Jyothirvidwan Brahmasri Ravikumar Sharma Garu Jyothishaya, Smartha, Aagama, Vasthu Shastra Pandith
20+ years of Sadhana (experience).
This channel started on Aug 2, 2019, with the blessings of Ammavaru.
Hello everyone,
I am an astrologist. also a palmist. I will also check that. I will perform any type of Pooja at your home as per your requirements. According to your Horoscope, I would even suggest gemstones, which can help you grow in your career.
Note: Please go through the disclaimer & copy the right text under each of the videos, before watching it. These videos cannot be reused until you get written permission from the channel admin.
For queries related to the Channel, Ravikumar Garu's contact mail ID: SHARMASJYOTHIRNILAYAM@gmail.com
| SVV Astrology
For More :
www.instagram.com/astrologysvv?igsh=NWUwMHNsbXYzcG…
my WhatsApp group for any queries or consultations.join
Follow this link to join my WhatsApp group:
chat.whatsapp.com/BcWOLtMkgr1F1Qtcgkrjtt
SVV Astrology channel
1 day ago | [YT] | 1
View 0 replies
SVV Astrology channel
🍀🌺🍀🌺🍀🕉️🍀🌺🍀🌺🍀నేడు..
*భీష్మ ఏకాదశి*
➖➖➖✍️
```
భీష్మ ఏకాదశి నాడు అందరూ చదవ వలసిన కథ..
శ్రీ మన్మహా భారతాన్ని ఎన్ని సార్లు విన్నా, ఎన్ని సార్లు చదివినా మళ్ళీ మళ్ళీ చదవాలనీ, వినాలని అనిపిస్తుంది.
ఎందుకంటే అదొక ధర్మ, జ్ఞాన భాండాగారం, భారతం అనగానే మొదటగా మనసుకు స్ఫురించేది భీష్మపితామహుడు, విష్ణు సహస్రనామాలు.
ఆయన కురువంశ పితామహుడు (తాతగారు).
హస్తినాపురం కురువంశ జన్మభూమి, దుష్యంతుని పుత్రుడైన భరతుడు పాలించిన భూమి ఈ భరత భూమి.
భరతుని కొడుకు సహోత్రుడు, అతని కొడుకు హస్తి, ఆ హస్తి చేత నిర్మిమైనదే హస్తినాపురం, హస్తి కొడుకు వికుందుడు.
వికుందుడి కొడుకు అజమీనుడు, అజమీనుడి కొడుకు సంవర్ణుడికీ సూర్య పుత్రిక తపతికీ పుట్టిన వాడే కురు, అ కురు రాజు పేరే పరంపరగా కురువంశానికి వచ్చింది.
కురు రాజు తరువాత ప్రదీపుడు ప్రముఖుడు (రాజైనా ఋషి వంటి వాడు) రాజ ఋషి.
ఒకనాడు ఆయన గంగాతీరంలో తపస్సు చేసుకుంటున్నాడు,
మహా తేజశ్శాలి అయిన ఒక స్త్రీ గంగానదిలో నుండి వచ్చి ప్రదీపుని ఒడిలో కూర్చుని ఆయన భుజం మీద చేయి వేసింది.
ఆయన హఠాత్తుగా కళ్ళు తెరచి ఆశ్చర్యంలో ఆమెను ఎవరు నీవని అడిగాడు.
ఆమె చాలా మురిపెంగా ‘రాజా నేను నీమీద ప్రేమతో నిన్ను కోరి వచ్చాను, నాపేరు గంగ’ అన్నది...
ప్రదీపుడు చిరునవ్వు నవ్వాడు, ‘చూడమ్మ! నీవు నాకుడి తొడ మీద కూర్చున్నావు.
కుడి తొడ పుత్రికాస్థానం, అలా కుడి తొడ మీద కూర్చుని నన్ను కోరడం ధర్మ పద్దతి కాదు కానీ నీ కోరిక ననుసరించి నాకు కోడలివి అవుతావు అప్పుడు నాకు కూతురు సమానమవుతావు’ అన్నాడు.
అప్పుడు గంగ కూడా పకపకా నవ్వి ‘రాజా ఆ మాట నీనోట అనిపించడానికే ముందు చూపుతోనే వచ్చాను’ అన్నది.
‘కానీ రాజా నాదొక నియమం విను, నన్ను నీ కొడుకు వివాహం చేసుకున్న తరువాత నేను ఏం చేసినా నీవు ఒక్క మాట కూడా మాట్లాడరాదు’ అన్నది.
ప్రదీప మహరాజు ‘సరే!’ అన్నాడు, ఏకపత్నీవ్రతుడైన మనస్సు అతి ప్రశాంత సమయంలో ఉండగా ఒక పుత్రుడు జన్మించాడు.
శిశువుకి అర్థవంతమైన శంతనుడు అని పేరు పెట్టారు, అలా కొంత కాలం గడిచింది ఆ శంతనుడు దేవతలకు కూడా సహాయం చేయగలిగిన అమిత శక్తివంతుడు, కురు పితామహుని పుట్టుకకూ శంతనుని పుట్టుకకూ పూర్వ జన్మ సంబంధాలున్నాయని మనకు మహాభారతం చెబుతోంది.
మహాభిషుడు అనే ఒక చక్రవర్తి ఉండేవాడు, మహాశక్తి సంపన్నుడాయన, తపశ్శక్తితో ఇంద్రలోకంలో ఉండగా దేవతలు బ్రహ్మలోకానికి వెళ్తూ ఆయనను కూడా రమ్మన్నారు.
అప్పుడే గంగాదేవి కూడా దివ్యకాంత రూపంలో అక్కడికి వచ్చింది.
అక్కడ గాలి కొంచెం గట్టిగా వీచి గంగాదేవి దుకూలం పలుచని వస్త్రం కొంచెం తొలగింది.
అందరూ తలలు వంచుకున్నారు, కాని మహాభిషుడు తలదించుకోలేదు.
అందుకు ఫలితంగా బ్రహ్మదేవుడు మహాభిషుని భూలోకంలో పుట్టి అక్కడే ఉండిపొమ్మని అన్నాడు, ఆ మహాభిషుడే ఈ శంతనుడు.
దేవతలలో అష్ట వసువులు ఎనమిది మంది.
వారిలో ద్యువు అనే వసువు భార్య వసిష్ఠమహర్షి వద్దవున్న కామధేనువు పాలు కావాలని భర్తను ఎలాగైనా తెచ్చిపెట్టమని కోరింది.
భార్య కోరిక తీర్చాలనే ఉత్సాహంతో వసువులందరినీ వెంట పెట్టుకుని వెళ్ళి కామధేనువును అపహరించాడు ద్యువు.
అపహరించడం మానవ నైజం కనుక మీరు మానవ(భూ) లోకంలో పుట్టమనీ శపించాడు మహర్షి.
మానవులుగా పుట్టాలంటే తల్లిగర్భంలో యాతన అనుభవించాలి.
ఎప్పుడు మళ్ళీ ఉత్తమ గతి కలుగుతుందో తెలియదు, అందుకని మంచి మాతృమూర్తి కోసం వసువులు వెదికారు, అప్పుడు గంగమ్మ కనిపించింది, అప్పటికీ ఆమె తాను ఏమి చేసినా కాదనకూడదు అనే షరతు మీద శంతనుని పెళ్ళాడింది.
వసువులు గంగాదేవిని ‘తల్లీ మమ్ములను నీ గర్భంలో ధరించు మేము భూమి మీద ఎక్కువ కాలం ఉండలేము.
మేము పుట్టీ పుట్టగానే మళ్ళీ మా లోకానికి గంగాజలం ద్వారా పంపించు తల్లీ’ అని వేడుకున్నారు...
అప్పుడు గంగమ్మ ‘వసువులారా! మీ కోసం నేను ఎనిమిది సార్లు గర్భం ధరిస్తే నాకు ఒక్క కొడుకు కూడా మిగలడా?’అన్నది.
అప్పుడు ద్యువు నీ కొడుకుగా ఉండిపోతాడు.
మేము ఏడుగురం మా తేజస్సులో 8వ భాగం ఈ ద్యువులో ఉంచుతామన్నారు, గంగమ్మ ఒప్పుకున్నది ...
పుట్టీపుట్టగానే ఏడుగురు వసువులనూ గంగలో వదిలి వేసింది.
ఎనిమిదవ వాడిని వద్దని వారించాడు శంతనుడు.
వెంటనే మన నిర్ణయం ప్రకారం నేను నిన్ను విడిచి వెళ్ళిపోతానన్నది.
‘మహారాజా నేను వెళ్తూ నీకొక నిజాన్ని చెప్పి వెళ్తాను, నేను గంగపాలు చేసిన ఏడుగురూ వసువులు.
శాపకారణాన భూమి మీద పుట్టారు, వారి తేజస్సును నీ తపఃశ్శక్తి తప్పమరేదీ భరించలేదు, అందుకే మానవకాంతగా నిన్ను పెళ్లాడాను.
ఈ ఎనిమిదవ వసువు మన కొడుకు, వీడిని మహనీయుడిగా తీర్చిదిద్ది తిరిగి నీకు అప్పగిస్తాన’ని తీసుకుని వెళ్లిపోయింది, అతని పేరు దేవవ్రతుడు.
ఆ పిల్లవాడికి వసిష్ఠుడు, పరశురాముల వద్ద శస్త్రాస్త్ర సమగ్ర విద్యలను, బృహస్పతి, శుక్రాచార్యుల వద్ద సమస్త ధర్మ నీతి శాస్త్రాలను బోధింపచేసి సర్వ విద్యా శ్రేష్ఠుడిగా పెంచింది.
ఒకనాడు శంతన మహారాజు గంగా తీరాన విహరిస్తూ ఉండగా తేజశ్శాలి, మహాప్రజ్ఞశాలి, మహాయోధ లక్షణాలు కలిగిన దేవవ్రతుని చూచి ఆశ్చర్యపోయాడు.
అప్పుడు గంగాదేవి ప్రత్యక్షమై ‘మహారాజా! మన పుత్రుడు దేవవ్రతుడ’ని అప్పగించి అంతర్ధానం అయింది.
ఆజన్మ శుద్ధమైన దైవశక్తి మహర్షులు, దేవగురువుల శస్త్రాస్త్ర సంపదతో ఎదురులేని మహావీరుడైనాడు దేవవ్రతుడు.
శంతనుడు కొడుకుకి యౌవరాజ్యాభిషేకం చేశాడు.
ఆ రోజులలో రాజులకు ఏకపత్నీ వ్రతం లేదు, శంతనుడు గంగాతీరాన దాశ రాజు పెంపుడు కూతురు సత్యవతిని వివాహామాడాలని భావించాడు, కాని దాశర్యులు అంగీకరించలేదు.
‘రాజా నీకు జ్యేష్ఠుడైన మహావీరుడైన యువకుడు కొడుకు దేవవ్రతుడున్నాడు.
అతనికే నీరాజ్యాధికారం వారసత్వం కూడా ఉత్తమ కులసంజాత అయిన నా పెంపుడు కూతురు సంతానానికే రాజ్యాధికారం అభిస్తేనే నేను అంగీకరిస్తా’నన్నాడు.
అందుకు శంతనుడు ఒప్పుకోలేదు, కాని దేవవ్రతుడు తాను ఎప్పటికీ బ్రహ్మచారిగానే ఉంటానని వివాహం చేసుకోను కనుక వారసత్వ రాజ్య సింహాసనం కోరే వారుండరనీ, జీవితమంతా కురువంశ రక్షకుడిగా, హస్తినాపుర ప్రతిష్ట ధ్యేయంగా మనుగడ సాగిస్తూ జీవితాంతం ఉండగలననీ సకల దేవతల, పంచభూతాల సాక్షిగా భీషణ ప్రతిజ్ఞ చేశాడు.
అప్పటినుండి గాంగేయుడు- దేవవ్రతుడు భీష్ముడుగా సార్ధక నామధేయుడైనాడు.
తండ్రి శంతన మహారాజు స్వచ్ఛంద మరణాన్ని తానుగా కోరుకుంటేనే మరణం వరంగా ప్రసాదించాడు.
ఆ భీష్ముడినే యుగాలు గడిచినా కురుపితామహుడిగా లోకం కీర్తిస్తున్నది.
*లోకాలకు విష్ణు సహస్రనామాలను, తిరుగులేని రాజనీతి ధర్మాలను, కాల నియమం లేని ధర్మ సూక్ష్మాలను శాశ్వతం చేసిన మహామహితాత్ముడు.
*తన తప్పిదాలకు తానే అంపశయ్యను శిక్షగా విధించుకున్న జ్ఞాని.
అందుకే ఇప్పటికీ ఆమాట తప్పని వ్యక్తిని భీష్మ ప్రతిజ్ఞ చేశాడు అంటాం.
ఎవరినైనా స్వార్థమెరుగని మనిషిగా చెప్పాలంటే నిస్వార్ధగుణంలో భీష్మా చార్యుడండీ, కురువంశానికి భీష్మాచార్యుడిలా పాటు బడ్డాడు అంటారు.
దేవతలైనా సరే మానవ, పశు, పక్షి, క్రిమికీటక రూపాలైనా సరే చేసిన కర్మ కారణంగానే జన్మలు పొందవలసి ఉంటుందనే విషయం గ్రహించమని అటువంటి మహత్ముల జ్ఞాన, శీల సంపదలను ఆదర్శంగా జీవించాలనే విషయం విస్మరించకుండా మన కర్త్యవ్యాలను, జీవితపు విలువలను చక్కదిద్దుకోమని తెలుసుకోమని మహనీయుల చరిత్రలు చెపుతాయి.
అటువంటి పుణ్య పురుషలని స్మరించడం, భీష్మ ఏకాదశి నాడు విష్ణు సహస్రనామాలను పారాయణ చేయడంద్వారా శ్రీకృష్ణ పరమాత్మకు ప్రీతిపాత్రులమవుదాం. ✍️```
. *సర్వం శ్రీకృష్ణార్పణమస్తు*
🌷🙏🌷```
🙏లోకా సమస్తా సుఖినోభవన్తు!🙏
🍀🌺🍀🌺🍀🕉️🍀🌺🍀🌺
➖▪️➖
2 weeks ago | [YT] | 6
View 0 replies
SVV Astrology channel
🍀🌺🍀🌺🍀🕉️🍀🌺🍀🌺🍀
*రథసప్తమి*
➖➖➖✍️
*రథసప్తమి రోజు జిల్లేడు ఆకును తలమీద పెట్టుకుని - స్నానం చేస్తే వచ్చే ఫలితం ఏమిటి ?*
సూర్యుడు అవతరించిన మాఘశుక్ల సప్తమి ,
సూర్య జయంతి అనీ, రథసప్తమి అనీ ప్రసిద్ధికెక్కింది.
మాఘ సప్తమినాడు సూర్యభగవానుడు రెండవసారి అవతరించాడు.
సూర్యుని మెుదటి అవతారం వివస్వంతుడు.
అదితికి, కశ్యపునికి పుత్రునిగా రెండవసారి అవతరించాడు.
ఆయనకు అదితి పుత్రుడు కనుక ఆదిత్యుడని ,
కశ్యప పుత్రుడు కనుక కాశ్యపేయుడనీ పేరు వచ్చింది.
రథసప్తమి నాడు ఆవు పేడ ద్వారా తయారైన పిడకలపై క్రొత్త కుండలో కానీ లేదా ఇత్తడి పాత్రతో కానీ, ఆవు పాలతో పాయసం వండి చిక్కుడు కాయల రథం మీద, చిక్కుడు ఆకులు వేసి దాని మీద పాయసం పెట్టి సూర్యునికి నివేదించి, ఆపై ప్రసాదాన్ని స్వీకరించినవారు సకల పాపాల నుండి విముక్తిని పొంది, ఆరోగ్యాన్ని పొందుతారు.
ఈనాడు సూర్యుడు ఏడు గుర్రాలు పొదిగిన రథం మీద పరమ పవిత్రమైన ఉత్తరాయణ పుణ్య కాలంలో పయనిస్తూ లోకాన్ని సంతోష పెడతాడు.
సూర్యుడు ఉదయిస్తున్నప్పుడే స్నానం చేయాలి.
అప్పుడే మాఘస్నాన ఫలితం వస్తుంది.
ఉదయిస్తున్న సూర్యుడికి నమస్కారం చేసి చేతిలోకి నీళ్లు తీసుకుని అర్ఘ్యం ఇవ్వాలి.
ఇది మాఘస్నానంలో చేసి తీరవలసినటువంటి నియమము.
*"సర్వ తీర్థేషు యత్పుణ్యం, సర్వ వేదేషు యత్ఫలం, సకృత్ మాఘస్నానా తత్ఫలం లభతే నరః"* అని వ్యాసులవారు చెప్పారు.
అంటే నిత్యం తీర్థయాత్రలు అన్నీ చేయటం వల్ల వచ్చే పుణ్యం మాఘమాసంలో స్నానం చేస్తే వస్తుంది.
సకల వేదములు శ్రద్ధతో వినటం వల్ల, పారాయణం చేయటం వల్ల ఇతరులకు బోధించటం వల్ల వచ్చే ఫలితం మాఘమాసం మెుత్తం స్నానం చేయటం వల్ల పొందుతారు.
స్నానం చేసాక యథాశక్తి దానం చేస్తే మంచిది.
ఈశ్వరానుగ్రహం వల్ల అనేక దోషాలనుంచి విముక్తి పొందుతారు.
శ్రీ ఆదిత్య హృదయం , శ్రీ ఆదిత్య స్తవం పారాయణం చేసుకోవాలి✍️. *సర్వం శ్రీకృష్ణార్పణమస్తు*
🌷🙏🌷```
🙏లోకా సమస్తా సుఖినోభవన్తు!🙏
🍀🌺🍀🌺🍀🕉️🍀🌺🍀🌺🍀
*రేపటి తరానికి బతుకు, భద్రతలతో పాటు భారతీయత కూడా నేర్పండి.
➖▪️➖
3 weeks ago | [YT] | 5
View 0 replies
SVV Astrology channel
https://youtu.be/4vz0om93SSs?si=QXV3P...
click this link about radha saptami on SVV Astrology YouTube channel
3 weeks ago | [YT] | 6
View 0 replies
SVV Astrology channel
🍀🌺🍀🌺🍀🕉️🍀🌺🍀🌺🍀
*భోగి,సంక్రాంతి,కనుమ*
➖➖➖
భారతీయ సంస్కృతికి దర్పణాలు, విభిన్న జాతుల సంస్కార బిందువులు మన ‘పండుగలు’.
మన గతాన్ని స్మరింపజేసి, వర్తమానాన్ని పరామర్శించుకుంటూ, భవిష్యత్తును నిర్మించుకునే ఉత్సాహ స్ఫూర్తిని,సందేశాల్ని ఇచ్చేవి దయచేసి మన ఘనమైన సంస్కృతిని భవిషత్తు తరాల వారికి అందించండి.
ప్రతి పండుగకు నిర్దేశింపబడిన సంప్రదాయాలు, వాటి అంతరార్థాలను గ్రహించి, ఆరోగ్యం, ఆహ్లాదం, ఆత్మానందాన్ని అనుభవిస్తూ, సాంఘిక, నైతిక, వైజ్ఞానిక, ఆధ్యాత్మిక ప్రయోజనాలను ప్రజా శ్రేయస్సుకు ఉపకరించాలని హితవు పలికేవి పండుగలు. ```
*భోగి పండుగ:*```
అసురేశ్వరుడైన బలిచక్రవర్తిని శ్రీమహావిష్ణువు వామన రూపంలో పాతాళానికి పంపిన పర్వదినమే భోగిపండుగ.
భోగిమంటలు మానవునిలోని, కల్మషాలను పటాపంచలు చేస్తాయని, సంకటాలు దగ్ధం అవుతాయని చెప్తారు. బలి చక్రవర్తిని వామనుడు మూడు అడుగుల స్థలం ఇవ్వమని కోరాడు. ఆ మూడు అడుగుల స్థలం ఇచ్చి, తనలోని స్థూల, సూక్ష్మ, కారణ శరీరాలను; జాగృత్, స్వప్న, సుషుప్త్యావస్థలను; సత్వ, రజ, తమో గుణములను, ఈషణత్రయాన్ని హరింపజేసుకున్నాడు. వామనుని పాదస్పర్శతో బలిచక్రవర్తి, అజ్ఞానమనే చీకటిని పోగొట్టుకొని జ్ఞాన వెలుగును దర్శించి ఉత్తరాయణమంతా స్వర్గ ద్వారములు, వైకుంఠ ద్వారములు తెరచి ఉండేటట్లుగా, ఆ సమయంలో మరణించిన వారికి ఉత్తమ గతి ప్రాప్తించేటట్లుగా శ్రీమన్నారాయణుని నుండి మానవాళి కోసం వరం అడిగి, పొందాడు. మనస్సులో మాధవుణ్ణి మనసారా నింపుకుని మానవసేవలో మాధవ సేవా పుణ్యాన్ని పొందమని చెప్తుంది మకర సంక్రాంతి - భోగి పండుగ.
పండుగలెన్ని ఉన్నా, తెలుగు జాతికి పెద్ద పండుగ - సంక్రాంతి.
కాల సంబంధమైన పండుగలు, ముఖ్యంగా మూడు. ఉగాది, సంక్రాంతి, రథసప్తమి.
‘సమ్యక్ క్రాంతి - సంక్రాంతి’. సమ్యక్ అంటే పవిత్రమైన, క్రాంతి. అనగా మార్పు.
సూర్యుడు ఉత్తరాభిముఖంగా పయనిస్తూ, ప్రకృతిలో శోభ, విలాసము, అందము ఆనందము చేకూరే ‘మార్పు’ను తీసుకొని వస్తాడు. ```
*పంచపాదం పితరం ద్వాదశాకృతిం, దివ ఆహుః పరే అర్ధే పురీషిణం, అధామే అన్య ఉపరే విచక్షణం సప్తచక్రే షడర ఆహురర్పి తమితి’* ```
అన్నది ఋగ్వేదం. కాలాన్ని ఏర్పరచి భాగవిభాగాలుగా వున్న సంవత్సరంగా కొలత ఇచ్చి, హేమంతము - శిశిరము ఒక ఋతువుగా చెపితే - అయిదు ఋతువులుగా, ఏడు చక్రాల రథముతో, ఏడు గుర్రాలుగా చెప్పబడే ఏడు రంగులతో లేక వారములోని ఏడు దినములతో పన్నెండు రూపాలు అనగా పన్నెండు నెలలుగా, అన్నిటికీ నియామకుడుగా, తండ్రిగా వ్యవహరిస్తున్నాడు - సూర్యుడని ఋగ్వేదం చెప్పింది.
అటువంటి సూర్యుని గమనాన్ననుసరించి వచ్చే పండుగ మకర సంక్రాంతి, ఉత్తరాయణ పుణ్యకాలం - మకర సంక్రమణం.
అశ్వని నుండి రేవతి వరకు ఇరువది ఏడు నక్షత్రములు. ఒక్కొక్క నక్షత్రానికి నాలుగు పాదాలు, వెరశి నూట ఎనిమిది.
మేషం నుండి మీనం వరకు పన్నెండు రాశులు. 108ని, ఒక్కొక్క రాశిలో తొమ్మిది పాదములు చొప్పున విభజించారు.``` *‘ఆదిత్యాయచ సోమాయ మంగళాయ బుధాయచ గురు శుక్ర వని భ్యశ్చరా హవే కేతవే నమః’* ```అని రవి మొదలు కేతువు వరకు తొమ్మిది గ్రహాలు. ప్రతి గ్రహం పన్నెండు రాశులలోనూ సంచరిస్తారు. చంద్రుడు ఒక రాశి నుండి మరో రాశిలో ప్రవేశించటానికి 21/4 రోజులు పడుతుంది. రవికి ఒక రాశి నుండి మరో రాశిలో ప్రవేశానికి ఒక నెల పడుతుంది. అంటే సంవత్సరంలో పన్నెండు రాశులలో సూర్యుడు చేరటాన్ని ‘సంక్రమణం’ లేక ‘సంక్రాంతి’ అంటారు.
‘సంక్రాంతి’ అంటే ‘చేరుట’ అని అర్థం. సూర్యుడు, కర్కాటక ధనూ మకర రాశులలో ప్రవేశించే సమయాలకు అనగా సంక్రాంతులకు, ఒక ప్రత్యేకత ఉన్నది. అందునా, మకర రాశిలో ప్రవేశించేటపుడు ఒక విశిష్టత ఉంది. అదే మకర సంక్రాంతి. మకర రాశి నుండి మిధున రాశి వరకు, సూర్యుడు సంచరించే కాలం - ఉత్తరాయణం, వెలుగు మార్గం.
మకర సంక్రమణం హేమంత ఋతువులో జరుగుతుంది. శోభాయమానం - హేమంత ఋతువు తట్టలో కూర్చోబెట్టిన వధువులా, గుమ్మడిపూవులో కులికే మంచు బిందువులతో, రాబోయే శిశిర భయంతో ప్రకృతి కాంత ‘జమిలి దుప్పటి కప్పుకొన్నదా’ అన్నట్లు తెలుగు నేల నాల్గు దెసల మంచు కురుస్తూ ఉండగా హేమంత ఋతువు వచ్చిందంటారు, కవి సమ్రాట్ విశ్వనాథ. వేకువ ఝామున ముగ్గుపెట్టే కన్నె, మంచుకొండ ఆడపడుచులాగా, పశువులను తోలుకొనిపోయే రైతు హిమగిరి పాలికాపులాగా, పంట కుప్పపై వేసే కొప్పు - మంచు కొండ కనక శిఖరంలాగా, తడిపాటి మట్టి గోడను, చిఱుకొమ్ములతో గోరాడు గిత్త - నందీశ్వరుడు లాగా, కనపడుట వలన నిత్యము మంచు పడుతూ ఉండటం వలన, హిమాచలము సపరివారముగా ఉత్తరము నుండి దక్షిణాపథానికి వచ్చినట్లుగా హేమంత ఋతువు ఆంధ్రదేశంలో ప్రవేశించిందని హేమంత ఋతు శోభను విశిష్టంగా వర్ణించిన కవులు ఎందరో.... ‘అగ్నేనయ సుపధారాయేఅస్మాన్’ అని అరుణ మంత్రం, ఈశావాశ్యోపనిషత్ భగవద్గీత అష్టమాధ్యాయం, ఛాందోగ్యోపనిషత్లు ఉత్తరాయణం, మకర సంక్రమణం గురించి వివరించాయి. ‘ఓ అగ్నిదేవుడా మంచి మార్గాన్ని మాకు చూపించు’ అని ప్రార్థిస్తున్నారు. జీవులు తాము చేసిన కర్మఫలాన్ని అనుభవించటానికి ప్రయాణించే రెండు రకములయిన మార్గాలను చెప్తూ, మొదటిది ‘దేవయానం’. అనగా అర్చిర్మార్గం. అంటే కాంతి లేక వెలుగు మార్గం, అంటే సక్రమ మార్గం. అదే ఉత్తరాయణం.
రెండవది -పితృయానం - కృష్ణపక్షం - చీకటి మార్గం. అక్రమ మార్గం - దక్షిణాయనం.
వెలుగు మార్గంలో పయనించిన వారు, సూర్య సాయుజ్యం పొందుతారు. సూర్య చంద్ర సంబంధిత విషయాన్ని తెలిసికొని, దర్శించిన ఉపాసకులు పరబ్రహ్మ తత్త్వంలో తాదాత్మ్యం చెందుతారు. అందుకే భీష్ముడు ఉత్తరాయణం అంటే సూర్యుడు మకర రాశిలో ప్రవేశించే వరకు వేచి ఉండి తనువు స్వచ్ఛందంగా చాలించి పరబ్రహ్మ తత్త్వంలో లీనమయినాడు.
ఇది హేమంత నవ్యకాంతితో వచ్చే మకర సంక్రాంతి
ఉత్తరాయణ పుణ్యకాల వైశిష్ట్యం. జీవన గమనంలో వచ్చే అనేక ఆటుపోట్లతో సతమతమయి మోడువారిన జీవితాలను చిగురింపజేసే అమృత క్రాంతి సంక్రాంతి.
ఎంతో ఉత్సాహాన్నిచ్చి, శేష జీవితాన్ని గడపటానికి చైతన్య శక్తినిస్తుంది - మకర సంక్రాంతి.
*మకర సంక్రాంతి:* ```
శని ప్రభావము:
మకర రాశికి శని అధిపతి. శని - వాయుతత్త్వం, వాతతత్త్వం. కనుక వాతహరములైన వంటలూ తిలా (నువ్వులు) ప్రాధాన్యమూ కనిపిస్తాయి. వాతహరములైన నువ్వులతోనూ, బెల్లముతో కూడిన పిండి వంటలు సంక్రాంతి పండుగనాడు చేస్తారు. గుమ్మడి దానమిస్తారు (మంచి గుమ్మడి) సజ్జ రొట్టెలు తింటారు. వృషభము, ఆవుదూడ - చిన్న వెండి విగ్రహాల్ని దానమిస్తారు. హేమంత ఋతువులో వచ్చే అనారోగ్యాలు, నువ్వులు బెల్లం, సజ్జలతో చేసిన పదార్థాలతో చేసిన వంటలతోను, సూర్యారాధనతోనూ, ప్రాణాయామంతోనూ నయమవుతాయి.
*సంక్రాంతి మహిమ:*```
జాబాలి మహర్షికి సునాగుడు అనే ముని, సంక్రాంతి మహిమను చెప్పాడు. సంక్రాంతినాడు శివునికి ఘృతాభిషేకం చేసి నువ్వు పువ్వులతో, మారేడు దళాలతో పూజచేసి, షోడశోపచారములర్పించాలి. రాత్రంతా పరమేశ్వర ధ్యానంలో భజనానందంతో జాగరణ చెయ్యాలి. ప్రాతఃకాలంలో స్నానం చేయాలి. మకర సంక్రాంతి నాడు యశోదా కృష్ణ ప్రతిమలకు పూజచేసి, పెరుగు పోసిన పాత్ర, కవ్వం మొదలయిన వాటితో ఆ ప్రతిమలను సత్పాత్రునికి దానం చేస్తే, ధనధాన్యాది సంపదలు, పరమేశ్వరానుగ్రహం కలుగుతాయని చెప్పాడు. కృపాచార్యుని సోదరి కృపి ద్రోణాచార్యుని భార్య తన దారిద్య్ర బాధ చెప్పి దుర్వాసుని కోరితే ఆయన ఈ వ్రతం చెప్పాడు. ఆ ప్రకారం ఆమె చేసినందుకు ఆమెకు అశ్వత్థామ కలిగి, దారిద్య్ర బాధ తొలగిందని సునాగముని చెప్పాడు. ఇదీ సంక్రాంతి మహిమ. ```
*మకర సంక్రమణం:*```
గజేంద్ర మోక్షం జ్యోతిష శాస్త్ర అన్వయం:```
మకర మొకటి రవి జొచ్చెను, మకరము మఱియొకటి ధనుసు మాటున దాగెన్, మకరాలయమున దిరిగెడు మకరంబులు కూర్మరాజు మఱువున కరిగెన్ - ```
భాగవతము మకర రాశిలో రవి ప్రవేశాన్ని గురించి అనగా ‘మకర సంక్రాంతి’ని గూర్చి వివరిస్తూ పరమ భాగవతోత్తముడైన పోతన, భాగవతంలో వ్రాసిన పద్యమిది.
‘ఉషాత్రయం, శ్రవణం, ధనిష్ఠార్థం మకరం’ అనగా, ఉత్తరాషాఢ మూడు పాదములు, శ్రవణం నాలుగు పాదములు, ధనిష్ఠ - ఒకటి రెండు పాదములు. వెరశి తొమ్మిది పాదములు - మకరరాశి. మకర మొకటి ధనువు మాటున దాగినదనగా - ఉత్తరాషాఢ నక్షత్రంలో మొదటి పాదం, ధనుర్రాశికి చెందింది. మూలా నక్షత్రం - పృథ్వీ తత్త్వంతో కూడినది. కూర్మరాజు (తాబేలు) పృథ్వి (భూమి)కి సంకేతం. కావున ధనుర్రాశిలోని నక్షత్రాన్ని మకర రాశిలోని నక్షత్రాల్ని వివరిస్తూ రవి మకర రాశిలో ప్రవేశించినపుడు వచ్చే మకర సంక్రాంతిని గురించి మహాకవి పోతన భాగవతంలోని ‘గజేంద్ర మోక్ష’ ఘట్టంలో చక్కగా వివరించాడు.
పితృతర్పణాలు మానవులకు కాలమానమైన ఒక మాసం, పితృదేవతలకు ఒకరోజు. అంటే శుక్ల పక్షం పగలు, కృష్ణపక్షం రాత్రి. అలాగే మానవ సంవత్సరం దేవతలకు - ఒకరోజు. అనగా మకర రాశిలో సూర్యుడు ప్రవేశించినప్పటి నుండి వచ్చిన ఉత్తరాయణం, ఆరునెలలూ దేవతలకు పగలు, దక్షిణాయనం - రాత్రి. దేవతలకు పగటికాలం ప్రారంభమైన ఉత్తరాయణంలో మంచి కార్యాలు, యజ్ఞయాగాదులు, క్రతువులు చేసి, దేవతల అనుగ్రహాన్ని పొంది, పుణ్యప్రాప్తితో పురుషార్థాల్ని పొందమని సూచిస్తుంది - మకర సంక్రాంతి. ఆ విధంగానే పితృదేవతలకు మకర సంక్రమణం రోజున తర్పణాలు అర్పిస్తే, వారికి ఉత్తమ లోక ప్రాప్తి లభిస్తుందని చెప్తారు. మకర సంక్రాంతి స్వామి అయ్యప్ప జయంతి హరిహరాంశగా అవతరించి స్వామియే శరణమయ్యప్పా స్వామి శరణం అయ్యప్ప శరణం అంటూ శబరిమలకు వచ్చే భక్తుల శరణు ఘోషతో శబరిమల మారుమ్రోగుతుంది. దాన్ని ఆలకించి కటాక్షించే స్వామి అయ్యప్ప జయంతి - మకర సంక్రాంతి రోజే. పందల రాజుకిచ్చిన వాగ్దానం మేరకు ప్రతి సంవత్సరం మకర సంక్రాంతికి స్వామి జ్యోతి స్వరూపుడై దర్శనమిచ్చి భక్తులకు జ్ఞానోదయాన్ని కల్గిస్తాడు. ‘పరమాత్ముడు వెలిగే ముచ్చట బాగ తెలిసి కోరే’ అన్నాడు వాగధీశ్వరీ రాగంలో త్యాగరాజస్వామి, ‘అంతర్బహిశ్చ తత్సర్వం వ్యాప్త నారాయణ స్థ్సితః’ అన్నది శృతి. ఇది మకర సంక్రాంతి విశేషం.
భోగి పండుగ సంక్రాంతి పండుగను ముచ్చటగా మూడు రోజులు జరుపుకుంటారు. భోగి, సంక్రాంతి, కనుమ అంటారు. సంక్రాంతి ముందు రోజు వచ్చేది భోగి పండుగ. తెల్లవారక మునుపే లేచి ఇంటి ముందు భాగంలో భోగిమంటలు వేస్తారు. అనగా ఇంటిలోని పాత వస్తువులు, పనికిరాని వస్తువులు ఆ మంటల్లో వేస్తారు. మంటల చుట్టూ పిల్లలూ, పెద్దలూ కూర్చుని చలి కాచుకుంటారు. మనలోని దుష్ట భావనల్ని, దుర్గుణాల్ని జ్ఞానమనే మంటలో వేసి దహించటమే దీని అంతరార్థం. చిన్నపిల్లల్ని చక్కగా అలంకరించి, ముస్తాబు చేసి వరుసగా కూర్చోబెట్టి వారి తల మీద రేగిపండ్లు, బంతిపూలు, శనగలు, వయోవృద్ధులు ముతె్తైదువులు పోస్తారు. పెద్దలు చిన్నారులను ఆశీర్వదించటం, దృష్టి దోష నివారణ దీనిలోని ఆంతర్యం అని చెప్తూ, రేగిపండ్లలో సౌర తేజస్సు ఉంటుంది. సూర్యుడు ప్రాణ శక్తి ప్రదాత. కనుక, సూర్యతేజస్సు బ్రహ్మరంధ్రం గుండా పిల్లలకు అందివ్వబడుతుందన్నది, దీని వెనుక దాగిన వైజ్ఞానిక ఆధ్యాత్మిక రహస్యంగా చెప్తారు.
గోదా కల్యాణం రవి, ధనుర్రాశిలో ప్రవేశించిన రోజు నుంచి ధనుర్మాస వ్రతం ఆచరించి, శ్రీరంగనాథుని వివాహమాడింది గోదాదేవి. శ్రీవిల్లి పుత్తూరులో ముకుందార్యుడనే శ్రీవైష్ణువుడు, ఆయన భార్య పద్మావతి విష్ణు భక్తులు. పూల మాలలు, తులసి మాలలు కట్టి పరమాత్మకు సమర్పించుచూ, సత్కాలక్షేపం చేస్తూ ఉండేవాడు. సంతానం లేని విష్ణుచిత్తునికి (ముకుందార్యుడు) తులసి వనంలో పాదులు చేస్తుండగా లభించిన పసిపాపకు ‘కోదై’ అని నామకరణం చేశాడు. ఆమే గోదాదేవి. శ్రీరంగనాథునికి అనగా కృష్ణునికి సమర్పించే పూలదండలను, తను ముందుగా ధరించిన తరువాత స్వామికి సమర్పించిన గోదాదేవిని ‘ఆ ముక్తమాల్యద’ అన్నారు. విష్ణుచిత్తుడే పెరియాళ్వారు. రోజుకొక పాశురముతో శ్రీకృష్ణుని (శ్రీరంగనాథుని) ధనుర్మాసంలో 30 రోజులు అర్చించగా, రంగనాథుడామెకు స్వప్నంలో కనిపించి, ఆమె హృదయ పరిపక్వతకు సంతసించి, తపోనియమాలను వీడి సర్వభోగాలను అనుగ్రహించాడు. ఆ దేవదేవుని ఆజ్ఞానుసారం శ్రీరంగ క్షేత్రంలో భోగిపండుగ రోజున వైభవంగా కల్యాణం జరిగింది. గోదాదేవి (ఆండాళ్ తల్లి) యోగనిద్రాముద్రితుడైన శ్రీరంగనాథునిలో ఐక్యమయింది. ఇది భోగి పండుగ విశేషం.
. *సర్వం శ్రీకృష్ణార్పణమస్తు*
🌷🙏🌷```
🙏లోకా సమస్తా సుఖినోభవన్తు!🙏
1 month ago | [YT] | 3
View 0 replies
SVV Astrology channel
https://youtu.be/Kq8KVTjL9pQ
2 months ago | [YT] | 0
View 0 replies
SVV Astrology channel
https://youtu.be/uPdifxAYpnA
2 months ago | [YT] | 0
View 0 replies
SVV Astrology channel
https://youtu.be/uPdifxAYpnA
#శివలింగానికి అభిషేకం చేస్తే ఏం జరుగుతుంది
#అసలు లింగనికే ఎందుకు అభిషేకం
# అభిషేకం చెయ్యటం వ్యర్థమా?
# అభిషేకం చేయటం ద్వారా శాస్త్రం ఏం రహస్యం దాచింది
3 months ago | [YT] | 4
View 0 replies
SVV Astrology channel
https://youtu.be/fMaAcbCyI90
కార్తీక మాసంలో లో మహా పాపాలు చేయకూడని తెలుసుకోవడం తప్పని సారి అలాగే ఏ తిధి లో ఏ దానం చేస్తే మంచిది అని చెప్పారు శాస్త్రం లో అది కూడా వస్తుంది ఈ రోజు చుడండి మీ svv Astrology YouTube channel
3 months ago | [YT] | 2
View 0 replies
SVV Astrology channel
SVV Astrology Group and family to all well-wishers,supernatural దీవాలి to all
3 months ago | [YT] | 4
View 0 replies
Load more