My Name is Vamsi ... I am a Hindu... I believe in my Hindu religion ...
I am proud to say that I am an orthodox Hindu (Sanatana Hindu) A Sanātana Hindu is a Hindu who follows the teachings of Sanātana Dharma, which is often referred to as Hinduism
DevotionalNews #DevotionalNews #Tirumala #Tirupati #TTD #God
Please share God's videos to our Hindus
ism tv Bhakti
Om Namo Venkatesaya
12- 04-2026
Total pilgrims : 77,743
Tonsures : 30,276
Hundi kanukalu : 3.59CR
Waiting Compartments... 20
Approx. Darsan Time for Sarvadarshanam (with out SSD Tokens).. 8 H
Tq
3 days ago | [YT] | 0
View 0 replies
ism tv Bhakti
గండి క్షేత్రం - రాయచోటి-వేంపల్లె మార్గమధ్యంలో పాపఘ్ని నదీతీరాన వెలసింది. పాపఘ్నీ నది ఇక్కడ శేషాచలం కొండను చీలుస్తుంది. కొండకు గండి కొట్టింది కాబట్టి ఈ ప్రాంతానికి గండి అని పేరు వచ్చింది. ఇది ప్రసిద్ధిచెందిన వీరాంజనేయ క్షేత్రం.
స్థలపురాణం
==========
త్రేతాయుగంలో శ్రీరాముడు అరణ్యవాసం చేస్తున్న సమయంలో సీతాదేవిని రావణుడు అపహరిస్తాడు. రామలక్ష్మణులు సీతాన్వేషణలో దండకారణ్యం నుండి గండిక్షేత్రం మీదుగా రావడం జరిగింది. అప్పటికే వాయుక్షేత్రంగా ప్రసిద్ధిగాంచిన గండిక్షేత్రంలో వాయుదేవుడు తపస్సు చేసుకుంటూ ఉండేవాడట.
అతడు రామలక్ష్మణులకు ఆహ్వానం పలికి తన ఆతిథ్యం స్వీకరించమని వేడుకొనగా, రావణవధ అనంతరం తిరుగు ప్రయాణంలో నీ కోరిక తీరుస్తానని వాగ్దానం చేసాడు.
రావణుని చంపి శ్రీరాముడు అయోధ్యకు తిరిగి వస్తున్నపుడు ఆంజనేయుని తండ్రి వాయుదేవుడు గండిలోని రెండుకొండలకు బంగారు తోరణం నిర్మించి శ్రీరామునికి స్వాగతం పలికాడు.
శ్రీరాముడు ఆ రాత్రికి ఇక్కడ విశ్రాంతి తీసుకున్నాడు.
శ్రీరాముడు అక్కడి ప్రకృతి సౌందర్యానికి ముగ్ధుడై సీతాన్వేషణం మొదలుగా రావణాసురునిపై తన విజయానికి మూలకారణమైన వీరాంజనేయుని తన బాణపు కొసతో కొండశిల మీద చిత్రించాడు.
చిత్రం చివరిదశలో లక్ష్మణుడు వచ్చి కాలహరణం సంగతి గుర్తుచేయగా ఆ తొందరలో శ్రీరాముడు ఆంజనేయుని చిత్రం ఎడమచేతి చిటికెనవ్రేలు విడదీయకుండా వెళ్ళిపోయాడు.
ఆచిత్రరూపమే శ్రీ వీరాంజనేయుని విగ్రహముగా విరాజిల్లుతున్నది. ఈ విధంగా గండి క్షేత్రం ఏర్పడింది.
చరిత్ర
=====
త్రేతాయుగం అనంతరం వసంతాచార్యులనే భక్తుడు చిన్నగుడి నిర్మించి ఆ రేఖాచిత్రానికి పూజలు చేయడం ప్రారంభించాడు.
తర్వాత మరికొంతకాలానికి వ్యాసరాయలనే శిల్పాచార్యుడు ఆ రేఖాచిత్రమును విగ్రహముగా మార్చాలని ఉలితో చెక్కుతుండగా వీరాంజనేయస్వామివారి ఎడామచేతి చిటికెనవ్రేలు విడదీసే సందర్భంలో రక్తం ధారలుగా స్రవించిందట. అంతట ఆ శిల్పాచార్యుడు అది గమనించి తన ప్రయత్నమును విరమించి పునఃప్రతిష్ఠ చేయడం జరిగింది.
బంగారు తోరణం
============
థామస్ మన్రో దత్తమండలాలకు కలెక్టర్ గా ఉండేవాడు. ఆయన గండి క్షేత్రం దర్శించినప్పుడు ఆయనకు బంగారు తోరణం కనిపించింది.మహాపురుషులకే ఇలా బంగారు తోరణం కనిపిస్తుంది. బంగారు తోరణం చూసిన వారు ఆరు నెలల్లో మరణిస్తారు. మన్రో మరణం ఆ తర్వాత అరు నెలల్లోపే జరిగింది. నమ్మశక్యం గాని ఈ విషయం వైఎస్ఆర్ జిల్లా గెజెటీర్ లో ఉంది.
తి.తి.దే. యాజమాన్యం
================
2007 సంవత్సరంలో తిరుమల తిరుపతి దేవస్థానాలు గండిక్షేత్రాన్ని దత్తత తీసుకొని అభివృద్ధి చేశారు. వీరాంజనేయ స్వామివారి ఆలయానికి ప్రహారీ నిర్మించి, ఉత్తరంవైపు గాలిగోపురం, కల్యాణ మండపం, అన్నదాన సత్రం మొదలైన భవనాలు నిర్మించారు.
ఉత్సవాలు
========
• శ్రావణ మాసోత్సవాలు
• అన్నదాన కార్యక్రమం
ఇతర విశేషాలు
==========
• ఇక్కడ ఇంకా నామాల గుండు, ఈశ్వరాలయం, భూమానందాశ్రమం చూడదగ్గవి. భూమానందాశ్రమం ఆధ్యాత్మిక చింతనా కేంద్రం. ఈ ఆశ్రమాన్ని కీ.శే. రామకృష్ణానందుల వారు స్థాపించారు.
• గండి క్షేత్రాన్ని భక్తులు సంవత్సరం పొడవునా దర్శిస్తూ ఉంటారు. శ్రావణ శనివారాల్లో విశేష సంఖ్యలో యాత్రీకులు, భక్తులు గండి వీరాంజనేయ క్షేత్రానికి వస్తూ ఉంటారు.
ఇక్కడ శనీశ్వర అలయము ఉంది. నది అవతలి భాగాన శివాలయo కూడా ఉంది.
3 days ago | [YT] | 4
View 0 replies
ism tv Bhakti
*ఘనంగా జరిగిన శుక్రవారం శుభంకరిఅమ్మవారి ఒడి బియ్యం కార్యక్రమం*
*సాయి ట్రస్ట్ ఆధ్వర్యంలో 54 శుక్రవారం జరగనున్న ఒడిబియ్యం కార్యక్రమం నాల్గవ వారం జీసస్ నగర్ (రేణుక నగర్ )శ్రీ రేణుక ఎల్లమ్మదేవాలయంలో ఘనంగా జరిగింది* .
పెద్ద సంఖ్యలో మహిళలు పాల్గొని లలితా సహస్రనామ పారాయణం నిమ్మకాయ దీపాలతో పూజ ఖడ్గమాల మొదలగు పూజలు నిర్వహించారు.
అనంతరం*మొదట రేణుక ఎల్లమ్మ కు ఒడి బియ్యం పెట్టీ అనంతరం సుగుణమ్మ అనే మహిళలకు ఒడి బియ్యం కార్యక్రమం చేశారు
*54 వారాలకు ఆర్థిక సహాయాన్ని శ్రీమతి రుక్మిణి సాయి ట్రస్ట్ అధ్యక్షుడు విజయ సాయికుమార్ మాతృమూర్తి ఆర్థిక సాయం అందిస్తున్నారు*
.*ఆలయ అర్చకులు పార్థసారథి స్వామి వారు కార్యక్రమాన్ని శాస్తోతంగా నిర్వహించినారనీ సాయి ట్రస్ట్ అధ్యక్షుడు విజయ సాయికుమార్ తెలిపారు*.
ఈ కార్యక్రమంలో భువన ,శ్వేతరాఘవేంద్ర ,,పల్లవి , పద్మ అధిక సంఖ్యలో మహిళలు పాల్గొన్నారు
5 days ago | [YT] | 4
View 0 replies
ism tv Bhakti
*సంకట నిరసన మారుతి స్తోత్రం*
భూత ప్రేత సమంధాది
రోగ వ్యాధి సమస్తహీ|
నాసతీ తుటతీ చింతా
ఆనందే భీమదర్శనే||
భావము :
ఈ స్తోత్రమును పఠించినవారికి భూత ప్రేత పిశాచముల వల్ల బాధ కలుగదు. రోగముల, వ్యాధుల పీడ నశిస్తుంది. మానసిక చింతలు పటాపంచలవుతాయి. మారుతి దర్శనం వల్ల ఆనందం కలుగుతుంది.
హే ధరా పంధరా శ్లోకీ
లాభలీ శోభలీ బరీ|
దృఢదేహో నిసందేహో
సంఖ్యా చంద్రకళా గుణే||
భావము :
దృఢదేహుడైన మారుతియొక్క ఈ పదిహేను శ్లోకముల స్తోత్ర పఠనము - లాభములనూ, శుభములనూ చేకూర్చుతుంది. ఈ పదిహేను శ్లోకములూ అమృతమయుడైన చంద్రునియొక్క కళల వంటివి. కనుక ఇవి భక్తులపై అమృతమును కురిపిస్తాయనడంలో సందేహం లేదు.
1 week ago | [YT] | 0
View 0 replies
ism tv Bhakti
*బనగానపల్లె పుణ్యక్షేత్రం - కాలజ్ఞాన పత్రాలు నిక్షిప్తమైన పవిత్ర "చింతమాను*
నంద్యాల జిల్లా బనగానపల్లెలోని చింతమాను మఠం విశిష్టతను ప్రతి హిందువు తెలుసుకోవాలి. ఈ చిత్రంలో మీరు చూస్తున్నది సాక్షాత్తూ ఆ శ్రీమద్విరాట్ పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వామి వారి మహిమకు సజీవ సాక్ష్యం.
ఈ క్షేత్ర విశేషాలు ఏమిటంటే
చారిత్రక సత్యం: ఒకప్పుడు ఈ ప్రదేశంలో స్వామి వారు స్వహస్తాలతో నాటిన చింత చెట్టు ఉండేది. కాలక్రమేణా ఆ మూల వృక్షం కాలం తీరిపోయింది. ప్రస్తుతం మనం దర్శించుకుంటున్నది ఆ స్థానంలో వెలసిన మరొక చింత చెట్టు. * కాలజ్ఞాన నిధి: ఆనాడు స్వామి వారు లోక కల్యాణం కోసం రాసిన కాలజ్ఞాన తాళపత్ర గ్రంథాలను తన స్వహస్తాలతో ఈ చింతమాను కిందనే నిక్షిప్తం చేశారు.
నేటికీ భక్తులు ఈ చింతమానును దర్శించి, ఆ జగద్గురువు అనుగ్రహం పొందుతుంటారు.
స్వామి వారు దాచిన ఆ కాలజ్ఞాన పత్రాల శక్తి ఈ ప్రదేశంలో నిరంతరం ప్రసరిస్తూనే ఉంటుంది. భవిష్యత్తును ముందే చూసి మనల్ని హెచ్చరించిన ఆ వీరబ్రహ్మేంద్రస్వామి వారి పాదాలకు శతకోటి వందనాలు.*
1 week ago | [YT] | 3
View 0 replies
ism tv Bhakti
🔔 *అనగనగా..* 🔔
ఒక ఊరిలో ఎవరో రామాయణ ప్రవచనం చెప్తున్నారు. బండోడు శ్రద్ధగా విని అర్ధరాత్రి ఇంటికి వచ్చాడు.
"రామాయణం నీకేం అర్ధమైంది" అని అడిగింది భార్య. "నాకేం అర్ధం కాలేదు" అన్నాడు బండోడు.
ప్రవచనం జరిగిన పది రోజులూ ఇదే తంతు. ప్రవచనం నుండి రాగానే నీకేమర్ధమయింది అని భార్య అడగడం, నాకేం అర్ధం కాలేదని బండోడు చెప్పడం. భార్యకి కోపం నషాళానికి అంటింది.
"ఇదిగో ఆ గుండ్రాయి తీసుకు పోయి దాన్తో నీళ్ళు పట్రా" అంది. బండోడు వెళ్ళి గుండ్రాయిని నీళ్ళల్లో ముంచాడు. గుండ్రాయిలో నీళ్ళు నిలబడవు కదా. అలాగే తీసుకొచ్చాడు. భార్య మళ్ళీ తెమ్మంది. మళ్ళీ వెళ్ళాడు. అలా పది సార్లు తిప్పింది.
"చూసావా! ఆ గుండ్రాయితో నీళ్ళు తేలేకపోయావు. అలాగే పది రోజులు రామాయణం విన్నా నీకు ఏమీ అర్ధం కాలేదు. నువ్వా గుండ్రాయితో సమానం" అని ఈసడించింది.
అప్పుడు బండోడు అన్నాడు, *"గుండ్రాయి నీళ్ళు తేలేక పోయిన మాట నిజమే కానీ, పదిసార్లు నీళ్ళల్లో మునగడం వల్ల మాలిన్యం అంతా పోయి అది శుభ్రపడింది కదా. అలాగే రామాయణం నాకేమీ అర్ధం కాకపోయినా పది రోజుల్నుండీ వినడం వల్ల మనసు తేలిక పడ్డట్టు హాయిగా వుంది. మనసు ప్రశాంతంగా వుంది"* అన్నాడు.
*భర్తకి అర్ధం కావల్సిన దానికన్నా ఎక్కువే అర్ధం అయిందని భార్యకి అర్ధం అయింది! నవ విధ భక్తి మార్గాల్లో శ్రవణం ఒకటి. విన్నా చాలు!*
*తులసిమొక్కను నాటండి.🪴*
*భగవద్గీతను చదవండి.📖*
*గోమాతను పూజించి సంరక్షించండి*
*కథ కంచికి.. మనం ఇంటికి*
🙏🏻🙏🏻🙏🏻🔔🔔🔔🙏🏻🙏🏻🙏🏻
2 weeks ago | [YT] | 0
View 0 replies
ism tv Bhakti
*54 శుక్రవారం శుభంకరిఅమ్మవార్లకు ఒడి బియ్యం కార్యక్రమం ప్రారంభం*
*పరాభవ నామ సంవత్సరం పురస్కరించుకొని పరాశక్తి అమ్మవారి లకు ప్రత్యేక పూజలు నిర్వహించాలని సత్సంకల్పంతో సాయి ట్రస్ట్ ఆధ్వర్యంలో 54 శుక్రవారం 54 దేవాలయాల్లో అమ్మవార్లకు మరియు ఓడి బియ్యం మరియు లలితా సహస్రనామ పారాయణం కుంకుమార్చన నిర్వహించగలము అందులో భాగంగా మొట్టమొదటగా హౌసింగ్ బోర్డ్ లోని గాయత్రి దేవాలయంలో ఈరోజు ఒడి బియ్యం కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించాము అని సాయి ట్రస్ట్ అధ్యక్షుడు డావిజయ సాయికుమార్ తెలిపారు*
ఉదయం 11 గంటలకు లలితా సహస్రనామ పారాయణము కుంకుమార్చన నిమ్మకాయ దీపాలు మొదలగు పూజ నిర్వహించి అనంతరం మహా మంగళహారతి నిర్వహించారు. అనంతరం ఉమాదేవి అనే బ్రాహ్మణ మహిళకు మరొకరికి నిర్వహి పెట్టారు
ప్రసాద వితరణ తో కార్యక్రమం ముగిసింది.
*ఒడిబియ్యం నిలిచిన వారికి ఒడి నింపి*
ప్రతి మహిళకు సౌభాగ్యం గుర్తుగా ఒడి బియ్యం కార్యక్రమాన్ని నిర్వహిస్తుంటాము కానీ కొంతమందికి తల్లిదండ్రులు లేక బాంధవ్యాలు సరిగా లేక 11 సంవత్సరాలు ఒడి బియ్యం లేక పోవటంతో అటువంటి వారికి సాయి ట్రస్ట్ ఆధ్వర్యంలో అందిస్తున్నామని ఇటువంటి వారు ఎవరైనా ఉంటే సాయి ట్రస్ట్,8712345520 ని సంప్రదించవలసిందిగా డా విజయ సాయికుమార్ కోరుచున్నారు ఈ 54 అమ్మవారిలకు మహిళలకు అందించే ఓడి బియ్యం ఖర్చు మొత్తం శ్రీమతి వై.రుక్మిణి సాయి ట్రస్ట్ అధ్యక్షుడు డా విజయ్ సాయికుమార్ మాతృమూర్తి అందిస్తున్నారని తెలిపారు
కార్యక్రమంలో సంధ్య మూర్తి సాయి ట్రస్ట్ మహిళా బృందం శ్వేత నవజ్యోతి పల్లవి విశాల పద్మలత తదితరులు పాల్గొన్నారు.
3 weeks ago | [YT] | 6
View 0 replies
ism tv Bhakti
*తెలుగు నూతన పరాభవ నామ సంవత్సర శుభాకాంక్షలు*
*పరాభవ నామ సంవత్సరం ఆధ్యాత్మిక అంతరార్థం:*
మనిషిలో ఉన్న **'అహంకారం', 'గర్వం', 'స్వార్థం' పరాభవం పాలు కావడాన్ని (ఓడిపోవడాన్ని)** ఇది సూచిస్తుంది.
మనలోని కామ, క్రోధ, లోభ, మోహ, మద, మాత్సర్యాలు అనే అరిషడ్వర్గాలను జయించి, వినయంతో ఉండాలని ఈ సంవత్సరం మనకు బోధిస్తుంది.
అహంకారంతో విర్రవీగే పాలకులకు,వ్యక్తులకు ఈ సంవత్సరం గట్టి గుణపాఠం నేర్పుతుంది. కానీ... వినయంతో, నిజాయితీగా, ధర్మబద్ధంగా కష్టపడే వారికి అద్భుతమైన విజయాలను ప్రసాదిస్తుంది.
సర్వేజనా సుఖినోభవంతు
సమస్త లోకా సుఖినోభవంతు
3 weeks ago | [YT] | 1
View 0 replies
ism tv Bhakti
*🔥హారతి మనం ఎందుకు ఇస్తాం?🙏*
*కర్పూరానికి అలసటను దూరం చేసే శక్తి ఉంటుంది.*
👏👏👏👏👏👏👏
సాధారణంగా భగవంతునికి ఇచ్చే హారతికైనా, పూజ తర్వాత మనకిచ్చే మంగళహారతికైనా ఇదే సూత్రం వర్తిస్తుంది.
🌺🌺🌺🌺🌺🌺🌺
అంతేకాదు వృత్తాకారంలో దైవం చుట్టూ హారతిని తిప్పడం వల్ల ఉత్పన్నమయ్యే శక్తి నాలుగు దిశలకూ ప్రయాణిస్తుంది.
🌹🌹🌹🌹🌹🌹🌹
మనం హారతిని కళ్లకు అద్దుకోవడంవల్ల ఆ తరంగాలు మన అరచేతుల ద్వారా శరీరంలోకి ప్రవేశిస్తాయి.
🌸🌸🌸🌸🌸🌸🌸
హారతి సమయంలో చేసే ఘంటానాదం సాంత్వననిచ్చే తరంగాల సృష్టికి సహకరిస్తుంది.✊
*నమో శ్రీ వేంకటేశాయ🙏*
1 month ago | [YT] | 0
View 0 replies
ism tv Bhakti
నేడు తిరుమలలో టీటీడీ బోర్డు సమావేశం
రూ.5,500 కోట్ల బడ్జెట్ అంచనాలకు ఆమోదం
దాదాపు 90 అంశాలతో సమావేశం ఎజెండా
శ్రీవారి ముడుపు పత్రం పథకంపై చర్చించనున్న బోర్డు
1 month ago | [YT] | 0
View 0 replies
Load more