందుకు కొత్త చట్టాన్ని తీసుకురావడానికీ ప్రభుత్వం సిద్ధంగా ఉంది. అదే సమయంలో రాజ్యాంగం కల్పించిన భావ ప్రకటన స్వేచ్ఛ ను పూర్తిగా పరిరక్షిస్తాము. • మన మాటల్లో బాధ్యత ఉండాలి. మన భాషలో గౌరవం ఉండాలి. మన స్వేచ్ఛకు జవాబుదారీతనం ఉండాలి. సోషల్ మీడియా మనుషులను కలిపే వేదిక కావాలి... విడదీసే వేదిక కాకూడదు. మమ్మల్ని ప్రశ్నించండి. విమర్శించండి. మీ అభిప్రాయాన్ని చెప్పండి. కానీ గౌరవంతో చెప్పండి. బాధ్యతతో చెప్పండి. చట్టాన్ని గౌరవిస్తూ చెప్పండి. అప్పుడే మన ప్రజాస్వామ్యం మరింత బలపడుతుంది.
2 ఏళ్ల ప్రజా ప్రభుత్వం 2 ఏళ్ల అభివృద్ధి ప్రస్థానం 2 ఏళ్ల గ్రామ స్వరాజ్యం
"పవన్ కళ్యాణ్ అనే నేను..." అనే ప్రతిజ్ఞతో ప్రజా సేవకు అంకితమై, పాలనలో తనదైన ముద్ర వేసి, రాష్ట్ర అభివృద్ధికి, గ్రామ స్వరాజ్య సాధన దిశగా అడుగులు వేస్తూ... దేశ రాజకీయాల్లో సరికొత్త అధ్యాయాన్ని లిఖించిన జనసేన పార్టీ అధినేత, గౌరవ ఉప ముఖ్యమంత్రి శ్రీ #PawanKalyan గారు. #janasenaparty#janasena
It was the rebirth of an eternal civilization that refused to bow down.
Raigad Fort witnessed the roar of a lion as Chhatrapati Shivaji Maharaj was crowne
6 జూన్ 1674 – చరిత్రను
మార్చిన తేదీ.
అది కేవలం రాజుకు పట్టాభిషేకం కాదు. హైందవీ స్వరాజ్య ఉద్భవనం మరియు నాగరికత పునర్జన్మ తనను తాను గౌరవంగా, ధైర్యం, సార్వభౌమత్వంతో పరిపాలించుకోవాలని సంకల్
రాయిగాడ్ కోట వద్ద, ఛత్రపతి శివాజీ మహారాజ్ కిరీటం ధరించారు, ఒక దార్శనికతను రాజ్యంగా మార్చారు మరియు స్వయం పాలన, నాయకత్వం, మరియు స్థిరత్వం యొక్క ఆదర్శాలతో తరాలకు స్ఫూర్తినిచ్చారు
స్వరాజ్య వారసత్వం నేటికీ భారత్ కు స్ఫూర్తినిస్తూనే ఉంది.
[ఛత్రపతి శివాజీ మహారాజ్, హైందవీ స్వరాజ్య, రాయిగడ్ కోట, రాజ్యాభిషేక్, మరాఠా సామ్రాజ్యం, హిందూ స్వరాజ్య, భారత చరిత్ర, మరాఠా చరిత్ర, స్వరాజ్య, శివాజీ మహారాజ్ పట్టాభిషేకం, జూన్ 6 1674, రాయిగడ్, భారత చరిత్ర, చారిత్రక వారసత్వం, నాయకత్వం, స్వయం పాలన, నాగరికత వారసత్వo #chatrapatishivajimaharajkijai#shivajimaharaj#hindaviswarajya #🚩
తాడేపల్లిగూడెం నియోజకవర్గం శాసనసభ్యులు ప్రభుత్వ విప్ శ్రీ బొలిశెట్టి శ్రీనివాస్ గారి ఆధ్వర్యంలో స్వీమింగ్ పూల్ ఓపెనింగ్స్ కార్యక్రమం విజయవంతం జరిగింది ఈ కార్యక్రమంలో పాల్గొన్న యువ నాయకులు బొలిశెట్టి రాజేష్ గారు,పశ్చిమ గోదావరి జిల్లా కలెక్టర్ శ్రీమతి చదలవాడ నాగమణి గారు, ఉంగుటూరు శాసనసభ్యులు ధర్మరాజు గారు, స్పోర్ట్స్ ఆధారటీ చైర్మన్, శ్రీ రవి నాయుడు గారు , కూటమి నాయకులు పాల్గొన్నారు
గౌరవ ప్రభుత్వ విప్ శ్రీ బొలిశెట్టి శ్రీనివాస్ గారు శాసనసభ్యులు మరియు గౌరవ జిల్లా కలెక్టర్ శ్రీ మతి చదలవాడ నాగరాణి (I.A.S )గారు చేతులు మీదగా పెన్షన్ మరియు నిత్యావసర సరుకులు పంపిణి కార్యక్రమం చేపట్టారు.
Janasena Local
మహారాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ దేవేంద్ర ఫడ్నవీస్ గారితో శ్రీ పవన్ కళ్యాణ్ గారు భేటీ
• తూర్పు కనుమల్లో పులుల సంరక్షణ చర్యలపై చర్చ
• ఆంధ్రప్రదేశ్ కి రెండు ఆడ పులులు ఇస్తున్నందుకు కృతజ్ఞతలు
మహారాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ దేవేంద్ర ఫడ్నవిస్ గారిని రాష్ట్ర ఉప ముఖ్యమంత్రివర్యులు శ్రీ పవన్ కళ్యాణ్ గారు మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ భేటీలో ఇరు రాష్ట్రాల మధ్య పరస్పర ప్రయోజనాలకు సంబంధించిన పలు అంశాలపై చర్చించారు. మంగళవారం ముంబైలోని మహారాష్ట్ర ముఖ్యమంత్రి వారి క్యాంపు కార్యాలయంలో జరిగిన ఈ భేటీలో తూర్పు కనుమల్లో పులుల సంరక్షణ, మహారాష్ట్ర నుంచి రాష్ట్రానికి రెండు ఆడ పులులు ఇచ్చే అంశాలపై ఇరువురు నేతల మధ్య ఫలవంతమైన చర్చలు సాగాయి. ఉమ్మడి ప్రయోజనాలకు సంబంధించి భవిష్యత్తులో మరింత సహకరించుకోవాలని నిర్ణయించారు.
ఈ సందర్భంగా శ్రీ పవన్ కళ్యాణ్ గారు మాట్లాడుతూ “ఆంధ్ర ప్రదేశ్లోని తూర్పు కనుమల ప్రాంతంలో ఆడ పులుల సంఖ్య గణనీయంగా తగ్గడంతో జన్యుపరమైన సమస్యలు తలెత్తాయి. ఈ క్రమంలో పులుల సంఖ్య పునరుద్ధరణకు మహారాష్ట్ర ప్రభుత్వ సహకారం తీసుకుంటున్నాం. ఆంధ్రప్రదేశ్ కు రెండు ఆడ పులులు ఇచ్చేందుకు మహారాష్ట్ర ప్రభుత్వం అంగీకరించింది. వారు అందిస్తున్న సహకారానికి మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. తూర్పు కనుమలలో పులుల సంరక్షణ చరిత్రలో ఒక ముఖ్యమైన మైలురాయిగా నిలిచిపోతుంది. తూర్పు కనుమల్లో ఆడ పులుల ప్రవేశంతో అంతరసంతానోత్పత్తి (Inbreeding) సమస్యలను అధిగమించడంతోపాటు, జన్యు వైవిధ్యం పెరిగి, పులుల సంఖ్య దీర్ఘకాలిక స్థిరత్వానికి దోహదపడుతుంది. తద్వారా తూర్పు కనుమలలో ఆరోగ్యకరమైన, స్వయం సమృద్ధి కలిగిన పులుల ఆవాస వ్యవస్థ ఏర్పడుతుంది.
శాస్త్రీయ విధానాలు, స్థిరమైన వన్యప్రాణి నిర్వహణ ఆధారంగా జీవ వైవిధ్య పరిరక్షణకు ఇరు రాష్ట్రాలు కట్టుబడి ఉన్నాయన్న అంశాన్ని ఈ సంయుక్త సంరక్షణ కార్యచరణ ప్రతిబింబిస్తోంది. ఆంధ్రప్రదేశ్–మహారాష్ట్ర రాష్ట్రాల మధ్య ఏర్పడిన ఈ భాగస్వామ్యం తూర్పు కనుమలలో పులుల దీర్ఘకాలిక సంరక్షణకు విశేషంగా దోహదపడుతుందని విశ్వసిస్తున్నాం. ఈ కార్యక్రమాన్ని ముందుకు తీసుకెళ్లడంలో మాకు నిరంతరం మార్గదర్శకత్వం అందిస్తున్న కేంద్ర అటవీ, పర్యావరణ, వాతావరణ మార్పుల శాఖ మంత్రి శ్రీ భూపేందర్ యాదవ్ గారికి కూడా ఈ సందర్భంగా ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. వన్యప్రాణి సంరక్షణ, జీవ వైవిధ్య పరిరక్షణ లక్ష్యాల సాధనలో మహారాష్ట్ర ప్రభుత్వం, కేంద్ర ప్రభుత్వం, ఇతర భాగస్వామ్య సంస్థలతో కలిసి మరింత సమన్వయంతో ముందుకు వెళ్తామ”న్నారు.
#janasena
1 month ago | [YT] | 0
View 0 replies
Janasena Local
జనసేన పార్టీ నిర్మాణ సారథుల సమాచార సేకరణ కమిటీ కేంద్ర కార్యాలయం హెల్ప్ లైన్ నెంబర్ : 08069932233
#JSPMembershipToLeadership
#JSPForNewAgePolitics
@JanaSenaParty
1 month ago | [YT] | 0
View 0 replies
Janasena Local
సోషల్ మీడియాలో విమర్శలు ఉండాలి, దూషణలు కాదు..
వాక్ స్వాతంత్ర్యం… సోషల్ మీడియా దుర్వినియోగంపై ఉప ముఖ్యమంత్రి శ్రీ Pawan Kalyan గారు సోషల్ మీడియాలో సందేశం ఇచ్చారు. ఈ సందేశంలో ముఖ్యాంశాలు
• సోషల్ మీడియా అనేది ఇప్పుడు మన రోజువారీ జీవితంలో ఒక భాగమైపోయింది. మన అభిప్రాయాలను చెప్పడానికి, ప్రజా సమస్యలను ప్రభుత్వ దృష్టికి తీసుకురావడానికి, ఒకరితో ఒకరు అనుసంధానమవ్వడానికి, ప్రభుత్వాన్ని ప్రశ్నించడానికి ఇది ఒక శక్తివంతమైన వేదిక.
• భావ ప్రకటన స్వేచ్ఛ అనేది మన రాజ్యాంగం కల్పించిన ప్రాథమిక హక్కు. ఆ హక్కును నేను గౌరవిస్తాను... మా ప్రభుత్వం కూడా గౌరవిస్తుంది. కానీ మనం గుర్తుంచుకోవాల్సిన ఒక ముఖ్యమైన విషయం ఉంది. భావ ప్రకటన స్వేచ్ఛ అనేది పూర్తిగా అపరిమితమైన హక్కు కాదు. దానికి కొన్ని పరిమితులు ఉన్నాయి. ఒకరి హక్కులను మరొకరు ఉల్లంఘించే స్థాయికి వెళ్లినప్పుడు, చట్టపరమైన పరిణామాలు తప్పవు.
• భారత రాజ్యాంగంలోని ఆర్టికల్ 19(2) ప్రకారం దేశ సమగ్రత, జాతీయ భద్రత, ప్రజా శాంతి, మర్యాద, నైతిక విలువలు, పరువు నష్టం, నేరాలకు ప్రేరేపించడం వంటి అంశాల్లో చట్టపరమైన పరిమితులు ఉన్నాయి.
• సింపుల్ గా చెప్పాలంటే ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ అంటే ఫ్రీడమ్ టూ అబ్యూజ్ కాదు. ప్రభుత్వాన్ని విమర్శించే హక్కు మీకు ఉంది. మమ్మల్ని ప్రశ్నించే హక్కు మీకు ఉంది. మా నిర్ణయాలతో విభేదించే హక్కు మీకు ఉంది. అదే ప్రజాస్వామ్యం... దాన్ని మేము స్వాగతిస్తాము
• కానీ ఒకరిని తిట్టడం, ప్రాణ భయానికి గురి చేస్తూ బెదిరింపులకు పాల్పడటం, ఆధారాలు లేకుండా ఆరోపణలు చేయడం, మహిళలను టార్గెట్ చేయడం, మత విశ్వాసాలను అవమానించడం, ఒక వ్యక్తి గౌరవాన్ని దెబ్బతీయడం, హింసకు ప్రేరేపించడం... ఇవన్నీ రాజ్యాంగం కల్పించిన స్వేచ్ఛలోకి రావు. ఇవి చట్టపరంగా నేరాలు.
• గత కొన్నేళ్లుగా సోషల్ మీడియా దుర్వినియోగం ఆందోళన కలిగించే స్థాయికి చేరుకుంది. చాలామంది ఫేక్ అకౌంట్స్ వెనుక దాక్కొని అసభ్య పదజాలం ఉపయోగించడం, వ్యక్తిగత దూషణలు చేయడం, పరువు తీసే ప్రయత్నాలు చేయడం, ఆధారాలు లేని ఆరోపణలు చేయడం, తప్పుడు ప్రచారాలు, ఫోటోలను అసభ్యంగా మార్చడం, వేధింపులు, బెదిరింపులు వంటి చర్యలకు పాల్పడుతున్నారు. మహిళలను అత్యంత అసభ్యంగా టార్గెట్ చేస్తున్నారు.
• దేవుళ్లు, దేవతలపై కూడా ఉద్దేశపూర్వకంగా అవమానకర వ్యాఖ్యలు చేస్తున్నారు. ఇది భావ ప్రకటన స్వేచ్ఛ కాదు, ఆరోగ్యకరమైన విమర్శ కాదు. ఇది ప్రజాస్వామ్యయుతం అంతకంటే కాదు.
• నిర్మాణాత్మక విమర్శలు, ఫెయిర్
కామెంట్స్, సెటైర్స్ , విభిన్న అభిప్రాయాలను వ్యక్తం చేసే హక్కును మేము పూర్తిగా గౌరవిస్తాము. కానీ ఉద్దేశపూర్వకంగా తప్పుడు ప్రచారాలు చేయడం, ద్వేషపూరిత ప్రసంగాలు, నేరపూరిత బెదిరింపులు, సైబర్ వేధింపులు , దూషణలు, ఒకరి పరువును ఉద్దేశపూర్వకంగా దెబ్బతీయాలనే ప్రయత్నాలు... ఇవన్నీ భావ ప్రకటన స్వేచ్ఛ పేరుతో సమర్థించబడవు.
• నేరానికి కులం లేదు ... మతం లేదు... రాజకీయ పార్టీ లేదు. తప్పు చేసిన తర్వాత కులం, మతం, ప్రాంతం లేదా రాజకీయాల వెనుక దాక్కోవాలని ఎవరూ ప్రయత్నించకండి. చట్టం ముందు ప్రతి పౌరుడు సమానమే. నేరం చేసిన ప్రతి ఒక్కరిపై చట్టప్రకారం చర్యలు తీసుకోబడతాయి.
• సోషల్ మీడియా దుర్వినియోగం వల్ల ఇబ్బందులు ఎదుర్కొంటున్న ప్రతి ఒక్కరికీ నేను ఒక మాట చెబుతున్నాను... మీరు ఒంటరివారు కాదు. మీకు ప్రభుత్వం అండగా ఉంటుంది.
• ఉప ముఖ్యమంత్రి కార్యాలయంలో ఫిర్యాదులు స్వీకరించేందుకు ప్రత్యేక వ్యవస్థను ఏర్పాటు చేస్తాము. స్క్రీన్షాట్లు, లింక్లు, వీడియోలు వంటి డిజిటల్ ఆధారాలతో ఫిర్యాదులు చేయవచ్చు. ప్రతి జెన్యూన్ ఫిర్యాదును పరిశీలించి సంబంధిత అధికారులకు పంపించి చట్టపరమైన చర్యలు తీసుకునేలా చూస్తాము.
• అలాగే, పదే పదే ఫేక్ అకౌంట్స్ ద్వారా సోషల్ మీడియా దుర్వినియోగానికి పాల్పడుతున్న వారిని గుర్తించి, వారి వివరాలను ప్రభుత్వానికి అందించాలని బాధ్యతగల పౌరులను కోరుతున్నాను. ఇది కేవలం ప్రభుత్వ బాధ్యత మాత్రమే కాదు... మనందరి బాధ్యత.
• ఇలాంటి నేరాలకు పాల్పడిన వారిపై భారతీయ న్యాయ సంహిత (బిఎన్ఎస్), భారతీయ నాగరిక్ సురక్షా సంహిత (బిఎన్ఎస్ఎస్), సమాచార సాంకేతిక చట్టం 2000, ఇతర సంబంధిత చట్టాల ప్రకారం కఠిన చర్యలు తీసుకుంటాము.
• అవసరమైతే సోషల్ మీడియా దుర్వినియోగాన్ని అరికట్టేందుకు కొత్త చట్టాన్ని తీసుకురావడానికీ ప్రభుత్వం సిద్ధంగా ఉంది. అదే సమయంలో రాజ్యాంగం కల్పించిన భావ ప్రకటన స్వేచ్ఛ ను పూర్తిగా పరిరక్షిస్తాము.
• మన మాటల్లో బాధ్యత ఉండాలి. మన భాషలో గౌరవం ఉండాలి. మన స్వేచ్ఛకు జవాబుదారీతనం ఉండాలి. సోషల్ మీడియా మనుషులను కలిపే వేదిక కావాలి... విడదీసే వేదిక కాకూడదు. మమ్మల్ని ప్రశ్నించండి. విమర్శించండి. మీ అభిప్రాయాన్ని చెప్పండి. కానీ గౌరవంతో చెప్పండి. బాధ్యతతో చెప్పండి. చట్టాన్ని గౌరవిస్తూ చెప్పండి. అప్పుడే మన ప్రజాస్వామ్యం మరింత బలపడుతుంది.
1 month ago | [YT] | 0
View 0 replies
Janasena Local
Janasena Chief Sri PawanKalyan explains reason for organising "Sena Prasthanam" at National Capital Delhi.
#JanaSenaniInNewDelhi #SenaPrasthanam
#JANASENA #janasenaparty
2 months ago | [YT] | 0
View 0 replies
Janasena Local
#2YrsOfTrustDevelopmentWelfare
#PawanKalyanAneNenu
2 ఏళ్ల ప్రజా ప్రభుత్వం
2 ఏళ్ల అభివృద్ధి ప్రస్థానం
2 ఏళ్ల గ్రామ స్వరాజ్యం
"పవన్ కళ్యాణ్ అనే నేను..." అనే ప్రతిజ్ఞతో
ప్రజా సేవకు అంకితమై,
పాలనలో తనదైన ముద్ర వేసి,
రాష్ట్ర అభివృద్ధికి, గ్రామ స్వరాజ్య సాధన దిశగా అడుగులు వేస్తూ...
దేశ రాజకీయాల్లో సరికొత్త అధ్యాయాన్ని లిఖించిన జనసేన పార్టీ అధినేత, గౌరవ ఉప ముఖ్యమంత్రి శ్రీ #PawanKalyan గారు.
#janasenaparty #janasena
2 months ago | [YT] | 0
View 0 replies
Janasena Local
It was the rebirth of an eternal civilization that refused to bow down.
Raigad Fort witnessed the roar of a lion as Chhatrapati Shivaji Maharaj was crowne
6 జూన్ 1674 – చరిత్రను
మార్చిన తేదీ.
అది కేవలం రాజుకు పట్టాభిషేకం కాదు. హైందవీ స్వరాజ్య ఉద్భవనం మరియు నాగరికత పునర్జన్మ తనను తాను గౌరవంగా, ధైర్యం, సార్వభౌమత్వంతో పరిపాలించుకోవాలని సంకల్
రాయిగాడ్ కోట వద్ద, ఛత్రపతి శివాజీ మహారాజ్ కిరీటం ధరించారు, ఒక దార్శనికతను రాజ్యంగా మార్చారు మరియు స్వయం పాలన, నాయకత్వం, మరియు స్థిరత్వం యొక్క ఆదర్శాలతో తరాలకు స్ఫూర్తినిచ్చారు
స్వరాజ్య వారసత్వం నేటికీ భారత్ కు స్ఫూర్తినిస్తూనే ఉంది.
[ఛత్రపతి శివాజీ మహారాజ్, హైందవీ స్వరాజ్య, రాయిగడ్ కోట, రాజ్యాభిషేక్, మరాఠా సామ్రాజ్యం, హిందూ స్వరాజ్య, భారత చరిత్ర, మరాఠా చరిత్ర, స్వరాజ్య, శివాజీ మహారాజ్ పట్టాభిషేకం, జూన్ 6 1674, రాయిగడ్, భారత చరిత్ర, చారిత్రక వారసత్వం, నాయకత్వం, స్వయం పాలన, నాగరికత వారసత్వo
#chatrapatishivajimaharajkijai #shivajimaharaj #hindaviswarajya #🚩
2 months ago | [YT] | 0
View 0 replies
Janasena Local
తాడేపల్లిగూడెం నియోజకవర్గం శాసనసభ్యులు ప్రభుత్వ విప్ శ్రీ బొలిశెట్టి శ్రీనివాస్ గారి ఆధ్వర్యంలో స్వీమింగ్ పూల్ ఓపెనింగ్స్ కార్యక్రమం విజయవంతం జరిగింది ఈ కార్యక్రమంలో పాల్గొన్న యువ నాయకులు బొలిశెట్టి రాజేష్ గారు,పశ్చిమ గోదావరి జిల్లా కలెక్టర్ శ్రీమతి చదలవాడ నాగమణి గారు, ఉంగుటూరు శాసనసభ్యులు ధర్మరాజు గారు, స్పోర్ట్స్ ఆధారటీ చైర్మన్, శ్రీ రవి నాయుడు గారు , కూటమి నాయకులు పాల్గొన్నారు
3 months ago | [YT] | 0
View 0 replies
Janasena Local
గౌరవ ప్రభుత్వ విప్ శ్రీ బొలిశెట్టి శ్రీనివాస్ గారు శాసనసభ్యులు మరియు గౌరవ జిల్లా కలెక్టర్ శ్రీ మతి చదలవాడ నాగరాణి (I.A.S )గారు చేతులు మీదగా పెన్షన్ మరియు నిత్యావసర సరుకులు పంపిణి కార్యక్రమం చేపట్టారు.
#janasenaparty #janasena #bolisettisrinivasu garu #pawankalyan garu
3 months ago | [YT] | 0
View 0 replies
Janasena Local
3 months ago | [YT] | 0
View 0 replies
Janasena Local
నేడు గిరిపుత్రుల మధ్య జనసేన 13 వ ఆవిర్భావ దినోత్సవ కార్యక్రమం
జనసైనికులకు, జనసేన నాయకులకు, వీరమహిళలకు జనసేన ఆవిర్భావ దినోత్సవ శుభాకాంక్షలు.
#JanaSenaFormationDay
#JSPFormationday
#Janasenaparty
#janasena
#PawanKalyan garu
A
5 months ago | [YT] | 0
View 0 replies
Load more