Please Like, Share and Subscribe our Channel.


@Kavsvlogs

2 hours ago | [YT] | 0

@Kavsvlogs

2 hours ago | [YT] | 0

@Kavsvlogs

2 hours ago | [YT] | 0

@Kavsvlogs

మన_నోటి_నుండి_వచ్చే_ప్రతి_మాట_మన_
భవిష్యత్తును_నిర్ణయిస్తుందని_మీకు_తెలుసా?

మీ_మాటే_మీ_మంత్రం - వాక్కులో దాగి ఉన్న అద్భుత శక్తి!

మన దైనందిన జీవితంలో మనం చేసే "మాట" యొక్క శక్తి గురించి, అంటే "వాక్ శుద్ధి" గురించి ఒక అద్భుతమైన post కోసం తెలుసుకుందాము..

మనం రోజూ ఎన్నో మాటలు మాట్లాడుతుంటాం. కానీ మన నోటి నుండి వచ్చే ప్రతి మాట మన భవిష్యత్తును నిర్ణయిస్తుందని మీకు తెలుసా? "నోరు మంచిదైతే ఊరు మంచిదవుతుంది" అని ఊరికే అనలేదు పెద్దలు. మన వాక్కును ఎలా ఒక శక్తివంతమైన ఆయుధంగా మార్చుకోవాలో ఈరోజు తెలుసుకుందాం.

💬  మాట - ఒక విత్తనం :-

మనం మాట్లాడే ప్రతి మాట ఒక విత్తనం లాంటిది. మనం పదే పదే "నాకు అదృష్టం లేదు", "నాకు అన్నీ కష్టాలే" అని అంటూ ఉంటే, మన మెదడు అదే నిజమని నమ్ముతుంది. దీనినే 'Self-fulfilling prophecy' అంటారు. అంటే మనమే మన కష్టాలను మన మాటలతో ఆహ్వానిస్తున్నాం అన్నమాట.

🙏  సరస్వతీ దేవి నివాసం:-

హిందూ ధర్మం ప్రకారం, మన నాలుకపై సరస్వతీ దేవి కొలువై ఉంటుంది. అందుకే మనం మాట్లాడేటప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలి. రోజులో ఒక్కసారైనా మనం అన్న మాట నిజమవుతుందని అంటారు. అందుకే ఎప్పుడూ "శుభం" పలకాలి. మన మాటల్లో సానుకూలత (Positivity) ఉంటే, మన చుట్టూ ఉన్న వాతావరణం కూడా అలానే మారుతుంది.

🤔  వాక్ సిద్ధి అంటే ఏమిటి?

నిజం మాట్లాడేవారికి, ఇతరులను దూషించని వారికి 'వాక్ సిద్ధి' కలుగుతుంది. అంటే వారు ఏది అంటే అది జరుగుతుంది. మనం అంత స్థాయికి వెళ్లకపోయినా, కనీసం మన మాటలతో ఎవరినీ బాధపెట్టకుండా ఉంటే, అది అమ్మవారికి మనం చేసే అతిపెద్ద పూజ.

🤫  ప్రాక్టికల్ టిప్ - "మౌనం":-

రోజూ కనీసం 15 నుండి 30 నిమిషాల పాటు మౌనంగా ఉండటానికి ప్రయత్నించండి. మౌనం వల్ల మన శక్తి వృధా అవ్వదు. అది మన అంతరాత్మతో మనల్ని కలుపుతుంది. అప్పుడు మనం మాట్లాడే ప్రతి మాటలో ఒక స్పష్టత, ఒక గౌరవం కనిపిస్తాయి.

💐గుర్తుంచుకోండి..

విసిరిన రాయి, జారిన మాట తిరిగి రావు. మీ మాటను ఒక దీపంలా వెలిగించండి, ఇతరుల మనసును గాయపరిచే ముల్లులా మార్చకండి. మీ వాక్కు మధురంగా ఉంటే, ఆ జగన్మాత అనుగ్రహం మీపై ఎల్లప్పుడూ ఉంటుంది.

14 hours ago | [YT] | 1

@Kavsvlogs

*శంఖం పూరిచకుండా పూజ ముగించకూడదని ఒక ఆచారం ఉంది*.

పెద్ద పెద్ద దేవాలయాల్లో గర్భగుడి తలుపులు తీసేటప్పుడు కూడా శంఖాన్ని ఊదుతారు.

మన భారతీయ సంస్కృతిలో శంఖానికి ఒక ప్రత్యేక స్థానం ఉండటానికి కారణం అది సముద్ర మథన సమయంలో పాల సముద్రం నుండి బయటకు రావటమే.

*అలా బయటపడిన దానిని శ్రీమహావిష్ణువు ధరించాడు,దానికే పాంచజన్యం అని పేరు*.

*దాని తరువాత వచ్చిన లక్ష్మి దేవిని కూడా స్వామి స్వీకరించాడు. ముందుగా శంఖం దాని వెంటే లక్ష్మీదేవి రావటంతో శంఖాన్ని ఆ దేవి అన్నగారిగా వర్ణిస్తారు.*

*దేముడు గదిలో శంఖం పెట్టి దానిలో నీరు నింపి ఉంచటం వల్ల శుభాలు జరుగుతాయని ఒక నమ్మకం.*

*ఈ శంఖంలో రెండు రకాలు ఉన్నాయి. ఒకటి దక్షిణావృత శంఖం, రెండవది వామావృత శంఖం.*

దక్షిణావృత శంఖాలని ఎక్కువగా పూజావిదానంలో వాడరు.

ఇవి తెల్లటి తెలుపు రంగులో ఉండి దాని మీద కాఫీరంగు గీత ఉంటుంది. ఇది కుడి వైపు తెరుచుకుని ఉంటుంది.

*ఈ శంఖంలో నీరు నింపి సూర్యుడికి ధారపోస్తే కంటికి సంబందించిన రోగాలు తగ్గుతాయి.*

*ఎడమవైపు తెరుచుకుని ఉండే శంఖాన్ని వామావృత శంఖం అంటారు.*

ఇది పేరుకి తగ్గట్టు ఎడమవైపుకి తెరుచుకుని ఉంటుంది. అన్ని పూజా విధానాల్లో మనం తరచుగా వాడేది దీనినే.

*ఇది ఇంట్లో ఉంటే దుష్ట శక్తులు ఆ దరిదాపులకి కూడా రావట.*

వైదికశాస్త్ర ప్రకారం శంఖం పూరించగానే వచ్చే శబ్దానికి ఆ చుట్టుపక్కల ఉండే క్రిమికీటకాలు నాశనమైపోతాయట.

*దీనిని ఆధునిక శాస్త్ర విజ్ఞానం కూడా ధృవీకరించింది.*

*1929లో బెర్లిన్ యూనివర్సిటీలో దీనిని మళ్లీ నిర్ధారించారు.*

*ఈ శంఖధ్వనికి రెండువేల ఆరువందల అడుగుల దూరంలో ఉండే క్రిములు కూడా స్పృహ తప్పి పోతాయట.*

అంతేకాదు వైద్యశాస్త్రంలో కూడా దీనికి మంచి గుర్తింపు ఉంది. రోజూ శంఖాన్ని ఊదేవారికి శ్వాస సంబందిత వ్యాధులు దగ్గరకి రావట.

ఆస్త్మా కూడా తగ్గుతుందని ఒక అధ్యయనం తెలిపింది. రాత్రి పూట శంఖాన్ని నీళ్ళతో నింపి ఆ నీటిని ఉదయాన్నే చర్మంపై రాసుకుంటే చర్మసంబందిత వ్యాదులు దూరమవుతాయట.

*ఇంట్లో దీనిని ఉంచుకోవటం వల్ల వాస్తు దోషాలు ఉన్నా అన్నీ తొలగిపోతాయి.*

*శంఖాన్ని కాల్చగా వచ్చిన భస్మం వల్ల అనేక రోగాలు నయమవుతాయట*.

ఈ శంఖాల వల్ల ఆయువృద్ధి, లక్ష్మీ ప్రాప్తి, పుత్రప్రాప్తి, శాంతి, వివాహ ప్రాప్తి కలుగుతాయని ఒక నమ్మకం.

శంఖాలలో అనేక రకాలు ఉన్నాయి. అందులో గోముఖ శంఖం ఒకటి. ఇది ఆవు మొహం ఆకారంలో ఉండటం వల్ల దీనికి ఆ పేరు వచ్చింది. గోముఖ శంఖాన్ని పూజించిన వారికి మనస్సులో ఉన్న కోరికలు తీరుతాయి.

*దీనిని షాపులో ఉంచుకొని పూజించిన వారికి రోజూ వ్యాపార,ధనాభివృద్ది కలుగుతుంది* .

*శంఖం ఏదైనా దానిని మాత్రం ఎప్పుడూ బోర్లించి ఉంచకూడదు.*

*ఏ ఇంట్లో శంఖాన్ని దేముడి గదిలో ఉంచి పూజిస్తారో ఆ ఇల్లు ధనధాన్యాలతో తులతూగుతుందిట.*

*ఇన్ని ఉపయోగాలున్న శంఖాన్ని పూజించడం, ఆరాదించడం, పూజా విధానాలలో ఉపయోగించడం ఎంతో మంచిది.*

1 week ago | [YT] | 0

@Kavsvlogs

శనివారం వీటికి ప్రదక్షిణలు చేస్తే ఫలితం...........!!


ప్రతి శనివారం ఈ మూడింటికి ఈ విధంగా ప్రదక్షిణాలు చేస్తే మీ జీవితంలో ఉన్న అన్ని చికాకులు పోతాయి

శనివారం సాక్షాత్ శ్రీ మహా విష్ణువు అంశం అయిన
శ్రీ వెంకటేశ్వరస్వామికి ఎంతో ఇష్టమైన రోజు.
అయితే ఈ రోజు కొన్ని పనులు చేస్తే మనం తెలియక చేసిన పాపాలు పోవడమే కాకుండా సకల సంపదలు
సుఖ సంతోషాలు మీ సొంతం అవుతాయి
అవేమిటో ఈ రోజు మనం చూద్దాము.



రావి చెట్టు.....

రావి చెట్టుకి ప్రతి శనివారం మూడు ప్రదక్షిణాలు కనుక చేస్తే చాలా లక్ష్మిప్రదం.
అలాగే ఆ చెట్టు కింద ముక్కోటి దేవతల ఆశీర్వాదం దక్కుతుందని నమ్మకం.
అందుకే ప్రతి శనివారం రావిచెట్టు ప్రదక్షిణాలు శుభప్రదం



హనుమంతుడు.....

శనివారం కేవలం గోవిందుడీకే కాదు హనుమంతుడికి కూడా ఎంతో ఇష్టమైన రోజు.
అయితే జీవితంలో తెలియని బాధలు
తీరని కోరికలు ఏదైనా ఆరోగ్య సమస్యలు
కనుక వేధిస్తుంటే హనుమంతుడికి 11 ప్రదక్షిణాలు చెయ్యాలి.
ఇలాగా చెయ్యడం వల్ల ఆయన కరుణ ఎప్పుడు
మీ వెంటే ఉంటుంది.
ఆలాగే వేంకటేశ్వరస్వామికి ప్రతి శనివారం లేదా
నిత్యం 7 ప్రదక్షిణాలు కనుక చేస్తే ఇంక
మీ అదృష్టానికి తిరుగు ఉండదు



తులసి మొక్క....

ప్రతి ఇంట్లో ఉండే మొక్క తులసి మొక్క
అయితే ఈ తులసి మొక్కని పూజిస్తే
మనకి ఈ జన్మలో ఉన్న పాపాలే కాకుండా
ఏడేడు జన్మల పాపాలు పోతాయి అని పెద్దలు చెబుతారు పైగా ఆడవాళ్ళకి ఐదవతనం కడుపు చలవతో పాటు
ఆ ఇంటికి ఎప్పుడు రక్షగా తులసీదేవి
తల్లి వలే కాపాడుతుంది,
అందుకే ప్రతి శనివారం 3 ప్రదక్షిణాలు చేస్తే మంచిది.

1 week ago | [YT] | 0

@Kavsvlogs

🌷🙏అంజనేయ స్వామిని తమలపాకులతో పూజించటం వలన కలుగు ప్రయోజనాలు🙏🌷

1. ఆంజనేయ స్వామికి లేత తమలపాకుల మాలను వేస్తే రోగాలతో ఇబ్బందులు పడేవారికి త్వరగా గుణం కనిపిస్తుంది.

2. ఇంట్లో మాంత్రిక దోషాలు ఉన్నవారు ఆంజనేయస్వామికి తమల పాకుల హారాన్ని వేస్తే మంత్ర సంబందమైన పీడలు తొలగిపోతాయి.

3. సంసారంలో ప్రశాంతత లేని వారు స్వామికి తమల పాకుల హారాన్ని వేయిస్తే సంసారంలో సుఖం లభిస్తుంది.

4. కొందరు చిన్న పిల్లలు ఎంత ఆహారాన్ని తిన్నప్పటికీ సన్నగానే ఉంటారు. చాలా నీరసంగా కనిపిస్తుంటారు. ఇలాంటి వారు స్వామికి తమలపాకుల హారాన్ని వేస్తే ఆరోగ్యం బాగుపడి చక్కగా ఎదుగుతారు.

5. వ్యాపారంలో చాల నష్టాలు వస్తుంటే స్వామికి తమలపాకుల హారాన్ని వేయించి తమలపాకులు, పండ్లు దక్షిణ సమేతంగా దానం చేస్తే వ్యాపారం వృద్ధిలోకి వస్తుంది.

6. ఏ వ్యక్తి అయితే హీనంగా చూడబడుతాడో అటువంటి వ్యక్తి స్వామికి తమలపాకుల హారాన్ని సమర్పిస్తే సంఘంలో గౌరవం లభిస్తుంది.

7. శనైశ్చర దృష్టి ఉన్నవారు ఆంజనేయ స్వామికి తమలపాకుల హారాన్ని వేస్తే శనీశ్వరుని అనుగ్రహం కలుగుతుంది.

8. వైద్య పరంగా నయంకానీ వ్యాధులు ఉన్నవారు స్వామికి తమలపాకుల హారాన్ని వేసి, ప్రసాదాన్ని స్వీకరిస్తే అన్ని రోగాలు నయమవుతాయి.

9. సుందర కాండ పారాయణం చేసి స్వామికి తమలపాకుల హారాన్ని వేస్తే అన్ని కార్యాలలో విజయం సిద్ధిస్తుంది.

10. హనుమాన్ చాలీసా చదివి స్వామిని ప్రార్ధించి తమలపాకుల హారాన్ని వేస్తే పరమాత్మని అనుగ్రహం కలుగుతుంది.

11. వాద ప్రతివాదాల్లో స్వామిని ప్రార్ధించి తమలపాకుల హరాన్ని సమర్పించి, ప్రసాదం తీసుకుంటే జయం మీదే అవుతుంది.

12. తాంబూల దానంతో గంగా దేవి సంతృప్తి పడుతుంది.పర్ణ ప్రసాదాన్ని ఆంజనేయ స్వామి పూజల్లో కూడా వాడతారు.

తమలపాకులతో మాలను చేసి ఆంజనేయ స్వామికి వేస్తారు. అనంతరం తమలపాకును భక్తులకు ప్రసాదంగా ఇస్తారు. దీనికి పర్ణ ప్రసాదమనే పేరు.

హనుమాన్ మంత్రాన్ని రోజు ఉచ్చరించడం వల్ల శక్తి, ధైర్యంతోపాటు శారీరక సామర్థ్యం కూడా పొందుతారు.

1.ఓ హనుమంతాయ నమ:,
2.హం పవన నందాయ స్వాహ

అంటూ మంత్రోచ్ఛారణ గావిస్తే ధైర్యంతోపాటు శారీరక సామర్థ్యం కూడా పొందుతారు.

🌺🌺🌺

3.హం హనుమంతాయ రుద్రాత్మక హం ఫట్

ఈ రహస్య మంత్రాన్ని పఠించడం ద్వారా అపరిమితమైన శక్తిని పొందవచ్చు.

🌺🌺🌺

"ఓ నమో భగవతే ఆంజనేయ మహాబలాయ స్వాహ"

మంత్రాన్ని 21 వేల సార్లు ఉచ్ఛరిస్తే మొండి రోగాలు, దుష్ట శక్తులు పీడనం తొలగిపోవడమే కాదు, జీవితంలో ఎదురైన ఇతర ఆటంకాలు కూడా తొలగిపోతాయి.

🌷శ్రీ అంజనేయం🌷

సేకరణ

1 week ago | [YT] | 3

@Kavsvlogs

చంద్ర గ్రహణం


ఈ సం|| ఫాల్గున శుక్ల పూర్ణిమా మంగళవారము
03-03-2026 నాడు సింహరాశిలో పూర్వఫల్గునీ నక్షత్రమున కేతుగ్రస్త చంద్రగ్రహణం సంభవించును.

స్పర్శ కాలం పగలు 03:20
సూర్యాస్తమయం (హైదరాబాద్) సాయంత్రం 06:23

మోక్ష కాలం రాత్రి 06:47

మొత్తం పుణ్యకాలం 00:24

*గ్రహణ ఆరంభము ప గం. 03:20 అయినను పుణ్యకాలము మాత్రం సూర్యాస్తమయము/ చంద్రోదయం నుండి ప్రారంభమగును.*

-: నిత్య భోజన ప్రత్యాబ్దికాది నిర్ణయము :-

*గ్రస్తోదయే విధోః పూర్వం నాహర్భోజన మాచరేత్ ।* *గ్రస్తోదయే భవేదిన్దోః దివా శ్రాద్ధం న కారయేత్ ॥* *రాత్రావపి తదా కుర్యాత్ ప్రత్యబ్దం మను రబ్రవీత్ ||*

ఇత్యాది శాస్త్రవాక్యములను బట్టి సమర్థులు ఈరోజు పగలు ఏ రకమైన ఆహారాదులు తీసుకొనకూడదు. శుద్ధ మోక్షానన్తరము (రా 06:47 తరువాత) నిత్యభోజన, ప్రత్యాబ్దికములను ఈ రాత్రియే యథాప్రకారము జరుపుకొనవలెను. అశక్తులు (పిల్లలు, రోగగ్రస్థులు, గర్భిణులు, వృద్ధులు) ఈనాడు పగలు గం.11:00 లోపు భుజింప వచ్చును.

ఈనాటి రాత్రికాలమున శ్రాద్ధాచరణము విశేష ధర్మ శాస్త్రమును బట్టి నిర్ణయము. అయితే విధవాకర్తృకశ్రాద్ధ మగుచో ఈ రోజు (పగలు రాత్రి) ఉపవసించి మరునాడే జరుపవలసియుండును. అట్లే ఈనాడు జరుపవలసిన విశేష పూజాదులన్నియు గ్రహణానంతరమే జరుప కొనవలయును.

గ్రహణ గోచారము :- ఈ గ్రహణమును పూర్వఫల్గుని నక్షత్రము వారును, పూర్వాషాఢ నక్షత్రము వారును, భరణి నక్షత్రము వారును, అధమ ఫలము నిచ్చు రాశుల వారును అసలు చూడరాదు.

శుభ ఫలము : మిథున, తుల, వృశ్చిక, మీన రాశులవారలకు

మధ్యమఫలము : మేష, కర్కాటక, ధనుః, కుంభ రాశులవారలకు


అధమ ఫలము : వృషభ, సింహ, కన్య, మకర రాశులవారలకు.

*కొన్ని ముఖ్యమైన సూచనలు*

సూర్యగ్రహణము సంభవించే ఝాము (యామము) నకు పూర్వపు నాలుగు ఝాములు (సుమారు 12 గంటలు) ముందుగా ఎటువంటి ఆహారము తినరాదు. చంద్రగ్రహణమునకు పూర్వపు మూడు ఝాములు (సుమారు 9 గంటలు) ముందుగా తినరాదు. 7 సం॥ వయస్సు లోపు పిల్లలకు, వృద్ధులకు ఈ నియమము లేదు. ఈవిధముగా పూర్తిగా నిరాహారముగా ఉండలేని వాళ్ళు పాలు, పండ్లు వంటి లఘువైన ఆహారమును స్వీకరించవచ్చును. గ్రహణము సంభవించు ఝామునకు ముందు ఝాములో (సుమారు 3 గంటలు) అది కూడా స్వీకరించుట ఉత్తమం కాదు.

నీళ్ళు, పక్వముకాని పదార్థములు వీటి శుద్ధి కొరకు వాటిపై దర్భలు వేసియుంచుట అనాదిగా ఉన్న శిష్ట సంప్రదాయం. (కొన్ని ప్రాంతములో ఇంటి గర్భము (ప్రధాన హాలు) లో ముగ్గు వేసి దర్భలనుంచుట ద్వారా ఇంటి మొత్తమునకు శుద్ధి అగునను శిష్టాచారముగా కూడా గలదు). అలా ఉంచిన పదార్థాలను గ్రహణానంతరం వాడుకోవచ్చును. కాని గ్రహణ సమయానికి పూర్వమే వండిన పదార్థములు పనికిరావు.


*జయగురుదత్తా, శ్రీ గురు దత్త*

1 week ago | [YT] | 4

@Kavsvlogs

మంత్రాలయం లో శ్రీ గురు రాఘవేంద్ర స్వామి గురు వైభవోత్సవం🙏

1 week ago | [YT] | 2

@Kavsvlogs

🌺🌺 *శ్రీ గురు రాఘవేంద్ర స్వామి*🌺🌺

🌺🌹 *గురువైభవోత్సవం సందర్భంగా*🌹🌺



ఫాల్గుణమాసం శుద్ధ సప్తమి మంత్రాలయం శ్రీ రాఘవేంద్ర స్వామి సన్యాసాశ్రమం స్వీకరించిన రోజు పాడ్యమి నుంచి సప్తమి వరకూ మంత్రాలయంలో ఘనంగా ఉత్సవాలు నిర్వహిస్తారు. , ఈ నేపథ్యంలో ఏటా మంత్రాలయంలో గురు వైభవోత్సవాలు ఘనంగా నిర్వహిస్తారు.

*శ్రీ గురు రాఘవేంద్ర* స్వామి(1595-1671)హిందూ మత ద్వైత సిద్ధాంతానికి సంబంధించిన ఒక ప్రముఖమైన గురువు. 16వ శతాబ్దంలో జీవించారు. ఇతను వైష్ణవాన్ని (విష్ణువుని కొలిచే సిద్ధాంతం) అనునయించారు, మరియు మధ్వాచార్యులు బోధించిన ద్వైతాన్ని అవలంబించారు. ఇతని శిష్యగణం ఇతడిని ప్రహ్లాదుడి అవతారంగా భావిస్తారు. తమిళనాడులోని కుంభకోణం మధ్వమఠాన్ని 1624 నుండి 1636 వరకూ మఠాధిపతిగా పాలించి ఆపై ఉత్తరానికి యాత్రలు చేసారు. ఇతను శ్రీమూల రాముడి మరియు శ్రీ పంచముఖ ముఖ్యప్రాణదేవరు (పంచముఖ హనుమంతుడు) యొక్క పరమ భక్తులు.

ఇతను పంచముఖిలో తపస్సు చేశారు, ఇచ్చట పంచముఖ హనుమంతుణ్ణి దర్శించారు.(హనుమంతుని పంచముఖ దర్శనం శ్రీరామ చంద్రులు తర్వాత దర్శించినది శ్రీ రాఘవేంద్ర తీర్ధులు మాత్రమే) మంత్రాలయం లో తన మఠాన్ని స్థాపించారు, మరియు ఇక్కడే జీవ సమాధి పొందారు . వేలకొలదీ భక్తులు తరచూ మంత్రాలయ దర్శనానికి వస్తుంటారు.

రాఘవేంద్రస్వామి వెంకణ్ణ భట్టుగా తమిళనాడులోని భువనగిరిలో తిమ్మణ్ణభట్టు మరియు గోపికాంబ అనే కనడ భట్టు రాజులు రెండవ సంతానంగా 1595లో జన్మించారు. జన్మ సంవత్సరం 1598 లేదా 1601 కూడా కావచ్చు అనే వాదనలున్నాయి.

వేంకటేశ్వర స్వామి వారి అనుగ్రహంతో పుట్టినందుకు ఈతణ్ణి చిన్నప్పుడు వేంకటనాథుడనీ, వేంకటాచార్య అని కూడా పిలిచేవారు. తన బావ లక్ష్మీనరసింహాచార్ వద్ద మదురైలో ప్రాథమిక విద్యను అభ్యసించాక, వేంకటనాథుడ్ని కుంభకోణంలోని శ్రీమఠంలో విద్యార్థిగా చేరి, ఆపై రాఘవేంద్ర తీర్థులుగా సన్యసించారు. 1614లో మదురై నుండి తిరిగి వచ్చినపుడు సరస్వతీ బాయితో వీరికి వివాహమయింది.

వీరి కొడుకు లక్ష్మీనారాయణాచార్య అదే సంవత్సరంలో పుట్టాడు. ఆ తర్వాత కుటుంబమంతా కుంభకోణం చేరుకుంది. శ్రీమఠంలో రాఘవేంద్ర స్వామి సుధీంద్రతీర్థుల వద్ద అభ్యసించడం మొదలుపెట్టారు. అనతికాలంలో గొప్ప విద్యార్థిగా ఉద్భవించి, అన్ని వాదోపవదాల్లో తర్కాలలో తనకంటే పెద్దవారిని సైతం ఓడించారు. సంస్కృత మరియు వైదికశాస్త్రాల్లో నిష్ణాతుడై ఇతరులకు బోధించడం మొదలుపెట్టారు.

రాఘవేంద్రస్వామి సంగీతంలో కూడా నిష్ణాతులే, ఆయన కాలంలో ఆయనో గొప్ప వైణికుడు కూడా. గురువు తరువాత మఠం బాధ్యతలు స్వీకరించి ఆపై దక్షిణభారత దేశమంతా విజయం చేయటానికి బయలుదేరారు. మార్గంలో ఎన్నో అద్భుతాలను తన శిష్యబృందానికి చూపిస్తూ మధ్వప్రోక్త ద్వైత సిద్ధాంతానికి బాగా ప్రచారం చేసారు. 1671 లో తన శిష్యబృందంతో రాబోయే 800 సంవత్సరాలు జీవించే ఉంటానని చెప్పి మంత్రాలయంలో జీవసమాధి పొందారు.

🌹 *శ్రీ గురు రాఘవేంద్ర స్వామి చరిత్ర* 🌹

శ్రీరాఘవేంద్రులు జ్ఞాన సంపన్నుడు, సిద్ధ పురుషుడు. మంత్రాలయంలోని బృందావన సన్నిధానంలో భక్తులు పొందే శాంతి సంతృప్త్తుల మాటలకందనివి. అలజడి, అశాంతి, ఆందోళనలతో నిండిన నేటి నాగరిక సమాజానికి అటువంటి సత్పురుషుల సాహిత్యం, సాన్నిహిత్యం, సాన్నిధ్యం ఎంతో అవసరం. అది నిరంతరం వెలిగే అఖండ జ్యోతి.

🌺 *గురు రాఘవేంద్రస్వామి చరిత్ర* 🌺

శ్రీ రాఘవేంద్రస్వామి 1571లో కాంచీపురం సమీపంలోని భువనగిరిలో నిరుపేద కుటుంబంలో తిమ్మన్నభట్టు , గోపికాంబ దంపతులకు జన్మించాడు. తల్లిదండ్రులుపెట్టిన పేరు వెంకటనాధుడు. వీరి తాతగారు శ్రీకృష్ణ్ణదేవరాయల ఆస్థాన వైణికుడిగా వుండేవారు. వెంకటనాథుడి బాల్యంలోనే తల్లిదండ్రులు గతించారు. బావగారైన లక్ష్మీనారాయణ చేరదీశాడు. బావగారి పెంపకంలోనే వెంకటనాథుడు సర్వశాస్త్ర పారంగతుడయ్యాడు.

యుక్తవయసు రాగానే సరస్వతి అనే కన్యతో వివాహమైంది. ఓ పిల్లవాడు కూడా పుట్టాడు. కాని వెంకటనాధునికి దరిద్రం దావాలనంలా చుట్టుముట్టింది. ఆదుకునేవారెవరు లేరు. నిస్సహాయ స్థితిలో వెంకటనాధుడు భార్యాబిడ్డలతో కలిసి కుంభకోణం చేరుకున్నాడు. అనూహ్యంగా అక్కడ తాత్కాలికంగా బసచేసిన సుధీంద్ర తీర్థులవారి ఆశ్రయం లభించింది.

1 week ago | [YT] | 1