Tenali Rams

వీటినిఈతరంపిల్లలకునేర్పించండి. చదివించండి మరియు మనం కూడా మరోసారి మననం చేసుకుందాం.

దిక్కులు:
(1) తూర్పు, (2) దక్షిణం, (3) పడమర,(4)
ఉత్తరం

మూలలు:
(1) ఆగ్నేయం, (2) నైరుతి,(3) వాయువ్యం, (4) ఈశాన్యం

వేదాలు:
(1) ఋగ్వే దం,(2) యజుర్వేదం,(3) సామవేదం,(4) అదర్వణ వేదం

పురుషార్ధాలు:
(1) ధర్మ,(2) అర్థ,(3) కామ,(4) మోక్షా

పంచభూతాలు:
(1) గాలి, (2) నీరు,(3) భూమి,(4) ఆకాశం,(5) అగ్ని.

పంచేంద్రియాలు:
(1) కన్ను, (2) ముక్కు, (3) చెవి, (4) నాలుక,(5) చర్మం

లలిత కళలు:
(1) కవిత్వం,(2) చిత్రలేఖనం,(3) నాట్యం,(4) సంగీతం,(5) శిల్పం

పంచగంగలు:
(1) గంగ,(2) కృష్ణ,(3) గోదావరి,(4) కావేరి, (5) తుంగభద్ర.

దేవతావృక్షాలు:
(1) మందారం, (2) పారిజాతం,(3) కల్పవృక్షం, (4) సంతానం,(5) హరిచందనం.

పంచోపచారాలు:
(1) స్నానం,(2) పూజ, (3) నైవేద్యం,(4) ప్రదక్షిణం,(5) నమస్కారం.

పంచామృతాలు:
(1) ఆవుపాలు,(2) పెరుగు,(3) నెయ్యి,(4) చక్కెర, (5) తేనె.

పంచలోహాలు:
(1) బంగారం, (2) వెండి, (3) రాగి,(4) సీసం,(5) తగరం.

షడ్రుచులు:
(1) తీపి,(2) పులుపు, (3) చేదు,(4) వగరు, (5) కారం,(6) ఉప్పు.

అరిషడ్వర్గాలు షడ్గుణాలు
(1) కామం, (2) క్రోధం,(3) లోభం, (4) మోహం,(5) మదం,(6) మత్సరం.

ఋతువులు
(1) వసంత,(2) గ్రీష్మ,(3) వర్ష, (4) శరద్ఋతువు, (5) హేమంత,(6) శిశిర

సప్త ఋషులు
(1) కాశ్యపుడు,(2) గౌతముడు, (3) అత్రి,(4) విశ్వామిత్రుడు, (5) భరద్వాజ,(6) జమదగ్ని,(7) వశిష్ఠుడు.

తిరుపతి సప్తగిరులు
(1) శేషాద్రి,(2) నీలాద్రి, (3) గరుడాద్రి, (4) అంజనాద్రి, (5) వృషభాద్రి, (6) నారాయణాద్రి, (7) వేంకటాద్రి.

సప్త వ్యసనాలు
(1) జూదం,(2) మద్యం,(3) దొంగతనం, (4) వేట,(5) వ్యభిచారం, (6) దుబారఖర్చు,(7) కఠినంగా మాట్లాడటం.

సప్త నదులు
(1) గంగ, (2) యమునా, (3) సరస్వతి, (4) గోదావరి, (5) సింధు,(6) నర్మద, (7) కావేరి.

నవధాన్యాలు
(1) గోధుమ,(2) వడ్లు, (3) పెసలు,(4) శనగలు, (5) కందులు,(6) నువ్వులు, (7) మినుములు, (8) ఉలవలు,(9) అలసందలు.

నవరత్నాలు
(1) ముత్యం, (2) పగడం, (3) గోమేధికం,(4) వజ్రం,(5) కెంపు,(6) నీలం, (7) కనకపుష్యరాగం, (8) పచ్చ (మరకతం), (9) ఎరుపు (వైడూర్యం).

నవధాతువులు
(1) బంగారం,(2) వెండి,(3) ఇత్తడి, (4) రాగి, (5) ఇనుము,(6) కంచు,(7) సీసం, (8) తగరం, (9) కాంతలోహం.

నవరసాలు
(1) హాస్యం,(2) శృంగార, (3) కరుణ, (4) శాంత, (5) రౌద్ర, (6) భయానక,(7) బీభత్స, (8) అద్భుత,(9)
వీర

నవదుర్గలు
(1) శైలపుత్రి, (2) బ్రహ్మ చారిణి, (3) చంద్రఘంట,(4) కూష్మాండ,(5) స్కందమాత, (6) కాత్యాయని, (7) కాళరాత్రి, (8) మహాగౌరి, (9) సిద్ధిధాత్రి.

దశ సంస్కారాలు
( 1 ) వివాహం, ( 2 ) గర్భాదానం, ( 3 ) పుంసవనం , ( 4 ) సీమంతం, ( 5 ) జాతకకర్మ, ( 6 ) నామకరణం, ( 7 ) అన్నప్రాశనం, ( 8 ) చూడకర్మ,( 9 ) ఉపనయనం, (10) సమవర్తనం

దశావతారాలు
( 1 ) మత్స్య, ( 2 ) కూర్మ,( 3 ) వరాహ, ( 4 ) నరసింహ, ( 5 ) వామన, ( 6 ) పరశురామ, ( 7 ) శ్రీరామ,( 8 ) శ్రీకృష్ణ, ( 9 ) బుద్ధ,(10) కల్కి.

జ్యోతిర్లింగాలు హిమలయపర్వతం ~ కేదారేశ్వరలింగం .కాశీ ~ కాశీవిశ్వేశ్వరుడు .మధ్యప్రదేశ్ ~ మహాకాలేశ్వరలింగం, ఓంకారేశ్వరలింగం. (2)గుజరాత్ ~ సోమనాధలింగం, నాగేశ్వరలింగం. (2)మహారాష్ట్ర ~ భీమశంకరం, త్ర్యంబకేశ్వరం, ఘృష్ణేశ్వరం, వైద్యనాదేశ్వరం. (4)ఆంధ్రప్రదేశ్ ~ మల్లిఖార్జునలింగం (శ్రీశైలం) తమిళనాడు ~ రామలింగేశ్వరం.

తెలుగు వారాలు
(1) ఆది, (2) సోమ, (3) మంగళ, (4) బుధ, (5) గురు, (6) శుక్ర, (7) శని.

తెలుగు నెలలు
( 1 ) చైత్రం,( 2 ) వైశాఖం,( 3 ) జ్యేష్ఠం, ( 4 ) ఆషాఢం, ( 5 ) శ్రావణం, ( 6 ) భాద్రపదం, ( 7 ) ఆశ్వీయుజం, ( 8 ) కార్తీకం, (9 ) మార్గశిరం, (10) పుష్యం, (11) మాఘం, (12) ఫాల్గుణం.

రాశులు
( 1 ) మేషం,( 2 ) వృషభం, ( 3 ) మిథునం, ( 4 ) కర్కాటకం,( 5 ) సింహం, ( 6 ) కన్య, ( 7 ) తుల, ( 8 ) వృశ్చికం, ( 9 ) ధనస్సు, (10) మకరం, (11) కుంభం, (12) మీనం.

తిథులు
( 1 ) పాఢ్యమి, ( 2 ) విధియ, ( 3 ) తదియ, ( 4 ) చవితి,( 5 ) పంచమి, ( 6 ) షష్ఠి, ( 7 ) సప్తమి, ( 8 ) అష్టమి, ( 9 ) నవమి, (10) దశమి, (11) ఏకాదశి, (12) ద్వాదశి, (13) త్రయోదశి, (14) చతుర్దశి, (15) అమావాస్య /పౌర్ణమి.

నక్షత్రాలు
( 1 ) అశ్విని, ( 2 ) భరణి, ( 3 ) కృత్తిక, ( 4 ) రోహిణి, ( 5 ) మృగశిర, ( 6 ) ఆరుద్ర, ( 7 ) పునర్వసు, ( 8 ) పుష్యమి, ( 9 ) ఆశ్లేష, (10) మఖ, (11) పుబ్బ, (12) ఉత్తర, (13) హస్త, (14) చిత్త, (15) స్వాతి, (16) విశాఖ, (17) అనురాధ, (18) జ్యేష్ఠ, (19) మూల, (20) పూర్వాషాఢ, (21) ఉత్తరాషాఢ, (22) శ్రావణం, (23) ధనిష్ఠ, (24) శతభిషం, (25) పూర్వాబాద్ర, (26) ఉత్తరాబాద్ర, (27) రేవతి.

తెలుగు సంవత్సరాల పేర్లు
( 1 ) ప్రభవ :-1927, 1987, 2047, 2107
( 2 ) విభవ :- 1928, 1988, 2048, 2108
( 3 ) శుక్ల :-1929, 1989, 2049, 2109
( 4 ) ప్రమోదూత :-1930, 1990, 2050, 2110
( 5 ) ప్రజోత్పత్తి :-1931, 1991, 2051, 2111
( 6 ) అంగీరస :- 1932, 1992, 2052, 2112
( 7 ) శ్రీముఖ :-1933, 1993, 2053, 2113
( 8 )భావ. - 1934, 1994, 2054, 2114
9యువ. - 1935, 1995, 2055, 2115
10.ధాత. - 1936, 1996, 2056, 2116
11.ఈశ్వర. - 1937, 1997, 2057, 2117
12.బహుధాన్య.-1938, 1998, 2058, 2118
13.ప్రమాది. - 1939, 1999, 2059, 2119
14.విక్రమ. - 1940, 2000, 2060, 2120
15.వృష.-1941, 2001, 2061, 2121
16.చిత్రభాను. - 1942, 2002, 2062, 2122
17.స్వభాను. - 1943, 2003, 2063, 2123
18.తారణ. - 1944, 2004, 2064, 2124
19.పార్థివ. - 1945, 2005, 2065, 2125
20.వ్యయ.-1946, 2006, 2066, 2126
21.సర్వజిత్తు. - 1947, 2007, 2067, 2127
22.సర్వదారి. - 1948, 2008, 2068, 2128
23.విరోధి. - 1949, 2009, 2069, 2129
24.వికృతి. - 1950, 2010, 2070, 2130
25.ఖర. 1951, 2011, 2071, 2131
26.నందన.1952, 2012, 2072, 2132
27 విజయ.1953, 2013, 2073, 2133,
28.జయ. 1954, 2014, 2074, 2134
29.మన్మద.1955, 2015, 2075 , 2135
30.దుర్మిఖి. 1956, 2016, 2076, 2136
31.హేవళంబి. 1957, 2017, 2077, 2137
32.విళంబి. 1958, 2018, 2078, 2138
33.వికారి.1959, 2019, 2079, 2139
34.శార్వారి. 1960, 2020, 2080, 2140
35.ప్లవ1961, 2021, 2081, 2141
36.శుభకృత్. 1962, 2022, 2082, 2142
37.శోభకృత్. 1963, 2023, 2083, 2143
38. క్రోది.1964, 2024, 2084, 2144,
39.విశ్వావసు.1965, 2025, 2085, 2145
40.పరాభవ.1966, 2026, 2086, 2146
41.ప్లవంగ. 1967, 2027, 2087, 2147
42.కీలక. 1968, 2028, 2088, 2148
43.సౌమ్య. 1969, 2029, 2089, 2149
44.సాధారణ . 1970, 2030, 2090, 2150
45.విరోధికృత్. 1971, 2031, 2091, 2151
46.పరీదావి. 1972, 2032, 2092, 2152
47.ప్రమాది. 1973, 2033, 2093, 2153
48.ఆనంద. 1974, 2034, 2094, 2154
49.రాక్షస. 1975, 2035, 2095, 2155
50.నల :-1976, 2036, 2096, 2156,
51.పింగళ 1977, 2037, 2097, 2157
52.కాళయుక్తి 1978, 2038, 2098, 2158
53.సిద్ధార్ధి 1979, 2039, 2099, 2159
54.రౌద్రి 1980, 2040, 2100, 2160
55.దుర్మతి 1981, 2041, 2101, 2161
56.దుందుభి 1982, 2042, 2102, 2162
57.రుదిరోద్గారి 1983, 2043, 2103, 2163
58.రక్తాక్షి 1984, 2044, 2104, 2164
59.క్రోదన 1985, 2045, 2105, 216
60.అక్షయ 1986, 2046, 2106, 2166

2 days ago | [YT] | 1

Tenali Rams

*గురు పౌర్ణమి విశిష్టత*
➖➖➖✍️
```
అనాది కాలం నుంచి "ఆషాడ శుద్ధ పౌర్ణమిని, గురుపౌర్ణమి" అంటారు.

దీనినే "వ్యాస పౌర్ణమి" గా పరిగణలోనికి తీసుకొని ఆ రోజు దేశం నలుమూలలా గురుపూజా మహోత్సవాలు నిర్వహిస్తుంటారు.

ఆ రోజు మునిశ్రేష్ఠుడైన వ్యాసమహాముని జన్మతిధి కనుక ఆ భగవానుని యొక్క జన్మదినం మానవ చరిత్రలోనే అది ఒక అపూర్వమైన ఆధ్యాత్మికమైన మహాపర్వదినంగా విరాజిల్లుతోంది.

ఈ ఆషాడ శుద్ధ పౌర్ణమి యొక్క విశిష్ఠత గురించి ఒక చక్కని ప్రాచీన కధ ఉంది.

పూర్వం వారణాశిలో కడుపేద బ్రాహ్మణ దంపతులు ఉండేవారు. ఆత్రేయస గోత్రము గల ఆ బ్రాహ్మణుని యొక్క పేరు 'వేదనిధీ. ఆయన భార్య వేదవతీ. వీరిద్దరు ఎల్లప్పుడు చక్కని ఆధ్యాత్మిక చింతనతో భక్తి జ్ఞానము కలిగి జీవిస్తున్నారు. వారు సంతానము కోసం ఎన్ని నోములు నోచినా, ఎన్ని వ్రతాలు చేసినా; వారికి సంతానము మాత్రం కలుగలేదు.

ఇలా ఉండగా; ఒకనాడు 'వేదనిధికీ ప్రతిరోజు మధ్యాహ్న సమయమందు వ్యాసభగవానులు రహస్యంగా గంగానదికి స్నానానికి వస్తుంటారని వార్త తెలుసుకుని ఎలా అయినాసరే వ్యాసమహర్షి దర్శనం పొందాలని ప్రతిరోజూ వేయికళ్ళతో వెతకనారంభిస్తాడు. ఒక రోజు నదీతీరాన ఒక భిక్షువు రూపం ధరించి దండధరుడైన వ్యక్తిని దర్శిస్తాడు.

వెనువెంటనే వేదనిధి ఆయన పాదాలను ఆశ్రయిస్తాడు. దానికి ఆ భిక్షువు చీదరించుకుని కసరికొడతాడు.

అయినా సరే! పట్టిన పాదాలను మాత్రము వదలకుండా "మహానుభావా! తమరు సాక్షాత్తు వ్యాసభగవానులని" నేను గ్రహించాను. అందుచేతనే, మిమ్మల్ని శరణు పొందగోరుచున్నాను అంటాడు.

ఆ మాటలు విన్న ఆ అజ్ఞాత భిక్షువు గంగానది ఒడ్డువైపునకు నలుదిశలా బిత్తరి చూపులు చూస్తూ, ఇంకా తనను ఎవరైనా చూస్తున్నారేమో అని తలచి వెంటనే వేదనిధిని ఆప్యాంగా చేరదీసి, నాయొక్క రహస్యం మాత్రము ఎవరికీ తెలియకూడదు. ఇంతకీ నీకు ఏమికావాలో కోరుకో అంటాడు.

మహానుభావా! రేపు నా తండ్రిగారి పితృకార్యము. దానికి తమరు బ్రహ్మణార్థమై భోజనానికి మా ఇంటికి తప్పక దయచేయవలసిందిగా నా కోరిక! అని చెప్తాడు.

అందులకు మహర్షి అతని ఆహ్వానాన్ని అంగీకరిస్తాడు.

అనంతరం ఎంతో సంతోషంగా ఇంటికి చేరుకున్న వేదనిధి తన భార్యకి గంగానదీతీరాన జరిగిన వృత్తాంతమంతా వివరిస్తాడు.

మరసటిరోజు ఉదయమే ఇచ్చిన మాటప్రకారం వారి గృహానికి విచ్చేసిన ఆ వ్యాస భగవానుని ఆ దంపతులు ఎంతో ఆదరాభిమానాలతో వారిని పూజిస్తారు. అనంతరం వారు దేవతార్చనకు సాలగ్రామం, తులసి దళాలు, పూలు మున్నగు పూజాద్రవ్యాలు సిద్ధం చేస్తారు.

వారి పూజ అనంతరం ఎంతో శుచిగా మడిగా సర్వవంటకాలను సిద్ధపరచి శ్రాద్ధవిధులను విధి విధానంగా నిర్వహిస్తారు.

అనంతరం ఆ దంపతులు ఆ వ్యాస భగవానునికి సాష్టాంగ దండ ప్రణామం చేస్తారు.

వారి అతిథ్యానికి ఎంతో సంతుష్టులైన
ఆ ముని శ్రేష్ఠుడు, ఓ పుణ్య దంపతులారా మీకు ఏం వరంకావాలో కోరుకోండి అంటారు.

మేము నోయని నోము లేదు, చేయని వ్రతం లేదు, అయినా సంతానభాగ్యము మాత్రము మాకు కలుగలేదు! అని బదులు పలుకుతారు.

ఓ ఆదర్శ దంపతులారా! అందులకు మీరు చింతించవలసిన పనిలేదు. త్వరలోనే మీకు తేజోవంతులు, ఐశ్వర్యవంతులు అయిన పదిమంది పుత్రసంతతికలిగి, మీరు చక్కని సుఖజీవనముతో జీవితంలో ఎన్నో సుఖభోగాలను అనుభవిస్తూ అంత్యమున విష్ణుసన్నిధాన్ని పొందగలరు, అని ఆశీర్వదించి తిరుగు ప్రయాణమవుతున్న ‎వ్యాసభగవానునితో ప్రభూ! తిరిగి తమ దర్శన భాగ్యము మాకు ఎలా కలుగుతుంది? అని వేదనిధి ప్రశ్నిస్తాడు.

దానికి వ్యాస మహర్షి బదులుగా 'ఓ భూసురోత్తమా! నన్ను మరల మరల దర్శించుచూ ఉండాలని మీరు ఎంతో కోరికతో ఉన్నారని నేను గ్రహించాను. అందులకు నన్ను మీరు ఎలా దర్శించగలరో చెప్తాను, వినండి…

ఎవరైనా ఎప్పుడైనా, ఎక్కడైనా సరే! మన వేదవేదాంగముల యొక్క రహస్యాలను, ఇతిహాసములయొక్క గూడార్థాలు ఉపదేశిస్తూ ఉంటారో అతడే నా యొక్క నిజస్వరూపంగా తెలుసుకుని అట్టి పురాణ కథకుడైన వ్యక్తిని సాక్షాత్తు వ్యాసమూర్తిగా భావించి పూజింపవలెను. అట్టి పౌరాణికులందరిలోను నేను ఎల్లప్పుడూ ఉంటాను.
అదేకాదు ఎవరైనాసరే! గతకల్పాలలో జరిగిన చరిత్ర; విశ్వం యొక్క పూర్వవృత్తాంతం; పురాణగాథలు మున్నగునవి విప్పి చెప్పాలంటే వారికి నా అనుగ్రహము లేనిదె చేప్పలేరు. కావున అట్టి పౌరాణికునికి ఆషాఢ శుద్దపాడ్యమి నాడు వారికి గురుపూజ చేసి పూజించవలెనని చెప్పారు.

నాటి నుండి నేటివరకు అదే ఆచారము కొనసాగడం మనం చూస్తున్నాం!.

అది విన్న వేదనిధి మరోమారు వ్యాసభవానుని “మహాత్మా! తమను ఏయే రోజుల్లో ఏవిధంగా పూజించాలి? సవిస్తరంగా చెప్పండి” అని ప్రశ్నిస్తాడు.
```
*"మమ జన్మదినే సమ్యక్ పూజనీయః ప్రయత్నతః*
*ఆషాఢ శుక్ల పక్సేతు పూర్ణిమాయాం గురౌతథా*
*పూజనీయే విశేషణ వస్త్రాభరణ ధేనుభిః*
*దక్షిణాభిః మత్స్యరూప ప్రపూజయేత్*
*ఏపం కృతే త్వయా విప్రః మత్స్య రూపస్య దర్శనం*
*భవిష్యతి నసందేహొమ యైవోక్తం ద్విజోత్తమ."*```

ఓ బ్రాహ్మణోత్తమా! నేను జన్మించిన ఆషాఢ శుద్ధ పౌర్ణమినాడు ఈ గురుపూజను శ్రద్ధాభక్తులతో చేయాలి.
ఆ రోజు కనుక గురువారము అయితే, అది మరింతగా శ్రేష్టమైనది. వస్త్ర, ఆభరణ గోదానములతో అర్ఘ్య పాదాలతోటి నా రూపాన్ని పూజించువారికి నా స్వరూప సాక్షాత్కారం లభిస్తుంది అని సాక్షాత్తు వ్యాస మహర్షి చెప్పారు.

అప్పటి నుంచి వ్యాసపౌర్ణమి, నేటికీ సర్వులకు అత్యంత పుణ్య ప్రదముగా చెప్పబడుచున్నది. ఈ కధ పూర్వము నారదుడు వైశంపాయనుడికి ఈ గురు పౌర్ణమి యొక్క విశిష్టత వివరించినట్లుగా బ్రహ్మండ పురాణంలోనూ ‎స్వధర్మసింధు అనే గ్రంధములోను వివరంగా చెప్పబడి యున్నది.```

*"వ్యాసం వశిష్ఠ నప్తారం శక్తేః పౌత్ర మకల్మషం*
*పరాశరాత్మజం వందే శుకతాతం తపోనిధం*
*వ్యాసాయ విష్ణురూపాయ వ్యాస రూపాయ విష్ణవే*
*నమోవై బ్రహ్మనిధయే వాసిష్టాయ నమోనమః.*✍️```
. *సర్వం శ్రీకృష్ణార్పణమస్తు*
🌷🙏🌷

3 weeks ago | [YT] | 1

Tenali Rams

*దక్షిణాయనం ప్రారంభం*
➖➖➖✍️
*దక్షిణాయన పుణ్యకాలంలో ఏమిచెయ్యాలి*
జ్యోతిషశాస్త్రం ప్రకారం సూర్యుడు నవగ్రహాలకు రాజు.... అసలు జ్యోతిషంలో ఒక్క గ్రహం రాశి మారటానికి ఒక్కో కాల వ్యవధి వుంటుంది. అంటే చంద్రుడు మేష రాశి నుంచి వృషభరాశికి మారటానికి 2 1/2 రోజులు పడుతుంది. శనిగ్రహం 2 1/2 సం పడు తుంది. రాహు, కేతువులకి 1 1/2 సం, రవికి నెల రోజులు... ఇలా ప్రతి గ్రహానికి కొంత కాల పరిమితి వుంటుంది. అయితే ముఖ్యంగా సూర్యుడు నెలకి ఒక్కో రాశి చొన (మేషాది మీనరా శులు) పన్నెండు రాశులలోనూ పన్నెండు నెలలు సంచరిస్తే మనకి సంవత్సర కాలం పూర్త వుతుంది.
సూర్యుడు మేష రాశి ప్రవేశాన్ని జ్యోతిష పరిభాషలో ‘మేష సంక్రమణం’ అని
సూర్యుడు వృషభ రాశి ప్రవేశాన్ని జ్యోతిష పరిభాషలో ‘వృషభ సంక్రమణం’ అని
సూర్యుడు మిథున రాశి ప్రవేశాన్ని జ్యోతిష పరిభాషలో ‘మిథున సంక్రమణం’ అని
*సూర్యుడు కర్కాటక రాశి ప్రవేశాన్ని జ్యోతిష పరిభాషలో ‘కర్కాటక సంక్రమణం’ అని*
ఇలా ఏయే రాశుల్లో ప్రవేశిస్తే ఆయా సంక్రమణ కాలంగా చెపుతారు. సంక్రమణం అనే మాటకి ‘జరగటం’, ‘ప్రవేశించటం’ అని చెప్పొచ్చు.
*సూర్యుడు కర్కాటక సంక్రమణం చేసాడు అంటే సూర్యుడు కర్కాటక రాశిలోకి ప్రవేశించాడు అ ని అర్ధం. ఇది జూలై 15 నుంచి 17 తేది వరకు జరుగుతూ వుంటుంది. సాధారణంగా జూలై 16వ తేదీనే!*
*ఈ కర్కాటక సంక్రమణాన్ని ‘దక్షణాయన’ మని అంటుంటారు. (మనకి సంవత్సరానికి అయన ములు రెండు. ఒకటి ఉత్తరాయనం, రెండవది దక్షిణాయనం) ఇక తర్వాత సూర్యుని సింహరాశి ప్రవేశం, తర్వాత కన్యా రాశి ప్రవేశం (వినాయక చవితి వస్తుంది), తులారాశి ప్రవేశం (దసరాలు). ఇలా పన్నెండు రాశులలోనూ సూర్యుడు ప్రవేశించే కాలా న్ని సంక్రమణంగా చెప్తాం. (మకర సంక్రమణం (సంక్రాంతి)... మకరరాశి ప్రవేశం! కుంభరాశి ప్రవేశం (మహాశివరాత్రి)) అయితే సూర్యుని మకర సంక్రమణ మే ‘ఉత్తరాయన పుణ్యకాలం’.*
ఏ తిథులతోను సంబంధం లేకుండాను, ఎవరినీ అడగక్కర్లేకుండాను సంవత్సరంలో వచ్చే పండుగలు ఉత్తరాయణ-దక్షిణాయన మనేవి. *జనవరి 14న వచ్చే ఉత్తరాయణాన్ని మకర సంక్రమణమనీ, జూలై 16న వచ్చే దక్షిణాయనాన్ని కర్కాటక సంక్రమణమనీ , వ్యవహరిస్తారు. ఈ రెండు ఆయనాలు కలిపితేనే సంవత్సరం అవుతుంది.*
సూర్యుడు ప్రతి నెలలోను ఒక రాశినుండి మరొక రాశిలోకి ప్రవేశిస్తుంటాడు. దీనికే ‘సంక్రమణం’ అని పేరు. *సూర్యుడు కర్కాటక రాశిలోకి ప్రవేశించినప్పటినుంచి మకరరాశిలోకి ప్రవేశించేంతవరకు వుండే కాలం దక్షిణాయనం. ఈ ఆయనంలో సూర్యుడు భూమధ్య రేఖకు దక్షిణంగా సంచరిస్తాడు. దేవతలకు ఉత్తరాయణం పగలు కాగా, దక్షిణాయనం రాత్రిగాను చెప్తారు* . అదేవిధంగా ఉత్తరాయణం దేవతలకు, దక్షిణాయనం పితృదేవతలకు ప్రీతికరమని చెబుతారు. *దక్షిణాయన సందర్భంగా సంక్రమణ స్నానాలు చేయడం, విష్ణు సహస్రనామ పారాయణం చేయడంతోపాటు శ్రీ వరాహస్వామి వారిని పూజించడం శ్రేష్టమని చెప్తారు.*
దక్షిణాయన ఆరంభ కాలమైన ఆషాఢంలో ఏ పండుగలు లేకపోయినా ఆ తర్వాత మాసాల్లో శ్రీకృష్ణాష్టమి, వినాయక చవితి, రాఖీపూర్ణిమ, ఆదిపరాశక్తి మహిమలను చాటే దసరా, నరక బాధలు తొలగించిన దీపావళి, శివకేశవులకు ప్రీతికరమైన కార్తీక, మార్గశిర మాసాలు, గోపికలు ఆనంద పారవశ్యాన్ని పొందే ధనుర్మాసం ఇవన్నీ దక్షిణాయనంలోనే వస్తాయి. ఆషాఢమాసంలో సూర్యుడు కర్కాటక రాశిలోకి ప్రవేశించడం ఖచ్చితంగా జరుగుతుంది. కర్కాటక రాశి ప్రవేశంతో దక్షిణాపథంవైపు సూర్యుడు పయనమవుతాడు. దక్షిణాయనంలో చేసే పితృకర్మలు సరాసరి ఆ పితృ దేవతలకు ఉత్తమమైనవి. *దక్షిణాయనంలో చేసే పితృకర్మలు సరాసరి ఆ పితృదేవతలకు సకల నరకాలనుండి తొలగిస్తాయి.*
దక్షిణాయనంలో దేవతా ప్రతిష్ఠ, గృహ ప్రవేశం, ఉపనయనం, వివాహ కార్యాల్లాంటి శుభ కార్యాలను చేయడం మంచిది కాదంటారు. కానీ దక్షిణాయనంలో ఉగ్రదేవతా రూపాలను అంటే సప్త మాతృకలు, భైరవ, వరాహ, నృసింహ, మహిషాసుర మర్దని, దుర్గ లాంటి దేవతామూర్తులను ప్రతిష్టించవచ్చని వైఖానస సంహిత చెబుతోంది. కర్కాటక సంక్రమణ సమయంలో అంటే దక్షిణాయన ప్రారంభంలో పుణ్య స్నానాలు, జపతపాలు చేయడం ఎంతో మంచిది. ఆనాడు కులదైవాన్ని, లేదా శ్రీ మహా విష్ణువును పత్రాలతో పూజిస్తే ఆ ఏడాదంతా చేసే దోషాలు, పాపాలు వైదొలగుతాయి. వారి పితృదేవతలు స్వర్గాది సుఖలోకాలను చేరుకుంటారు.

సంక్రమణ కాలంలో చేసే పుణ్య స్నానాల వలన రోగాలు నివారించబడడమే కాకుండా దారిద్య్రం కూడా నిర్మూలించబడుతుంది. ముఖ్యంగా ఈ సంక్రమణ కాలం సాధకులకు మంచి ఆధ్యాత్మిక ఫలితాలనిస్తుంది. ఈ సమయంలో దానాలు కూడా విశేష ఫలాలనిస్తాయి. అందుకే *మోక్షానికి ఉత్తరాయణం, ఇహానికి దక్షిణాయనం ప్రతీకలుగా భావిస్తారు.* ఈరోజు పుణ్యనదీ స్నాన, దాన, జప, హోమం అక్షయ ఫలాన్ని ఇస్తుంది. మనందరము కూడా దక్షిణాయన సందర్భంగా మన ఆచార సంప్రదాయాలు పాటిద్దాం. భావి తరాలకు మన సంస్కృతిని తెలియజేద్దాం✍️
*సర్వం శ్రీకృష్ణార్పణమస్తు*
*🙏లోకానాఃసమస్తాః సుఖినోభవంతు🙏*
*రేపటితరానికి బతుకు, భద్రతలతోపాటు భారతీయతకూడా నేర్పండి*
➖▪️➖

1 month ago | [YT] | 2

Tenali Rams

శ్రీ జగన్నాథ రథయాత్ర దర్శనం...🙏💐🌹
ఒడిశాలోని పూరీలో నిర్వహించే శ్రీ జగన్నాథ రథయాత్ర భారత దేశంలోనే కాకుండా ప్రపంచవ్యాప్తంగా అత్యంత ప్రసిద్ధి చెందిన ఆధ్యాత్మిక మహోత్సవం. ఈ దివ్య రథయాత్రను ప్రత్యక్షంగా దర్శించేందుకు ప్రపంచం నలుమూలల నుంచి లక్షలాది మంది భక్తులు తరలివస్తారు. ప్రతి సంవత్సరం ఆషాఢ శుక్ల విదియ నాడు శ్రీ జగన్నాథ స్వామివారు, అన్నయ్య శ్రీ బలభద్రుడు, చెల్లెలు శ్రీ సుభద్రాదేవితో కలిసి మహారథాలపై విహరించే మహోత్సవాన్ని అత్యంత వైభవంగా నిర్వహిస్తారు. ప్రతి సంవత్సరం ఆషాఢ మాస శుక్ల పక్ష విదియ తిథిన శ్రీ జగన్నాథ రథయాత్ర ప్రారంభం అవుతుంది. అనంతరం ఆషాఢ శుక్ల ఏకాదశి రోజున స్వామివారి తిరుగు ప్రయాణం (బహుదా యాత్ర) నిర్వహించబడుతుంది.

సాంప్రదాయం ప్రకారం శ్రీ జగన్నాథ స్వామివారి రథాన్ని నంది ఘోషం అని పిలుస్తారు. ఈ రథంపై ఎగిరే పతాకాన్ని త్రైలోక్య మోహిని అంటారు. ఈ రథానికి మొత్తం 16 చక్రాలు ఉంటాయి. రథంలో ప్రధానంగా పసుపు రంగు వస్త్రాలు అలంకరిస్తారు.

శ్రీ బలభద్రుని రథాన్ని తాలధ్వజం అని పిలుస్తారు. దీనిపై ఉండే పతాకాన్ని ఉన్నాని అని అంటారు. ఈ రథానికి 14 చక్రాలు ఉంటాయి. ఈ రథాన్ని లాగే తాడును వాసుకి అని పిలుస్తారు.

శ్రీ సుభద్రాదేవి రథాన్ని పద్మధ్వజం (దర్పదలనం) అని పిలుస్తారు. ఈ రథానికి మొత్తం 12 చక్రాలు ఉంటాయి. రథాన్ని ప్రధానంగా ఎరుపు రంగు వస్త్రాలతో అలంకరిస్తారు. ఈ రథాన్ని లాగే తాడును స్వర్ణచూడా అని పిలుస్తారు.

పురాణాల ప్రకారం, ఒకసారి శ్రీ సుభద్రాదేవి తన అన్నలైన శ్రీకృష్ణుడు, శ్రీ బలరాముడితో కలిసి నగరాన్ని దర్శించాలని కోరిక వ్యక్తం చేసింది. ఆమె కోరికను గౌరవించిన ఇద్దరు అన్నలు సుభద్రాదేవి కోసం అద్భుతమైన రథాన్ని సిద్ధం చేసి, ముగ్గురూ కలిసి నగర విహారానికి బయలుదేరారు. ఆ ప్రయాణంలో వారు తమ మేనత్త గుండిచాదేవి ఆలయానికి చేరుకుని అక్కడ ఏడు రోజుల పాటు నివసించి తిరిగి పూరీకి చేరుకున్నారు. అప్పటి నుంచి ప్రతి సంవత్సరం శ్రీ జగన్నాథ స్వామివారు, శ్రీ బలభద్రుడు, శ్రీ సుభద్రాదేవి రథాలపై నగర విహారానికి బయలుదేరి గుండిచా ఆలయాన్ని దర్శించడం సంప్రదాయంగా కొనసాగుతోంది. ఈ యాత్రలో ముందుగా శ్రీ బలభద్రుని రథం, మధ్యలో శ్రీ సుభద్రాదేవి రథం, చివరగా శ్రీ జగన్నాథ స్వామివారి రథం ప్రయాణిస్తుంది. శ్రీ జగన్నాథ స్వామి వారు, శ్రీ బలభద్రుడు, శ్రీ సుభద్రాదేవి రథాలను పరిపక్వమైన వేప చెక్కతో (దారు) మాత్రమే తయారు చేస్తారు. చెక్క తప్ప ఇతర పదార్థాలను ఉపయోగించకుండా సంప్రదాయ పద్ధతిలో నిర్మించడం ఈ రథాల ప్రత్యేకత. మూడు రథాలలో శ్రీ జగన్నాథ స్వామి వారి నందిఘోష రథమే అతిపెద్దది. దీనికి 16 చక్రాలు ఉంటాయి. రథయాత్ర ప్రారంభానికి ముందు అనేక వైదిక, ఆగమ సంప్రదాయ పూజలు నిర్వహిస్తారు. అనంతరం పూరీ మహారాజు స్వయంగా విచ్చేసి రథాలకు పూజలు నిర్వహిస్తారు. తర్వాత బంగారు చీపురుతో (ఛేరా పహరా) రథమార్గాన్ని, రథ మండపాన్ని స్వయంగా శుభ్రపరచడం ఈ ఉత్సవంలో అత్యంత విశిష్టమైన ఆచారంగా భావించబడుతుంది. శాస్త్రాల ప్రకారం, శ్రీ జగన్నాథ రథయాత్రను భక్తిశ్రద్ధలతో ప్రత్యక్షంగా దర్శించడం వల్ల వెయ్యి యజ్ఞాలు చేసినంత పుణ్యఫలం లభిస్తుందని విశ్వాసం. అందుకే ప్రతి సంవత్సరం ఈ మహోత్సవాన్ని దర్శించేందుకు దేశ విదేశాల నుంచి లక్షలాది మంది భక్తులు పూరీకి చేరుకొని శ్రీ జగన్నాథ స్వామి వారి కృపాకటాక్షాలను పొందుతారు.
*┈┅━❀꧁: 🕉️ :꧂❀━┅┈*

1 month ago | [YT] | 1

Tenali Rams

Everyone got their own time


Someone graduated at the age of 22, but waited 5 years before securing a good job.

Someone became a CEO at 25, and died at 50. While another became a CEO at 50, and lived to 90 years.

Someone is still single, while someone from his school group has become grandfather.

Obama retired at 55 & Trump started at 70.

Everyone in this world works based on their time zone. People around you might seem ahead of you & some might seem to be behind you.

But everyone is running their own race, in their own time.

Do not envy them. They are in their time zone, and you are in yours.

So, relax.

You're not late.

You're not early.

You are very much on time ❤️

1 month ago | [YT] | 1

Tenali Rams

*మధ్యతరగతి అంతరంగంలో ఆ అంతరం అలాగే ఉండిపోయింది!*
🤔🤔🤔🤔🤔🤔🤔🤔

*1)* చిన్నప్పుడు రైల్లో ప్రయాణం చేసేటప్పుడు - తినడానికి , ఇంటినుండి అమ్మ చేసినవి తీసుకెళ్ళేవాళ్ళం.

కొంతమంది - రైల్లో కొనుక్కుని తినేవాళ్ళని చూసినపుడు మనమూ అలాగే కొనుక్కుని తినాలనిపించేది!

అప్పుడు నాన్న చెప్పేవాళ్ళు, *అది మన స్థాయికి చేయదగ్గది కాదు, డబ్బులున్న గొప్ప వాళ్ళు చేసేది అని!*

ఇప్పుడు పెద్దయ్యాక -
మనం కొనుక్కుని తినే టైంకి.....
ఆ పెద్ద వాళ్ళు , గొప్పవాళ్ళు ఆరోగ్య రీత్యా ఆహారం ఇంటినుండి తెచ్చుకుని తింటున్నారు.😂

*దాంతో ఆ అంతరం అలాగే ఉండిపోయింది .*

*2)* చిన్నప్పుడు కాటన్ దుస్తులు వేసుకుంటే - కొంతమంది టెర్లిన్ బట్టలు తొడుక్కునే వాళ్ళు.
అదిచూసి అటువంటివి కావాలనిపించినపుడు, నాన్న చెప్పే వారు ...
*అది ఖరీదైనది మనం అంత పెట్టగలిగేవాళ్ళంకాదని!*

పెద్దయ్యాక -
మనం టెర్లిన్ వాడటం మొదలు పెడితే .....
వాళ్ళు - కాటన్ కు దిగారు. ఇప్పుడు, కాటన్ దుస్తుల ధరే ఎక్కువ ! 🤪

*దాంతో ఆ అంతరం అలాగే ఉండిపోయింది ..*😒🤔

*3)* చిన్నప్పుడు ఆడుకుంటూ ఉన్న కాటన్ ప్యాంటుకే - మోకాళ్ళ దగ్గర చినిగితే , పారేసెందుకు మనసొప్పక అమ్మ లేదా టైలర్ తమ పనితనం చూపి నీట్ గా రఫ్ చేసి ఇస్తే ...మళ్ళీ హ్యాపీగా వేసుకునేవాళ్ళం!

పెద్దయ్యాక చూస్తే -
జనం ఆ మోకాళ్ళదగ్గర చిరుగులు ఉన్నవాటిని.... ఫ్యాషన్ పేరుతో అధికధరలకు కొంటున్నారు !

*దాంతో ఆ అంతరం అలాగే ఉండిపోయింది ...*🤔😒

4)* ఓ వయసులో మనకు - సైకిల్ కొనగలగడమే కష్టం.

అదీ సాధించేసరికి - వాళ్ళు స్కూటర్ నడిపించేవాళ్ళు.

మనం - స్కూటర్ కొనే సమయానికి ....
వాళ్ళు కార్లలో తిరిగేవారు.

మనం కొంచెం ఎదిగి - మారుతి 800 కొనే సమయానికి ....
వాళ్ళు BMW ల్లో తిరిగారు.

మనం రిటైర్మెంట్ వయసుకి వచ్చిన కూడబెట్టుకున్న వాటితో - కొంచెం పెద్ద కారు కోనేసమయానికి ....
వాళ్ళు ఆరోగ్యావసరాలతో సైక్లింగ్ చేస్తున్నారు!

*దాంతో ఇప్పటికి ఆ అంతరం అలాగే ఉండిపోయింది* . .🤔😒

ప్రతి దశలో ,
ప్రతి సమయాన ,
విభిన్న మనుషుల మధ్య - స్థాయి అంతరం ఉండనే ఉంటుంది.

*ఆ అంతరం - నిరంతరం* ఎప్పటికి ఉండి తీరుతుంది.

రేపటిఆలోచనతో ఇవాళ్టిది వదులుకుని .....😢
మళ్ళీ రేపటిరోజున - గతించిన ఇవాళ్టి గురించి ,చింతించేకంటే, 🥱

ఇవాళ అందినదానితో ఆనందిస్తూ , ఆస్వాదిస్తూ 💃🏻 రేపటికి స్వాగతం పలకడం శ్రేయస్కరం.🥰

*మనo .... మనవారి గురించి కాలాన్ని వెచ్చిద్దాం*
💞🌹

*మనం నవ్వుతూ ఉందాం*😊

*జీవితం కూడా సంతోషంగా ఉంటుంది* 🤩

1 month ago | [YT] | 0

Tenali Rams

2 months ago | [YT] | 1

Tenali Rams

Travel Sloka for before or travel time
ప్రయాణే గరుడా రూఢం
పారిజాత హరం హరిం
సత్యభామ యూతం ధ్యాయేత్
సర్వ కార్యార్థ సిద్ధయే

2 months ago | [YT] | 1

Tenali Rams

*అమెరికా పర్యటనలో ఉన్న ఒక సీనియర్ సిటిజన్ ఇస్తున్న సలహా:*

ప్రియమైన మిత్రులారా,
మేము గత రెండు నెలలుగా అమెరికాలోని వాషింగ్టన్ రాష్ట్రంలో ఉన్న సియాటెల్ నగరంలో ఉంటున్నాము. భారతదేశం నుండి వచ్చేటప్పుడే నా భార్యకు శ్వాసకోస సంబంధిత సమస్య తీవ్రంగా ఉంది. ఆమె పరిస్థితిని దృష్టిలో ఉంచుకుని, మేము భారత్ నుండి తగినన్ని మందులను వెంట తెచ్చుకున్నాము. అమెరికాలో ఆ మందులు వాడిన తర్వాత ఆమె దాదాపు కోలుకుంది.
అయితే, తెచ్చుకున్న మందులు అయిపోవడంతో, మా పర్యటన సమయంలో ఆమెకు మళ్లీ శ్వాసకోస సమస్య వస్తుందేమోనని నేను ఆందోళన చెందాను. అందుకే, సియాటెల్‌లోని ఒక పల్మనాలజిస్ట్ (శ్వాసకోస నిపుణుడు) అపాయింట్‌మెంట్ తీసుకోమని నా కుమార్తెను కోరాను.
కానీ, నేరుగా నిపుణుడిని కలవడానికి వీల్లేదని, ముందుగా జనరల్ ఫిజీషియన్‌ను కలవాలని నా కుమార్తెకు చెప్పారు. దాని కోసం మాకు వారం రోజుల తర్వాత అపాయింట్‌మెంట్ ఇచ్చారు, అది కూడా కేవలం వీడియో కాల్ ద్వారా మాత్రమే.
మేము ఫోన్‌లో సుమారు 10 నిమిషాల పాటు డాక్టరుతో మాట్లాడి, ఇండియాలో నా భార్య వాడుతున్న మందుల గురించి వివరించాము. ఆయన సమస్యను అర్థం చేసుకున్నానని చెబుతూ, అందుకు తగ్గట్టుగా మందులు రాసిచ్చారు. ఆ మందులను మెడికల్ స్టోర్ నుండి తీసుకోవచ్చని చెప్పారు. తీరా మేము స్టోర్‌లో విచారించగా, ఆ మందులు వెంటనే అందుబాటులో లేవని, రావడానికి 4-5 రోజులు పడుతుందని చెప్పారు.
చివరికి ఐదో రోజున మాకు ఆ మందులు అందాయి. ఆశ్చర్యకరమైన విషయం ఏమిటంటే, ఆ మందులను 'సిప్లా' (Cipla) కంపెనీ తయారు చేసింది మరియు వాటిపై 'మేడ్ ఇన్ ఇండియా' అని రాసి ఉంది. అమెరికాలో తీసుకున్న మెడికల్ ఇన్సూరెన్స్ వల్ల 50% రాయితీ లభించిన తర్వాత కూడా మేము ₹21,000 చెల్లించాల్సి వచ్చింది. అంటే, ఇండియాలో కేవలం ₹2,500 ఖరీదు చేసే మందులు, అమెరికాలో అక్షరాలా ₹42,000 అన్నమాట.
భారతదేశంలో మందుల దుకాణాల్లో నేరుగా దొరికే మందులను ఇక్కడ పొందడానికి మాకు 12 రోజుల సమయం పట్టింది. వారం రోజుల తర్వాత, డాక్టర్ సంప్రదింపుల ఫీజు (కన్సల్టేషన్) కోసం మాకు $283 (సుమారు ₹23,000) బిల్లు వచ్చింది.
భారతదేశంలో వైద్య సదుపాయాలు చాలా అధ్వాన్నంగా ఉన్నాయని భావించే నా భారతీయ మిత్రుల కోసం నా ఈ అనుభవాన్ని పంచుకుంటున్నాను.
మీ విశ్రాంత జీవితంలో మీరు భారతదేశంలో నివసిస్తున్నందుకు మిమ్మల్ని మీరు అదృష్టవంతులుగా భావించండి.

పుణ్యభూమి ఐన మన భారతదేశం లో మనం ప్రశాంతంగా బ్రతుకుతున్నందుకు సంతోషించండి. 🇮🇳 "భారతీయ విలాసవంతమైన జీవితం" (The Indian Luxury) - ప్రపంచమే కుళ్ళుకునే నిజం! 🌍
=========

మనం తరచుగా "మంచి జీవితం" కోసం విదేశాల వైపు చూస్తుంటాం. కానీ కాస్త ఆలోచిస్తే... లండన్ లేదా న్యూయార్క్‌లో ఉన్న ఒక బిలియనీర్‌కు కూడా దొరకని కొన్ని రోజువారీ సౌకర్యాలు, మన భారతదేశంలో మధ్యతరగతి వారికి కూడా చాలా సులువుగా దొరుకుతున్నాయి.

మన దేశంలో సామాన్యుడి జీవితం కూడా ఒక **VIP లైఫ్‌స్టైల్** అని చెప్పడానికి 8 నిదర్శనాలు:

**1. ఉదయం 7 గంటల రొటీన్: 🗞️**
కేవలం కొన్ని రూపాయలకే ప్రతిరోజూ ఉదయాన్నే ఫ్రెష్ పేపర్ మన గుమ్మం ముందుకు వస్తుంది. అదే వెస్ట్రన్ దేశాల్లో అయితే ఇదొక ఖరీదైన సేవ, పైగా అక్కడ ప్రింట్ మీడియా దాదాపు అంతరించిపోతోంది.

**2. డేటా ప్రజాస్వామ్యం: 📶**
ప్రపంచ దేశాలు బేసిక్ ఇంటర్నెట్ కోసం నెలకి $50 (సుమారు ₹4000) కంటే ఎక్కువ ఖర్చు చేస్తుంటే, మన దేశంలో కేవలం ₹300లకే హై-స్పీడ్ 5G డేటాను ఎంజాయ్ చేస్తున్నాం. ప్రపంచంలోనే అత్యంత చౌకైన డేటా మనదే! ఇదే మన ఆర్థిక వ్యవస్థను డిజిటల్‌గా మార్చేసింది.

**3. "10 నిమిషాల" అద్భుతం: ⚡**
టీలో వేయడానికి అల్లం ముక్క లేదా పాలు అయిపోయాయా? Blinkit, Zepto, లేదా Swiggy Instamart లో ఆర్డర్ చేస్తే... నీళ్లు మరిగేలోపే వస్తువు మీ చేతుల్లో ఉంటుంది. అదే యూరప్‌లో అయితే, ఒక కోటు వేసుకుని, చలిలో 15 నిమిషాలు నడిచి స్టోర్‌కి వెళ్లాలి... అప్పటికే అది మూసేసి ఉన్నా ఆశ్చర్యపోనక్కర్లేదు.

**4. క్షణాల్లో వైద్యం: 🩺**
ఒక స్పెషలిస్ట్ డాక్టర్‌ని కలవాలా? నేరుగా హాస్పిటల్‌కి వెళ్లొచ్చు. బ్లడ్ టెస్ట్ చేయించాలా? ఉదయం 6 గంటలకే ల్యాబ్ టెక్నీషియన్ ఇంటికి వచ్చి శాంపిల్ తీసుకుంటారు, మధ్యాహ్నానికల్లా రిపోర్ట్ వాట్సాప్‌లోకి వచ్చేస్తుంది. అక్కడ ఉన్నట్టు 3 నెలల వెయిటింగ్ లిస్ట్‌లు, "ఇన్సూరెన్స్ అప్రూవల్" నరకాలు మనకు లేవు.

**5. మనుషుల సాయం (Human Support System): 🏠**
ఇల్లు తుడవడానికి, వంట చేయడానికి, డ్రైవింగ్‌కి మనుషులు ఉండటం ఇక్కడ కేవలం ధనవంతులకే పరిమితం కాదు... మధ్యతరగతి జీవితాలకి ఇది వెన్నుముక. ఇది మన జీవితాల్లో అత్యంత విలువైనది... అంటే **"సమయాన్ని" (TIME)** మిగులుస్తుంది.

**6. UPI విప్లవం: 📱**
రోడ్డు పక్కన తాగే ₹5 రూపాయల చాయ్ నుండి ₹50,000 ల్యాప్‌టాప్ వరకు... అంతా ఒకే ఒక స్కాన్! వ్యాలెట్‌లతో పనిలేదు, "కార్డ్ మెషిన్ పనిచేయడం లేదు" అనే సాకులు లేవు, ఎలాంటి ట్రాన్సాక్షన్ ఫీజులు లేవు. ఈ విషయంలో ప్రపంచ దేశాలు మనకంటే చాలా వెనుకబడి ఉన్నాయి.

**7. "ఉచిత" చిన్న చిన్న ఆనందాలు: 💧**
ఏ హోటల్‌కి వెళ్లినా ఒక గ్లాసు మంచి నీళ్లు ఫ్రీగా ఇస్తారు (అక్కడైతే $5 బిల్లు వేస్తారు). మన బట్టలు ఇస్త్రీ చేయడానికి వీధి చివర ప్రెస్‌వాలా ఉంటారు. ఈ చిన్న చిన్న విషయాలే మన జీవితాన్ని సాఫీగా సాగేలా చేస్తాయి.

**8. సామాజిక బంధాలు (Social Safety Net): 🤝**
మనం లీగల్ నోటీసులు, కోర్టుల సంస్కృతిలో బతకడం లేదు... బంధాల సంస్కృతిలో బతుకుతున్నాం. మనకు ఏదైనా సమస్య వస్తే, పక్కింటివాడు కోర్టు నోటీసు పంపడు... ప్రేమగా "కిచిడీ" వండి పంపిస్తాడు.

---

### బాటమ్ లైన్ (The Bottom Line) 🚩

భారతదేశం అనేది కేవలం ఒక దేశం కాదు; అడుగడుగునా సౌకర్యాలు నిండిన ఒక అద్భుతమైన ప్రపంచం. పాశ్చాత్య దేశాలలో ప్రజలు తమ పనులన్నీ (గడ్డి కత్తిరించడం నుండి ప్లంబింగ్ వరకు) తామే చేసుకుంటూ (DIY Struggle) సగం జీవితాన్ని గడిపేస్తుంటే... ఇండియాలో మాత్రం మనల్ని కనిపెట్టుకుని చూసే ఒక సేవా ఆధారిత జీవనశైలి ఉంది.

> **ఇక్కడ మనం కేవలం బతకడం లేదు... మనల్ని ప్రతి క్షణం చూసుకునే ఒక వ్యవస్థ ఉంది! 🧡🤍💚**

**నిజం:** విదేశాలకు వెళ్లి మన బట్టలు మనమే ఉతుక్కుని, గిన్నెలు తోముకున్నప్పుడే... మన దేశంలో ఉన్న ఈ "రాజభోగం" (Indian Comfort) విలువ ఏంటో ప్రతి ఒక్కరికీ అర్థమవుతుంది!

కాబట్టి - తూర్పుకైనా వెళ్ళు, పడమరకైనా వెbళ్ళు..
**భారతదేశమే నంబర్ వన్!** 🇮🇳👌

Copy post

2 months ago | [YT] | 0

Tenali Rams

🍀🌺🍀🌺🍀🕉️🍀🌺🍀🌺🍀

*మన్రో గంగాళాలు*
➖➖➖✍️


*"మన్రో గంగాళాలు" అంటే  ఏవో తెలుసా..??*

కడుపు నొప్పికి మంత్రం *శ్రీవారి పులిహోరే...*
```
తిరుమలలో శ్రీవారికి ప్రతిరోజు నివేదించే నైవేద్యాలు ఇలాంటి గంగాళంలో మాత్రమే ఎందుకు నివేదింప బడుతున్నాయి.??

ఈ గంగాళం వెనక ఉన్న కథ ఏమిటి..??

1800 ప్రాంతంలో తిరుమలలో దాదాపు శ్రీవారి కైంకర్యాలకు, నైవేద్య నివేదనకు, భక్తులకు ప్రసాదాల వితరణ కోసం ప్రముఖంగా వెదురు బుట్టలు వాడేవారు.

అప్పట్లో భక్తులకు హోటల్స్ లేవు కనుక.... తిరుమలలో భక్తులకు బుట్టల్లో ప్రసాదాలు పంచిపెట్టేవారు. అవే ఆనాటి భక్తులకు కడుపు నింపేవి.

అక్కడక్కడా రామానుజ కూటముల ద్వారా కూడ అన్న సంతర్పణ జరిగినా ఆలయంలో పంచి పెట్టే ప్రసాదాలే ఆ నాటి భక్తులకు ప్రధాన ఆహారం.

1800 ప్రాంతంలో అప్పటి మద్రాస్ ప్రెసిడెన్సీ లో పని చేస్తూ బ్రిటిష్ ప్రభుత్వం వారి ఈస్ట్ ఇండియా కంపెనీ లో గవర్నర్ గా పని చేసిన అధికారి పేరు.. “THOMOS MUNRO” ..

దక్షిణ భారతదేశం మరియూ ప్రముఖంగా రాయలసీమ, కంచి ప్రాంతంలో ఆయన ఏలుబడి కింద ఉండేది.

ఈయన నిక్కచ్చిగా క్రైస్తవ పద్ధతులు పాటించే విదేశీయుడు.
మన హైందవ సనాతన ధర్మం పట్ల ఎటువంటి గౌరవ భావం లేనివాడు.

ఉద్యోగ రీత్యా చాలా సార్లు తిరుమల వచ్చినా... ఒక్కసారి కూడా శ్రీవారి దర్శనం చేసుకోకుండా తిరిగి వెళ్లిపోయేవాడు.

అప్పట్లో తిరుమలలో భక్తులకు గుడి బయట ప్రసాదాలు పెద్ద మొత్తంలో పంచిపెట్టేవారు (అవే వారికి భోజనాలు).

అప్పట్లో శ్రీవారికి ప్రధాన ప్రసాదంగా పొంగలి, పులిహారా, దద్దోజనం మొదలైన వంటలు సమర్పించేవారు (అప్పటికి లడ్డు ప్రధాన ప్రసాదం కాదు).

ఆ ప్రసాదాలను భక్త్తులు ఎంతో భక్తితో అక్కడ నేల మీద  కూర్చుని నేరుగా చేతులతో తన్మయత్వంలో తినడం చూసి థామస్ మన్రోకి ఒకరకమైన అసహ్యం వేసింది.

స్వతహాగా విదేశీయుడు కావున... అలా నేరుగా చేతులతో ప్రసాదాలు తినడం చూసి అది ఆరోగ్యకరమైన పద్దతి కాదు అని, శుచి శుభ్రత లేకుండా అలా అందరూ కలిసి ఓకేదగ్గర నేరుగా ప్రసాదాలు చేతితో తినడం వల్ల లేనిపోని అంటు వ్యాధులు, కడుపు నొప్పులు వచ్చే ప్రమాదాలు ఉన్నాయి అని.... మన ఆలయ సంప్రదాయం, ప్రసాదాలు పట్ల ఒకింత చులకన భావం కలిగిన థామస్ మన్రో వెంటనే తన అధికారం ఉపయోగించి నేరుగా తిరుమలలో భక్తులు శ్రీవారి ప్రసాదాలు తినకుండా ఆదేశాలు ఇచ్చాడు.

శ్రీవారి లీల ప్రభావంతో  ఏ కడుపు నొప్పిని సాకుగా చూపించి ప్రసాదాలు థామస్ మన్రో రద్దు చేశారో... అదే  తీవ్రమైన కడుపు నొప్పి ఆయనకి వచ్చి ఎన్ని రకాలుగా వైద్యం చేయించినా తగ్గకుండా ఆతని ఆరోగ్యం క్షీణించి, పూర్తిగా అనారోగ్యంతో మంచం పట్టినాడు.

అనుకోని పరిస్థితుల్లో అతనికి మంత్రాలయం రాఘవేంద్రస్వామి వారి మీద ఎనలేని భక్తి, శ్రద్ధ గురి కుదిరింది. అతను ఆ ఆలయంకి ఎన్నో కైంకర్యాలకు ధన సహాయం చేసినా ఆయన కడుపు నొప్పి మాత్రం తగ్గక నరక యాతన అనుభవించేవాడు.

అతనిలో వచ్చిన ఆధ్యాత్మిక పరివర్తనకి, సనాతన ధర్మం పట్ల భక్తిని గమనించిన మంత్రాలయ పీఠాధిపతులు ఆయన తిరుమల  శ్రీవారి పట్ల, ఆయన ప్రసాదాల పట్ల చేసిన ఘోరమైన తప్పుని తెలియజేసి, శ్రీవారి క్షేత్ర మహిమని వివరించారు.

శ్రీవారి ప్రసాదాల మహిమ తెలుసుకున్న థామస్ మన్రో... శ్రీవారి పులిహార నేరుగా తన చేతితో తిన్న వెంటనే కడుపునొప్పి మటుమాయం అయింది..

తప్పు తెలుసుకున్న థామస్ మన్రో... శ్రీవారికి కైంకర్యాల కోసం, నైవేద్యాలు సమర్పణ కోసం  చాలా గంగాళాలు సమర్పించాడు మరియూ తిరుపతి శ్రీవారి భక్తులకు మళ్ళీ మునుపటి లాగా ప్రసాదాలు పంచి పెట్టేలా వాటిని భక్తులు నేరుగా ఆలయం దగ్గరే తినేలా తిరిగి ఉత్తర్వులు ఇచ్చాడు.

ఎంత పశ్చాత్తాప పడినా, ఎన్ని గంగాళాలు దేవస్థానానికి సమర్పించినా శ్రీవారి దర్శనానికి మాత్రం నోచుకోలేకపోయాడు.

మనోవ్యధతో మంచం పట్టి “నేరుగా
నీ సేవలో పాల్గొనే అదృష్టం లేదా స్వామీ” అని ఎన్నో విధాల శ్రీవారిని ప్రార్థిస్తూ 1827 లో ప్రాణం వదిలాడు.

అతని భక్తికి మెచ్చిన శ్రీనివాసుడు ఆనాటి నుండి ఈనాటి వరకు తన అన్ని రకాల ప్రసాదాలను కేవలం ఆ గంగాళాలులోనే స్వీకరిస్తున్నాడు...

ఈ గంగాళలను ఇప్పటికీ ```
*"మన్రో గంగాళాలు"*  ```అనే పేరుతో  దేవస్థాన పూజా కైంకర్యాలలో చలామణీలో ఉన్నాయి.

శ్రీవారి దర్శనానికి నేరుగా నోచుకోకపోయినా ఆయన పేరు మీదే ప్రసాదాల పాత్రలు ఉండేలా శ్రీవారు అతనికి ఎప్పటికీ తరిగిపోని చిరకీర్తిని కలిగించి ఒక రకమైన చిరకీర్తి  ప్రసాదించాడు.

తెలుసుకోవాలన్న శ్రద్ధ, భక్తి ఉండాలే గాని తిరుమలలో పరమాత్మ గూర్చే కాదు ఆ పరమాత్మునికి నివేదించే ప్రసాదాలలోనే కాక ఆ ప్రసాదాల పాత్రల వెనక కూడా ఎంతో విలువైన ఆధ్యాత్మిక మహిమలు, శ్రీవారు లీలలు, చరిత్ర  కలదు.

భక్తితో శ్రీనివాసుని తెలుసుకునే ప్రయత్నం చేస్తే తిరుమలగిరిలో అడుగడుగున, ప్రతి గడపకి, ప్రతి చెట్టుకి ప్రతి ఒక్క చిన్న ప్రదేశం వెనక ఎంతో తెలుసుకోవాల్సిన ఆధ్యాత్మిక చరిత్ర దాగి ఉంది...```

*శ్రీనివాసుడి గురించి తెలుసుకోండి ... నలుగురికి తెలియజెప్పండి...*✍️
*ఓం నమో వెంకటేశాయ!*
(Credit To M.Suvarchala Madam)
*సర్వం శ్రీకృష్ణార్పణమస్తు*
🌷🙏🌷

🙏లోకా సమస్తా సుఖినోభవన్తు!🙏
🍀🌺🍀🌺🍀🕉️🍀🌺🍀🌺🍀
*రేపటి తరానికి బతుకు, భద్రత లతోపాటు భారతీయత కూడా నేర్పండి.*

2 months ago | [YT] | 0