786 NEWS CHANNEL MEDIA HD®️ UR VOICE OUR REPORT 🎤

OFFICIAL YOUTUBE CHANNEL 7️⃣8️⃣6️⃣ MEDIA, SOCIAL SERVICE, HUMAN RIGHTS, ANTI CRIME. 24/7 LIVE WORLD WIDE REPORTS INTERVIEWS EXCLUSIVE NEWS ENTERTAINMENT CURRENT LEGAL ADVICE CRIME AFFAIRS CIVIL MATTERS UPDATES OFFICIAL YOUTUBE CHANNEL 786 NEWS CHANNEL MEDIA HD ✅️
#786NEWS NO 1 DIGITAL MEDIA NETWORK UR VOICE OUR REPORT
WANTED REPORTER'S.CALL
+91 7674963786 📞
#ANDHRAPRADESH , TELANGANA WORLD WIDE "POLITICAL DEBATES,786 CHANNEL CHAIRMAN 786 Fayaz Bhai. #ANTICRIMEBEURE
#Latest News"
#Live Report's
#Current Affairs"
#Breaking News"
#Latest News"
#Crime"
#civilmatters
#crimealerts
#Trending Video's"
#Political"
#Exclusive Interviews"
#Special Story's"
#Business"
#Cricket"
#Bollywood
#Tollywood"
#Entertainment"
#Education"
#Sports"
#Business Updates"
#Weather Updates"
#and a Lot of More Videos watch on free #786media
SUBSCRIBE LIKE SHARE, 786 SEVA SAMSATH
FOR SUPPORT. Our Gpay/Phone Pe Number is : 7674963786 / Our UPI ID is 7674963786@kotak
For Advertisement Call: 7674963786




786 NEWS CHANNEL MEDIA HD®️ UR VOICE OUR REPORT 🎤

NEW CAMERA #panasoniclumix #HUMANRIGHTS.... 786 FAYAZ BHAI SOCIAL ACTIVIST SENIOR SOCIAL WORKER INTERNATIONAL HUMAN RIGHTS PROTECTION COMMISSION NELLORE DISTRICT MEDIA CELL INCHARGE NCR ACB 786 media no 1 news channel millions of peoples watching subscribe like share follow on Facebook YouTube what's app Instagram upcoming satellite channel Link youtube.com/@786newschannelmedia?si=_iqeV2ZbSk8yWz… our team working for better society social service social activist any ads cal 7674963786

1 day ago | [YT] | 9

786 NEWS CHANNEL MEDIA HD®️ UR VOICE OUR REPORT 🎤

ఓ హత్య కేసులో అరెస్ట్ అయి.. బెయిల్‌పై విడుదలైన వై.యస్.ఆర్ కాంగ్రెస్ పార్టీ పల్నాడు జిల్లా అధ్యక్షులు పిన్నెల్లి రామకృష్ణారెడ్డిని హైదరాబాద్ లోని వారి నివాసం నందు మర్యాదపూర్వకంగా కలిసిన వై.యస్.ఆర్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి శ్యామల ...#ysrcpsocialmedia #ysr #ysrcp #AndhraPradesh #newsupdates #appolitics
#PinnelliRamakrishnaReddy
#PalnaduDistrictYsrcpPresident

4 days ago | [YT] | 9

786 NEWS CHANNEL MEDIA HD®️ UR VOICE OUR REPORT 🎤

ప్రేమ మైకంలో ఓ కూతురు చేసిన పాపం ఆమె జీవితాన్ని వెంటాడింది . ప్రియుడిని పెళ్లి చేసుకునేందుకు పోలీసు అధికారిగా ఉన్న తండ్రికి పాలలో విషమిచ్చి చంపేసింది. కూతురు కూడా పోలీస్ అధికారే. ఆమె ప్రియుడు కూడా పోలీస్.. మహారాష్ట్ర చంద్రాపూర్ లో పోలీస్ అధికారి జయంత్ బల్లావర్ నిజాయితీ గల అధికారిగా పేరు తెచ్చుకున్నాడు. ఆయన కూతురు ఆర్య కూడా పోలీసు అధికారే. ఆమె ఆశిష్ అనే పోలీస్ ను ప్రేమించింది . పెళ్లి చేసుకుంటానని చెప్పడంతో తండ్రి అతని గురించి విచారించి వద్దని చెప్పాడు. కానీ వినకుండా తనని పెళ్లి చేసుకుంటానని పట్టు పట్టింది. దీంతో తండ్రి ఆమెను కట్టడి చేసి పెళ్లి చేసుకునేందుకు వీలు లేదని కచ్చితంగా చెప్పాడు. చివరకు తండ్రిని చంపాలని పథకం వేసింది . ప్రియుడుకి చెప్పి స్లో పాయిజన్ తెప్పించింది. తండ్రి డ్యూటీకి పోయేముందు మిల్క్ షేక్ ఇచ్చింది . దానిలో పాయిజన్ కలిపింది. అతడు పోలీస్ కార్యాలయం చేరుకున్న తర్వాత మైకం వచ్చి పడిపోయి అక్కడే చనిపోయాడు. దీంతో పోలీసు అధికారులు దాన్ని గుండె జబ్బుగా భావించి పోస్ట్ మార్టం చేయించ కుండా శవాన్ని ఇంటికి పంపేసి యధా ప్రకారం అంత్య క్రియలు చేశారు . ఆర్య తను ప్రేమించిన ఆశిష్ ను పెళ్లి చేసుకుంది. ఆ తర్వాత భార్య భర్తలు ఇద్దరు మధ్య గొడవ జరిగింది. దీంతో ఆర్య పుట్టింటికి వచ్చేసింది . ఆశిష్ తాగుబోతు ప్రవర్తన సహించలేక అతనిని కూడా పోలీస్ అధికారులు సస్పెండ్ చేశారు. దీంతో ఉన్మాదిగా మారిన ఆశిష్ పోలీస్ కార్యాలయానికి వెళ్లి ఆర్య , తన కోసం తండ్రిని చంపిన కుట్ర చెప్పేశాడు. పోలీస్ అధికారులు లోతుగా విచారణ చేసి ఆర్యతో సహా మరో ముగ్గురిని అరెస్ట్ చేసి జైలుకు పంపారు...

4 days ago | [YT] | 4

786 NEWS CHANNEL MEDIA HD®️ UR VOICE OUR REPORT 🎤

BREAKING NEWS LIVE #786MEDIA UR VOICE OUR REPORTS బైక్ నడుపుతూ కాలువలోకి దూసుకెళ్లిన యువతి

యువతితో పాటు బైక్‌పై కూర్చున్న యువకుడు కూడా కాలువలో గల్లంతు

జగిత్యాల జిల్లా మెట్‌పల్లి మండలం పెద్దాపూర్ కాలువలో ఘటన

మూల మలుపు వద్ద అదుపుతప్పి బైక్‌తో సహా కెనాల్‌లో పడి గల్లంతు

గమనించి బైక్‌ను బయటకు తీసిన స్థానికులు

దొరకని యువతి, యువకుడి ఆచూకీ.. పోలీసుల గాలింపు చర్యలు

4 days ago | [YT] | 10

786 NEWS CHANNEL MEDIA HD®️ UR VOICE OUR REPORT 🎤

BREAKING NEWS LIVE #786MEDIA UR VOICE OUR REPORTS చెన్నై:

టీవీకే పార్టీ అభ్యర్థులను ప్రకటించిన విజయ్..

234 అసెంబ్లీ స్థానాలకు అభ్యర్థులను ప్రకటించిన విజయ్..

రెండు స్థానాల్లో పోటీ చేస్తున్నట్లు ప్రకటించిన విజయ్..

పెరంబూర్, తిరుచ్చి ఈస్ట్ నియోజకవర్గాల నుంచి పోటీ చేస్తున్న విజయ్...

4 days ago | [YT] | 8

786 NEWS CHANNEL MEDIA HD®️ UR VOICE OUR REPORT 🎤

BREAKING NEWS LIVE #786MEDIA UR VOICE OUR REPORTS *విద్యార్థినిగా మారి ఆకతాయిలకు చెక్ పెట్టిన మహిళా ఎస్సై*

*విద్యార్థినుల భద్రత కోసం వినూత్న చర్యలు…*

*పోలీసులపై ప్రజల్లో పెరిగిన నమ్మకం*

భూపాలపల్లి:
జయశంకర్ భూపాలపల్లి జిల్లాలో విద్యార్థినుల భద్రత కోసం పోలీసులు తీసుకున్న వినూత్న చర్య ప్రజల్లో విశేషంగా చర్చనీయాంశమైంది. టేకుమట్ల మహిళా ఎస్సై అమూల్య, విద్యార్థిని వేషధారణలో పరీక్షా కేంద్రం వద్ద ప్రత్యక్షమై ఆకతాయిల ఆటకు చెక్ పెట్టారు.

పరీక్షా కేంద్రాల వద్ద విద్యార్థినులను వేధిస్తున్నారనే సమాచారం అందుకున్న వెంటనే, పరిస్థితిని స్వయంగా తెలుసుకుని చర్యలు తీసుకోవాలని ఆమె నిర్ణయించారు. ఖాకీ యూనిఫాం వదిలి, సాధారణ విద్యార్థినిలా ఎరుపు రంగు డ్రెస్సులో చేతిలో పుస్తకాలు పట్టుకుని పరీక్షా కేంద్రానికి వెళ్లారు.

విద్యార్థినుల భద్రతపై ప్రత్యేక దృష్టి సారించిన పోలీసులు, పరీక్షా కేంద్రాల వద్ద పర్యవేక్షణను మరింత కట్టుదిట్టం చేశారు. ఈ చర్యతో అక్కడి పరిసరాల్లో శాంతి నెలకొనడంతో పాటు, విద్యార్థినులు ధైర్యంగా పరీక్షలకు హాజరయ్యే పరిస్థితి ఏర్పడింది.

మహిళల భద్రతకు పోలీసులు ఎంత ప్రాధాన్యత ఇస్తున్నారో ఈ ఘటన మరోసారి స్పష్టం చేసింది. అవసరమైతే ఎలాంటి పరిస్థితుల్లోనైనా ప్రజల రక్షణ కోసం పోలీసులు ముందుండి పనిచేస్తారని మహిళా ఎస్సై అమూల్య చర్య ద్వారా స్పష్టమైంది.

స్థానికులు ఆమె ధైర్యాన్ని, సమయస్ఫూర్తిని అభినందిస్తూ, ఇటువంటి చర్యలు సమాజంలో భద్రతను పెంపొందించడంలో కీలకంగా ఉంటాయని పేర్కొన్నారు. ఈ సంఘటన ఆకతాయిలకు గట్టి హెచ్చరికగా నిలిచిందని, ఇకపై ఇలాంటి వేధింపులకు పాల్పడితే కఠిన చర్యలు తప్పవని పోలీసులు హెచ్చరించారు.

4 days ago | [YT] | 6

786 NEWS CHANNEL MEDIA HD®️ UR VOICE OUR REPORT 🎤

BREAKING NEWS LIVE #786MEDIA UR VOICE OUR REPORTS అమరావతికి కేంద్రం రక్షణ కవచం !

ఆంధ్రప్రదేశ్ రాజధానిగా అమరావతిని శాశ్వతం చేసే దిశగా ఒక చారిత్రక ఘట్టం ఆవిష్కృతం కాబోతోంది. ప్రధానమంత్రి కార్యాలయం నుండి వచ్చిన స్పష్టమైన సంకేతాలతో, రాష్ట్ర ప్రభుత్వం అసెంబ్లీలో అమరావతిని ఏకైక రాజధానిగా ఖరారు చేస్తూ మరోసారి తీర్మానం చేయనుంది. ఈ తీర్మానం ఆధారంగా కేంద్ర ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్ పునర్విభజన చట్టం-2014లో సవరణలు చేసి, అమరావతిని అధికారిక రాజధానిగా పొందుపరచనుంది. ఒకసారి విభజన చట్టంలో రాజధాని పేరు చేరితే, భవిష్యత్తులో ఏ ప్రభుత్వం వచ్చినా, ఏ ముఖ్యమంత్రి అనుకున్నా దానిని మార్చడం రాజ్యాంగబద్ధంగా అసాధ్యం అవుతుంది.

అసెంబ్లీకి జగన్ వస్తారా?

ఈ కీలక తీర్మానం సమయంలో వైసీపీ అధినేత జగన్ మోహన్ రెడ్డి ఏం చేస్తారో స్పష్టత లేదు. గతంలో ప్రతిపక్ష నేతగా ఉన్నప్పుడు 33 వేల ఎకరాలు రాజధానికి ఉండాల్సిందే అని అసెంబ్లీ సాక్షిగా మద్దతు తెలిపిన జగన్, అధికారంలోకి వచ్చాక మూడు రాజధానుల పేరుతో ఆ నిర్ణయాన్ని తుంగలో తొక్కారు. ఇప్పుడు కూటమి ప్రభుత్వం ప్రవేశపెట్టబోయే తీర్మానానికి వైసీపీ మద్దతు ఇస్తుందా లేదా అనేది పెద్ద ప్రశ్న. ఒకవేళ మద్దతు ఇస్తే తన పాత యూ-టర్న్ నిర్ణయాన్ని ఒప్పుకున్నట్లు అవుతుంది, ఇవ్వకపోతే అమరావతికి వ్యతిరేకి అనే ముద్ర శాశ్వతంగా పడిపోతుంది. అందుకే ఆయన రాకపోవచ్చు.. ఎమ్మెల్యేల్ని పంపకపోవచ్చు.

మూడు రాజధానులకు ముగింపు

ఐదేళ్లుగా అమరావతిని స్మశానంగా అభివర్ణించి, విశాఖకు రాజధానిని తరలించాలని జగన్ చేసిన ప్రయత్నాలన్నీ ఇప్పుడు బూడిదలో పోసిన పన్నీరు కానున్నాయి. విభజన చట్టంలో మార్పులు జరిగితే, జగన్ కలలుగన్న మూడు రాజధానుల కాన్సెప్ట్ చట్టపరంగా సమాధి అవుతుంది. రాజకీయంగా అమరావతిని దెబ్బతీయాలని చూసిన జగన్‌కు, కేంద్ర ప్రభుత్వం నేరుగా రంగంలోకి దిగి రాజధానిని చట్టబద్ధం చేయడం కోలుకోలేని దెబ్బ. రాష్ట్ర అభివృద్ధికి అమరావతి గుండెకాయ అని నమ్మే మెజారిటీ ప్రజలకు ఇది తీపి కబురు కాగా, జగన్ రెడ్డి పంతానికి ఇది ఒక పెద్ద చెక్.

శాశ్వత రాజధానిగా అమరావతి

చంద్రబాబు నాయుడు కేంద్రంపై ఒత్తిడి తెచ్చి, రాజధాని అంశాన్ని విభజన చట్టంలో చేర్పించడంలో విజయం సాధిస్తున్నారు. దీనివల్ల అమరావతి భూములిచ్చిన రైతులకు న్యాయం జరగడమే కాకుండా, రాష్ట్రానికి వచ్చే పెట్టుబడులకు ఒక భరోసా లభిస్తుంది. జగన్ ప్రభుత్వం హయాంలో ఏర్పడిన అనిశ్చితికి ఈ చట్టబద్ధమైన ముద్రతో తెరపడనుంది. రేపటి రోజున ఎవరు అధికారంలోకి వచ్చినా రాజధానిని మార్చలేరన్న గ్యారంటీ ప్రజల్లోకి వెళ్లడం వల్ల, కూటమి ప్రభుత్వానికి ఇది ఒక భారీ రాజకీయ మైలేజీగా మారనుంది. రెండో విడత భూసమీకరణకూ రైతులు పెద్ద ఎత్తున ముందుకు వచ్చే అవకాశం ఉంది.

1 week ago | [YT] | 6

786 NEWS CHANNEL MEDIA HD®️ UR VOICE OUR REPORT 🎤

BREAKING NEWS LIVE #786MEDIA UR VOICE OUR REPORTS దేశంలో రూ.940 లక్షల కోట్ల బంగారం.. కానీ ఆర్థిక వ్యవస్థకు నిరుపయోగం: కేంద్ర మాజీ మంత్రి పీపీ చౌదరి

మన దేశంలోని ఇళ్లు, దేవాలయాల్లో సుమారు 50,000 టన్నుల బంగారం నిరుపయోగంగా మూలుగుతోందని కేంద్ర మాజీ మంత్రి పీపీ చౌదరి వెల్లడించారు. దీని ప్రస్తుత మార్కెట్ విలువ దాదాపు 10 లక్షల కోట్ల డాలర్లు (సుమారు రూ.940 లక్షల కోట్లు) ఉంటుందని అంచనా వేశారు. అసోచాం నిర్వహించిన ఒక సదస్సులో ఆయన మాట్లాడుతూ, ఇంత భారీ సంపద అందుబాటులో ఉన్నా, దేశ ఆర్థికాభివృద్ధికి దాన్ని ఉపయోగించుకోలేకపోతున్నామని ఆవేదన వ్యక్తం చేశారు.

గత రెండేళ్లుగా బంగారం ధర ఏటా 30శాతం పెరిగినా, దేశంలో కొనుగోళ్లు ఏమాత్రం తగ్గలేదు. భవిష్యత్తులో ధర మరింత పెరుగుతుందనే నమ్మకంతో ప్రజలు బంగారాన్ని కొని బీరువాల్లో భద్రపరుస్తున్నారు. దీనివల్ల వ్యక్తిగత ఆస్తుల విలువ పెరిగినా, అధిక దిగుమతుల రూపంలో దేశ ఆర్థిక వ్యవస్థపై భారం పడుతోంది. ఈ బంగారాన్ని ఆర్థిక వ్యవస్థలోకి తీసుకురాగలిగితే దిగుమతులు తగ్గడమే కాకుండా, కరెంట్ ఖాతా లోటు (సీఏడీ) కూడా అదుపులోకి వస్తుందని చౌదరి అభిప్రాయపడ్డారు.

ఈ సమస్యకు పరిష్కారంగా ఫిజికల్ బంగారాన్ని ఎలక్ట్రానిక్ గోల్డ్ రిసీట్స్‌గా (ఈజీఆర్‌) మార్చడమే సరైన మార్గమని నిపుణులు సూచిస్తున్నారు. ఎన్‌ఎస్‌ఈ చీఫ్ బిజినెస్ డెవలప్‌మెంట్ ఆఫీసర్ శ్రీరామ్ కృష్ణన్ మాట్లాడుతూ, ఈజీఆర్‌లను స్టాక్ మార్కెట్‌లో షేర్లలా సులభంగా అమ్మి, కొనుక్కోవచ్చని తెలిపారు. అయితే, భౌతిక బంగారాన్ని ఈజీఆర్‌గా మార్చేటప్పుడు 3శాతం జీఎస్టీ చెల్లించాల్సి రావడం ప్రజలకు, ఆలయాలకు భారంగా మారింది. ఈ కారణంగానే ఈ పథకానికి ఆదరణ లభించడం లేదని ఆయన పేర్కొన్నారు. ఈ జీఎస్టీ సమస్యను పరిష్కరించాలని కోరుతూ ఎన్‌ఎస్‌ఈ ఇప్పటికే ప్రభుత్వానికి ఒక ప్రతిపాదన సమర్పించినట్లు ఆయన వివరించారు.

1 week ago | [YT] | 4

786 NEWS CHANNEL MEDIA HD®️ UR VOICE OUR REPORT 🎤

BREAKING NEWS LIVE #786MEDIA UR VOICE OUR REPORTS పార్టీలు, అమ్మాయిలు, రీల్స్.. అందుకే ఫెయిల్ అవుతున్నారు: యోగరాజ్ సింగ్ సంచలన వ్యాఖ్యలు

టీమిండియా మాజీ క్రికెటర్, యువరాజ్ సింగ్ తండ్రి యోగరాజ్ సింగ్ యువ ఆటగాళ్లపై సంచలన వ్యాఖ్యలు చేశారు. 2026 టీ20 ప్రపంచకప్ ఫైనల్‌లో అభిషేక్ శర్మ కేవలం 21 బంతుల్లో 52 పరుగులతో చెలరేగినప్పటికీ, అతని ఆటతీరు, వైఖరిపై యోగరాజ్ తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. అభిషేక్‌కు, శుభ్‌మన్ గిల్‌కు యువరాజ్ సింగ్ మెంటార్‌గా వ్యవహరిస్తున్నప్పటికీ, యోగరాజ్ వారిద్దరినీ వదలకుండా విమర్శించడం గమనార్హం.

ఇన్‌సైడ్‌స్పోర్ట్‌కు ఇచ్చిన ఒక ఇంటర్వ్యూలో యోగరాజ్ సింగ్ మాట్లాడుతూ... "అభిషేక్ శర్మ ప్రదర్శన పట్ల నేను చాలా అసహనంగా ఉన్నాను. కొన్నిసార్లు అతనికి మెసేజ్‌లు కూడా పంపాను. ఆటను తేలికగా తీసుకోవద్దని చెప్పాను. కానీ అతను ఎప్పుడూ గాల్లోకి షాట్లు కొట్టి, సిక్సర్లతో ప్రేక్షకులను అలరించాలని చూస్తాడు. ఆటలో సింగిల్స్, డబుల్స్ కూడా ఉంటాయి. కొన్నిసార్లు డిఫెన్సివ్‌గా కూడా ఆడాలి. యువరాజ్ స్థాయికి చేరుకోవాలంటే అతనికి మరో జన్మ పట్టొచ్చు" అని ఘాటుగా వ్యాఖ్యానించారు.

ఆటగాళ్ల వైఫల్యానికి ఆఫ్-ఫీల్డ్ కార్యకలాపాలే కారణమని యోగరాజ్ ఆరోపించారు. "శుభ్‌మన్ గిల్‌కు, అభిషేక్‌కు ఏమైంది? పార్టీలు, అమ్మాయిలు, డబ్బు, నిరంతరం షూటింగ్‌లు.. మనసు వేరే చోట ఉన్నప్పుడే వైఫల్యం వస్తుంది. అభిషేక్ విషయంలో అదే జరుగుతోంది. రీల్స్ చేసుకుంటూ తిరుగుతున్నాడు, అది అతని పని కాదు. రాత్రి 9 గంటలకు పడుకుని, ఉదయం 5 గంటలకు లేచి వెయ్యి బంతులు ప్రాక్టీస్ చేయాలి" అని హితవు పలికారు.

అశ్విన్‌పైనా తీవ్ర వ్యాఖ్యలు
ఇదే సమయంలో రవిచంద్రన్ అశ్విన్‌పై కూడా యోగరాజ్ మండిపడ్డారు. లక్నో సూపర్ జెయింట్స్ తుది జట్టులో అర్జున్ టెండూల్కర్‌కు అవకాశం రాదని అశ్విన్ చేసిన వ్యాఖ్యలను ఆయన తప్పుబట్టారు. గతంలో అర్జున్‌కు కొంతకాలం శిక్షణ ఇచ్చిన యోగరాజ్.. "అశ్విన్ ఒక చెత్త వాగుడు వాగుతున్నాడు. టీవీలో కూర్చుని ఒకరి గురించి అలా ఎలా మాట్లాడతాడు? అసలు నువ్వేంటి?" అని ప్రశ్నించారు. అర్జున్ ఒక మంచి బ్యాటర్ అని, వెన్నెముక సమస్య కారణంగా అతని బౌలింగ్ యాక్షన్ సరిగ్గా లేదని తెలిపారు. "అర్జున్ బ్యాటింగ్ చేస్తుంటే సిక్సర్లు, బౌండరీలు బాదాడు. అతని కోచ్‌తో చెప్పాను.. మీకు చేతకాకపోతే అతడిని నాకు అప్పగించండి అని" యోగరాజ్ సింగ్ వ్యాఖ్యానించారు.

1 week ago | [YT] | 4

786 NEWS CHANNEL MEDIA HD®️ UR VOICE OUR REPORT 🎤

BREAKING NEWS LIVE #786MEDIA UR VOICE OUR REPORTS అమెరికా ప్రతిపాదనకు ఇరాన్ చెక్.. మా షరతులు ఒప్పుకుంటేనే శాంతి!

పశ్చిమాసియాలో ఉద్రిక్తతలను తగ్గించేందుకు అమెరికా చేసిన దౌత్యపరమైన ప్రయత్నాలకు గట్టి ఎదురుదెబ్బ తగిలింది. కాల్పుల విరమణ కోసం అమెరికా పంపిన 15 సూత్రాల ప్రతిపాదనను ఇరాన్ నిర్ద్వంద్వంగా తిరస్కరించింది. తమ షరతులు నెరవేరేంత వరకు దాడులను కొనసాగిస్తామని, యుద్ధాన్ని ఎప్పుడు ముగించాలో తామే నిర్ణయించుకుంటామని తేల్చిచెప్పింది.

అమెరికా తన కాల్పుల విరమణ ప్రణాళికను పాకిస్థాన్ ద్వారా ఇరాన్‌కు చేరవేసింది. ఈజిప్టు కూడా ఈ మధ్యవర్తిత్వ ప్రక్రియలో పాలుపంచుకుంది. అయితే, ఈ ప్లాన్‌ను స్వీకరించిన అనంతరం ఇరాన్ తన కఠిన వైఖరిని స్పష్టం చేసింది. అమెరికా ప్రతిపాదన మోసపూరితంగా, తమ ప్రయోజనాలకు విఘాతం కలిగించేలా ఉందని ఓ సీనియర్ ఇరాన్ అధికారి పేర్కొన్నట్లు అక్కడి అధికారిక మీడియా ప్రెస్ టీవీ వెల్లడించింది.

‘మా షరతులు నెరవేరినప్పుడు, మేం నిర్ణయించుకున్నప్పుడు మాత్రమే ఈ యుద్ధం ముగుస్తుంది. అంతేకానీ అమెరికా కోరుకున్నప్పుడు కాదు’ అని ఆ అధికారి స్పష్టం చేశారు. అంతేకాదు, యుద్ధ విరమణకు ఇరాన్ సొంతంగా ఐదు షరతులను ప్రతిపాదించింది. తమపై దాడులు, హత్యలు పూర్తిగా ఆపాలని, భవిష్యత్తులో ఇలాంటి యుద్ధం పునరావృతం కాకుండా హామీ ఇవ్వాలని, యుద్ధ నష్టపరిహారం చెల్లించాలని, హార్ముజ్ జలసంధిపై తమ సార్వభౌమత్వాన్ని అంతర్జాతీయ సమాజం గుర్తించాలని డిమాండ్ చేసింది. ఈ దౌత్యపరమైన చర్చలు జరుగుతున్నప్పటికీ, దాడులను ఆపేది లేదని ఇరాన్ తన చర్యల ద్వారా స్పష్టం చేస్తోంది.

1 week ago | [YT] | 4