AadyaTv is a dynamic YouTube channel covering news from Telangana and Andhra Pradesh. Known for its independent and innovative approach, the channel delivers accurate and factual content, breaking news, political analysis, and satirical pieces with wit & humor.

Aadya TV also provides live reports and in-depth documentaries.

The channel is a one-stop destination for updates on politics, sports, entertainment, business, science, and technology.

Committed to unbiased reporting, Aadya TV aims to be a reliable source for the latest and most comprehensive stories from both Telugu states.
Please Follow On
FB - www.facebook.com/profile.php?id=61556679644352
Twitter - twitter.com/aadya_tv
Instagram - www.instagram.com/aadyatvtelugu/?hl=en




Aadya TV

❌⚡ కాంగ్రెస్ అంటేనే కరెంటు కోతలు!

వనపర్తి జిల్లా, పెబ్బేరు మండలం గుమ్మడం సబ్‌స్టేషన్‌ను తనిఖీ చేసిన బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్.

సబ్‌స్టేషన్‌ లాగ్‌బుక్‌ను పరిశీలించి, విద్యుత్ సరఫరాపై అధికారులను అడిగి వివరాలు తెలుసుకున్న
KTR BRS


లాగ్‌బుక్‌లోని వివరాలతో “6 గంటల కరెంటు కూడా సక్కగా ఇస్తలేరు” అని తేలిపోయింది.

అడ్డగోలు కరెంట్ కోతలపై ఆందోళన వ్యక్తం చేస్తూ భారీగా తరలివచ్చిన రైతులు.

#ktr #brsparty #aadyatv #telangananews

8 hours ago | [YT] | 315

Aadya TV

సీఎం రేవంత్ రెడ్డికి కేటీఆర్ బంపర్ ఆఫర్

కేసీఆర్ కుటుంబానికి లక్ష కోట్ల భూములంటూ రేవంత్ రెడ్డి చేస్తున్న అసత్య ప్రచారాలపై స్పందించిన కేటీఆర్

మాకున్న ఆస్తులన్నీ రాసిస్తాం.. రేవంత్ రెడ్డి చెప్పిన రూ.లక్ష కోట్లు రాష్ట్రంలోని పేద ప్రజల ఖాతాలో వేస్తాడా?

తెలంగాణలోని పేద ప్రజల ఖాతాలో వెంటనే రేవంత్ రెడ్డి రూ.లక్ష కోట్లు వేస్తానంటే.. మా పేరుతో ఉన్న ప్రతి ఇంచు భూమిని రాసిస్తాం

లేకపోతే రేవంత్ రెడ్డి పిచ్చి ప్రచారాన్ని ఇకనైనా మానుకుని వెంటనే ముక్కు నేలకు రాసి క్షమాపణ చెప్పు

వెయ్యి ఎకరాల ఫామ్ హౌజ్ అంటూ రేవంత్ రెడ్డి ఇంతకాలం చేసిన విషప్రచారం బెడిసి కొట్టడంతో.. ఇప్పుడు కేసీఆర్ కుటుంబానికి రూ.లక్ష కోట్ల భూములు అంటూ ఈ విష ప్రచారం చేయడానికి సిగ్గనిపిస్తలేదా?

కేసీఆర్ వ్యవసాయ క్షేత్రంలో ఉన్నది కేవలం 67 ఎకరాలు మాత్రమేనని రేవంత్ రెడ్డే అసెంబ్లీలో స్వయంగా ఒప్పుకున్నాక కూడా కుతంత్రాలతో కట్టుకథలు అల్లుతున్నాడు

వెయ్యి రోజుల విఫల పాలన నుంచి అటెన్షన్ డైవర్షన్ చేసేందుకే ఈ కుట్ర చేస్తున్నట్టు తెలంగాణ సమాజానికి అర్థమైపోయింది

420 హామీల మోసాల నుంచి, 22-A భూకుంభకోణం నుంచి ఈ చిల్లర ఆరోపణలతో నాలుగు కోట్ల ప్రజల దృష్టిని మళ్లించలేరు

బీఆర్ఎస్ ప్రభుత్వం ఏర్పడగానే రేవంత్ రెడ్డి చేసిన అవినీతి అక్రమాలు, కుంభకోణాలన్నింటినీ బయటపెడతాం

రేవంత్ రెడ్డి కుటుంబం దోచుకున్న ప్రతి పైసాను తెలంగాణ ప్రజల సాక్షిగా కక్కిస్తాం

- కేటీఆర్

#ktr #cmrevanthreddy #aadyatv

14 hours ago | [YT] | 241

Aadya TV

బిగ్ బ్రేకింగ్ న్యూస్

ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్‌పై అనర్హత వేటు వేసిన తెలంగాణ హైకోర్టు

#danamnagender #highcourt #aadyatv

1 day ago | [YT] | 179

Aadya TV

వైఎస్ షర్మిల కుమార్తె అంజలి రెడ్డి వివాహ తేదీలు ప్రకటన..

వైఎస్ఆర్ ఘాట్ వద్ద తొలి ఆహ్వాన పత్రికఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల తన కుమార్తె వైఎస్ అంజలి రెడ్డి వివాహం సోమల రఘురామ్ రెడ్డితో జరగనుందని ప్రకటించారు.

స్వర్గీయ వైఎస్ రాజశేఖరరెడ్డి గారి ఆశీస్సులతో వైఎస్ఆర్ కుటుంబంలో మరో సంతోషకరమైన క్షణం ఇదని ఆమె పేర్కొన్నారు.ఈ నెల 24న నిశ్చితార్థం, నవంబర్ 25న పరిణయం, డిసెంబర్ 5న రిసెప్షన్ వేడుక జరుగుతాయని షర్మిల వెల్లడించారు. ఇరువురి కలయిక దైవ సంకల్పమని, నూరేళ్ల జీవితానికి శుభారంభమని ఆమె అన్నారు.

కాబోయే నూతన వధూవరుల తొలి వివాహ ఆహ్వాన పత్రికను కుటుంబ సభ్యులు, రఘురామ్ రెడ్డి తల్లిదండ్రులతో కలిసి ఇడుపులపాయలోని నాన్న వైఎస్ఆర్ ఘాట్ వద్ద ఉంచి ఆశీస్సులు తీసుకున్నారు.

నాన్న దీవెనలు బిడ్డల జీవితాలకు కొండంత అండగా నిలుస్తాయని, ఆయన చూపిన సన్మార్గం ఎల్లప్పుడూ ఆదర్శప్రాయంగా ఉంటుందని షర్మిల తెలిపారు.రఘురామ్ రెడ్డి సోమల సుబ్బా రెడ్డి, సోమల పద్మా రెడ్డి దంపతుల కుమారుడు. వీరి కుటుంబం మూలాలు కర్నూలు జిల్లాకు చెందినవి.

ప్రస్తుతం అమెరికాలో స్థిరపడి ఉన్నారు. కుటుంబ సభ్యులందరూ అమెరికా పౌరులు. రఘురామ్ రెడ్డి అమెరికాలో డాక్టర్‌గా పనిచేస్తున్నారు.షర్మిల, ఆమె భర్త అనిల్ కుమార్ దేవునికి కృతజ్ఞతలు తెలుపుకుంటూ, స్నేహితులు, శ్రేయోభిలాషుల ప్రార్థనలు, ఆశీర్వాదాలు కోరారు. నూతన దంపతుల దాంపత్య జీవితం కన్నుల పండుగగా, సుఖసంతోషాలతో సాగాలని కోరుకున్నారు.

#yssharmila #ysrghat #aadyatv

1 day ago | [YT] | 40

Aadya TV

మీనాక్షి నటరాజన్ పాస్‌పోర్ట్ సీజ్ చేయండి

నాంపల్లి కోర్టులో అత్యవసర పిటిషన్ వేసిన కుంభం శివకుమార్ రెడ్డి కేసు బాధితురాలు శ్రీలత

మీనాక్షి నటరాజన్‌పై ఇప్పటికే కోర్టు పరిధిలో రెండు క్రిమినల్ కేసులు ఉన్నాయని, ఈ నేపథ్యంలో ఆమె ఉన్నత చదువుల కోసం విదేశీ పర్యటనకు వెళ్లడం సరికాదని, ఆమె పాస్‌పోర్ట్ జప్తు చేయాలని పిటిషన్ దాఖలు చేసిన శ్రీలత

క్రిమినల్ కేసులు ఎదుర్కొంటున్న వారు విదేశాలకు వెళ్తే న్యాయ ప్రక్రియకు అంతరాయం కలుగుతుందని, ఆమె విదేశీ పర్యటనను అడ్డుకోవాలని పిటిషన్

#meenakshinatarajan #congressparty #aadyatv

1 day ago | [YT] | 31

Aadya TV

ఫార్ములా-ఈ రేసు అక్రమ కేసు విచారణలో భాగంగా నాంపల్లి ఏసీబీ కోర్టుకు హాజరయ్యేందుకు బయలుదేరిన బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్!

#ktr #nampallycourt #aadyatv

1 day ago | [YT] | 348

Aadya TV

తెలంగాణ గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికలకు ఓటర్ల జాబితా ప్రక్రియ షెడ్యూల్ విడుదల

మహబూబ్‌నగర్–రంగారెడ్డి–హైదరాబాద్, వరంగల్–ఖమ్మం–నల్గొండ గ్రాడ్యుయేట్స్ నియోజకవర్గాలకు కొత్త ఓటర్ల జాబితా

2027 మార్చిలో రెండు గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ నియోజకవర్గాల్లో ఖాళీలు ఏర్పడనున్న నేపథ్యంలో కొత్తగా ఓటర్ల జాబితా సిద్ధం చేసేందుకు ఎన్నికల సంఘం షెడ్యూల్ విడుదల చేసింది.

📌 ముఖ్యమైన తేదీలు
సెప్టెంబర్ 28, 2026: ఓటర్ల జాబితా ప్రక్రియపై ప్రజా నోటీసు
అక్టోబర్ 15: పత్రికల్లో తొలి పునఃప్రచురణ
అక్టోబర్ 25: రెండో పునఃప్రచురణ
నవంబర్ 6: ఫారం–18 దరఖాస్తుల స్వీకరణకు చివరి తేదీ
నవంబర్ 20: ముసాయిదా ఓటర్ల జాబితా ముద్రణ పూర్తి
నవంబర్ 25: ముసాయిదా ఓటర్ల జాబితా ప్రచురణ
నవంబర్ 25–డిసెంబర్ 10: క్లెయిమ్‌లు, అభ్యంతరాల స్వీకరణ
డిసెంబర్ 25: క్లెయిమ్‌లు, అభ్యంతరాల పరిష్కారం పూర్తి
డిసెంబర్ 30: తుది ఓటర్ల జాబితా ప్రచురణ
⚠️ గ్రాడ్యుయేట్ ఓటర్లకు కీలక సూచన

ప్రస్తుత ఓటర్ల జాబితాలో పేర్లు ఉన్న గ్రాడ్యుయేట్లు కూడా కొత్తగా మార్చిన ఫారం–18లో తప్పనిసరిగా దరఖాస్తు చేసుకోవాలని ఎన్నికల సంఘం స్పష్టం చేసింది.

దరఖాస్తుతో పాటు అవసరమైన ధ్రువపత్రాలు, సర్టిఫికెట్ల ధృవీకరించిన ప్రతులను సమర్పించాలని సూచించింది.

ఓటు హక్కు కోసం అర్హులైన గ్రాడ్యుయేట్లు నిర్ణీత గడువులోగా ఫారం–18 దరఖాస్తు ప్రక్రియను పూర్తి చేయడం కీలకం.

#graduatemlcelections #telanganaelections #aadyatv

2 days ago | [YT] | 108

Aadya TV

పాలమూరు నీటి గోస తీర్చిన అపర భగీరథుడు కేసీఆర్!

పాలమూరు–రంగారెడ్డి ఎత్తిపోతల ప్రాజెక్ట్‌ పంపులు ప్రారంభించి మూడేళ్లు పూర్తి!

ఉమ్మడి పాలనలో కరువు కాటకాలు, వలసలతో అల్లాడిన పాలమూరు ప్రాంతానికి సాగునీటి వెలుగులు తీసుకొచ్చిన ఘనత మాజీ సీఎం కేసీఆర్‌దని బీఆర్ఎస్ వర్గాలు పేర్కొంటున్నాయి.

ఏళ్ల తరబడి పెండింగ్‌లో ఉన్న ప్రాజెక్టులను ముందుకు తీసుకెళ్లి, ఉమ్మడి మహబూబ్‌నగర్ జిల్లాలో లక్షల ఎకరాలకు సాగునీరు అందించే దిశగా బీఆర్ఎస్ ప్రభుత్వం కీలక చర్యలు చేపట్టిందని వారు చెబుతున్నారు.

ఉమ్మడి మహబూబ్‌నగర్, రంగారెడ్డి, నల్గొండ జిల్లాల్లో సాగునీటి అవసరాలను తీర్చే లక్ష్యంతో పాలమూరు–రంగారెడ్డి ఎత్తిపోతల ప్రాజెక్ట్‌కు కేసీఆర్ ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. కృష్ణా జలాలతో 12.30 లక్షల ఎకరాలను తడిపే లక్ష్యంతో ప్రణాళికలు రూపొందించింది.

2023 సెప్టెంబర్ 16న నార్లాపూర్ పంపును ప్రారంభించిన కేసీఆర్ ప్రభుత్వం, పాలమూరు సాగునీటి కలను సాకారం చేసే దిశగా కీలక అడుగు వేసిందని బీఆర్ఎస్ పేర్కొంటోంది.

అయితే, అనంతరం అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం పాలమూరు–రంగారెడ్డి ప్రాజెక్ట్‌పై తగినంత దృష్టి పెట్టడం లేదని బీఆర్ఎస్ తరఫున విమర్శలు వ్యక్తమవుతున్నాయి.

నార్లాపూర్ పంపు ప్రారంభానికి మూడేళ్లు పూర్తైన సందర్భంగా, పాలమూరు–రంగారెడ్డి ప్రాజెక్టులో మిగిలిన పనులను వేగవంతం చేసి, రైతుల పొలాలకు సాగునీరు అందించాలని కాంగ్రెస్ ప్రభుత్వాన్ని మరోసారి డిమాండ్ చేస్తున్నాం.

పాలమూరు ప్రజల నీటి హక్కులతో రాజకీయాలు చేయొద్దు.
ప్రాజెక్టును నిర్లక్ష్యం చేయకుండా పనులు పూర్తి చేసి రైతులకు నీరు అందించాలి.

#kcr #kaleshwaramproject #aadyatv

2 days ago | [YT] | 263

Aadya TV

నాంపల్లి కోర్టును ఆశ్రయించిన హరీష్ రావు

టీపీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్, ఎమ్మెల్సీ అద్దంకి దయాకర్‌పై మాజీ మంత్రి హరీష్ రావు తరఫున నాంపల్లి కోర్టులో పరువు నష్టం దావా దాఖలైంది.

క్షుద్ర పూజలకు సంబంధించిన ఆరోపణల నేపథ్యంలో తన ప్రతిష్ఠకు భంగం కలిగించేలా వ్యాఖ్యలు చేశారంటూ హరీష్ రావు ఇప్పటికే లీగల్ నోటీసులు జారీ చేసినట్లు ఆయన తరఫు న్యాయవాది తెలిపారు. నిర్ణీత గడువులోగా క్షమాపణలు చెప్పకపోవడంతో న్యాయపరమైన చర్యలకు దిగినట్లు వెల్లడించారు.

ఈ వ్యవహారంపై కోర్టులో దావా దాఖలు చేసిన హరీష్ రావు తరఫు న్యాయవాది, ఆరోపణలకు సంబంధించిన అంశాలను న్యాయస్థానం దృష్టికి తీసుకెళ్లినట్లు తెలిపారు.

#harishrao #maheshkumargoud #aadyatv #addankidayakar

2 days ago | [YT] | 381

Aadya TV

ప్రజా ప్రయోజనాల కోసం AI వినియోగంపై KTR దృష్టి 🤖🇮🇳

BRS వర్కింగ్ ప్రెసిడెంట్ KTR న్యూఢిల్లీలోని ఇండియా హ్యాబిటాట్ సెంటర్‌లో ఏర్పాటు చేసిన **‘Bharat AI Experiential Center’**ను సందర్శించారు.

జనాగ్రహ నిర్వహించిన ‘Sheheron Pe Charcha’ కార్యక్రమంలో పాల్గొన్న అనంతరం KTR ఈ AI ఎక్స్‌పీరియెన్షియల్ సెంటర్‌ను సందర్శించారు.

ఈ సందర్భంగా ప్రజా ప్రయోజనాల కోసం ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI) ఆధారిత పరిష్కారాలపై పనిచేస్తున్న వివిధ సంస్థల ప్రతినిధులతో KTR ముచ్చటించారు. ఆయా సంస్థలు అభివృద్ధి చేస్తున్న AI ఆధారిత టెక్నాలజీలు, వాటి వినియోగం, ప్రజలకు అందించే ప్రయోజనాల గురించి ఆయన తెలుసుకున్నారు.

ప్రభుత్వ పాలనలో టెక్నాలజీ వినియోగాన్ని పెంచడం, ప్రజలకు మెరుగైన సేవలు అందించడంలో AI వంటి ఆధునిక సాంకేతికతలను ఉపయోగించడం, నగరాల అభివృద్ధి మరియు ప్రజా సమస్యల పరిష్కారంలో కొత్త ఆవిష్కరణలకు ప్రాధాన్యత ఇవ్వడం వంటి అంశాలపై ఈ సందర్శనలో చర్చ జరిగింది.

టెక్నాలజీని కేవలం అభివృద్ధి కోసం కాకుండా… ప్రజల జీవితాలను మరింత సులభతరం చేయడానికి వినియోగించాలనే ఆలోచనతో KTR AI రంగంలోని తాజా పరిణామాలను పరిశీలించారు.

#ktr #brsparty #aadyatv

3 days ago | [YT] | 508