Hi Friends
NOTE: మన Model Ideas YouTube Channel ను Subscribe చేసుకున్న
వారు అడిగే ప్రశ్నలను చదువుతూ
Next వీడియోలో Answer Explain చేయడం జరుగుతుంది.

This is Rajendhar Bondla, IMPACT Foundation Trainer, Soft Skills Trainer, Personality Development and Motivational Speaker.
This "Model Ideas YouTube Channel", is to guide you Government Jobs, Degree, PG, Professional Courses & "Career Guidance", to my Subscribers. It helps you in reaching your targeted Goals.
Please contact/text mail me for
1) Promotion of Your Business
2) Promotion of Your APPS
3) Promotion of Your Institutes
4) Promotion of Your Websites/YouTube Channels
Please follow me on:
Website: englishgururaj.com/
Instagram: www.instagram.com/modelideasy...
Telegram Link: t.me/rajo15
e-mail: rajavalmiki18@gmail.com
YouTube: model Ideas
Face Book: www.facebook.com/profile.php?...
Face Book Page: www.facebook.com/Model-Ideas-...
Twitter:https: twitter.com/BondlaRajendhar


Model Ideas

*🔊చివరి ఏడాది విద్యార్థులకూ ప్రధానమంత్రి ఇంటర్న్షిప్*

*🔷ఎంపికైతే నెలకు రూ.9వేలు*

*🍥గ్రాడ్యుయేషన్, పోస్ట్ గ్రాడ్యుయేషన్ చివరి సంవత్సరం చదువుతున్న విద్యార్థులూ ప్రధానమంత్రి ఇంటర్న్షిప్ స్కీమ్(పీఎంఐఎస్)లో పాల్గొనవచ్చని కేంద్రం తెలిపింది. ఈ మేరకు అర్హత నిబంధనలు సడ లిస్తూ కార్పొరేట్ వ్యవహారాల మంత్రిత్వ శాఖ బుధ వారం ప్రకటన విడుదల చేసింది. దీని ప్రకారం.. 18-25 ఏళ్ల వయసున్న చివరి సంవత్సరం విద్యార్థులు పీఎం ఐఎస్ పోర్టల్ ద్వారా అగ్రశ్రేణి సంస్థల్లో పెయిడ్ ఇంట ర్షిప్ కోసం దరఖాస్తు చేసుకోవచ్చు. ఎంపికైనవారికి నెలకు కనీసం రూ.9వేల ఆర్థిక సాయం అందిస్తారు. దరఖాస్తు చేసుకొనేవారు తమ విద్యా సంస్థల నుంచి నిరభ్యంతర పత్రాన్ని సమర్పించాల్సి ఉంటుంది.*

2 weeks ago | [YT] | 3

Model Ideas

*తెలంగాణ మోడల్ స్కూల్ ప్రవేశ పరీక్ష హాల్ టికెట్లు విడుదల డైరెక్ట్ లింక్....*
👇👇👇👇👇

telanganams.cgg.gov.in/TGMSWEB20/#/

4 weeks ago | [YT] | 3

Model Ideas

*🔊డిగ్రీలో మళ్లీ సీట్ల కోత!.. 2 లక్షల వరకు తగ్గే అవకాశం*

*🔶రాష్ట్రంలో మొత్తం 4.4లక్షల సీట్లు*

*🔷సగం సీట్లు కూడా నిండని పరిస్థితి*

*🔶మూడో వారంలో దోస్త్‌ నోటిఫికేషన్‌*

*🔷సీట్లు తగ్గించిన తర్వాతే విడుదల*

*🍥రాష్ట్రంలో డిగ్రీ సీట్లకు మళ్లీ కోత పడబోతున్నది. ఒక్క ఫస్టియర్‌లోనే దాదాపు 2 లక్షల సీట్లు తగ్గనున్నాయి. అంటే సగం సీట్లు కోల్పోవాల్సి వస్తుంది. రాష్ట్రంలో 965 డిగ్రీ కాలేజీలు, 4,40,107 సీట్లు ఉన్నాయి. ఈ విద్యా సంవత్సరంలో 2,05,140 సీట్లు(46శాతం) సీట్లు మాత్రమే భర్తీ అయ్యాయి. ఏకంగా 2,34,967 సీట్లు ఖాళీగా ఉన్నాయి. అంటే సగం సీట్లు కూడా నిండని పరిస్థితి. ఈ నెల 14లోపు ఇంటర్‌ ఫలితాలు విడుదలకానున్నాయి. మూడో వారంలో డిగ్రీ ఆన్‌లైన్‌ సర్వీసెస్‌ తెలంగాణ (దోస్త్‌) నోటిఫికేషన్‌ విడుదల కానున్నది. భర్తీకాని సీట్లను తగ్గించిన తర్వాతే దోస్త్‌ నోటిఫికేషన్‌ విడుదల చేయాలన్న ఆలోచనలో అధికారులు ఉన్నారు. సోమవారం దోస్త్‌పై కీలక సమావేశం జరిగింది.*

*🌀ఉన్నత విద్యామండలి చైర్మన్‌ ప్రొఫెసర్‌ బాలకిష్టారెడ్డి, కళాశాల విద్యాశాఖ కమిషనర్‌ శ్రీదేవసేన, ఇతర ఉన్నతాధికారులు పాల్గొన్నారు. ముఖ్యంగా కొత్త కోర్సులను ప్రవేశపెట్టడం, భర్తీకాని సీట్లను తగ్గించే అంశంపైనే చర్చ జరిగింది. అయితే, ఈ ఏడాది కొత్త కోర్సులను ప్రవేశపెట్టేందుకు 160 కాలేజీలు ఆసక్తి చూపించాయి. వీటికి అదనపు సీట్లు ఇవ్వకూడదని నిర్ణయించారు. ఇప్పటికే ఉన్న సీట్లను రద్దుచేసుకుంటేనే కొత్త సీట్లు ఇవ్వాలన్న నిర్ణయానికి వచ్చారు. ఇక జీరో అడ్మిషన్‌ కాలేజీలు, 15 మంది/15 శాతం అంతకంటే తక్కువ సీట్లు నిండిన కాలేజీలను కూడా పక్కనబెట్టాలన్న ఆలోచన చేస్తున్నారు.*

*💥64 జీరో అడ్మిషన్‌ కాలేజీలు*

*💠ఉమ్మడి రాష్ట్రంలో డిగ్రీ కాలేజీలకు ఇబ్బడిముబ్బడిగా అనుమతులిచ్చారు. ఇంటర్‌ సెకండియర్‌లో ఏటా 3.3 లక్షల మంది మాత్రమే ఉత్తీర్ణులవుతున్నారు. కానీ, డిగ్రీ ఫస్టియర్‌లో4.4లక్షల సీట్లకు అనుమతిచ్చారు. ఇంజినీరింగ్‌, ఫార్మసీలో చేరినవారు మినహా ఏటా రెండు లక్షల మంది మాత్రమే డిగ్రీలో చేరుతున్నారు. ఇదిలా ఉంటే, రాష్ట్రంలో జీరో అడ్మిషన్‌ కాలేజీల సంఖ్య రోజురోజుకూ పెరుగుతున్నది. 2025-26 విద్యాసంవత్సరంలో 64 డిగ్రీ కాలేజీల్లో ఒక్కరు కూడా చేరలేదు. వీటిలో 63 ప్రైవేట్‌, ఒక ప్రభుత్వ డిగ్రీ కాలేజీ ఉన్నది. యూనివర్సిటీల వారీగా తీసుకుంటే అత్యధికంగా కాకతీయ పరిధిలో 22, ఎంజీయూ పరిధిలో 14, ఉస్మానియా 13, పాలమూరు 5,శాతవాహన 2 ఉన్నాయి.*

*💥రూరల్‌ కాలేజీల్లో చేరట్లే..*

*🥏డిగ్రీ కోర్సుల్లో చేరే విద్యార్థుల ఆలోచనలు మారుతున్నాయి. రూరల్‌ కాలేజీల్లో చేరడం లేదు. ముఖ్యంగా అర్బన్‌, గ్రేటర్‌లోని కాలేజీల్లోనే చేరుతున్నారు. విద్యార్థులు ఎక్కువగా హైదరాబాద్‌ సహా పెద్ద నగరాల్లో చదివేందుకు ఇష్టపడుతున్నారు. పట్టణాల్లో చదివితే ఉన్నతస్థానాలు చేరవచ్చనే ఆలోచనతో విద్యార్థులు గ్రేటర్‌కు క్యూ కడుతున్నారు. జీరో అడ్మిషన్‌, సీట్లు నిండని కాలేజీలను పరిశీలిస్తే దాదాపు అన్ని గ్రామీణ, సెమీ అర్బన్‌ ప్రాంతాల్లోనే ఉన్నాయి. ఫలితంగా మండల, నియోజకవర ్గకేంద్రాల్లోని డిగ్రీ కాలేజీల్లో అడ్మిషన్ల సంఖ్య తగ్గుతున్నది.*

1 month ago | [YT] | 1

Model Ideas

*🔊విద్యాశాఖలో కొలువుల భర్తీ*

*🔶విద్యా రంగంలోనే మొత్తం 12,746 నియామకాలు*

*🍥రాష్ట్రంలో విద్యావ్యవస్థను సమూలంగా ప్రక్షాళన చేస్తూ, నాణ్యమైన* *బోధనను అందించడమే లక్ష్యంగా ప్రభుత్వం* *అడుగులు వేస్తోందని, ప్రభుత్వ నియామకాల్లో శాంతి భద్రతలకు ఇచ్చే ప్రాధాన్యం తర్వాత, అత్యధిక ప్రాధాన్యతను విద్యారంగానికే కేటాయించినట్లు తెలంగాణ సామాజిక ఆర్థిక సర్వే*
*2026 నివేదిక వెల్లడించింది. ప్రభుత్వం ఏర్పడినప్పటి నుంచి ఇప్పటి వరకు మొత్తం 67,763 పోస్టులను వివిధ శాఖల్లో భర్తీ* *చేశారు.ఇందులో హోం శాఖ 15,714*
*పోస్టులతో మొదటి స్థానంలో ఉండగా, సెకండరీ ఎడ్యుకేషన్ (10,272 పోస్టుల*
*భర్తీతో రెండో స్థానాన్ని దక్కించుకుంది. దీనికి అదనంగా హయ్యర్ ఎడ్యుకేషన్ లో*
*భర్తీ చేసిన 2,474 పోస్టులను కలిపితే, ఒక్క విద్యా రంగంలోనే మొత్తం 12,746*
*నియామకాలు జరిగినట్లు సోషియో ఎకానమిక్ 2026 వెల్లడించింది. సాధార*
*ణంగా ఎక్కువ మంది సిబ్బంది అవసరమయ్యే వైద్య, రెవెన్యూ విభాగాల కంటే*
*విద్యాశాఖలోనే ప్రభుత్వం ఎక్కువ ఖాళీలను భర్తీ చేసింది. మొత్తం విద్యాశాఖలో*
*12,746 ఖాళీలను భర్తీ చేయగా, వైద్య ఆరోగ్య శాఖలో 9,023 పోస్టులు, రెవెన్యూ*
*శాఖ 8,079 పోస్టులు భర్తీ చేసినట్లు నివేదిక వెల్లడించింది. ఏళ్ల తరబడి పెండింగ్ లో*
*ఉన్న ఉపాధ్యాయ నియామకాలను ప్రభుత్వం ప్రాధాన్యత క్రమంలో భర్తీ చేయ*
*డంతో, ప్రభుత్వ పాఠశాలల్లో నాణ్యమైన విద్య అందుబాటులోకి తీసుకురావడమే*
*లక్ష్యంగా ఇతర శాఖల కంటే ఎక్కువగా ఈ పోస్టులని భర్తీ చేసినట్లు నివేదిక పేర్కొంది.* *ఉపాధ్యాయుల కొరతను అధిగమించడం ద్వారా అట్టడుగు స్థాయి నుంచి*
*విద్యా ప్రమాణాలను మెరుగుపరచవచ్చని ప్రభుత్వం భావిస్తోందని వెల్లడించింది.*
*మొత్తం 27 విభాగాల్లోని 67,763 పోస్టుల భర్తీ పారదర్శకంగా జరిగిందని సోషియో*
*ఎకానమిక్ వెల్లడించింది.*

1 month ago | [YT] | 2

Model Ideas

*🔊ఫలితాలు ప్రకటించకుండానే ఫీజుల స్వీకరణ*


*🔶ప్రతిష్టాత్మక ఉస్మానియా యూనివర్సిటీ నిర్వాకం*

*🔷గందరగోళంలో డిగ్రీ బ్యాక్‌లాగ్‌ విద్యార్థులు*

*🍥ఫలితాలు విడుదల చేయాలి. రీ వెరిఫికేషన్‌.. రీ కౌంటింగ్‌కు అవకాశమివ్వాలి. ఆ తర్వాత ఫెయిలైన వారి నుంచి పరీక్ష ఫీజు స్వీకరించాలి. ఇది సాధారణం గా జరిగే పరీక్షల ప్రక్రియ. కానీ ఇవేవీ లే కుండా.. అసలు ఫలితాలే విడుదల చేయకుండానే ఉస్మానియా యూనివర్సిటీ విద్యార్థుల నుంచి ఫీజులు స్వీకరిస్తున్నది. విద్యార్థుల జేబులకు చిల్లులు పెడుతున్న ది. వందేండ్ల చరిత్ర గల ఈ వర్సిటీ చర్య లు విస్తుగొలుపుతున్నాయి. వర్సిటీ పరిధిలో డిగ్రీ కోర్సుల్లో 2021-22, 2022-23 బ్యాచ్‌ల్లో కొందరు బ్యాక్‌లాగ్‌ విద్యార్థులున్నారు. వీరు ఫెయిలైన సబ్జెక్టులకు 2025 నవంబర్‌లో పరీక్షలు రాశారు. అయితే ఆయా పరీక్షల ఫలితాలు వర్సిటీ అధికారులు ఇంకా విడుదల చేయలేదు. కానీ ఈ పరీక్షల్లో ఫెయిలైనవారు ఈనెల 16లోపు కాలేజీల్లో ఫీజు చెల్లిస్తే.. కాలేజీ యాజమాన్యాలు ఈ నెల 17 లోపు ఫీజు చెల్లించాలని గడువు విధించారు.*

*🌀గడువు ముగిసిన తర్వాత రూ. 500 జరిమానాతో ఫీజు చెల్లించాలని సూచించారు. అయితే ఫలితాలు విడుదల కాకపోవడంతో విద్యార్థులు ఏ సబ్జెక్టులకు ఫీజు కట్టాలన్న గందరగోళంలో ఉన్నారు. ఫీజు కట్టిన తర్వాత ఆయా సబ్జెక్టులు పాసైతే ఫీజులు వాపసు చేస్తారా..? అంటూ విద్యార్థులు ప్రశ్నిస్తున్నారు. ఫలితాలు విడుదల చేయకుండానే ఫీజుల స్వీకరణ షెడ్యూల్‌ను ఎలా విడుదల చేస్తున్నారని ప్రశ్నిస్తున్నారు. ఓ విద్యార్థిని బుధవారం బాగ్‌లింగంపల్లిలోని బీఆర్‌ అంబేద్కర్‌ కాలేజీకి ఫీజు చెల్లించేందుకు వెళ్లగా ఫలితాలు ఇంకా రాలేదని.. అయినా ఫీజు కట్టాలని కాలేజీ అధికారులు సూచించారు. దీంతో ఆ విద్యార్థిని ఫీజు చెల్లించకుండానే వెనుదిరిగింది. ఇదే విషయంపై ఓయూ పరీక్షల విభాగం కంట్రోలర్‌ డాక్టర్‌ శశికాంత్‌ స్పందిస్తూ.. గడువులోగా ఫలితాలు విడుదల చేసేందుకు ప్రయత్నిస్తున్నామని తెలిపారు. ఒకటి రెండు రోజులు ఫీజు చెల్లింపు గడువు పొడిగిస్తామని పేర్కొన్నారు.*

1 month ago | [YT] | 5