*గణపతికి అత్యంత ప్రీతిపాత్రమైన తిధులలో ప్రధానమైనది చవితి తిథి*
మానవుల కష్టాల నుండి గట్టెక్కించేది సంకటహర చతుర్థి వ్రతం. గణపతికి అత్యంత ప్రీతిపాత్రమైన తిధులలో ప్రధానమైనది చవితి తిథి.
పౌర్ణమి తరువాత వచ్చే చతుర్థి రోజున చేసే వ్రతంను సంకష్టహర చతుర్థి లేదా సంకటహర చతుర్థి వ్రతం అంటారు.
ఇందులో వరదచతుర్థి ని వినాయక వ్రతం గా వినాయక చవితి రోజున ఆచరించెదరు. సంకటములను తొలగించే సంకట హర చతుర్థి వ్రతంను మాత్రం ఆలంబనంగా ఆచరిస్తూ ఉంటారు.
*సంకటహర చతుర్థి వ్రత పూజా విధానం:-* సంకష్టహరచవితి వ్రతాన్ని 3, 5, 11 లేదా 21 నెలలపాటు ఆచరించాలి. ఈ వ్రతాన్ని బహుళ చవితి నాడు ప్రారంభించాలి. వ్రతాచరణ రోజున ప్రాతఃకాలమే తలస్నానం చేసి ఆ తరువాత గణపతిని పూజించాలి. అరమీటరు పొడవు ఉన్న తెలుపు లేదా ఎరుపు రవికల గుడ్డముక్క తీసుకుని వినాయకుడి ముందు పెట్టి దానిని పసుపు, కుంకుమలతో అలంకరణను చేయాలి. మనస్సులోని కోరికను తలచుకొని మూడు గుప్పిళ్ళ బియ్యాన్ని గుడ్డలో వేసిన తరువాత తమలపాకులో రెండు ఎండు ఖర్జూరాలు, రెండు వక్కలు, దక్షిణ పెట్టి మనసులోని కోరికను మరొకసారి తలచుకుని మూటకట్టాలి.
సంకటనాశన గణేశ స్తోత్రం, సంకట హర చతుర్థి వ్రత కథను చదవవలెను.
ఆ మూటను స్వామి ముందు పెట్టి ధూపం వెలిగించి కొబ్బరికాయ లేదా పళ్ళు స్వామికి నివేదించాలి. తదుపరి గణపతి ఆలయానికి వెళ్ళి 3 లేక 11 లేక 21 ప్రదక్షిణాలు చేయాలి. శక్త్యానుసారము గరిక పూజను కాని, గణపతి హోమమును కాని చేయించుకోవచ్చును. సూర్యాస్తమయం వరకూ పూజ చేసిన వినాయకుడిని కదపరాదు. సూర్యుడు అస్తమించిన తరువాత స్నానం చేసి దీపం వెలిగించి తిరిగి వినాయకుడికి లఘువుగా పూజ చేయాలి. నియమం పూర్తయిన తరువాత వినాయకుడికి కట్టిన ముడుపు బియ్యంతో పొంగలి చేసి స్వామికి నివేదించి సాయంత్రం తినాలి.
*సంకట హర చతుర్ధి వ్రత కథ:*
ఒకానొకనాడు ఇంద్రుడు తన విమానంలో బృఘండి (వినాయకుని గొప్ప భక్తుడు) అనే ఋషి దగ్గర్నించి ఇంద్రలోకానికి తిరిగి వెలుతుండగా ఘర్సేన్ అనే రాజు రాజ్యం దాటే సమయంలో అనేక పాపములు చేసిన ఒకానొక వ్యక్తి ఆకాశంలో పయనించే ఆ విమానంపై దృష్టి సారించాడు. అతని దృష్టి సోకగానే ఆ విమానం చటుక్కున భూమిపై అర్ధాంతరంగా ఆగిపోవటం జరిగింది. ఆ ఇంద్ర విమానం అద్భుతమైన వెలుగుకి ఆశ్చర్యచకితుడైన ఆ దేశపురాజు సురసేనుడు గబగబ బయటికి వచ్చి ఆ అద్భుతాన్ని చూసి ఆశ్చర్యం చెందుతూ చూడ సాగాడు.
అక్కడ ఇంద్రుని చూసి ఎంతో సంతోషానికి లోనయిన మహారాజు ఆనందంతో నమస్కరించారు. ఇంద్రునితో అక్కడ విమానం ఎందుకు ఆపినారో కారణం అడిగాడు. అపుడు ఇంద్రుడు.. ‘ఓ రాజా! మీ రాజ్యంలో పాపాలు అధికంగా చేసిన వ్యక్తి ఎవరిదో దృష్టి సోకి విమానం మార్గమధ్యలో అర్ధాంతరంగా ఆగింది’ అని చెప్పాడు.
అపుడు ఆ రాజు ‘అయ్యా! మరి మళ్ళీ ఆగిపోయిన విమానం ఎలా బయలుదేరుతుంది’అని అడిగాడు వినయంగా! అపుడు ఇంద్రుడు ‘ఇవాళ పంచమి, నిన్న చతుర్ధి. నిన్నటి రోజున ఎవరైతే ఉపవాసం చేసారో వారి పుణ్యఫలాన్ని నాకిస్తే నా విమానం తిరిగి బయలుదేరుతుంది’ అని చెప్పాడు.
సైనికులంతా కలిసి రాజ్యం అంతా తిరిగారు అన్వేషిస్తూ.. ఒక్కరైనా నిన్నటి రోజున ఉపవాసం చేసిన వారు కనబడకపోదురా? అని! కానీ దురదృష్టవశాత్తు అలా ఎవరూ దొరకలేదు. అదే సమయంలో కొందరు సైనికుల దృష్టిలో ఒక గణేష దూత వచ్చి మరణించిన స్త్రీ మృతదేహాన్ని తీసుకెళ్ళటం కనబడింది.
సైనికులు వెంటనే ఎంతో పాపాత్మురాలైన స్త్రీని ఎందుకు గణేష లోకానికి తీసుకువెడుతున్నారని ప్రశ్నించారు. దానికి గణేశ దూత, 'నిన్నంతా ఈ స్త్రీ ఉపవాసం వుంది. తెలియకుండానే ఏమీ తినలేదు.
చంద్రోదయం అయిన తర్వాత లేచి కొంత తిన్నది. రాత్రంతా నిద్రించి చంద్రోదయ సమయాన నిద్రలేచి కొంత తినటం వల్ల ఆమెకి తెలియకుండానే సంకష్ట చతుర్ధి వ్రతం చేసింది. ఈ రోజు మరణించింది' అని చెప్పాడు.
అంతేకాక ఎవరైనా తమ జీవితకాలంలో ఒక్కసారైనా ఈ వ్రతం చేస్తే వారు గణేష లోకానికి గాని స్వనంద లోకానికి గాని చేరుకోటం మరణానంతరం తథ్యం అని చెప్పాడు. గణేషుని దూతని అపుడు సైనికులు ఎంతో బ్రతిమాలారు. ఆ స్త్రీ మృతదేహాన్ని తమకిమ్మని, అలా చేస్తే విమానం తిరిగి బయలుదేరుతుందని ఎంతో చెప్పారు. ఆమె పుణ్య ఫలాన్ని వారికివ్వటానికి గణేషుని దూత అంగీకరించనే లేదు.
ఆమె దేహం పై నుండి వీచిన గాలి ఆ విమానం ఆగిపోయిన చోట చేరి విస్పో టనం కలిగించింది. మృతదేహం పుణ్యఫలం పొందినది కావటం వలన ఆ దేహాన్ని తాకిన గాలి సైతం పుణ్యం పొందింది. దాని వలన ఇంద్రుని విమానం బయలుదేరిందని చెప్పచ్చు.
ఈ కథ సంకష్ట హర చవితి ప్రాముఖ్యత, ఆధ్యాత్మిక విలువలతో పాటు సంకష్ట చవితి ఉపవాసం మొదలైన విషయాలు తెలుపుతున్నది. వినాయకుని భక్తులందరి దృష్టిలోనూ ఈ వ్రతం చేయటం వలన చాలా పుణ్యం పొందుతారని భావన!
ఈ వ్రత మహత్యం వలన ఈ వ్రతం ఆచరించిన వారు ఎవరైనా గణేషుని లోకానికి లేదా స్వనంద లోకానికి వెడతారని అక్కడ భగవంతుని ఆశీస్సుల వల్ల ఎంతో ఆనందాన్ని అనుభవిస్తారని అంటారు.
*చేసేటువంటి పనులలో ఆటంకాలు సమస్యలు ఇబ్బందులు తొలగించి కార్యజయం ప్రసాదించే శక్తివంతమైన గణపతి స్వామి వారి తాళ స్తోత్రాన్ని రోజు చదవడం వల్ల జీవితంలో ఎటువంటి సమస్యలు ఇబ్బందులు ఉండవు ముందుగా ఈ స్తోత్రాన్ని నేర్చుకొని చదివే ప్రయత్నం అందరూ చేయండి.
ఈ రోజు ముఖ్యంగా సంకష్టహర చతుర్థి ఉన్నది కావున అందరూ చదివే ప్రయత్నం లేదా వినే ప్రయత్నం చేయండి*
శుక్రవారం చేతినిండా గోరింటాకు పెట్టుకుంటే.. కష్టాలుండవట.. సీతమ్మ ఇచ్చిన వరమే కారణమట......!!
చేతినిండా గోరింటాకు పెట్టుకునే మహిళలకు కష్టాలుండవని పురాణాలు చెప్తున్నాయి. గోరింటాకు అంటేనే మహిళలు ఎంతో ఇష్టపడుతుంటారు.
చిన్న చిన్న ఫంక్షన్లైనా పెద్ద పెద్ద వేడుకలైనా గోరింటాకు లేకుండా జరుగదు. ప్రస్తుతం గోరింటాకు నూరి పెట్టుకోకపోయినా..
మెహందీలపై మహిళలు ఎక్కువ ఆసక్తి చూపుతున్నారు. పెళ్ళిళ్లకు ముందు మెహందీ ఫంక్షన్ గ్రాండ్గా నిర్వహిస్తున్నారు.
అలాంటి గోరింటాకు ఎందుకంత ప్రాశస్త్యమైందంటే..? గోరింటాకుకు సీతమ్మ తల్లి వల్లే ఇంత గొప్పతనం లభించిందని పురాణాలు చెప్తున్నాయి.
రావణుడిని సంహరించి.. రాముడు సీతమ్మను రక్షించి తన వెంట తీసుకెళ్లేందుకు వచ్చినప్పుడు.. ఆమె ముఖంలో సంతోషం వెల్లివిరిసింది. అప్పుడు సీతాదేవి రాముని వద్ద..
అశోకవనంలో తానుంతకాలం .. ప్రతి రోజు తన కష్టాలను గోరింటాకు చెట్టుతో చెప్పుకున్నానని తెలిపింది. ఈ గోరింటాకు చెట్టుకు తాము ఏదైనా చేయాలని కోరింది.
ఇందులో భాగంగానే సీతమ్మ గోరింటాకు చెట్టును వరం కోరుకోమంది. అయితే గోరింటాకు చెట్టు మాత్రం తనకు ఎలాంటి వరాలొద్దని చెప్పింది.
ప్రస్తుతం నీ మోము ఎలా సంతోషంతో కళకళలాడుతుందో.. సీతమ్మలాగానే లోకంలోని మహిళలందరూ సంతోషంగా ఉండాలని ఆకాంక్షించింది. అందుకు గోరింటాకు నిజాయితీకి సీతాదేవి మెచ్చి..
గోరింటాకు చెట్టుకు ఓ వరం ఇచ్చింది. గోరింటాకు చెట్టును ఎవరు ప్రార్థిస్తారో.. వారి చేతుల్లో గోరింటాకు పెట్టుకుంటారో.. వారికి సకలసంపదలు, సుఖసంతోషాలు చేకూరుతాయి. వారి జీవితం సంతోషకరంగా ఉంటుందని చెప్తుంది.
అందుకే ఇప్పటివరకు ఉత్తరాదిన వివాహానికి ముందు మెహందీ ఫంక్షన్ అట్టహాసంగా జరుగుతోంది. ఇందుకు కారణం శ్రీ మహాలక్ష్మి ఆశీస్సులు వధూవరులకు..
వివాహంలో పాల్గొనే బంధువులైన మహిళలకు లభిస్తుందని విశ్వాసం. అందుకే శుక్రవారం పూట గోరింటాకును మహాలక్ష్మీదేవిని ధ్యానించి చేతులు పండేంతగా పెట్టుకుంటే.. మహిళలకు ఎలాంటి కష్టాలుండవని..
శ్రీ మహాలక్ష్మీదేవి అనుగ్రహం లభిస్తుందని పండితులు చెప్తున్నారు.
అరుణాచలం అంటే మనకు పున్నమి రోజుల్లో గిరిప్రదక్షిణ, కార్తికమాసంలో జరిగే దీపారాధన మాత్రమే తెలుసు. కానీ స్వామివారి వార్షిక కల్యాణోత్సవం జరిగే రోజు మాత్రం పన్గుణి ఉతిరమే. పండుగ నాటి రాత్రి ఆలయ ప్రాకారంలో ఉత్సవమూర్తులను తీసుకువస్తారు.
ఎదుర్కోలతో కల్యాణమాలలు ధరింపజేస్తారు. ప్రత్యేకంగా అలంకరించిన మండపంలో ఆదిదంపతుల పరిణయాన్ని వేడుకగా నిర్వహిస్తారు. తర్వాత ఐదురోజులపాటు ఊంజల్ ఉత్సవం పేరిట మరో ప్రత్యేక వేడుక జరుగుతుంది.
వైశాఖ కృష్ణపక్ష/బహుళ దశమి, హనుమాన్ జయంతి. కొన్ని ప్రాంతాల్లో చైత్ర పూర్ణిమకు జరుపుతారు. అట్లాగే చైత్రపూర్ణిమ రోజున ప్రారంభమైన హనుమాన్ మండల దీక్ష వైశాఖ బహుళ దశమితో ముగుస్తుంది.
కలియుగంలో సులువగా ప్రసన్నమయ్యే దేవాత రూపాలలో శ్రీ ఆంజనేయస్వామి వారు ఒకరు. సప్త చిరంజీవులలో ఒకరు శ్రీ ఆంజనేయ స్వామి. అంజనాదేవికి, కేసరికి పరమశివుడి అంశగా వాయుదేవుని అనుగ్రహంతో జన్మించారు. ఈనాటికి హిమాలయపర్వతాల్లో కైలాసమానససరోవరం దగ్గర రామనామ జపం చేస్తూ సశరీరంతో ఉన్నారు.
హనుమంతుడి స్మరణచేత బుద్ధి, బలం, యశస్సు (కీర్తి), దైర్యం, నిర్భయత్వం (భయం లేకపోవడం), వాక్పటుత్వం కలుగుతాయి. సమస్తరోగాలు తొలగిపోతాయి. జడత్వం నాశనమవుతుంది. జ్ఞానం కలుగుతుంది. భూతప్రేత పిశాచాలు హనుమన్ స్మరణతోనే పారిపోతాయి. హనుమాన్ ఉపాసనతో జీవితంలో కష్టాలు తొలగిపోతాయి.
మనోజవం మారుతతుల్య వేగం జితేంద్రియం బుద్ధి మతాం వరిష్టం వాతాత్మజం వానరయూధ ముఖ్యం శ్రీ రామదూతం శిరసానమామి.
హనుమంతుడికి 5 సంఖ్య చాలా ఇష్టం. 5 ప్రదక్షిణలు చేయండి. అరటిపళ్ళు, మామిడి పళ్ళంటే చాలా ఇష్టం. వీలుంటే 5 పళ్ళు సమర్పించండి. 5 సార్లు హనుమాన్ చాలీసా పారాయణ చేయండి.
మదన పూర్ణిమ వ్రతం, పంగుని ఉత్తిరం - శ్రీ వల్లి - దేవసేన శ్రీ మురుగన్ స్వామి దివ్య కల్యాణం శుభాకాంక్షలు.
*ఏప్రిల్ 1న వచ్చే మదన పౌర్ణిమ రోజున జరగే పంగుని ఉత్తిరం పండుగ హిందూ సంప్రదాయంలో అత్యంత పవిత్రమైనది, శుభప్రదమైనది. వసంత ఋతువు సౌందర్యంతో కళకళలాడే ఈ దినం, ప్రేమ, శుద్ధి, దైవ అనుగ్రహం, దాంపత్య ఐక్యత అనే మహత్తర భావాలను ఒకటిగా కలిపే దివ్య సందర్భం. ఈ రోజునే అసుర సంహారకుడు, దేవతల రక్షకుడు అయిన శ్రీ మురుగన్ స్వామి, ఇంద్రుని కుమార్తె మరియు శుభలక్షణాల ప్రతిరూపమైన దేవయానై అమ్మవారిని తిరుపరంకుండ్రం క్షేత్రంలో వివాహమాడిన దినంగా భావించబడుతుంది.*
*దేవసేన (దేవయానై) (క్రియాశక్తి): ఇంద్రుని కుమార్తె అయిన దేవసేనను శ్రీ మురుగన్ స్వామి యొక్క విధివిధానపూర్వక (వైదిక) భార్యగా భావిస్తారు. సూరపద్మాసురునిపై విజయాన్ని సాధించిన అనంతరం, కృతజ్ఞతగా మరియు ధర్మానికి చిహ్నంగా ఇంద్రుడు తన కుమార్తెను స్వామికి వివాహం చేయించాడు. ఈ వివాహం సంప్రదాయబద్ధమైన "వైదిక వివాహం"గా పేర్కొనబడుతుంది.*
*వల్లి (ఇచ్చాశక్తి): వల్లి ఒక గిరిజన యువతి, వేటగాళ్ల వద్ద పెరిగిన ఆమె నిరుపాధి ప్రేమ, అచంచల భక్తికి ప్రతిరూపం. ఆమెను స్వయంగా మురుగన్ స్వామి ప్రేమతో ఆకర్షించి వివాహం చేసుకున్నాడు. ఇది ప్రేమకు, భక్తికి సామాజిక స్థితి కంటే ఉన్నతమైన స్థానం ఉందని తెలియజేస్తుంది. ఈ వివాహాన్ని సాధారణంగా "గంధర్వ వివాహం"గా అభివర్ణిస్తారు.*
*ఈ దివ్య కల్యాణం కేవలం ఒక పౌరాణిక సంఘటన మాత్రమే కాదు; ఇది గొప్ప ఆధ్యాత్మిక సందేశాన్ని అందిస్తుంది. శ్రీ మురుగన్ స్వామి దేవయానై అమ్మవారి చేతిని స్వీకరించడం అనేది “క్రియాశక్తి”తో పరమాత్ముని ఐక్యాన్ని సూచిస్తుంది. మన జీవితంలో చేసే ప్రతి కార్యం దైవ అనుగ్రహంతో కలిసినపుడే అది విజయవంతమవుతుందని ఈ దివ్య రూపం మనకు బోధిస్తుంది. దేవయానై అమ్మవారు దీర్ఘకాలం తపస్సు చేసి స్వామిని పొందినట్లు, భక్తి, సహనం, నిబద్ధతతో చేసిన ప్రయత్నం ఎప్పుడూ ఫలితాన్ని ఇస్తుందని ఇది తెలియ జేస్తుంది. మన జీవితంలో చేసే ప్రతి కార్యానికి దైవ అనుగ్రహం తోడైతే, అవన్నీ విజయవంతంగా పూర్తవుతాయని ఈ రూపం మనకు బోధిస్తుంది.*
*ఇదే రోజున ఆచరించబడే మదన పౌర్ణిమ వ్రతం ప్రేమ అనే దైవిక శక్తిని గుర్తుచేస్తుంది. మన్మథుడు (కామదేవుడు) పుష్పబాణాలను సంధించి జీవులలో ప్రేమను కలిగించే దేవుడిగా వర్ణించబడినా, శివుడు ఆయనను దహనం చేసిన పురాణ గాథ మనకు లోతైన సందేశాన్ని ఇస్తుంది. నియంత్రణలేని కామం మనసును దహనం చేస్తుంది; కానీ అదే శక్తిని నియంత్రించి ప్రేమగా, భక్తిగా మారిస్తే అది ఆధ్యాత్మిక మార్గానికి దారి తీస్తుంది. అందువల్ల మదన పౌర్ణిమ అనేది కామం నుండి ప్రేమకు, ప్రేమ నుండి భక్తికి జరిగే అంతరంగ ప్రయాణానికి సంకేతం.*
*ఈ పౌర్ణిమ రోజున వ్రతాన్ని ఆచరించే వారు ఉదయం స్నానం చేసి, శుభ్రమైన వస్త్రాలు ధరించి, కామదేవుడు మరియు రతి దేవిని ధ్యానిస్తూ పూజలు చేస్తారు. పూలు, గంధం, దీపం సమర్పించి మనస్సులోని కామ, క్రోధ, లోభాది దోషాలను తొలగించాలని ప్రార్థిస్తారు.
సాయంత్రం పౌర్ణిమ చంద్రుణ్ణి దర్శించి వ్రతాన్ని ముగిస్తారు. ఈ వ్రతం ముఖ్యంగా దాంపత్య సౌఖ్యం, పరస్పర అవగాహన, కుటుంబ ఐక్యతను పెంపొందించడంలో ఎంతో మేలు చేస్తుందని విశ్వాసం ఉంది.*
*తిరుపరంకుండ్రం, పళని, తిరుచేందూర్ వంటి ప్రముఖ మురుగన్ ఆలయాలలో ఈ రోజు “కల్యాణ వ్రతం”గా వైభవంగా జరుపుకుంటారు. “కంకండ దైవం”గా ప్రసిద్ధి చెందిన శ్రీ మురుగన్ స్వామి, ఈ పవిత్ర దినంలో తనను ఆశ్రయించే భక్తుల కష్టాలను తొలగించి, వారికి ఆరోగ్యం, శాంతి, ఆనందం ప్రసాదిస్తాడని నమ్మకం.*
*ఈ విధంగా మదన పౌర్ణిమ మరియు పంగుని ఉత్తిరం రెండు కలసి మనకు ఒక గొప్ప జీవన సత్యాన్ని తెలియజేస్తాయి -ప్రేమ అనేది కేవలం భావోద్వేగం కాదు; అది సృష్టికి మూలాధారం, దైవత్వానికి మార్గం. మనలోని కోరికలను నియంత్రించి, వాటిని ప్రేమగా, దయగా, భక్తిగా మార్చుకున్నప్పుడే మన జీవితం పరిపూర్ణమవుతుంది.*
*“కామం నుండి ప్రేమకు, ప్రేమ నుండి భక్తికి—ఇదే మదన పౌర్ణిమ యొక్క మార్గం.” చైత్ర పౌర్ణిమ (మదన పౌర్ణిమ) వ్రతము – ప్రేమ, శుద్ధి, ఆధ్యాత్మికతకు పునాది.*
*"కంకండ దైవం"గా ప్రసిద్ధి చెందిన శ్రీ మురుగన్ స్వామి, ఈ పవిత్ర దినంలో తనను ఆశ్రయించే భక్తుల వ్యాధులను తొలగించి, వారికి మానసిక ప్రశాంతతను ప్రసాదిస్తాడు.*
*ఈ శుభదినాన, మనమంతా శ్రీ మురుగన్ స్వామి దివ్య కల్యాణ రూపాన్ని ధ్యానిస్తూ, కందర్ షష్టి కవచం లేదా సిద్ధుల స్తోత్రాలను పారాయణం చేసి, ఆయన అనుగ్రహాన్ని పొందుదాం.*
*"ఎల్లవేళలా రామనామాన్ని గ్రోలుతూ, నమస్సులు అర్పిస్తూ, తద్వారా పెల్లుబికిన ఆ ఆనందంతో స్వచ్ఛమైన తన దంతముల కాంతిని నలు దిశలా వ్యాపింపజేస్తూ చిరునవ్వులు చిందిస్తూ, రామ నామమే శ్వాసగా జీవించే హనుమంతుణ్ణి నేను నిరంతరం ధ్యానిస్తూ ఉంటాను"*
*శ్రీ ఆదిశంకరాచార్యులవారు రచించిన శ్రీ రామ భుజంగప్రయాత స్తోత్రంలోని ఈ శ్లోకంతో హనుమంతుని స్తుతించి ఏ కార్యక్రమమైనా ప్రారంభిస్తే విజయం లభిస్తుంది.*
*అతులిత బలధామ హనుమా*
*హనుమద్విజయోత్సవం*
*"ఉత్తరాది వారికి చైత్ర పూర్ణిమ హనుమజ్జయంతి". దానినే మనవారు హనుమద్విజయోత్సవం అంటారు*.
*ఒరియా ప్రజలు మేష సంక్రాంతినాడు హనుమజ్జయంతి జరిగినట్లు భావిస్తారు. తమిళనాట మార్గశిర అమావాస్య నాడు హనుమజ్జయంతిని నిర్వహిస్తారు. మార్గశిరంలోనే శుద్ధ త్రయోదశి తిథిని కన్నడ ప్రజలు జరుపుకుంటారు. ఆనాడే తెలుగునాట హనుమద్ర్వతం చేసుకునే ఆచారం ఉంది. జ్యేష్ఠమాసంలో సువర్చలా హనుమంతుల కల్యాణం నిర్వహిస్తారు.*
*హనుమంతుని భక్తులకు ఎన్నడూ అపజయం లేదు. ఓటమి లేదు. లక్ష్యసాధనలో తనకంటూ ఒక నిర్దుష్ట మార్గాన్ని ఆచరణాత్మకంగా ప్రకటించిన కార్యసాధకుడు. అమేయ బలపరాక్రమ సంపన్నుడైనా అంతా రామనామ మహిమ అనే ఒక్కమాటతో అచంచలమైన స్వామిభక్తిని ప్రకటించే దాసానుదాసుడు. ఇన్ని సుగుణాల కలబోత కనుకనే ఆంజనేయుడు అందరి దైవం.*
*చైత్రపౌర్ణమికి భక్తులు హనుమద్దీక్షా స్వీకారం చేస్తారు. హనుమద్దీక్షా పరులకు శారీరక మానసిక రుగ్మతలు, భూత ప్రేత పిశాచ బాధలు తొలగి సుఖ శాంతులు కలుగుతాయి. దీక్షా నియమాలను పాటించగలిగే వారందరూ ఈ దీక్షాస్వీకారానికి అర్హులే."*
*హనుమంతుని కంటే గొప్పదైవం లేదని మహర్షులందరూ నిర్ణయించారంటుంది వానరగీత. కలియుగంలో హనుమను ఒక్కడిని సేవిస్తే సకల దేవతలనూ ఉపాసించినట్లే అని ఈశ్వరుడే స్వయంగా చెప్పాడు. హనుమజ్జయంతినాడు ఆంజనేయుని పూజిస్తే సకల శుభాలు లభిస్తాయి."*
*తెలుగువారి దేవుడని మనం ఘనంగా చెప్పుకోదగినవాడు. శ్రీ హనుమంతుడు. అంజనాదేవి, కేసరి దంపతులకు చిరకాలం సంతానం కలగలేదు. భర్త అనుమతి తీసుకుని అంజన వేంకటాద్రికి వెళ్లి శివుని కోసం తపస్సు చేసింది. "వాయువు ఆమెకు రోజూ ఒక ఫలం ఆహారంగా అందించేవాడు. ఆ ఫలం మాత్రమే తింటూ ఆమె వేయి సంవత్సరాలు తపస్సు చేసినట్లుగా పరాశర సంహిత చెబుతోంది". అంజన' తపస్సు చేయడం వల్ల ఏడుకొండలలో ఒక కొండకు అంజనాద్రి అని పేరువచ్చినట్లు బ్రహ్మాండపురాణంలోని తీర్థఖండంలో ఉంది.*
*పూర్వం ఒక పండుగ రోజున పార్వతీ పరమేశ్వరులు వేంకటాద్రికి వచ్చారు. అక్కడి వాతావరణానికి పులకించిన పార్వతి భర్తతో "మనమిద్దరం వానర రూపాలలో క్రీడిద్దాం" అని కోరింది. శివుడు సరేనన్నాడు. పార్వతి గర్భం ధరించింది. శివ పురాణంలో ని కుమార ఖండంలో చెప్పినట్లు శివతేజస్సు పార్వతి గర్భం నుంచి సంతాన రూపంలో బయటకు వస్తే అది దేవతలను, దానవులను కూడా సమానులను పీడిస్తుంది. అందుకే పార్వతి తన గర్భంలో ఉన్న రుద్రవీర్యాన్ని భరించమని అగ్నికిచ్చింది. అగ్నికూడా భరించలేక వాయువుకిచ్చాడు. వాయువు ఆ రుద్రవీర్యాన్ని చాలాకాలం భరించి భద్రపరిచాడు. సంతానం కోసం వేంకటాద్రిపై తపస్సు చేస్తున్న అంజనాదేవి చేతిలో ఒకనాడు ఫలం రూపంలో ఆ రుద్రవీర్యాన్ని ఉంచాడు. అంజన గర్భం ధరించింది. భర్తకు దూరంగా తపస్సులో ఉన్న తనకు గర్భం ఎలా వచ్చిందా అని ఆమె చింతిస్తూ ఉండగా శివుని వాణి. వినవచ్చింది.*
*"అంజనా! నీవు ఉత్తమురాలివి. నీకు శీలభంగం కాలేదు. ఈశ్వరానుగ్రహం వల్ల నీ గర్భం నుంచి ఒక మహానుభావుడు పుడతాడు. నీ పేరు మీదుగా ఆంజనేయుడని పేరు పొందుతాడు. నీ భర్తకు కూడా ఈ విషయం చెబుతాను. అతడు నిన్ను ఆదరిస్తాడు." ఆకాశవాణి పలుకులకు అంజనాదేవి సంతోషించింది. ఈ విషయం శివుడి ద్వారా తెలుసుకున్న అంజన భర్త కేసరి కూడా బ్రహ్మానందం పొందాడు*.
[ *ఆంజనేయుని జననకాలం గురించి పరాశర సంహిత చెప్పిన వివరాలివి. ఆనాడు వైశాఖ మాస కృష్ణ దశమి శనివారం, మధ్యాహ్న వేళ కర్కాటక లగ్నం. పూర్వాభాద్ర నక్షత్రంలో వైదృతి యోగంలో అంజనాదేవి ఆంజనేయుని కన్నది. ఆయన జననం పొందిన స్థలమే ఏడుకొండలలో ఒకటైన అంజనాద్రి.* ]
@Kavsvlogs
7 hours ago | [YT] | 1
View 0 replies
@Kavsvlogs
నేడు…
సంకష్టహర చతుర్థి
*గణపతికి అత్యంత ప్రీతిపాత్రమైన తిధులలో ప్రధానమైనది చవితి తిథి*
మానవుల కష్టాల నుండి గట్టెక్కించేది సంకటహర చతుర్థి వ్రతం. గణపతికి అత్యంత ప్రీతిపాత్రమైన తిధులలో ప్రధానమైనది చవితి తిథి.
పౌర్ణమి తరువాత వచ్చే చతుర్థి రోజున చేసే వ్రతంను సంకష్టహర చతుర్థి లేదా సంకటహర చతుర్థి వ్రతం అంటారు.
ఇందులో వరదచతుర్థి ని వినాయక వ్రతం గా వినాయక చవితి రోజున ఆచరించెదరు. సంకటములను తొలగించే సంకట హర చతుర్థి వ్రతంను మాత్రం ఆలంబనంగా ఆచరిస్తూ ఉంటారు.
*సంకటహర చతుర్థి వ్రత పూజా విధానం:-*
సంకష్టహరచవితి వ్రతాన్ని 3, 5, 11 లేదా 21 నెలలపాటు ఆచరించాలి. ఈ వ్రతాన్ని బహుళ చవితి నాడు ప్రారంభించాలి. వ్రతాచరణ రోజున ప్రాతఃకాలమే తలస్నానం చేసి ఆ తరువాత గణపతిని పూజించాలి.
అరమీటరు పొడవు ఉన్న తెలుపు లేదా ఎరుపు రవికల గుడ్డముక్క తీసుకుని వినాయకుడి ముందు పెట్టి దానిని పసుపు, కుంకుమలతో అలంకరణను చేయాలి. మనస్సులోని కోరికను తలచుకొని మూడు గుప్పిళ్ళ బియ్యాన్ని గుడ్డలో వేసిన తరువాత తమలపాకులో రెండు ఎండు ఖర్జూరాలు, రెండు వక్కలు, దక్షిణ పెట్టి మనసులోని కోరికను మరొకసారి తలచుకుని మూటకట్టాలి.
సంకటనాశన గణేశ స్తోత్రం, సంకట హర చతుర్థి వ్రత కథను చదవవలెను.
ఆ మూటను స్వామి ముందు పెట్టి ధూపం వెలిగించి కొబ్బరికాయ లేదా పళ్ళు స్వామికి నివేదించాలి. తదుపరి గణపతి ఆలయానికి వెళ్ళి 3 లేక 11 లేక 21 ప్రదక్షిణాలు చేయాలి. శక్త్యానుసారము గరిక పూజను కాని, గణపతి హోమమును కాని చేయించుకోవచ్చును. సూర్యాస్తమయం వరకూ పూజ చేసిన వినాయకుడిని కదపరాదు. సూర్యుడు అస్తమించిన తరువాత స్నానం చేసి దీపం వెలిగించి తిరిగి వినాయకుడికి లఘువుగా పూజ చేయాలి. నియమం పూర్తయిన తరువాత వినాయకుడికి కట్టిన ముడుపు బియ్యంతో పొంగలి చేసి స్వామికి నివేదించి సాయంత్రం తినాలి.
*సంకట హర చతుర్ధి వ్రత కథ:*
ఒకానొకనాడు ఇంద్రుడు తన విమానంలో బృఘండి (వినాయకుని గొప్ప భక్తుడు) అనే ఋషి దగ్గర్నించి ఇంద్రలోకానికి తిరిగి వెలుతుండగా ఘర్సేన్ అనే రాజు రాజ్యం దాటే సమయంలో అనేక పాపములు చేసిన ఒకానొక వ్యక్తి ఆకాశంలో పయనించే ఆ విమానంపై దృష్టి సారించాడు. అతని దృష్టి సోకగానే ఆ విమానం చటుక్కున భూమిపై అర్ధాంతరంగా ఆగిపోవటం జరిగింది.
ఆ ఇంద్ర విమానం అద్భుతమైన వెలుగుకి ఆశ్చర్యచకితుడైన ఆ దేశపురాజు సురసేనుడు గబగబ బయటికి వచ్చి ఆ అద్భుతాన్ని చూసి ఆశ్చర్యం చెందుతూ చూడ సాగాడు.
అక్కడ ఇంద్రుని చూసి ఎంతో సంతోషానికి లోనయిన మహారాజు ఆనందంతో నమస్కరించారు.
ఇంద్రునితో అక్కడ విమానం ఎందుకు ఆపినారో కారణం అడిగాడు. అపుడు ఇంద్రుడు.. ‘ఓ రాజా! మీ రాజ్యంలో పాపాలు అధికంగా చేసిన వ్యక్తి ఎవరిదో దృష్టి సోకి విమానం మార్గమధ్యలో అర్ధాంతరంగా ఆగింది’ అని చెప్పాడు.
అపుడు ఆ రాజు ‘అయ్యా! మరి మళ్ళీ ఆగిపోయిన విమానం ఎలా బయలుదేరుతుంది’అని అడిగాడు వినయంగా!
అపుడు ఇంద్రుడు ‘ఇవాళ పంచమి, నిన్న చతుర్ధి. నిన్నటి రోజున ఎవరైతే ఉపవాసం చేసారో వారి పుణ్యఫలాన్ని నాకిస్తే నా విమానం తిరిగి బయలుదేరుతుంది’ అని చెప్పాడు.
సైనికులంతా కలిసి రాజ్యం అంతా తిరిగారు అన్వేషిస్తూ.. ఒక్కరైనా నిన్నటి రోజున ఉపవాసం చేసిన వారు కనబడకపోదురా? అని!
కానీ దురదృష్టవశాత్తు అలా ఎవరూ దొరకలేదు.
అదే సమయంలో కొందరు సైనికుల దృష్టిలో ఒక గణేష దూత వచ్చి మరణించిన స్త్రీ మృతదేహాన్ని తీసుకెళ్ళటం కనబడింది.
సైనికులు వెంటనే ఎంతో పాపాత్మురాలైన స్త్రీని ఎందుకు గణేష లోకానికి తీసుకువెడుతున్నారని ప్రశ్నించారు. దానికి గణేశ దూత, 'నిన్నంతా ఈ స్త్రీ ఉపవాసం వుంది. తెలియకుండానే ఏమీ తినలేదు.
చంద్రోదయం అయిన తర్వాత లేచి కొంత తిన్నది.
రాత్రంతా నిద్రించి చంద్రోదయ సమయాన నిద్రలేచి కొంత తినటం వల్ల ఆమెకి తెలియకుండానే సంకష్ట చతుర్ధి వ్రతం చేసింది. ఈ రోజు మరణించింది' అని చెప్పాడు.
అంతేకాక ఎవరైనా తమ జీవితకాలంలో ఒక్కసారైనా ఈ వ్రతం చేస్తే వారు గణేష లోకానికి గాని స్వనంద లోకానికి గాని చేరుకోటం మరణానంతరం తథ్యం అని చెప్పాడు.
గణేషుని దూతని అపుడు సైనికులు ఎంతో బ్రతిమాలారు. ఆ స్త్రీ మృతదేహాన్ని తమకిమ్మని, అలా చేస్తే విమానం తిరిగి బయలుదేరుతుందని ఎంతో చెప్పారు. ఆమె పుణ్య ఫలాన్ని వారికివ్వటానికి గణేషుని దూత అంగీకరించనే లేదు.
ఆమె దేహం పై నుండి వీచిన గాలి ఆ విమానం ఆగిపోయిన చోట చేరి విస్పో టనం కలిగించింది. మృతదేహం పుణ్యఫలం పొందినది కావటం వలన ఆ దేహాన్ని తాకిన గాలి సైతం పుణ్యం పొందింది. దాని వలన ఇంద్రుని విమానం బయలుదేరిందని చెప్పచ్చు.
ఈ కథ సంకష్ట హర చవితి ప్రాముఖ్యత, ఆధ్యాత్మిక విలువలతో పాటు సంకష్ట చవితి ఉపవాసం మొదలైన విషయాలు తెలుపుతున్నది. వినాయకుని భక్తులందరి దృష్టిలోనూ ఈ వ్రతం చేయటం వలన చాలా పుణ్యం పొందుతారని భావన!
ఈ వ్రత మహత్యం వలన ఈ వ్రతం ఆచరించిన వారు ఎవరైనా గణేషుని లోకానికి లేదా స్వనంద లోకానికి వెడతారని అక్కడ భగవంతుని ఆశీస్సుల వల్ల ఎంతో ఆనందాన్ని అనుభవిస్తారని అంటారు.
1 day ago | [YT] | 6
View 0 replies
@Kavsvlogs
*చేసేటువంటి పనులలో ఆటంకాలు సమస్యలు ఇబ్బందులు తొలగించి కార్యజయం ప్రసాదించే శక్తివంతమైన గణపతి స్వామి వారి తాళ స్తోత్రాన్ని రోజు చదవడం వల్ల జీవితంలో ఎటువంటి సమస్యలు ఇబ్బందులు ఉండవు ముందుగా ఈ స్తోత్రాన్ని నేర్చుకొని చదివే ప్రయత్నం అందరూ చేయండి.
ఈ రోజు ముఖ్యంగా సంకష్టహర చతుర్థి ఉన్నది కావున అందరూ చదివే ప్రయత్నం లేదా వినే ప్రయత్నం చేయండి*
*శ్రీ గణపతి తాళం*
వికటోత్కటసుందరదంతిముఖం
భుజగేంద్రసుసర్పగదాభరణమ్ ।
గజనీలగజేంద్ర గణాధిపతిం
ప్రణతోఽస్మి వినాయక హస్తిముఖమ్ ॥ 1 ॥
సుర సుర గణపతి సుందరకేశం
ఋషి ఋషి గణపతి యజ్ఞసమానమ్ ।
భవ భవ గణపతి పద్మశరీరం
జయ జయ గణపతి దివ్యనమస్తే ॥ 2 ॥
గజముఖవక్త్రం గిరిజాపుత్రం
గణగుణమిత్రం గణపతిమీశప్రియమ్ ॥ 3 ॥
కరధృతపరశుం కంకణపాణిం
కబలితపద్మరుచిమ్ ।
సురపతివంద్యం సుందరనృత్తం
సురచితమణిమకుటమ్ ॥ 4 ॥
ప్రణమత దేవం ప్రకటిత తాళం
షడ్గిరి తాళమిదమ్ ।
తత్తత్ షడ్గిరి తాళమిదం
తత్తత్ షడ్గిరి తాళమిదమ్ ॥ 5 ॥
లంబోదరవర కుంజాసురకృత కుంకుమవర్ణధరమ్ ।
శ్వేతసశృంగం మోదకహస్తం ప్రీతిసపనసఫలమ్ ॥ 6 ॥
నయనత్రయవర నాగవిభూషిత నానాగణపతిదం తత్తత్
నయనత్రయవర నాగవిభూషిత నానాగణపతిదం తత్తత్
నానాగణపతి తం తత్తత్ నానాగణపతిదమ్ ॥ 7 ॥
ధవళిత జలధరధవళిత చంద్రం
ఫణిమణికిరణవిభూషిత ఖడ్గమ్ ।
తనుతనువిషహర శూలకపాలం
హర హర శివ శివ గణపతిమభయమ్ ॥ 8 ॥
కటతట విగలితమదజల జలధిత-
గణపతివాద్యమిదం
కటతట విగలితమదజల జలధిత-
గణపతివాద్యమిదం
తత్తత్ గణపతివాద్యమిదం
తత్తత్ గణపతివాద్యమిదమ్ ॥ 9 ॥
తత్తదిం నం తరికు తరిజణకు కుకు తద్ది
కుకు తకిట డిండింగు డిగుణ కుకు తద్ది
తత్త ఝం ఝం తరిత
త ఝం ఝం తరిత
తకత ఝం ఝం తరిత
త ఝం ఝం తరిత
తరిదణత దణజణుత జణుదిమిత
కిటతక తరికిటతోం
తకిట కిటతక తరికిటతోం
తకిట కిటతక తరికిటతోం తామ్ ॥ 10 ॥
తకతకిట తకతకిట తకతకిట తత్తోం
శశికలిత శశికలిత మౌలినం శూలినమ్ ।
తకతకిట తకతకిట తకతకిట తత్తోం
విమలశుభకమలజలపాదుకం పాణినమ్ ।
ధిత్తకిట ధిత్తకిట ధిత్తకిట తత్తోం
ప్రమథగణగుణకథితశోభనం శోభితమ్ ।
ధిత్తకిట ధిత్తకిట ధిత్తకిట తత్తోం
పృథులభుజసరసిజ విషాణకం పోషణమ్ ।
తకతకిట తకతకిట తకతకిట తత్తోం
పనసఫలకదలిఫలమోదనం మోదకమ్ ।
ధిత్తకిట ధిత్తకిట ధిత్తకిట తత్తోం
ప్రణతగురు శివతనయ గణపతి తాళనమ్ ।
గణపతి తాళనం గణపతి తాళనమ్ ॥ 11 ॥
*ఓం గం గణపతయే నమః*
1 day ago | [YT] | 3
View 0 replies
@Kavsvlogs
శుక్రవారం చేతినిండా గోరింటాకు పెట్టుకుంటే.. కష్టాలుండవట.. సీతమ్మ ఇచ్చిన వరమే కారణమట......!!
చేతినిండా గోరింటాకు పెట్టుకునే మహిళలకు కష్టాలుండవని పురాణాలు చెప్తున్నాయి. గోరింటాకు అంటేనే మహిళలు ఎంతో ఇష్టపడుతుంటారు.
చిన్న చిన్న ఫంక్షన్లైనా పెద్ద పెద్ద వేడుకలైనా గోరింటాకు లేకుండా జరుగదు. ప్రస్తుతం గోరింటాకు నూరి పెట్టుకోకపోయినా..
మెహందీలపై మహిళలు ఎక్కువ ఆసక్తి చూపుతున్నారు. పెళ్ళిళ్లకు ముందు మెహందీ ఫంక్షన్ గ్రాండ్గా నిర్వహిస్తున్నారు.
అలాంటి గోరింటాకు ఎందుకంత ప్రాశస్త్యమైందంటే..? గోరింటాకుకు సీతమ్మ తల్లి వల్లే ఇంత గొప్పతనం లభించిందని పురాణాలు చెప్తున్నాయి.
రావణుడిని సంహరించి.. రాముడు సీతమ్మను రక్షించి తన వెంట తీసుకెళ్లేందుకు వచ్చినప్పుడు.. ఆమె ముఖంలో సంతోషం వెల్లివిరిసింది. అప్పుడు సీతాదేవి రాముని వద్ద..
అశోకవనంలో తానుంతకాలం .. ప్రతి రోజు తన కష్టాలను గోరింటాకు చెట్టుతో చెప్పుకున్నానని తెలిపింది. ఈ గోరింటాకు చెట్టుకు తాము ఏదైనా చేయాలని కోరింది.
ఇందులో భాగంగానే సీతమ్మ గోరింటాకు చెట్టును వరం కోరుకోమంది. అయితే గోరింటాకు చెట్టు మాత్రం తనకు ఎలాంటి వరాలొద్దని చెప్పింది.
ప్రస్తుతం నీ మోము ఎలా సంతోషంతో కళకళలాడుతుందో.. సీతమ్మలాగానే లోకంలోని మహిళలందరూ సంతోషంగా ఉండాలని ఆకాంక్షించింది. అందుకు గోరింటాకు నిజాయితీకి సీతాదేవి మెచ్చి..
గోరింటాకు చెట్టుకు ఓ వరం ఇచ్చింది. గోరింటాకు చెట్టును ఎవరు ప్రార్థిస్తారో.. వారి చేతుల్లో గోరింటాకు పెట్టుకుంటారో.. వారికి సకలసంపదలు, సుఖసంతోషాలు చేకూరుతాయి. వారి జీవితం సంతోషకరంగా ఉంటుందని చెప్తుంది.
అందుకే ఇప్పటివరకు ఉత్తరాదిన వివాహానికి ముందు మెహందీ ఫంక్షన్ అట్టహాసంగా జరుగుతోంది. ఇందుకు కారణం శ్రీ మహాలక్ష్మి ఆశీస్సులు వధూవరులకు..
వివాహంలో పాల్గొనే బంధువులైన మహిళలకు లభిస్తుందని విశ్వాసం. అందుకే శుక్రవారం పూట గోరింటాకును మహాలక్ష్మీదేవిని ధ్యానించి చేతులు పండేంతగా పెట్టుకుంటే.. మహిళలకు ఎలాంటి కష్టాలుండవని..
శ్రీ మహాలక్ష్మీదేవి అనుగ్రహం లభిస్తుందని పండితులు చెప్తున్నారు.
3 days ago | [YT] | 1
View 0 replies
@Kavsvlogs
శ్రీ సుందరేశ్వర లింగం
కర్ణాటక లోని బీజాపూర్ ( విజయపుర ) లోని సుందరేశ్వర స్వామి ఆలయంలో కొలువై ఉన్న శివ లింగంపై శ్రీ చక్రం కూడా ఉంటుంది,
ఈ చిత్రంలో గమనించగలరు.
పార్వతీ పరమేశ్వరుల అర్ధనారీశ్వర తత్వానికి ప్రతీక ఈ శ్రీ చక్ర సహిత శివ లింగము🙏
4 days ago | [YT] | 2
View 0 replies
@Kavsvlogs
అరుణాచలేశ్వర కల్యాణం :
అరుణాచలం అంటే మనకు పున్నమి రోజుల్లో గిరిప్రదక్షిణ, కార్తికమాసంలో జరిగే దీపారాధన మాత్రమే తెలుసు.
కానీ స్వామివారి వార్షిక కల్యాణోత్సవం జరిగే రోజు మాత్రం పన్గుణి ఉతిరమే.
పండుగ నాటి రాత్రి ఆలయ ప్రాకారంలో ఉత్సవమూర్తులను తీసుకువస్తారు.
ఎదుర్కోలతో కల్యాణమాలలు ధరింపజేస్తారు. ప్రత్యేకంగా అలంకరించిన మండపంలో ఆదిదంపతుల పరిణయాన్ని వేడుకగా నిర్వహిస్తారు.
తర్వాత ఐదురోజులపాటు ఊంజల్ ఉత్సవం పేరిట మరో ప్రత్యేక వేడుక జరుగుతుంది.
4 days ago | [YT] | 2
View 0 replies
@Kavsvlogs
ఓం శ్రీ హనుమతే నమః
వైశాఖ కృష్ణపక్ష/బహుళ దశమి, హనుమాన్ జయంతి. కొన్ని ప్రాంతాల్లో చైత్ర పూర్ణిమకు జరుపుతారు. అట్లాగే చైత్రపూర్ణిమ రోజున ప్రారంభమైన హనుమాన్ మండల దీక్ష వైశాఖ బహుళ దశమితో ముగుస్తుంది.
కలియుగంలో సులువగా ప్రసన్నమయ్యే దేవాత రూపాలలో శ్రీ ఆంజనేయస్వామి వారు ఒకరు. సప్త చిరంజీవులలో ఒకరు శ్రీ ఆంజనేయ స్వామి. అంజనాదేవికి, కేసరికి పరమశివుడి అంశగా వాయుదేవుని అనుగ్రహంతో జన్మించారు. ఈనాటికి హిమాలయపర్వతాల్లో కైలాసమానససరోవరం దగ్గర రామనామ జపం చేస్తూ సశరీరంతో ఉన్నారు.
హనుమంతుడి స్మరణచేత బుద్ధి, బలం, యశస్సు (కీర్తి), దైర్యం, నిర్భయత్వం (భయం లేకపోవడం), వాక్పటుత్వం కలుగుతాయి. సమస్తరోగాలు తొలగిపోతాయి. జడత్వం నాశనమవుతుంది. జ్ఞానం కలుగుతుంది. భూతప్రేత పిశాచాలు హనుమన్ స్మరణతోనే పారిపోతాయి. హనుమాన్ ఉపాసనతో జీవితంలో కష్టాలు తొలగిపోతాయి.
మనోజవం మారుతతుల్య వేగం
జితేంద్రియం బుద్ధి మతాం వరిష్టం
వాతాత్మజం వానరయూధ ముఖ్యం
శ్రీ రామదూతం శిరసానమామి.
హనుమంతుడికి 5 సంఖ్య చాలా ఇష్టం. 5 ప్రదక్షిణలు చేయండి. అరటిపళ్ళు, మామిడి పళ్ళంటే చాలా ఇష్టం. వీలుంటే 5 పళ్ళు సమర్పించండి. 5 సార్లు హనుమాన్ చాలీసా పారాయణ చేయండి.
ఓం శ్రీ హనుమతే నమః
హనుమాన్ జయంతి శుభాకాంక్షలు🙏🙏
4 days ago | [YT] | 0
View 0 replies
@Kavsvlogs
5 days ago | [YT] | 6
View 0 replies
@Kavsvlogs
మదన పూర్ణిమ వ్రతం, పంగుని ఉత్తిరం - శ్రీ వల్లి - దేవసేన శ్రీ మురుగన్ స్వామి దివ్య కల్యాణం శుభాకాంక్షలు.
*ఏప్రిల్ 1న వచ్చే మదన పౌర్ణిమ రోజున జరగే పంగుని ఉత్తిరం పండుగ హిందూ సంప్రదాయంలో అత్యంత పవిత్రమైనది, శుభప్రదమైనది. వసంత ఋతువు సౌందర్యంతో కళకళలాడే ఈ దినం, ప్రేమ, శుద్ధి, దైవ అనుగ్రహం, దాంపత్య ఐక్యత అనే మహత్తర భావాలను ఒకటిగా కలిపే దివ్య సందర్భం. ఈ రోజునే అసుర సంహారకుడు, దేవతల రక్షకుడు అయిన శ్రీ మురుగన్ స్వామి, ఇంద్రుని కుమార్తె మరియు శుభలక్షణాల ప్రతిరూపమైన దేవయానై అమ్మవారిని తిరుపరంకుండ్రం క్షేత్రంలో వివాహమాడిన దినంగా భావించబడుతుంది.*
*దేవసేన (దేవయానై) (క్రియాశక్తి):
ఇంద్రుని కుమార్తె అయిన దేవసేనను శ్రీ మురుగన్ స్వామి యొక్క విధివిధానపూర్వక (వైదిక) భార్యగా భావిస్తారు. సూరపద్మాసురునిపై విజయాన్ని సాధించిన అనంతరం, కృతజ్ఞతగా మరియు ధర్మానికి చిహ్నంగా ఇంద్రుడు తన కుమార్తెను స్వామికి వివాహం చేయించాడు. ఈ వివాహం సంప్రదాయబద్ధమైన "వైదిక వివాహం"గా పేర్కొనబడుతుంది.*
*వల్లి (ఇచ్చాశక్తి):
వల్లి ఒక గిరిజన యువతి, వేటగాళ్ల వద్ద పెరిగిన ఆమె నిరుపాధి ప్రేమ, అచంచల భక్తికి ప్రతిరూపం. ఆమెను స్వయంగా మురుగన్ స్వామి ప్రేమతో ఆకర్షించి వివాహం చేసుకున్నాడు. ఇది ప్రేమకు, భక్తికి సామాజిక స్థితి కంటే ఉన్నతమైన స్థానం ఉందని తెలియజేస్తుంది. ఈ వివాహాన్ని సాధారణంగా "గంధర్వ వివాహం"గా అభివర్ణిస్తారు.*
*ఈ దివ్య కల్యాణం కేవలం ఒక పౌరాణిక సంఘటన మాత్రమే కాదు; ఇది గొప్ప ఆధ్యాత్మిక సందేశాన్ని అందిస్తుంది. శ్రీ మురుగన్ స్వామి దేవయానై అమ్మవారి చేతిని స్వీకరించడం అనేది “క్రియాశక్తి”తో పరమాత్ముని ఐక్యాన్ని సూచిస్తుంది.
మన జీవితంలో చేసే ప్రతి కార్యం దైవ అనుగ్రహంతో కలిసినపుడే అది విజయవంతమవుతుందని ఈ దివ్య రూపం మనకు బోధిస్తుంది. దేవయానై అమ్మవారు దీర్ఘకాలం తపస్సు చేసి స్వామిని పొందినట్లు, భక్తి, సహనం, నిబద్ధతతో చేసిన ప్రయత్నం ఎప్పుడూ ఫలితాన్ని ఇస్తుందని ఇది తెలియ జేస్తుంది. మన జీవితంలో చేసే ప్రతి కార్యానికి దైవ అనుగ్రహం తోడైతే, అవన్నీ విజయవంతంగా పూర్తవుతాయని ఈ రూపం మనకు బోధిస్తుంది.*
*ఇదే రోజున ఆచరించబడే మదన పౌర్ణిమ వ్రతం ప్రేమ అనే దైవిక శక్తిని గుర్తుచేస్తుంది. మన్మథుడు (కామదేవుడు) పుష్పబాణాలను సంధించి జీవులలో ప్రేమను కలిగించే దేవుడిగా వర్ణించబడినా, శివుడు ఆయనను దహనం చేసిన పురాణ గాథ మనకు లోతైన సందేశాన్ని ఇస్తుంది. నియంత్రణలేని కామం మనసును దహనం చేస్తుంది;
కానీ అదే శక్తిని నియంత్రించి ప్రేమగా, భక్తిగా మారిస్తే అది ఆధ్యాత్మిక మార్గానికి దారి తీస్తుంది. అందువల్ల మదన పౌర్ణిమ అనేది కామం నుండి ప్రేమకు, ప్రేమ నుండి భక్తికి జరిగే అంతరంగ ప్రయాణానికి సంకేతం.*
*ఈ పౌర్ణిమ రోజున వ్రతాన్ని ఆచరించే వారు ఉదయం స్నానం చేసి, శుభ్రమైన వస్త్రాలు ధరించి, కామదేవుడు మరియు రతి దేవిని ధ్యానిస్తూ పూజలు చేస్తారు. పూలు, గంధం, దీపం సమర్పించి మనస్సులోని కామ, క్రోధ, లోభాది దోషాలను తొలగించాలని ప్రార్థిస్తారు.
సాయంత్రం పౌర్ణిమ చంద్రుణ్ణి దర్శించి వ్రతాన్ని ముగిస్తారు. ఈ వ్రతం ముఖ్యంగా దాంపత్య సౌఖ్యం, పరస్పర అవగాహన, కుటుంబ ఐక్యతను పెంపొందించడంలో ఎంతో మేలు చేస్తుందని విశ్వాసం ఉంది.*
*తిరుపరంకుండ్రం, పళని, తిరుచేందూర్ వంటి ప్రముఖ మురుగన్ ఆలయాలలో ఈ రోజు “కల్యాణ వ్రతం”గా వైభవంగా జరుపుకుంటారు. “కంకండ దైవం”గా ప్రసిద్ధి చెందిన శ్రీ మురుగన్ స్వామి, ఈ పవిత్ర దినంలో తనను ఆశ్రయించే భక్తుల కష్టాలను తొలగించి, వారికి ఆరోగ్యం, శాంతి, ఆనందం ప్రసాదిస్తాడని నమ్మకం.*
*ఈ విధంగా మదన పౌర్ణిమ మరియు పంగుని ఉత్తిరం రెండు కలసి మనకు ఒక గొప్ప జీవన సత్యాన్ని తెలియజేస్తాయి -ప్రేమ అనేది కేవలం భావోద్వేగం కాదు; అది సృష్టికి మూలాధారం, దైవత్వానికి మార్గం. మనలోని కోరికలను నియంత్రించి, వాటిని ప్రేమగా, దయగా, భక్తిగా మార్చుకున్నప్పుడే మన జీవితం పరిపూర్ణమవుతుంది.*
*“కామం నుండి ప్రేమకు, ప్రేమ నుండి భక్తికి—ఇదే మదన పౌర్ణిమ యొక్క మార్గం.” చైత్ర పౌర్ణిమ (మదన పౌర్ణిమ) వ్రతము – ప్రేమ, శుద్ధి, ఆధ్యాత్మికతకు పునాది.*
*"కంకండ దైవం"గా ప్రసిద్ధి చెందిన శ్రీ మురుగన్ స్వామి, ఈ పవిత్ర దినంలో తనను ఆశ్రయించే భక్తుల వ్యాధులను తొలగించి, వారికి మానసిక ప్రశాంతతను ప్రసాదిస్తాడు.*
*“విజయశాలి వెల్ మురుగన్కు జయము! వీరత్వమూర్తి వెల్ మురుగన్కు జయము!”*
*ఈ శుభదినాన, మనమంతా శ్రీ మురుగన్ స్వామి దివ్య కల్యాణ రూపాన్ని ధ్యానిస్తూ, కందర్ షష్టి కవచం లేదా సిద్ధుల స్తోత్రాలను పారాయణం చేసి, ఆయన అనుగ్రహాన్ని పొందుదాం.*
5 days ago | [YT] | 2
View 0 replies
@Kavsvlogs
చైత్రపూర్ణిమ, హనుమద్విజయోత్సవం,
*ఒంటిమిట్ట శ్రీసీతారామ కళ్యాణం, రౌచ్యమన్వాది*
*గురుబోధ:*
*సదా రామ రామేతి రామామృతం తే |*
*సదా రామమానందనిష్యందకందం ||*
*పిబంతం సమంతం హసంతం సుదంతం |*
*హనూమంతం అంతర్భజే తం నితాంతం ||*
*"ఎల్లవేళలా రామనామాన్ని గ్రోలుతూ, నమస్సులు అర్పిస్తూ, తద్వారా పెల్లుబికిన ఆ ఆనందంతో స్వచ్ఛమైన తన దంతముల కాంతిని నలు దిశలా వ్యాపింపజేస్తూ చిరునవ్వులు చిందిస్తూ, రామ నామమే శ్వాసగా జీవించే హనుమంతుణ్ణి నేను నిరంతరం ధ్యానిస్తూ ఉంటాను"*
*శ్రీ ఆదిశంకరాచార్యులవారు రచించిన శ్రీ రామ భుజంగప్రయాత స్తోత్రంలోని ఈ శ్లోకంతో హనుమంతుని స్తుతించి ఏ కార్యక్రమమైనా ప్రారంభిస్తే విజయం లభిస్తుంది.*
*అతులిత బలధామ హనుమా*
*హనుమద్విజయోత్సవం*
*"ఉత్తరాది వారికి చైత్ర పూర్ణిమ హనుమజ్జయంతి". దానినే మనవారు హనుమద్విజయోత్సవం అంటారు*.
*ఒరియా ప్రజలు మేష సంక్రాంతినాడు హనుమజ్జయంతి జరిగినట్లు భావిస్తారు. తమిళనాట మార్గశిర అమావాస్య నాడు హనుమజ్జయంతిని నిర్వహిస్తారు. మార్గశిరంలోనే శుద్ధ త్రయోదశి తిథిని కన్నడ ప్రజలు జరుపుకుంటారు. ఆనాడే తెలుగునాట హనుమద్ర్వతం చేసుకునే ఆచారం ఉంది. జ్యేష్ఠమాసంలో సువర్చలా హనుమంతుల కల్యాణం నిర్వహిస్తారు.*
*హనుమంతుని భక్తులకు ఎన్నడూ అపజయం లేదు. ఓటమి లేదు. లక్ష్యసాధనలో తనకంటూ ఒక నిర్దుష్ట మార్గాన్ని ఆచరణాత్మకంగా ప్రకటించిన కార్యసాధకుడు. అమేయ బలపరాక్రమ సంపన్నుడైనా అంతా రామనామ మహిమ అనే ఒక్కమాటతో అచంచలమైన స్వామిభక్తిని ప్రకటించే దాసానుదాసుడు. ఇన్ని సుగుణాల కలబోత కనుకనే ఆంజనేయుడు అందరి దైవం.*
*చైత్రపౌర్ణమికి భక్తులు హనుమద్దీక్షా స్వీకారం చేస్తారు. హనుమద్దీక్షా పరులకు శారీరక మానసిక రుగ్మతలు, భూత ప్రేత పిశాచ బాధలు తొలగి సుఖ శాంతులు కలుగుతాయి. దీక్షా నియమాలను పాటించగలిగే వారందరూ ఈ దీక్షాస్వీకారానికి అర్హులే."*
*ఆలోక్య వేదశాస్త్రాణి సర్వాణ్యపి మహర్షిభిః |*
*ఇదమేకం సు నిర్ణీతం దైవం హనుమత్ పరం ||*
*హనుమంతుని కంటే గొప్పదైవం లేదని మహర్షులందరూ నిర్ణయించారంటుంది వానరగీత. కలియుగంలో హనుమను ఒక్కడిని సేవిస్తే సకల దేవతలనూ ఉపాసించినట్లే అని ఈశ్వరుడే స్వయంగా చెప్పాడు. హనుమజ్జయంతినాడు ఆంజనేయుని పూజిస్తే సకల శుభాలు లభిస్తాయి."*
*తెలుగువారి దేవుడని మనం ఘనంగా చెప్పుకోదగినవాడు. శ్రీ హనుమంతుడు. అంజనాదేవి, కేసరి దంపతులకు చిరకాలం సంతానం కలగలేదు. భర్త అనుమతి తీసుకుని అంజన వేంకటాద్రికి వెళ్లి శివుని కోసం తపస్సు చేసింది. "వాయువు ఆమెకు రోజూ ఒక ఫలం ఆహారంగా అందించేవాడు. ఆ ఫలం మాత్రమే తింటూ ఆమె వేయి సంవత్సరాలు తపస్సు చేసినట్లుగా పరాశర సంహిత చెబుతోంది". అంజన' తపస్సు చేయడం వల్ల ఏడుకొండలలో ఒక కొండకు అంజనాద్రి అని పేరువచ్చినట్లు బ్రహ్మాండపురాణంలోని తీర్థఖండంలో ఉంది.*
*ప్రసిద్ధం యాతు శైలోయం అంజనేనామతస్తప*
*అంజనాచల ఇత్యేవ నాత్రకార్యావిచారణా.*
*పూర్వం ఒక పండుగ రోజున పార్వతీ పరమేశ్వరులు వేంకటాద్రికి వచ్చారు. అక్కడి వాతావరణానికి పులకించిన పార్వతి భర్తతో "మనమిద్దరం వానర రూపాలలో క్రీడిద్దాం" అని కోరింది. శివుడు సరేనన్నాడు. పార్వతి గర్భం ధరించింది. శివ పురాణంలో ని కుమార ఖండంలో చెప్పినట్లు శివతేజస్సు పార్వతి గర్భం నుంచి సంతాన రూపంలో బయటకు వస్తే అది దేవతలను, దానవులను కూడా సమానులను పీడిస్తుంది. అందుకే పార్వతి తన గర్భంలో ఉన్న రుద్రవీర్యాన్ని భరించమని అగ్నికిచ్చింది. అగ్నికూడా భరించలేక వాయువుకిచ్చాడు. వాయువు ఆ రుద్రవీర్యాన్ని చాలాకాలం భరించి భద్రపరిచాడు. సంతానం కోసం వేంకటాద్రిపై తపస్సు చేస్తున్న అంజనాదేవి చేతిలో ఒకనాడు ఫలం రూపంలో ఆ రుద్రవీర్యాన్ని ఉంచాడు. అంజన గర్భం ధరించింది. భర్తకు దూరంగా తపస్సులో ఉన్న తనకు గర్భం ఎలా వచ్చిందా అని ఆమె చింతిస్తూ ఉండగా శివుని వాణి. వినవచ్చింది.*
*మాభూతే వ్రతభంగోయం విషాద వరాననే*
*దేవ ప్రసాదాత్తే గర్భే మహావ్యక్తిర్భవిష్యతి*
*"అంజనా! నీవు ఉత్తమురాలివి. నీకు శీలభంగం కాలేదు. ఈశ్వరానుగ్రహం వల్ల నీ గర్భం నుంచి ఒక మహానుభావుడు పుడతాడు. నీ పేరు మీదుగా ఆంజనేయుడని పేరు పొందుతాడు. నీ భర్తకు కూడా ఈ విషయం చెబుతాను. అతడు నిన్ను ఆదరిస్తాడు." ఆకాశవాణి పలుకులకు అంజనాదేవి సంతోషించింది. ఈ విషయం శివుడి ద్వారా తెలుసుకున్న అంజన భర్త కేసరి కూడా బ్రహ్మానందం పొందాడు*.
*వైశాఖే మాసి కృష్ణాయాం దశమీ మంద సంయుతా*
*పూర్వప్రోక్ష పదాయుక్తా తథా వైధృతి సంయుతా*
*తస్యాం మధ్యాహ్న వేళాయాం జనాయామాస వై సుతం*
*పూర్వాభాద్రా కుంభరాశే మధ్యాహ్నే కర్కటాంశకే*
[ *ఆంజనేయుని జననకాలం గురించి పరాశర సంహిత చెప్పిన వివరాలివి. ఆనాడు వైశాఖ మాస కృష్ణ దశమి శనివారం, మధ్యాహ్న వేళ కర్కాటక లగ్నం. పూర్వాభాద్ర నక్షత్రంలో వైదృతి యోగంలో అంజనాదేవి ఆంజనేయుని కన్నది. ఆయన జననం పొందిన స్థలమే ఏడుకొండలలో ఒకటైన అంజనాద్రి.* ]
5 days ago | [YT] | 1
View 0 replies
Load more