Harish Rao Thanneeru

Official YouTube Channel of Former Minister, BRSLP Deputy Floor Leader and MLA Siddipet Shri Harish Rao garu.


Harish Rao Thanneeru

Warm greetings on the occasion of #IndependenceDay 🇮🇳

On this Independence Day, let us salute the brave freedom fighters and visionary leaders whose courage, relentless efforts, and sacrifices continue to make every Indian proud.

Let us celebrate the spirit of freedom, unity, and patriotism, and reaffirm our commitment to building a stronger and more united India.

Jai Hind! 🇮🇳

16 hours ago | [YT] | 299

Harish Rao Thanneeru

ఎస్టీ కార్పొరేషన్ నిధులు పక్కదారి.. లగచర్ల గిరిజనులకు బేడీలు.

గత ప్రభుత్వం తండాలను జీపీలు చేస్తే.. ఈ ప్రభుత్వం భూములు గుంజుకుంటోంది.టిక్కీ ఆధ్వర్యంలో పారిశ్రామికవేత్తలుగా ఎదగాలి.

ఎస్టీల భూములు గుంజుకుని ముఖ్యమంత్రి సోదరులకు కట్టబెడుతున్నారు.

ఎస్టీ కార్పొరేషన్‌కు మూడేళ్లలో రూపాయి నిధులు విడుదల కాలేదు.

జాబ్ సీకర్స్ గా కాదు, జాబ్ క్రియేటర్స్ గా గిరిజన యువత ఎదగాలి.

గిరిజన యువతకు మార్గదర్శిగా టిక్కీ చేస్తున్న కృషి అభినందనీయం.

సిద్దిపేటలో TICCI జిల్లా చాప్టర్ ప్రారంభోత్సవంలో మాజీ మంత్రి హరీశ్ రావు.

3 days ago | [YT] | 260

Harish Rao Thanneeru

సిద్దిపేట జిల్లా కేంద్రం లో తెలంగాణ సిద్ధాంతకర్త ఆచార్య జయశంకర్ సార్ గారి జయంతి సందర్బంగా ఆయన విగ్రహానికి పూల మాల వేసి ఘనంగా నివాళ్లు అర్పించి వారిని స్మరించుకున్న మాజీ మంత్రి ఎమ్మెల్యే హరీష్ రావు గారు...

ఈ సందర్బంగా హరీష్ రావు గారు మాట్లాడుతు...

- తెలంగాణ సిద్దాంతకర్త జయశంకర్ గారి జయంతి సందర్భంగా అందరికీ శుభాకాంక్షలు

- జయశంకర్ గారు జీవితాంతం తెలంగాణ కోసం పోరాడిన మహనీయులు

- ఆయనకు సిద్దిపేటతో అవినావభవ సంబంధం ఉంది

- సిద్దిపేటలో అమరవీరుల స్తూపం ఆయన చేతుల మీదుగానే శంకుస్తపాన చేసుకున్నాం

- తెలంగాణ రాష్ట్ర సాధన కేసీఆర్ గారితోనే సాధ్యమని నమ్మి ఆయనతోనే వెన్నుదన్నుగా ఉన్నారు

- జయశంకర్ గారు వ్యక్తి కాదు శక్తి

- రాష్ట్రం కోసం ఆయన చేసిన పోరాటం ఎప్పటికీ చరిత్ర పుటలలో నిలిచిపోతుంది.

- ఇవాళ రాష్ట్రం సాధించామంటే అది జయశంకర్ సార్, కేసీఆర్ గారి పోరాటం వల్లనే

- పదేళ్ళలో కేసీఆర్ గారి పాలనలో తెలంగాణ ఆత్మ గౌరవాన్ని అద్భుతంగా నిలబెట్టారు

- కానీ ఇప్పుడు తెలంగాణ సోయిలేని వ్యక్తి ముఖ్యమంత్రిగా ఉన్నాడు

- అందుకే ఇప్పుడు నదీ జలాల విషయంలో తెలంగాణకు అన్యాయం జరుగుతున్నది.

- తెలంగాణ కోసం ఉద్యమం చేసి, పోరాడి కేసీఆర్ ప్రభుత్వం 383 టీఎంసీల గోదావరి జలాలకు అనుమతులు సాధించింది.

- కాంగ్రెస్ అధికారంలోకి వచ్చి 3 యేండ్లు అయినా ఒక్క ప్రాజెక్టుకు అనుమతులు సాధించలేదు

- ఇప్పుడు ఆ అనుమతులను రద్దు చేసే పరిస్థితి వచ్చింది

- GRMB ఏజెండాలో తెలంగాణ ప్రాజెక్టుల అనుమతులను అడ్డుకోవాలని చేర్చడం ఇదే మొదటి సారి.

- ఇది కాంగ్రెస్ ప్రభుత్వ వైఫల్యం.

- ఇప్పటికైనా జీఆర్ఎంబీ ఎజెండాలో తెలంగాణ ప్రాజెక్టులకు వ్యతిరేకంగా ఉన్న ప్రతిపాదనలను అడ్డుకోవాలి.

- ఆంద్రప్రదేశ్ కడుతున్న బనకచర్ల ప్రాజెక్టును ఎందుకు ఆపలేకపోతున్నారు.

- సమ్మక్కసాగర్ కు కేటాయించిన నీటిని ఎందుకు వదులుకుంటున్నరు.

- తెలంగాణ ప్రయోజనాలను కాపాడటానికి ప్రభుత్వం తక్షణమే చర్యలు తీసుకోవాలి.

- జయశంకర్ గారికి నిజమైన నివాళులు అర్పించడం అంటే మన నీటి వాటాను మనం కాపాడుకోవాలి.

1 week ago | [YT] | 271

Harish Rao Thanneeru

తెలంగాణ భవన్లో మాజీ మంత్రి, బిఆర్ఎస్ డిప్యూటీ ఫ్లోర్ లీడర్ హరీష్ రావు.

ఈనెల 18న హైదరాబాద్ వేదికగా జీఆర్ఎంబీ (GRMB) సమావేశం జరగబోతోంది. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ చెరో ఎజెండాను సిద్ధం చేసుకున్నాయి.

తెలంగాణ ప్రభుత్వం మౌనం చూస్తుంటే... జీఆర్ఎంబీ సమావేశం కేవలం ఏపీ ప్రయోజనాల కోసమే జరుగుతోందా? అనే అనుమానం కలుగుతోంది.

ఎజెండా వచ్చి ఇన్ని రోజులు అవుతున్నా తెలంగాణ ప్రభుత్వం కనీసం స్పందించకపోవడం దారుణం.

ఏపీ ప్రతిపాదించిన అంశాలు చూస్తే తెలంగాణ ఆత్మగౌరవం ఉన్న ప్రతి ఒక్కరి కడుపు మండక మానదు. రక్తం మరిగిపోక తప్పదు.

తెలంగాణ ప్రయోజనాలను దెబ్బతీసే కుట్రలను పటాపంచలు చేయాల్సిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఏం చేస్తున్నారు?

గుడ్డి గుర్రం పళ్లు తోముతున్నారా? లేక తెలంగాణ నీటి ప్రయోజనాలను గంపగుత్తగా ఏపీకి తాకట్టు పెట్టాలని చూస్తున్నారా?

చంద్రబాబు తెలంగాణకు ద్రోహం చేయాలని చూస్తుంటే... రేవంత్ రెడ్డి రక్తం ఎందుకు మరిగడం లేదు?

తెలంగాణ సోయి లేదా? తెలంగాణ ఆత్మగౌరవం లేదా? గురుదక్షిణ కోసమేనా ఈ మౌనం?

ప్రతిపక్షాలపై అడ్డగోలుగా మాట్లాడే రేవంత్ రెడ్డి... పక్క రాష్ట్రం తెలంగాణ నీటి హక్కులను కాలరాస్తుంటే ఎందుకు మాట్లాడటం లేదు?

"గుడ్లు పీకుతా... పేగులు మెడలో వేసుకుంటా" అంటూ రాక్షస భాష మాట్లాడే రేవంత్ రెడ్డి... చంద్రబాబు విషయంలో ఎందుకు నోరు మెదపడం లేదు?
చంద్రబాబు అంటే అంత భయమా?

తెలంగాణ జల ప్రయోజనాలను శాశ్వతంగా సమాధి చేసే విధంగా పక్క రాష్ట్రం కుట్రలు చేస్తోంది.

ఈనెల 18న జరిగే జీఆర్ఎంబీ సమావేశం ఎజెండా చూస్తే ఏపీ ఎంత వితండవాదం చేస్తుందో స్పష్టంగా అర్థమవుతుంది.

తెలంగాణ ప్రాజెక్టులపై ఏపీ మొత్తం విషం చిమ్మింది.
చంద్రబాబు తెలంగాణ ప్రాజెక్టులను తాను ఎప్పుడూ వ్యతిరేకించలేదని పదేపదే చెబుతారు. కానీ జీఆర్ఎంబీ ముందు పెట్టిన ఎజెండా చూస్తే అసలు నిజం ఏంటో అర్థమవుతుంది.

కాళేశ్వరం, చౌటుపల్లి హన్మంతరావు, చిన్న కాళేశ్వరం, చనాకా-కొరటా, మోదికుంట వాగు, కడెం గూడెం లిఫ్ట్, సీతారామ లిఫ్ట్ వంటి ప్రాజెక్టులకు ఇచ్చిన అనుమతులను నిలిపివేయాలని, వాటిని పునఃసమీక్షించాలని ఏపీ కోరుతోంది.

సమ్మక్క బ్యారేజీకి సంబంధించిన క్లియరెన్సులను కూడా నిలిపివేయాలని ఏపీ ప్రతిపాదిస్తోంది.

కొత్తగా అనుమతులు ఇవ్వాలని కాదు... కేసీఆర్ ప్రభుత్వం సాధించిన ఈ ఏడు ప్రాజెక్టుల అనుమతులను రివ్యూ చేయాలని ఏపీ కోరుతోంది.

ఆ ప్రతిపాదనను జీఆర్ఎంబీ ఎజెండాలో చేర్చడం అత్యంత దుర్మార్గమైన విషయం.

ఖమ్మం జిల్లాకు సీతారామ ప్రాజెక్టు నీళ్లు వస్తున్నాయంటే... కేసీఆర్ ప్రభుత్వం సాధించిన అనుమతుల వల్లే.

ఇప్పుడు అదే సీతారామ ప్రాజెక్టు అనుమతులను రద్దు చేయాలని ఏపీ కోరుతోంది.

తెలంగాణకు చెందిన ఏడు కీలక ప్రాజెక్టుల అనుమతులను నిలిపివేయాలని ఏపీ ప్రతిపాదిస్తుంటే తెలంగాణ ప్రభుత్వం ఏం చేస్తోంది?
తెలంగాణ ఇంజినీర్లు ఏం చేస్తున్నారు?

ఇప్పటికే అనుమతులు సాధించిన ప్రాజెక్టుల అనుమతులను రద్దు చేసే అధికారం ఎవరు ఇచ్చారు?

తెలంగాణ కోసం ఉద్యమం చేసి, పోరాడి కేసీఆర్ ప్రభుత్వం 383 టీఎంసీల గోదావరి జలాలకు అనుమతులు సాధించింది.

ఇప్పుడు ఆ అనుమతులను రద్దు చేసే పరిస్థితి ఎందుకు వచ్చింది?

కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన దాదాపు మూడేళ్లలో ఒక్క కొత్త ప్రాజెక్టుకు కూడా అనుమతి తీసుకురాలేదు.

సమ్మక్క, పాలమూరు, వార్ధా ప్రాజెక్టుల డీపీఆర్‌లు రిటర్న్ వచ్చాయి.

ఒక్క టీఎంసీ నీటికి కూడా కొత్తగా అనుమతి సాధించలేదు.

పైగా బీఆర్ఎస్ ప్రభుత్వం సాధించిన ఏడు ప్రాజెక్టుల అనుమతులను రద్దు చేసే పరిస్థితి తీసుకొచ్చారు.
తెలంగాణ భవిష్యత్తుతో ఆడుకుంటారా? నిద్రపోతున్నారా?
ఎజెండాలో ఈ అంశాలు రావడమే దుర్మార్గమైన విషయం.

చంద్రబాబు "నేను తెలంగాణ ప్రాజెక్టులను ఎప్పుడూ అడ్డుకోలేదు" అని చెబుతారు.
కానీ ఏప్రిల్ 24, 2026న తెలంగాణ ప్రాజెక్టులను అడ్డుకోవాలని చంద్రబాబు కేంద్రానికి లేఖ రాశారు.

ఇప్పుడు అదే ప్రాజెక్టులను ఆపేలా జీఆర్ఎంబీ ఎజెండాలో అంశాలను పెట్టించారు.
టీవీల్లో తెలంగాణ ప్రాజెక్టులను అడ్డుకోలేదంటారు... బయట మాత్రం ప్రాజెక్టుల అనుమతులు రద్దు చేయాలని లేఖలు రాస్తారు.
ఎజెండాలో పొందుపరుస్తారు.
మాటలకు, చేతలకు పొంతన లేకుండా పోయింది.

కేంద్రాన్ని చేతుల్లో పెట్టుకుని తెలంగాణ హక్కులను కాలరాస్తున్నారు. నోటికాడి బుక్కను లాక్కునే ప్రయత్నం చేస్తున్నారు.
తెలంగాణ ప్రజలు ఈ కుట్రలను ఎట్టి పరిస్థితుల్లోనూ ఊరుకోరు.

సీతారామ అంటే ఖమ్మం జిల్లా... కాళేశ్వరం అంటే సగం తెలంగాణ... గూడెం అంటే మంచిర్యాల... మోదికుంట వాగు అంటే ఖమ్మం... చిన్న కాళేశ్వరం అంటే మంత్రి శ్రీధర్ బాబు నియోజకవర్గం.

తెలంగాణ వ్యాప్తంగా తాగు, సాగునీరు అందించే ప్రాజెక్టుల అనుమతులను రద్దు చేయాలని ఏపీ కోరుతోంది.

తెలంగాణ ప్రభుత్వం, ఇంజినీర్లు ఏం చేస్తున్నారు?
ఆయా ప్రాంతాల మంత్రులు, ముఖ్యమంత్రి దీనికి అంగీకరిస్తున్నారా? సమాధానం చెప్పాలి.

కాంగ్రెస్, బీజేపీ కలిసి తెలంగాణ గొంతు కోస్తున్నాయనే అనుమానాలు ప్రజల్లో కలుగుతున్నాయి.
తెలంగాణకు చెందిన కేంద్ర మంత్రులు కిషన్ రెడ్డి, బండి సంజయ్ దీనిపై సమాధానం చెప్పాలి.

జీఆర్ఎంబీ అనేది కేంద్ర ప్రభుత్వ పరిధిలోని ఒక బోర్డు మాత్రమే.
జీఆర్ఎంబీ కేంద్ర ప్రభుత్వానికి ఎలా నిర్దేశాలు ఇస్తుంది?

కేంద్రంలోని అన్ని కీలక విభాగాలు పరిశీలించిన తర్వాతే తెలంగాణ ప్రాజెక్టులకు టీఏసీ అనుమతులు ఇచ్చింది.
టీఏసీలో కేంద్ర ప్రభుత్వానికి సంబంధించిన కీలక విభాగాలన్నీ ఉంటాయి.
కేంద్రం పరిశీలించి అనుమతించిన తర్వాత వాటిని మళ్లీ రద్దు చేయాలని చెప్పే అధికారం జీఆర్ఎంబీకి ఎక్కడిది?

దేశ చరిత్రలో అనుమతులు వచ్చిన తర్వాత వాటిని రివ్యూ చేయడం, రద్దు చేయడం జరిగిన సందర్భాలు ఎక్కడైనా ఉన్నాయా?

తొలిసారి దేశంలో తెలంగాణ ప్రాజెక్టుల అనుమతులను రద్దు చేయాలని ఏపీ ప్రతిపాదిస్తోంది.
ఏపీ ప్రతిపాదిస్తే జీఆర్ఎంబీ దాన్ని వ్యతిరేకించాలి కదా? మరి ఎజెండాలోకి ఎలా వచ్చింది?

తెలంగాణ ఇంజినీర్లు ఎందుకు మౌనంగా ఉన్నారు?
రేవంత్ రెడ్డి చెప్పడంతోనే ఈ ఎజెండా తయారైందా?
ఎంత ధైర్యం ఉంటే తెలంగాణ ప్రయోజనాలకు వ్యతిరేకమైన అంశాలు జీఆర్ఎంబీ ఎజెండాలోకి వస్తాయి?

తెలంగాణకు రాజ్యాంగపరమైన హక్కులు లేవా?
ఏడు ప్రాజెక్టుల అనుమతులను రివ్యూ చేస్తాం, నిలిపివేస్తాం అంటే ఏం జరుగుతోంది?

బీజేపీ ఇప్పటికైనా స్పందించాలి. లేదంటే తెలంగాణ ప్రయోజనాల కోసం మేమే పోరాటం చేయాల్సి వస్తుంది.
తెలంగాణ ప్రయోజనాలను కాపాడుతారా? పెదవులు మూసుకుని కూర్చుంటారా? బీజేపీ స్పష్టంగా చెప్పాలి.

కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్న నీళ్లను కూడా ఎత్తడం లేదు.
మేము నిలదీసిన తర్వాతే దేవాదులలో తొమ్మిది మోటార్లు ఆన్ చేశారు.
ఎల్లంపల్లిలో ఐదు పంపులు మాత్రమే నడుస్తున్నాయి.

కృష్ణా జలాల విషయంలోనూ అదే పరిస్థితి.
తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత అత్యంత తక్కువ నీటి వినియోగం కాంగ్రెస్ ప్రభుత్వంలోనే జరిగింది.
గోదావరి జలాలు ఎత్తడం లేదు... కృష్ణా జలాలు వినియోగించడం లేదు.

మరోవైపు సమ్మక్క బ్యారేజీకి ఎట్టి పరిస్థితుల్లోనూ అనుమతి ఇవ్వొద్దని ఏపీ కోరుతోంది.

సమ్మక్కకు అనుమతి ఇస్తే పోలవరానికి నీళ్లు తగ్గుతాయని ఏపీ ఎజెండాలో పేర్కొంది.

గోదావరిలో నీళ్లు పుష్కలంగా ఉన్నాయని చంద్రబాబు ప్రభుత్వమే చెబుతోంది.

గోదావరి-బనకచర్ల ప్రాజెక్టు ద్వారా నల్లమల సాగర్‌కు నీళ్లు తీసుకెళ్తామని చెబుతున్నారు.

మరోవైపు తెలంగాణకు దక్కాల్సిన 968 టీఎంసీలలో భాగంగా సమ్మక్క ప్రాజెక్టు నిర్మిస్తామంటే ఏపీ అడ్డుకుంటోంది.

సమ్మక్క సాగర్‌కు బీఆర్ఎస్ ప్రభుత్వం ఇప్పటికే అనుమతులు సాధించింది.

25-08-2022న సమ్మక్క సాగర్‌కు 47 టీఎంసీల నీటి కేటాయింపుతో కేసీఆర్ ప్రభుత్వం అనుమతులు సాధించింది.

సమ్మక్క సాగర్ అత్యంత కీలకమైన ప్రాజెక్టు.
ఎస్ఆర్‌ఎస్‌పీ స్టేజ్-2 ద్వారా నాలుగు లక్షల ఎకరాల ఆయకట్టుకు నీరు అందించడంతో పాటు, రామప్ప, పాకాల ద్వారా 40 వేల ఎకరాలకు సాగునీరు, ములుగు జిల్లాకు తాగునీరు, వరంగల్‌కు డ్రింకింగ్ వాటర్ అందించేలా ప్రతిపాదనలు చేసి అనుమతులు సాధించాం.

ఇప్పుడు ఆ అనుమతులను రద్దు చేయాలని ఏపీ జీఆర్ఎంబీ ఎజెండాలో ప్రతిపాదించింది.
సమ్మక్క సాగర్‌కు ఉరి వేసే కుట్ర జరుగుతోంది.

ముగ్గురు ముఖ్యమంత్రుల సమావేశంలో సమ్మక్క సాగర్‌కు కేటాయించిన 47 టీఎంసీల నీటి వాటాను వదులుకునేందుకు రేవంత్ రెడ్డి ఒప్పుకుంటున్నారా?
దీనిపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తెలంగాణ ప్రజలకు సమాధానం చెప్పాలి.

సమ్మక్క సాగర్ ద్వారా ఉత్తమ్ కుమార్ రెడ్డి నియోజకవర్గానికి కూడా నీళ్లు వస్తాయి.
అలాంటి ప్రాజెక్టును రద్దు చేయాలని ఎజెండాలో ప్రతిపాదిస్తుంటే నీటిపారుదల శాఖ మంత్రి ఏం చేస్తున్నారు?

ఈ ఎజెండాను వెంటనే రద్దు చేయాలి.
తెలంగాణ ఎంపీలు పార్లమెంట్‌లో ఈ అంశంపై పోరాటం చేయాలి.
మేము అడిగిన తర్వాత నిన్నటి తేదీ వేసి ఉత్తరం రాయడం కాదు... నిజంగా రాష్ట్ర ప్రయోజనాలను కాపాడాలి.

డ్రామాలు కాదు... తెలంగాణ ప్రయోజనాల కోసం నిజాయితీగా పోరాడాలి.
కేసీఆర్ ముఖ్యమంత్రిగా ఉండి ఉంటే ఇలాంటి ఎజెండా జీఆర్ఎంబీ ముందుకు వచ్చేదా?
తెలంగాణ ప్రయోజనాలకు వ్యతిరేకంగా మాట్లాడేంత ధైర్యం ఎవరికైనా ఉండేదా?

మీ బంటు ముఖ్యమంత్రి ఉన్నారు కాబట్టే ఇలాంటి ప్రతిపాదనలు వస్తున్నాయనే అనుమానం తెలంగాణ ప్రజల్లో కలుగుతోంది.
కేంద్ర ఇరిగేషన్ సెక్రటరీగా పనిచేసిన కాంతారావు, ఇక్కడ నీటిపారుదల శాఖ మంత్రి సలహాదారు, ఈఎన్‌సీ, జాయింట్ సెక్రటరీ వంటి కీలక స్థానాల్లో ఉన్నవారు అంతా ఆంధ్రా మూలాల వారే.

తెలంగాణ హక్కులను కాపాడాల్సిన అధికారులు, ఇంజినీర్లు ఎందుకు మౌనంగా ఉన్నారు?
గోదావరి-బనకచర్ల ప్రాజెక్టుపై రేవంత్ రెడ్డి ఎందుకు మాట్లాడటం లేదు?
ఆ ప్రాజెక్టు అంశాన్ని జీఆర్ఎంబీ ఎజెండాలో ఎందుకు పెట్టించలేదు?

ఏపీ మన ప్రాజెక్టుల అనుమతులను రద్దు చేయాలని కోరుతున్నప్పుడు... తెలంగాణ ప్రయోజనాలకు వ్యతిరేకంగా ఉన్న ఏపీ ప్రాజెక్టులపై ఎందుకు అభ్యంతరం వ్యక్తం చేయడం లేదు?

బనకచర్ల విషయంలో చంద్రబాబు, రేవంత్ రెడ్డి మధ్య లోపాయికారి ఒప్పందం జరిగిందా?
"సుజల సుఫలాం" పేరుతో రాష్ట్ర ప్రయోజనాలకు నష్టం చేసే ఒప్పందాలు జరుగుతున్నాయనే వార్తలు వస్తున్నాయి.

అసలు తెలంగాణకు 968 టీఎంసీల కేటాయింపు లేదని ఏపీ జీఆర్ఎంబీ ఎజెండాలో పేర్కొనడం అత్యంత ప్రమాదకరం.

ఆంధ్రప్రదేశ్ పునర్వ్యవస్థీకరణ సందర్భంగా శ్రీకృష్ణ కమిటీకి ఇచ్చిన నివేదికలో తెలంగాణకు 968 టీఎంసీల కేటాయింపు ఉంది.

9వ జీఆర్ఎంబీ సమావేశంలో కూడా తెలంగాణకు 968 టీఎంసీల హక్కు ఉందనే అంశం ఉంది.
ఆ సమావేశం మినిట్స్‌లో కూడా ఈ అంశం నమోదై ఉంది.
ఆ సమావేశానికి ఏపీ తరఫున ఆదిత్యనాథ్ గారు హాజరయ్యారు.

రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి అయిన తర్వాతే చంద్రబాబు తెలంగాణకు గోదావరిలో 968 టీఎంసీల కేటాయింపు లేదని మాట్లాడుతున్నారు.

తెలంగాణ హక్కులను కాపాడాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉంది.
మేము రాజకీయాల కోసం ఈ అంశాన్ని లేవనెత్తడం లేదు.
ఇది తెలంగాణ భవిష్యత్తుకు సంబంధించిన అత్యంత కీలకమైన అంశం.

చంద్రబాబు, రేవంత్ రెడ్డి మధ్య ఎలాంటి లోపాయికారి ఒప్పందం లేదంటే... ముఖ్యమంత్రి వెంటనే స్పందించాలి.

జీఆర్ఎంబీ ఎజెండాలో తెలంగాణ ప్రాజెక్టులకు వ్యతిరేకంగా ఉన్న ప్రతిపాదనలను అడ్డుకోవాలి.
తెలంగాణ ప్రయోజనాలను కాపాడటానికి ప్రభుత్వం తక్షణమే చర్యలు తీసుకోవాలి.

ఎనిమిదేళ్లు అధికారంలో ఉండి ప్రాణహిత ప్రాజెక్టును ఎందుకు పూర్తి చేయలేకపోయారు?
కేంద్రంలో మహారాష్ట్రలో, ఏపీలో కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నప్పుడు కూడా ఎందుకు అనుమతులు సాధించలేకపోయారు?
ఇప్పుడు తెలంగాణ సాధించిన అనుమతులను రద్దు చేయాలని మాత్రం ఎందుకు ప్రయత్నిస్తున్నారు?

తెలంగాణ నీటి హక్కులపై రాజీపడే ప్రసక్తే లేదు.
తెలంగాణ ప్రజల నోటికాడి నీళ్లను లాక్కోవడానికి చేసే ప్రతి ప్రయత్నాన్ని బీఆర్ఎస్ అడ్డుకుంటుంది.
అవసరమైతే తెలంగాణ నీటి హక్కుల కోసం పెద్ద ఎత్తున పోరాటం చేస్తాం.

1 week ago | [YT] | 254

Harish Rao Thanneeru

ఇంజనీరింగ్ విద్యార్థులను 'క్రిమినల్ వేస్ట్' అంటావా.. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తక్షణమే క్షమాపణ చెప్పాలి.

కాంగ్రెస్ మేనిఫెస్టోను సమాధి చేశారా.. 32 నెలలైనా ఓపీఎస్, ఆరు నెలల్లో ఇస్తామన్న పీఆర్సీ ఏవీ..

ప్రశ్నించే గొంతులపై ఏసీబీ, సీఐడీ అక్రమ కేసులు.. ఉద్యోగులకు బీఆర్ఎస్ అండగా ఉంటుంది, ఎవరూ భయపడొద్దు.

చాక్ పీస్ కొనేందుకు పైసల్లేవు, స్కావెంజర్లకు జీతాల్లేవు.. విద్యాశాఖ మంత్రిగా రేవంత్ రెడ్డి కంప్లీట్ ఫెయిల్.

అసెంబ్లీని స్తంభింపజేసి అయినా సరే.. ఉద్యోగుల ఓపీఎస్, డీఏల సాధన కోసం బీఆర్ఎస్ పక్షాన పోరాడుతాం.

2 weeks ago | [YT] | 280

Harish Rao Thanneeru

కేఆర్ ఉచిత ఇంజనీరింగ్, కెరీర్ గైడెన్స్ ఆధ్వర్యంలో ఐఐటీ, ఎన్ఐటీ, ట్రిపుల్ ఐటీ లలో సీట్లు సాధించిన విద్యార్థులకు సిద్దిపేట క్యాంపు కార్యాలయంలో సన్మానించిన మాజీ మంత్రి, ఎమ్మెల్యే
హరీష్ రావు గారు.


ఈ సందర్భంగా జాతీయ స్థాయి సంస్థల్లో ప్రవేశాలు పొంది ప్రతిభ చాటిన విద్యార్థులను అభినందించారు.

ఈ సందర్భంగా విద్యార్థులు, వారి తల్లిదండ్రులను ఉద్దేశించి హరీశ్ రావు గారు మాట్లాడుతూ....

✳️ పేద, మధ్యతరగతి కుటుంబాల నుంచి వచ్చిన విద్యార్థులకు ఐఐటీ, ఎన్ఐటీలలో సీటు రావడం మామూలు విషయం కాదు, ఆ ఒక్క సీటుతో ఆ విద్యార్థి జీవితంతో పాటు వారి కుటుంబ ఆర్థిక స్థితిగతులు పూర్తిగా మారిపోతాయి.

✳️ గ్రామీణ ప్రాంత పిల్లల భవిష్యత్తు మార్చాలనే గొప్ప ఉద్దేశంతో 'కేఆర్ గైడెన్స్ సెల్' ఏర్పాటు చేసి, వారికి ఉచితంగా మార్గనిర్దేశం చేస్తున్న కొలుపుల రాములు గారి కృషి వెలకట్టలేనిది.

✳️ ఒక ఉపాధ్యాయుడిగా తన వంతు సామాజిక బాధ్యతగా.. సొంత పిల్లల్లాగా భావించి వాట్సాప్ ఛానళ్లు, కౌన్సిలింగ్ ద్వారా ఆయన వేలాది మందికి అండగా నిలవడం గొప్ప విషయం.

✳️ ఒకప్పుడు ఐఐటీ, ఎన్ఐటీ సీట్లు అనగానే కేవలం హైదరాబాద్‌లోని కార్పొరేట్ స్కూళ్లలో చదివే పిల్లలకే వస్తాయనే అపోహ ఉండేది, కానీ పట్టుదల, ఏకాగ్రత ఉంటే గ్రామీణ విద్యార్థులు కూడా అద్భుతాలు సాధించగలరని ఈ విద్యార్థులు నిరూపించారు.

✳️ రాములు గారి కృషితో ఇప్పటికే సుమారు మూడు వేల మంది విద్యార్థులు అత్యుత్తమ కళాశాలల్లో సీట్లు పొందడం ఒక గొప్ప మార్పునకు సంకేతం.

✳️ విద్యార్థులు ఐఐటీ, ఎన్ఐటీ పూర్తి కాగానే వెంటనే ప్రైవేటు ఉద్యోగాల్లో చేరిపోవడం కాకుండా, సివిల్ సర్వీసెస్ ఐఏఎస్, ఐపీఎస్, ఐఎఫ్ఎస్, డిఫెన్స్ తదితర ఆల్ ఇండియా సర్వీసెస్ వైపు దృష్టి సారించాలి.

✳️ జాతీయ స్థాయిలో మన ప్రాంత అధికారుల ప్రాతినిధ్యం మరింత పెరగాలి, మన బిడ్డలు సివిల్ సర్వెంట్లుగా దేశానికి సేవ చేయాలని ఆకాంక్షిస్తున్నాను.

✳️ చదువు పూర్తయ్యాక కేవలం ఉద్యోగాలు అడిగే వారుగా కాకుండా, తమ నైపుణ్యంతో పది మందికి ఉద్యోగాలు ఇచ్చే వారుగా ఎదగాలి

✳️ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, ఇంటర్నెట్ యుగంలో ప్రపంచం మొత్తం యువత చేతుల్లోనే ఉంది, వినూత్న ఆలోచనలతో స్టార్టప్‌లు స్థాపించి 20 నుంచి 24 ఏళ్ల యువతే గూగుల్, అమెజాన్ లాంటి సంస్థలను ఆకర్షిస్తున్నారు. ఆ దిశగా మన విద్యార్థులు కూడా ఆలోచన చేయాలి.

✳️ విద్యార్థులు ఎప్పుడూ 'థింక్ బిగ్' అనే సూత్రాన్ని నమ్మాలని, లక్ష్య సాధనలో ఒకటి రెండు సార్లు విఫలమైనా పట్టువిడవకుండా శ్రమించాలి.

✳️ ఇప్పటికే అత్యుత్తమ సంస్థల్లో సీట్లు సాధించి తమ సత్తా నిరూపించుకున్న విద్యార్థులు, భవిష్యత్తులోనూ అదే ఆత్మవిశ్వాసంతో అద్భుతాలు సృష్టించి తమ తల్లిదండ్రులకు, సిద్దిపేటకు మంచి పేరు తీసుకురావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను.

2 weeks ago | [YT] | 279

Harish Rao Thanneeru

కొడంగల్ మాజీ ఎమ్మెల్యే పట్నం నరేందర్ రెడ్డి గారు, శాసన మండలి ప్రభుత్వ చీఫ్ విప్ పట్నం మహేందర్ రెడ్డి గార్ల మాతృమూర్తి పట్నం రుక్కమ్మ గారు ఇటీవల అనారోగ్యంతో మరణించిన నేపథ్యంలో ఈరోజు షాబాద్‌లోని వారి నివాసానికి మాజీ మంత్రి, బీఆర్ఎస్ డిప్యూటీ ఫ్లోర్ లీడర్ హరీశ్ రావు గారు వెళ్లి కుటుంబ సభ్యులను పరామర్శించారు.

మాతృవియోగంతో తీవ్ర విషాదంలో ఉన్న పట్నం నరేందర్ రెడ్డి గారిని, వారి సోదరుడు మహేందర్ రెడ్డి గారిని హరీశ్ రావు గారు ఓదార్చారు. ఈ సందర్భంగా రుక్కమ్మ గారి చిత్రపటానికి పూలమాల వేసి నివాళులు అర్పించారు. ఆమె ఆత్మకు శాంతి చేకూరాలని భగవంతుడిని ప్రార్థించారు.

2 weeks ago | [YT] | 230

Harish Rao Thanneeru

పదవులు శాశ్వతం కాదు.. ప్రజాసేవే అంతిమ లక్ష్యం: మాజీ మంత్రి హరీశ్ రావు

99టీవీ 'స్టేట్స్‌మ్యాన్ ఎక్సలెన్స్ అవార్డ్స్ - కాంక్లేవ్' లో పాల్గొన మాజీ మంత్రి, బీఆర్ఎస్ డిప్యూటీ ఫ్లోర్ లీడర్ హరీశ్ రావు..


రాజకీయం అంటే కేవలం ఎన్నికల్లో గెలవడం, అధికారం చెలాయించడం కాదని.. ప్రజల జీవితాల్లో మార్పు తీసుకురావడమే నిజమైన రాజకీయం అని మాజీ మంత్రి, బీఆర్ఎస్ డిప్యూటీ ఫ్లోర్ లీడర్ తన్నీరు హరీశ్ రావు అన్నారు. 99టీవీ ఆధ్వర్యంలో జరిగిన 'స్టేట్స్‌మ్యాన్ ఎక్సలెన్స్ అవార్డ్స్ – కాంక్లేవ్' Politics Beyond Power సదస్సులో ఆయన పాల్గొని యువతను ఉద్దేశించి స్ఫూర్తిదాయక ప్రసంగం చేశారు.

ఈ సందర్భంగా హరీశ్ రావు గారు మాట్లాడుతూ...

రాజకీయం అంటే ఎన్నికలు, సోషల్ మీడియా ట్రెండ్స్, విమర్శలు మాత్రమే అని యువత అపోహ పడుతోంది. కానీ నిజమైన రాజకీయం అంటే రైతుకు నీరు, బిడ్డకు విద్య, యువతకు ఉపాధి, రోడ్లు, వైద్యం అందించడం. అధికారం అనేది కేవలం ఒక సాధనం మాత్రమే.. సేవ చేయడమే అంతిమ లక్ష్యం కావాలి.

ఒక గొప్ప లక్ష్యానికి బలమైన నాయకత్వం, యువత శక్తి తోడైతే చరిత్ర ఎలా సృష్టించవచ్చో చెప్పడానికి తెలంగాణ ఉద్యమమే సజీవ సాక్ష్యం. తెలంగాణ సాధన అసాధ్యం అని అందరూ భావించిన సమయంలో.. కేసీఆర్ గారు తన ముందుచూపుతో, అకుంఠిత దీక్షతో దశాబ్దాల కలను ఒక క్రమశిక్షణతో కూడిన ప్రజాస్వామిక ఉద్యమంగా మార్చారు. ఆయన చేసిన ఆమరణ నిరాహార దీక్ష ఉద్యమానికి అద్భుతమైన దిశానిర్దేశం చేసింది.

ఆనాడు కేసీఆర్ గారు చూపిన బాటలో యువత, విద్యార్థులు తమ కెరీర్‌ను సైతం పక్కనపెట్టి ప్రాణాలకు తెగించి పోరాడారు కాబట్టే స్వరాష్ట్ర కల సాకారమైంది. ఒక నిజమైన నాయకుడు ప్రజల్లో, యువతలో ఎలాంటి స్ఫూర్తిని నింపుతాడో చెప్పడానికి కేసీఆర్ గారి నాయకత్వమే నిదర్శనం..

అధికారం ఉన్నప్పుడే కాదు, ప్రతిపక్షంలో ఉన్నా బాధ్యతతో పనిచేసి ప్రజలకు మేలు చేయవచ్చు. ఇందుకు నిదర్శనమే దేవాదుల ప్రాజెక్టు. ప్రతిపక్షంగా మేం ప్రభుత్వంపై తీవ్ర ఒత్తిడి తీసుకువచ్చి, దేవాదుల పంపులు ఆన్ చేయించి రైతుల పొలాలకు నీళ్లు వచ్చేలా చేశాం. ప్రజాస్వామ్యం అంటే ఇదే.

నేటి Gen Z యువత తలుచుకుంటే వ్యవస్థలను ఎలా మార్చగలదో ఇటీవల జరిగిన పరిణామాలే నిదర్శనం. యువత చేసిన వీరోచిత పోరాటం వల్లే ఈరోజు కేంద్ర విద్యాశాఖ మంత్రి తన పదవికి రాజీనామా చేయాల్సి వచ్చింది. ప్రశ్నించే యువత ఉన్నప్పుడే ప్రజాస్వామ్యం బలపడుతుంది.

ఈరోజు ప్రపంచ జ్ఞానం యువత అరచేతిలో ఉంది. కానీ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కేవలం ప్రశ్నలకు సమాధానాలు మాత్రమే ఇవ్వగలదు. మానవత్వంతో కూడిన మనిషి ఆలోచన మాత్రమే సామాజిక సమస్యలను పరిష్కరించగలదు. ఫాలోవర్స్ సంఖ్యను చూసి నాయకత్వం అని భ్రమపడొద్దు.. నాయకుడికి ఉండాల్సిన అతిపెద్ద అర్హత వ్యక్తిత్వం.

ప్రభుత్వ ఆఫీసులోని ప్రతి ఫైలు వెనుకా ఒక మనిషి జీవితం ఉంటుందనే స్పృహ ప్రజా ప్రతినిధులకు ఉండాలి. ప్రభుత్వాలు, పదవులు మారుతుంటాయి.. కానీ మనం చేసిన సేవ మాత్రమే మిగులుతుంది. దేశ నిర్మాణంలో యువత ప్రేక్షకులుగా మిగిలిపోవద్దు.. బాధ్యత గల పౌరులుగా భాగస్వాములు కావాలి. అధికారం కోసం కాకుండా సేవ చేయడం కోసం నాయకులుగా ఎదగాలి.

పాలిటిక్స్ బియాండ్ పవర్ అంటేనే స్వార్థం లేని సేవ అని, యువత గొప్ప ఆశయాల వెంట నడవాలని హరీశ్ రావు పిలుపునిచ్చారు. ఈ అద్భుతమైన కార్యక్రమాన్ని నిర్వహించిన లోర్వెన్ క్రాఫ్ట్స్ మరియు 99టీవీ నిర్వాహకులను ఆయన ప్రత్యేకంగా అభినందించారు.

3 weeks ago (edited) | [YT] | 287

Harish Rao Thanneeru

‘నా తెలంగాణ కోటి రత్నాల వీణ’ అంటూ తన రచనలతో తెలంగాణ అస్థిత్వపు భావజాలాన్ని నలుదిశలా చాటిన సాహితీ యోధుడు మహాకవి శ్రీ దాశరథి కృష్ణమాచార్యలు గారి జయంతి సందర్భంగా ఘన నివాళి.

తెలంగాణ ఆత్మగౌరవాన్ని అత్యున్నత శిఖరాల మీద నిలబెట్టే దాశరథి కవిత్వం, సాహిత్యం తెలంగాణ భవిష్యత్తు తరాలకు నిత్యస్ఫూర్తిదాయకం.

3 weeks ago | [YT] | 107

Harish Rao Thanneeru

తెలంగాణ భవన్‌లో మాజీ మంత్రి, బీఆర్ఎస్ డిప్యూటీ ఫ్లోర్ లీడర్ హరీశ్ రావు .

దేవాదుల ప్రాజెక్టు ద్వారా రైతులకు నీళ్లు ఇవ్వడంలో కాంగ్రెస్ ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని విమర్శ.
జూలై 13న 22 రిజర్వాయర్లు నింపి, 38 టీఎంసీల నీటిని ఎత్తుతామని చెప్పి హామీ నిలబెట్టుకోలేదని ఆరోపణ.
వరంగల్ జిల్లాలో రైతులు నీటి కోసం ధర్నాలు చేస్తున్నా ప్రభుత్వం స్పందించడం లేదని వ్యాఖ్య.
గోదావరిలో నీళ్లు సమృద్ధిగా ఉన్నా దేవాదుల పంపులు పూర్తి స్థాయిలో నడపడం లేదని విమర్శ.
10 పంపులు నడుస్తాయని చెప్పి, వాస్తవానికి 3–5 పంపులే నడుస్తున్నాయని ఆరోపణ.
"ఇది ఎల్‌నినో తెచ్చిన కరువు కాదు.. కాంగ్రెస్ తెచ్చిన కరువు" అని వ్యాఖ్య.
కేసీఆర్ ప్రభుత్వం దేవాదుల మూడు దశలు పూర్తి చేసి, నీళ్లు ఎత్తేందుకు సిద్ధం చేసిందని పేర్కొన్నారు.
రూ.700–800 కోట్ల విలువైన పంటలు నీటి కొరతతో నష్టపోయాయని అన్నారు.
కాంగ్రెస్ హామీలు నమ్మి రైతులు నాట్లు వేసుకున్నారని, ఇప్పుడు నీళ్లు అందక ఇబ్బందులు పడుతున్నారని విమర్శ.
మంత్రుల మాట ఒకటి, జిల్లా కలెక్టర్ మాట మరోటి అని ప్రభుత్వాన్ని ప్రశ్నించారు.
రైతులకు వెంటనే ఇన్‌పుట్ సబ్సిడీ ఇవ్వాలని డిమాండ్ చేశారు.
కాళేశ్వరం విషయంలో విమర్శలు చేస్తూ, దేవాదుల వద్ద మాత్రం చర్యలు ఎందుకు తీసుకోవడం లేదని ప్రశ్నించారు.
"తిట్ల మీద ఉన్న ధ్యాస నీటి బొట్లు ఎత్తడంపై లేదు" అంటూ సీఎం రేవంత్ రెడ్డిపై విమర్శలు చేశారు.
"అంగట్లో అన్నీ ఉన్నా అల్లుడి నోట్లో శని అన్నట్లు కాంగ్రెస్ పాలన ఉంది" అని వ్యాఖ్యానించారు.
22 రిజర్వాయర్లు వెంటనే నింపి, 3.17 లక్షల ఎకరాలకు సాగునీరు అందించాలని డిమాండ్ చేశారు.
ప్రభుత్వం స్పందించకపోతే వరంగల్, నల్గొండ, కరీంనగర్ రైతులతో కలిసి ఉద్యమాలు చేపడతామని హెచ్చరించారు.

3 weeks ago | [YT] | 297