Subscribe to Temples Network for the latest updates on temple events, spiritual knowledge, and daily god status! Join our community and stay connected to divine insights and holy places around the world. Don’t miss out—click Subscribe and turn on notifications!
Temples Network
🌿 రావి చెట్టు: విశ్వాసం, ఆయుర్వేదం మరియు అస్తిత్వానికి ప్రతీక అయిన మహావృక్షం 🌿
రావి ఆకుల గలగల శబ్దంలో కేవలం గాలి శబ్దం మాత్రమే కాదు, వేల సంవత్సరాల నాటి నాగరికత యొక్క గుసగుసలు కూడా ఇమిడి ఉన్నాయి. ఇది కేవలం ఒక చెట్టు కాదు; ఇది ప్రకృతి ప్రసాదించిన ఒక 'దైవ వరం', ఇది మనకు జీవితంలోనూ, తత్వశాస్త్రంలోనూ పాఠాలు నేర్పుతుంది.
🕉️ ధర్మం మరియు ఆధ్యాత్మికత యొక్క శిఖరం
సనాతన ధర్మంలో, రావి చెట్టును 'దేవవృక్షం'గా పూజిస్తారు. స్కంద పురాణం ప్రకారం, దాని వేళ్ళలో బ్రహ్మదేవుడు, కాండంలో విష్ణుమూర్తి మరియు పై కొమ్మలలో (ఆకులలో) శివుడు కొలువై ఉంటారు.
బోధి వృక్షం: ఈ పవిత్రమైన చెట్టు కిందనే సిద్ధార్థ రాకుమారుడు 'బుద్ధత్వాన్ని' పొందాడు, తద్వారా ఇది జ్ఞానోదయం మరియు నిర్వాణానికి ప్రపంచవ్యాప్త చిహ్నంగా మారింది.
శాశ్వత శక్తి: పితృ దోషాలను (వంశపారంపర్య దోషాలను) తగ్గించి, ఆధ్యాత్మిక ప్రశాంతతను సాధించడానికి ఈ చెట్టును ఒక ప్రధాన కేంద్రంగా పరిగణిస్తారు.
🧬 విజ్ఞాన అద్భుతం
సహజ ఆక్సిజన్ మొక్క: చాలా చెట్లు రాత్రిపూట కార్బన్ డయాక్సైడ్ను విడుదల చేస్తుండగా, రావి చెట్టు 24 గంటలూ ఆక్సిజన్ను (ప్రాణవాయువును) అందించే అరుదైన జాతులలో ఒకటి.
పర్యావరణ సంరక్షకుడు: దీని విశాలమైన, దట్టమైన పందిరి ఉష్ణోగ్రతను నియంత్రించడమే కాకుండా, వాతావరణాన్ని శుద్ధి చేయడంలో కూడా ముందుంటుంది.
విలక్షణమైన నిర్మాణం: దీని ఆకుల ప్రత్యేకమైన ఆకృతి వల్ల, అవి చిన్న గాలికి కూడా నిరంతరం కదులుతూ ఉంటాయి. దీనివల్ల చుట్టుపక్కల వాతావరణం ఎల్లప్పుడూ ఉత్సాహంగా, జీవంతో నిండినట్లుగా అనిపిస్తుంది.
🩺 ఔషధ గుణాల నిధి
ఆయుర్వేదంలో, రావి చెట్టును 'విశ్వరూప' (సార్వత్రిక) నివారణగా పరిగణిస్తారు. దీని బెరడు, పండ్లు మరియు లేత ఆకులు శ్వాసకోశ వ్యాధులు, చర్మ వ్యాధులు మరియు రక్త సంబంధిత సమస్యలకు సర్వరోగ నివారిణిగా నిరూపించబడ్డాయి.
"ఏ చెట్టు నీడలో బుద్ధుడు జ్ఞానోదయం పొందాడో; ఏ ఆకులలో దేవతలు కొలువుదీరారో; మరియు దేని శ్వాస నుండి ప్రాణదాత అయిన ఆక్సిజన్ నిరంతరం ప్రవహిస్తుందో—ఆ రావి వడే భారత భూమికి నిజమైన వైభవం."
👇 కామెంట్లలో మాకు తెలియజేయండి: మీ ఇంటి దగ్గర కూడా ఇంతే భారీ, పురాతనమైన రావి చెట్టు ఉందా?
3 weeks ago | [YT] | 336
View 1 reply
Temples Network
భీష్మ ఏకాదశి
విష్ణు సహస్రనామ జయంతి
శ్రీ విష్ణు సహస్రనామం భీష్మపితామహుడు పాండవులకు చేసిన మహోపదేశం. భారత సంగ్రామం పూర్తి అయిన తర్వాత భీష్మపితామహుడు అంపశయ్యపైనే ఉండి పొయ్యాడు. ఎక్కడి వాళ్ళు వారి వారి రాజ్యాలకు వెళ్ళి పోయారు. సుమారు నెల రోజులు గడిచాయి, పాండవులు శ్రీకృష్ణుడు సల్లాపాలు ఆడుకొనే ఒక సమయంలో ఒక నాడు హటాత్తుగా శ్రీకృష్ణుడు పాండవులతో మాట్లాడుతూ ఆగిపోయాడు. పాండవులకు గాబరా వేసింది. ఏమైంది అని శ్రీకృష్ణుడిని అడిగారు. శ్రీకృష్ణుడు వారికి సమాధానం చెబుతూ "మాంధ్యాతి భగవాన్ భీష్మః తపోమే తద్గతం మనః" కురుక్షేత్రంలో అంపశయ్యపై పవళించి ఉన్న భీష్మపితామహుడు నన్ను స్మరించుకుంటున్నాడు. అందుకే నామనస్సు అక్కడికి వెళ్ళి పోయింది. 'హే పాండవులారా! బయలుదేరండి, భీష్ముడి దగ్గరికి. ఎందుకంటే భీష్ముడు ఆస్తికాగ్రేసరుడు, ధర్మాలను అవపోశణం పట్టినవాడు. శాస్త్రాలను పూర్తిగా ఆకలింపు చేసిన మహనీయుడు. మానవాళి తరించడానికి కావల్సిన మార్గాలను స్పష్టంగా తెలిసిన మహనీయుడు. సులభంగా జీవకోటిని తరింపజేయడం ఎట్లానో అవగతం చేసుకొన్న మహనీయుడు. ధర్మ విషయంలో ఏ సంశయాలు ఉన్నా ప్రామాణికంగా తీర్చగలిగిన ఏకైక మహానుభావుడు. ఆయన దేహం నుండి నిష్క్రమించే సమయం ఆసన్నమవుతుంది. ఆయన అస్తమిస్తే లోకంలో ధర్మ సంశయాలని తీర్చే వ్యక్తులు ఎవ్వరూ ఉండరు. అందుకే సూక్శ్మ విషయాలను తెలుసుకుందురు రండి' అని భీష్మ పితామహుడి వద్దకు తీసుకు వచ్చాడు.
భీష్ముడు సుమారు నెలన్నర నుండి భాణాలపైనే పడి ఉన్నాడు. దేహం నిండా బాణాలు, శక్తి పూర్తిగా క్షీణించిపోయింది, అసలే మాఘమాసం ఎండకు ఎండుతూ, మంచుకు తడుస్తూ, నీరు లేదు, ఆహారం లేదు. స్వచ్చంద మరణం తెచ్చుకోగలడు, కాని ఆయన ఇన్ని భాదలు భరిస్తూ ఉండిపొయ్యాడు. ఉత్తరాయణం వరకు ఉండాలి అని అనుకున్నాడు. ఒక ఏకాదశి నాడు దేహం నుండి నిష్క్రమించాలని భగవంతుడిని తలచుకుంటున్నాడు. మనస్సులో శ్రీకృష్ణుడిని సాక్షాత్కరించు కోగలిగేవాడు ఆయన. తన హృదయ మందిరంలోనే శ్రీకృష్ణుడితో మాట్లాడగలిగే వాడు ఆయన. అంత జ్ఞానులైన మహనీయులకు ఈరోజు ఆరోజు అనే నియమం ఉండదు అని ఉపనిషత్తు చెబుతుంది. మరి అట్లాంటి వారు ఏ రోజు నిష్క్రమించినా పరమపదం లభిస్తుంది.ఎవరు కర్మ చేస్తారు అనే నియమం కూడా లేదు. భీష్ముడు తనకి "మాతా పితా బ్రాతా నివాసః శరణం సుహ్రుత్ గతిః గమ్యం సర్వం నారాయణః" అని అనుకున్న మహనీయుడు. ఆయనకు సర్వం శ్రీకృష్ణుడే అని విశ్వసించేవాడు. అందుకు ఆయన ఏనాడు మరణించినా భగవంతుడి సాయిజ్యం కలగక మానదు.
మరి అన్ని రోజులు అంపశయ్య పై ఎందుకు ఉండి పొయ్యాడు ?
ఆయనకు తను చేసిన దోషం ఒకటి స్పష్టంగా జ్ఞాపకం ఉంది. చేసిన ప్రతి దోషం శరీరం పైనే రాసి ఉంటుందట! అది తొలగితే తప్ప సద్గతి ఏర్పడదట. ఏ దోషం చేసాడాయన ? ద్రౌపతికి సభామధ్యంలో అవమానం జరుగుతుంటే ఏం చేయలేక పోయాడు. భగవత్ భక్తురాలికి అవమానం జరుగుతుంటే చూస్తు కూర్చుండి పోయాడు. ద్రౌపతికి శ్రీకృష్ణుడంటే అత్యంత ప్రేమ. తన గురువు వసిష్ఠులవారు చెప్పారట "మహత్యాపది సంప్రాప్తే స్మత్తవ్యః భగవాన్ హరిః" హే ద్రౌపతి! ఇత్రులు ఎవ్వరు తొలగించని ఆపద వచ్చినప్పుడు శ్రీహరిని స్మరించుకో అని. ఆనాడు సభామధ్యంలో తన అయిదుగురు అతి పరాక్రమమైన భర్తలు ఏం చెయ్యలేక పోయారు. వారు కౌరవులకి బానిసలై పోయారు. కౌరవులను ఎదురించడానికి వీలులేకుండా పోయ్యింది. వారు కేవలం సామాన్య ధర్మాన్నే పాటించారు, కాని సాటి మనిషిగా ఆమెను కాపాడాలనే విశేష ధర్మాన్ని ప్రక్కన పెట్టారు. శ్రీకృష్ణుడు తన భక్తులకి జరిగే అవమానాన్ని సహించలేడు. అలా చేసినందుకు మొత్తం వంద మంది కౌరవులను మట్టు పెట్టాడు. ఆ దోషంతో పాండవులకూ అదే గతి పట్టేది. కానీ అలా చేస్తే చివర తను ఎవరిని రక్షించాలని అనుకునాడో ఆ ద్రౌపతికే నష్టం జరుగుతుందని వారిని అట్టే ఉంచాడు. ఈ విషయం భగవంతుడే అర్జునుడితో చెప్పాడు. ఎప్పుడైతే ద్రౌపతికి అవమానం చేసారో వారందరిని అప్పుడే తీసి పాడేసాను, ఇప్పుడు వారు కేవలం కాలిపోయిన కాగితం వలె ఉన్నారే తప్ప, వారిని నేను ఎప్పుడో ఏరిపారేసాను, నీకు ఆ గౌరవం కట్టబెట్టాలని యుద్దం చేయమని చెబుతున్న అని శ్రీకృష్ణుడు అర్జునుడితో అన్నాడు.
బీష్మ పితామహుడు ఆనాడు ధర్మరాజుకు తలెత్తిన సందేహాలను తీరుస్తుంటే, ప్రక్కనే ఉన్న ద్రౌపతి నవ్వుతూ 'తాతా! ఆనాడు నాకు అవమానం జరుగుంటే ఏమైయ్యాయీ ధర్మాలు' అని అడిగిందట. అందుకు భీష్ముడు 'అవును ద్రౌపతి! నా దేహం దుర్యోదనుడి ఉప్పు తిన్నది, నా ఆధీనంలో లేదు. నాకు తెలుసు నీకు అవమానం జరుగుతుందని, కానీ నా దేహం నా మాట వినలేదు. అంతటి ఘోర పాపం చేసాను కనక, ఆ పాప ప్రక్షాళన కోసం ఇన్నాల్లూ అంపశయ్యపై పడి ఉన్నాను'అని చెప్పాడు. హస్తిన సింహాసనాన్ని కాపాడుతాను అని తాను తన తండ్రికి ఇచ్చిన వాగ్దానానికి కట్టుబడి ఉండిపోయాడు భీష్ముడు. కానీ, పరిస్థితుల ప్రభావంచే విశేష ధర్మాన్ని ప్రక్కన పెట్టాడు. ' హే ద్రౌపతీ! కృష్ణ భక్తిలో ఎట్లాంటి కల్మషం లేదు, కానీ శరీరం దుష్టమైపోయింది. దాన్ని పరిశుద్దం చేసుకోవాలనే అంపశయ్యపై పడి ఉన్నాను, అందుకు ఈ నాడు నేను ధర్మాలను చెప్పవచ్చును' అని పాండవులకు ఎన్నో నీతులను భోదించాడు.
శ్రీకృష్ణుడు భీష్మపితామహుడికి దేహబాదలు కలగకుండా వరం ఇచ్చి చెప్పించాడు. నాకెందుకు శక్తినిచ్చి చెప్పిస్తున్నావు, నీవే చెప్పచ్చుకదా అని భీష్ముడు అడిగాడు. అందుకు కృష్ణుడు నేను చెప్పొచ్చుకానీ, నీలాంటి అనుభవజ్ఞుడు చెబితే వచ్చే స్పష్టత నేను చెబితే ఉండదు. నేను చెబితే అది తత్వం, నీవు చెబితే అది తత్వ ద్రష్టం. తత్వాన్ని చూసినవాడు తత్వాన్ని చెప్పాలే తప్ప తత్వం తన గురించి తాను చెప్పుకోదు. నేల నేను ఇంత సారం అని చెప్పగలదా! ఆ నేలలో పండిన మ్రొక్క చెబుతుంది, ఆ నేల ఎంత సారమో. అలాగే నీవు అనుభవజ్ఞుడవి, నీవు ఉపదేశంచేస్తే అది లోకానికి శ్రేయస్సు.
భగవంతుడు సముద్రం లాంటి వాడు, నీరు ఉంటుంది కానీ పాన యోగ్యం కాదు.అదే నీటిని మెఘ వర్షిస్తే పానయోగ్యం. అందుకే భగవత్ జ్ఞానం నేరుగా కాకుండా భగవత్ తత్వం తెలిసిన భీష్ముడి ద్వారా అది అందితే లోకానికి హితకరం. అట్లా శ్రీకృష్ణుడు వరం ఇచ్చి, భీష్ముడి ద్వారా ధర్మ సారాన్ని పాండవులకు ఉపదేశం చేయించాడు. భగవద్గీత శ్రీకృష్ణుడు నేరుగా చెప్పాడు, శ్రీవిష్ణు సహస్రనామాల్ని భీష్ముడి ద్వారా చెప్పించాడు. అందుకే శ్రీవిష్ణు సహస్రనామాల వల్ల సులభంగా తరించ వీలు కలదు.
1 month ago | [YT] | 14
View 1 reply
Temples Network
సజీవ సమాధి వేళ.. గురుశిష్యుల బంధానికి సాక్ష్యం ఈ దివ్య లింగం! 🙏✨
👇
కలియుగ దైవం శ్రీమద్విరాట్ పోతులూరి వీరబ్రహ్మేంద్రస్వామి వారు భవిష్యత్ తరాల కోసం "సజీవ సమాధి"లోకి ప్రవేశించి, శాశ్వత తపోనిష్ఠలో ఉండాలని నిర్ణయించుకున్నారు.
ఆ సమయంలో అక్కడ లేని ప్రియ శిష్యుడు సిద్దయ్య, విషయం తెలుసుకొని పరుగున వచ్చారు. అప్పటికే గురువుగారు సమాధిలోకి వెళ్ళిపోయారని తెలిసి, "మీరు లేని లోకంలో నేను ఉండలేను" అంటూ ప్రాణత్యాగానికి సిద్ధపడ్డారు.
భక్తసులభుడు అయిన వీరబ్రహ్మేంద్ర స్వామి వారు, శిష్యుడి ఆర్తనాదాన్ని విలపించలేక, సజీవ సమాధిలో ఉన్నవారు తపోనిష్ఠ నుండి బయటకు వచ్చి, సిద్దయ్యను ఓదార్చారు. తాను భౌతికంగా సమాధిలో ఉన్నా, తన తపోశక్తి ఎప్పుడూ తోడుంటుందని అభయమిస్తూ సిద్దయ్య చేతికి అందించిన అపురూపమైన కానుక ఈ చిత్రంలో ఉన్నది!
దీనిని "అర్ధనారీశ్వర బాణలింగం" (శివశక్తి స్వరూపం) అంటారు.
దీని ప్రత్యేకత & ఉపయోగం:
గురు సాన్నిధ్యం: స్వామివారు సజీవ సమాధిలో ఏకాంతంలోకి వెళ్తున్నారు కాబట్టి, బాహ్య ప్రపంచంతో మాట్లాడరు. అందుకే తన ప్రతిరూపంగా, తన ప్రాణశక్తిని, తపోబలాన్ని ఈ లింగంలోకి ఆవాహన చేసి సిద్దయ్యకు ఇచ్చారు.
అర్ధనారీశ్వర తత్వం: ఇందులో సగం ఎరుపు, సగం తెలుపు రంగులో ఉండటం ప్రకృతి-పురుషుల ఐక్యతకు నిదర్శనం.
సాధన: సిద్దయ్య స్వామి వారికి భవిష్యత్తులో రాబోయే ఆటంకాలను తట్టుకోవడానికి, మనసు నిలకడగా ఉండడానికి, గురువుతో నిత్యం అనుసంధానమై ఉండడానికి ఈ లింగం ఉపయోగపడింది.
ఇది రాయి మాత్రమే కాదు, సాక్షాత్తు బ్రహ్మంగారి గుండెచప్పుడు. గురువు సజీవంగా ఉన్నా, శిష్యుడికి భౌతికంగా దూరమవుతున్న వేళ ఇచ్చిన దివ్య రక్షా కవచం ఇది.
ఓం శ్రీ వీరబ్రహ్మేంద్ర స్వామినే నమః 🙏
ఓం శ్రీ సిద్దయ్య స్వామినే నమః 🙏
1 month ago | [YT] | 6
View 0 replies
Temples Network
ఏకాదశ రుద్రులు ( Ekadasa rudrulu )
ఏకాదశ రుద్రులు అంటే శివుని పదకొండు రూపాలు లేదా అవతారాలు, వీరు హిందూ పురాణాల ప్రకారం వివిధ పేర్లతో ప్రస్తావించబడతారు, మత్స్య పురాణం ప్రకారం కపాల, పింగళ, భీమ, విరూపాక్ష, విలోహిత, అజపాద, అహిర్బుధన్య, శాస్త, శంభూ, చండ, భవ అనేవి వారి పేర్లు, వీరికి శివాలయాల్లో, ముఖ్యంగా కోనసీమ వంటి ప్రాంతాల్లో ప్రత్యేక పూజలు జరుగుతాయి, ఇవి శివునిలోని శక్తిని, ఉగ్ర రూపాన్ని సూచిస్తాయి.
మత్స్య పురాణం ప్రకారం: కపాల, పింగళ, భీమ, విరూపాక్ష, విలోహిత, అజపాద, అహిర్బుధన్య, శాస్త, శంభూ, చండ, భవ.
విష్ణు పురాణం ప్రకారం (మగ రూపాలు): మన్యు, మను, మహమస, మహాన్, శివ, ఋతుధ్వజ, ఉగ్రరేత, భవ, కామ, వామదేవ, ధృతవ్రత
మహాభారతం ప్రకారం: మృగవ్యాధ, సర్ప, నిరృతి, అజైకపాద్, అభివర్ధన, పినాకి, దహన, ఈశ్వర, కపాలి, స్థాను, భర్గ.
వాల్మీకి రామాయణం ప్రకారం: అజ, ఏకపాద, అభీర్బుధ్యా, హర, శంభూ, త్రయంబక, అపరాజిత, ఈశాన, త్రిభువన, త్వష్ట, రుద్ర.
ప్రభల తీర్థానికి 476 ఏళ్ల చరిత్ర - ప్రభల ఉత్సవానికి రాష్ట్ర పండగ హోదా కల్పించిన ప్రభుత్వం - కనుమ రోజు సంప్రదాయంగా ప్రభల తీర్థం వేడుక. కోనసీమ అందాలు ఇంద్రదనసుల్లా కొలువు తీరే ప్రభల తీర్ధం కన్నుల పండుగలా కనుమనాడు జరుగుతుంది.
మారుతున్న కాలంలో నాటికీ నేటికి సాంస్కృతిక సంప్రదాయాలకు ఆదరణ తగ్గలేదనటానికి ఈ ప్రభల ఉత్సవాలే ఉదాహరణ. 17వ శతాబ్దంలో జగ్గన్న మహారాజుగా పిలిచే రాజా వత్సవాయ జగన్నాథ మహారాజు 11 మంది ఏకాదశి రుద్రులంతా ఒకచోట కొలువు తీరాలనే సంప్రదాయాన్ని ప్రారంభించారు. అప్పట్నుంచి కనుమ పండగ రోజు ఈ సంప్రదాయాన్ని కొనసాగిస్తున్నారు. ఈ తోట మొసలపల్లి గ్రామములో వుంది కనుక దీనికి ఆతిధ్యము మొసలపల్లి కి చెందిన మధుమానంత భొగేశ్వరుడు మిగతా గ్రామ రుద్రులకు ఆతిధ్యము ఇస్తారు. ఈ రుద్రుడు అన్ని ప్రభల కన్నా ముందే తోటకు చేరుకుని అందరు రుద్రులూ తిరిగి వెళ్లిన తరువాత వెళ్లడం ఆనవాయితీ.ఈ ఏకాదశ రుద్రులకు అద్యక్షత వహించేది వ్యాఘ్రేశ్వారానికి చెందిన రుద్రుడు
"శ్రీ వ్యాఘ్రేశ్వరుడు".ఈ వ్యాఘ్రేశ్వరుడు కి చెందిన ప్రభ తోటలోకి రాగానే మిగతా రుద్ర ప్రభలన్నింటినీ మర్యాదా పుర:స్సరంగా ఒక్కసారి లేపి మళ్ళి కిందకు దించుతారు. ఈ 11 శివుళ్ళకు వ్యాఘ్రేశ్వరుడు అధిష్టానము.
ఇక్కడ మరో విశిష్టత ఏమిటీ అంటే గంగలకుర్రు మరియూ గంగలకుర్రు(అగ్రహారం) రుద్ర ప్రభలు ఈ తోట కి రావాలంటే మధ్యలో కాలువ(కౌశిక) దాటాలి.ఆ ప్రభలు ఆ కాలువలోంచి ఏ మాత్రం తొట్రూ లేకుండా "హరా హరా" అంటూ తీసుకువచ్చే ఆ గ్రామస్తుల ధైర్యం చూడడానికి రెండు కళ్ళు చాలవు. ఎందుకంటే కాలువలో మామూలుగానే నడువలేము. అలాంటిది ఒక 50 మంది మోస్తే కానీ లేవని ప్రభ ఆ కాలువలోంచి తోటలోకి తీసుకువచ్చే సన్నివేశం చూసేవారికి ఒల్లు గగుర్పొడుస్తుంది.ఇక ఆ కాలువలోకి వచ్చే ముందు ఒక వరి చేనుని ఆ ప్రభలు దాటవలిసి వస్తుంది. ఆ చేను ని తొక్కుతూ పంటను తొక్కుతూ వచ్చినా రైతులు భాదపడక సాక్షాత్తూ ఆ పరమేశ్వరుడు తమ చేల గుండా వెళ్ళడం పూర్వజన్మ సుకృతం గా భావిస్తారు. అలా ఏక కాలం లో ఏకాదశ రుద్రుల(11ప్రభలు) దర్శనం చేస్తుంటే కళ్ళు ఆనందాశ్రువులు రాలుస్తాయి.
దర్శనీయ ప్రణాళిక
అమలాపురం నుంచి రావులపాలెం పోవు బస్సులో ముక్కామల చేరుకోవాలి. ముక్కామల ఆటో స్టాండ్ నుంచి ఒక ఆటో ఏర్పాట్టు చేసుకోవాలి.
1) ముందుగా ముక్కామల శివాలయ దర్శనం
(కాలాగ్నిరుద్రాయ).
2) ముక్కామల నుంచి నేదునూరుకు ప్రయాణం. నేదునూరు శివాలయ దర్శనం (త్రికాగ్నికాలయ) తర్వాత వక్కలంక ప్రయాణం.
3) వక్కలంక శివాలయ దర్శనం (త్రిపురాంతకాయ) పిమ్మట ఇరుసుమండకు ప్రయాణం (వయా) ముక్కామల.
4) ఇరుసుమండ శివాలయ దర్శనం (త్ర్యంబకాయ) పిమ్మట పులేటికుర్రుకు ప్రయాణం.
5) పులేటికుర్రు శివాలయ దర్శనం (శ్రీ మన్మహాదేవాయ) పిమ్మట వ్యాఘ్రేశ్వరంకు ప్రయాణం.
6) వ్యాఘ్రేశ్వరం శివాలయ దర్శనం (విశ్వేశ్వరాయ) పిమ్మట కె. పెదపూడికు ప్రయాణం.
7) కె. పెదపూడి శివాలయ దర్శనం (మహాదేవాయ) పిమ్మట గంగలకుర్రుకు ప్రయాణం.
8) గంగలకుర్రు శివాలయ దర్శనం (సదాశివాయ) పిమ్మట గంగలకుర్రు అగ్రహారంకు ప్రయాణం.
9) గంగలకుర్రుక అగ్రహారం శివాలయ దర్శనం (సర్వేశ్వరాయ) పిమ్మట పాలగుమ్మి కు ప్రయాణం.
10. పాలగుమ్మి శివాలయ దర్శనం (మృత్యుంజయాయ) పిమ్మట మొసలపల్లి కు ప్రయాణం.
11. మొసలపల్లి శివాలయ దర్శనం (నీలకంఠాయ) పిమ్మట ముక్కామలకు తిరుగు ప్రయాణం. ముక్కామల నుంచి ఇంటికి ప్రయాణం.
ఏకాదశ రుద్రులును ఏక కాలములో సందర్శించుట పుణ్య దాయకం. వాటిని భక్తి శ్రద్ధలతో పూజించాలి. తద్వారా సకల పాపాల నుండి విముక్తులవుతారు. వ్యాధులు నుంచి విముక్తి పొందగలరు అని భక్తుల ఘాడ విశ్వాసం.
స్వంత వాహనములు కలిగిన వారు అమలాపురం నుంచి మొసలపల్లి చేరుకుంటారు. చివరి క్షేత్రంగా నేదునూరు చేరుకుంటారు. నేదునూరు నుంచి అయినవిల్లికి బయులుదేరుతారు.
1 month ago | [YT] | 30
View 0 replies
Temples Network
1 year ago | [YT] | 3
View 0 replies
Temples Network
శ్రీకాళహస్తి దర్శనం తరువాత నేరుగా ఇంటికే ఎందుకు వెళ్ళాలి..??
పంచ భూతాల నిలయమైన ఈ విశ్వంలో గాలి, నింగి, నేల, నీరు, నిప్పు వాటికి ప్రతీకలుగా భూమి మీద పంచభూత లింగాలు వెలిసాయి. అందులో ఒకటి చిత్తూరు జిల్లాలోని శ్రీకాళహస్తిలోని శ్రీకాళహస్తీశ్వరునిగా వెలసిన వాయులింగం.
అయితే ఇక్కడి గాలిని తగిలిన తరువాత మరే దేవాలయానికి వెళ్లకూడదు అనేది ఇక్కడి ఆచారం. అందులో నిజం లేకపోలేదు. సర్పదోషం, రాహుకేతువుల దోషం ఇక్కడికి వచ్చాక పూర్తిగా తొలగుతాయని చెబుతారు. శ్రీకాళహస్తిలోని సుబ్రహ్మణేశ్వరుని దర్శనంతో కాలసర్పదోషం తొలుగుతుంది. ప్రత్యేక పూజలు చేసుకున్న వారు నేరుగా ఇంటికే వెళ్లాలని చెబుతారు ఇక్కడి పూజారులు. కారణం దోష నివారణ జరగాలంటే శ్రీకాళహస్తిలో పాపాలను వదిలేసి ఇంటికి వెళ్లడమే. తిరిగి ఏ ఇతర దేవాలయాలకు వెళ్లినా దోష నివారణ జరగదని ఇక్కడి విశ్వాసం.
గ్రహణాలు, శని బాధలు పరమశివుడికి ఉండవని మిగతా అందరు దేవుళ్ళకు శని ప్రభావం, గ్రహణ ప్రభావం ఉంటుందని పురాణాలలో ఉంది. ఇందుకు నిదర్శనంగా తిరుమల శ్రీ వేంకటేశ్వరుని దేవాలయంతో సహా మిగిలిన అన్ని దేవాలయాలు దేశవ్యాప్తంగా గ్రహణ సమయంలో మూసివేస్తారు. గ్రహణ అనంతరం సంప్రోక్షణ జరిపిన తరువాతే పునఃదర్శనం ప్రారంభమవుతుంది.
కానీ మూసివేయని ఒకే ఒక్క దేవాలయం శ్రీకాళహస్తిలోని శ్రీకాళహస్తీశ్వరునిది. ఇక్కడి దేవుడికి గ్రహణ ప్రభావం ఉండదని పురాణాల్లో చెప్పబడింది. గ్రహణ సమయంలో ఇక్కడ ప్రత్యేక పూజలు జరుగుతాయి.
గ్రహణ సమయంలో భక్తుల దోష నివారణ పూజలు ఎక్కువగా చేస్తారు. అందుకే ఇక్కడి దేవుడి దర్శనం చేసుకున్నాక ఇక ఏ దేవాలయానికి వెళ్లనవసరం లేదు అన్నది పెద్దల మాట.
1 year ago | [YT] | 2
View 0 replies
Temples Network
చాగంటి కోటేశ్వర రావు గారి గూర్చి చాలామందికి తెలియని కొన్ని సంగతులు -
ఇవాళ సినిమా హీరోలలో అగ్రహీరోలకు ఏమాత్రం తీసిపోని పేరుప్రఖ్యాతులు కలిగిన ప్రవచనకారుడు బ్రహ్మశ్రీ చాగంటి కోటేశ్వర రావు గారు. గత పదిహేనేళ్లలో ఆయన సాధించిన ప్రతిష్ట మరే ఇతర ఆధ్యాత్మికవేత్తలకు దక్కలేదు అనేది నిస్సందేహం. అఖండ ప్రజ్ఞావంతుడు, పండితుడు, వేదమూర్తి చాగంటి వారు. ఆయన ఎంతటి ఖ్యాతి గడించారో , కొన్ని వివాదాల్లో కూడా చిక్కుకున్నారు. సునాయాసంగా బయటపడ్డారు.
చాగంటివారు ఫుడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లో మేనేజర్ గా పనిచేస్తున్నారు. ఆయన భార్య వ్యవసాయశాఖలో ఉన్నతాధికారిణి. ఏ ఛానెల్లో చూసినా చాగంటి వారి ప్రవచనాలు కనిపిస్తుంటాయి. అవి చూస్తే అసలు చాగంటి వారు ఏనాడైనా ఆఫీసుకు వెళ్తారా అనే సందేహం కలుగుతుంది ఎవరికైనా. కానీ చాగంటివారు ఆఫీసుకు ఒక్కరోజు కూడా సెలవు పెట్టరు. ఒక్కసారి కూడా లేట్ పెర్మిషన్స్ తీసుకోరు. ఆయన కేవలం శనివారం, ఆదివారం మాత్రమే ప్రవచనాలు ఇస్తారు. అవి కూడా కాకినాడలోని ఒక దేవాలయంలో. ఛానెల్స్ వారు అక్కడికి వెళ్లి రికార్డ్ చేసుకుని ప్రసారం చేస్తుంటారు.
చాగంటి వారికి ఉన్న ప్రతిభాసంపత్తిని సొమ్ము చేసుకోదలచుకుంటే ఈపాటికి ఆయన వందల ఎకరాల భూములు, ఇల్లువాకిళ్ళు, మణిమాణిక్యాలు సంపాదించేవారు. కానీ ప్రవచనాలను ఆయన నయాపైసా పారితోషికం తీసుకోరు. ఎక్కడికైనా బయట నగరాలకు వెళ్లి ప్రవచనాలు ఇవ్వాల్సివస్తే ఆయన తన సొంత డబ్బుతో స్లీపర్ క్లాస్ టికెట్ కొనుక్కుని ప్రయాణం చేస్తారు తప్ప నిర్వాహకులనుంచి డబ్బు తీసుకోరు. ఆయనకున్నది కేవలం రెండు పడకగదుల చిన్న ఇల్లు. ఇంతవరకు ఆయనకు కారు లేదు. ఆఫీసుకు కూడా మోటార్ సైకిల్ మీద వెళ్తారు. ఎఫ్ సి ఐ డైరెక్టర్ క్రైస్తవుడు. చాగంటి వారు ఆఫీసుకు వెళ్ళగానే ఆయనే స్వయంగా వచ్చి బూట్లు విప్పి చాగంటి వారికి నమస్కారం చేస్తారు. సెలవులను ఉపయోగించుకోమని, కావాలంటే లేట్ అనుమతులు తీసుకోమని చెప్పినా చాగంటివారు ఆ సౌకర్యాలను ఎన్నడూ వినియోగించుకోలేదు.
చాగంటి వారికి ఆరేడేళ్ల వయసులో జనకులు గతించారు. ఆయనకు ఒక అక్క, ఒక చెల్లెలు, ఒక తమ్ముడు ఉన్నారు. తల్లిగారు కస్టపడి నలుగురు పిల్లలను పెంచారు. వారికి ఆస్తిపాస్తులు లేవు. నిరుపేద కుటుంబం. సంసారానికి తాను మాత్రమే పెద్ద దిక్కు అన్న స్పృహ పొటమరించగా చాగంటి వారు అహోరాత్రాలు సరస్వతీ ఉపాసనే లక్ష్యంగా విద్యను అభ్యసించారు. పాఠశాల స్థాయినుంచి ఆయన విద్యాబుద్ధులు వికసించాయి. వేదాగ్రణి ఆయన రసన మీద తిష్టవేసుకుని కూర్చున్నది. ఫలితంగా ఆయన యూనివర్సిటీ స్థాయివరకు గోల్డ్ మెడలిస్టుగా ఎదిగారు.
ఇక ఆయన ఇవాళ చెప్పే ప్రవచనాల వెనుక ఆయనేదో వేదవేదాంగాలు, పురాణాలు, ఉపనిషత్తులు ఆపోసన పట్టారని చాలామంది పొరపడతారు. ఆయన కృషి పెద్దగా లేదు. అవన్నీ ఆయనకు పూర్వజన్మ సుకృతంగా లభించినవి అంటే మనం ఆశ్చర్యపోవాలి. ఇది వారికి భగవంతుడు ఇచ్చిన వరం తప్ప ఈ జన్మకృషి కాదు. అలా అని ఆయన వాటిని చదవలేదని కాదు. ఎంతచదివినా ధారణాశక్తి అనేది ప్రధానం. ఒకసారి శంకరుల సౌందర్యలహరి తిరగేస్తే అది మొత్తం ఆయన మదిలో నిలిచిపోతుంది. ఎక్కడ ఏ పేజీలో ఏమున్నదో చెప్పగలరు. వరప్రసాదితులకు మాత్రమే ఇది సాధ్యం.
ఆయన ఉద్యోగంలో చేరాక తోబుట్టువుల బాధ్యతను స్వీకరించారు. అక్క, చెల్లెలు, తమ్ముడుకు తానె తన సంపాదనతో వివాహాలు చేశారు. కుటుంబం కోసం తన కష్టార్జితాన్ని మొత్తం ధారపోశారు. తనకంటూ ఈరోజు వరకు బ్యాంకు బాలన్స్ లేదంటే నమ్ముతారా?
అప్పుడపుడు కాకినాడలో అయ్యప్ప దేవాలయంలో సాయంత్రం కూర్చుని భక్తులముందు భారతభాగవత ప్రవచనాలు ఇచ్చేవారు. ఎన్నడూ పట్టణం దాటి ఎరుగరు. ఏనాడూ డబ్బు పుచ్చుకునే వారు కారు. ఆయన స్వరలాలిత్యం, ధారణ, విజ్ఞానం, విశదీకరణ భక్తులను ఆకర్షించాయి. అభిమానులు పెరిగారు.
పీవీ నరసింహారావు ప్రధానమంత్రిగా ఉన్న సమయంలో అనుకుంటాను.. ఎక్కడో ఒకచోట చాగంటి వారిని కలిశారు. "మీ గురించి ఎంతో విన్నాను. మీ ఆధ్యాత్మిక పరిజ్ఞానం అసాధారణం. మీ ప్రవచనాలు నాకు బాగా నచ్చాయి. ముఖ్యంగా మీ పాండితీప్రకర్ష అమోఘం. ఇప్పుడు నేను మంచి స్థితిలో ఉన్నాను. ఏమైనా అడగండి. చేసిపెడతాను" అన్నారు పీవీ.
చాగంటి వారు నవ్వేసి "మీకూ, నాకు ఇవ్వాల్సింది ఆ పరమాత్మే తప్ప మరెవరూ కారు. మీ సహృదయానికి కృతజ్ఞతలు. నాకేమీ ఆశలు లేవు." అని నమస్కరించి బయటకు వెళ్లిపోయారు.
ఈనాటికి కూడా ఆయనకు ఉన్నది కేవలం రెండు మూడు ధోవతులు, నాలుగు పంచెలు, నాలుగు జతల ఆఫీస్ బట్టలు!!
చాగంటివారిని చూసి ఆయన ఎన్నో ఏళ్ళనుంచి ప్రవచనాలు ఇస్తున్నారని, లక్షలు సంపాదించి ఉంటారని చాలామంది భావిస్తుంటారు. ఆయన బయటప్రాంతాల్లో ప్రవచనాలు ఇవ్వడం వారి అమ్మగారు 1998 లో స్వర్గస్తులు అయ్యాక ప్రారంభించారు. ఎందుకంటే చాగంటి వంశంలో గత ఆరు తరాలుగా ఆ సరస్వతి కటాక్షం ఎవరో ఒక్కరికే వస్తున్నది. ఈ తరంలో ఆ శారదాకృప నలుగురు పిల్లలలో చాగంటి కోటేశ్వర రావు గారిపై ప్రసరించింది. ఆ మాత దయను తృణీకరించలేక తనకు తెలిసిన జ్ఞానాన్ని లోకానికి పంచుతున్నారు చాగంటి వారు.....
ధుర్మార్గులను ఖండించక పోవుట ఏంతటి తప్పో
ఇట్టువంటి మహాత్ములను ప్రశంసించక పోవడం గూడా అంతే తప్పు ఔతుంది
ఒక మహోన్నతమైన వ్యక్తిని కీర్తించడం పదుగురికీ తెలియజేస్తున్న మీ మహోన్నత వ్యక్తిత్వం ప్రశంసనీయం ధన్యవాదములు🙏🙏
1 year ago | [YT] | 2
View 0 replies
Temples Network
వరాహ లక్ష్మీనరసింహ స్వామి దేవస్థానం, సింహాచలం💫
శ్రీ వరాహ లక్ష్మీనరసింహస్వామి దేవస్థానం, విశాఖపట్టణంలో సింహాచలం అనే ప్రాంతంలో, నగర నడిబొడ్డు నుండి 11 కి.మీ. దూరంలో తూర్పు కనుమలలో పర్వతంపైన ఉన్న ప్రముఖ హిందూ పుణ్యక్షేత్రం. ఈ క్షేత్రాన విశాఖ పరిసర ప్రాంతాల్లో ప్రజలు సింహాద్రి అప్పన్న గా పిలిచే వరాహ లక్ష్మీ నరసింహస్వామి కొలువై ఉన్నాడు. ఈ దేవాలయం సముద్రమట్టానికి 244 మీ ఎత్తున సింహగిరి పర్వతంపై ఉంది. ప్రస్తుత ఆలయాన్ని 13వ శతాబ్దంలో ఒడిషాకు చెందిన తూర్పు గంగా రాజు లాంగుల నరసింగ దేవ I కళింగ వాస్తుశిల్పం ప్రకారం నిర్మించారు మరియు 1268 ADలో అతని కుమారుడు భానుదేవ I చేత ప్రతిష్ఠించబడింది.
ఇది దక్షిణ భారతదేశంలోని ముఖ్యమైన వైష్ణవ పుణ్యక్షేత్రాలలో ఒకటి. సంవత్సరానికి 12 గంటలు మాత్రమే ఈ దేవుని నిజరూప దర్శనం భక్తులకు లభిస్తుంది. మిగిలిన సమయంలో ఈ విగ్రహం చందనంతో కప్పబడి ఉంటుంది. నిజరూప దర్శన సమయాన్ని చందన యాత్ర లేదా చందనోత్సవం అని అంటారు. ఇది ప్రతీ సంవత్సరం వైశాఖ మాసం శుద్ధ తదియ నాడు వస్తుంది.
స్థలపురాణం
సింహాచలం చరిత్ర ఆధారాలతో సహా పదకొండవ శతాబ్దం వరకు కనిపిస్తుంది. కాని భారత ఇతిహాసాల ప్రకారం ఇది ఇంకా పురాతనమైనదై ఉండవచ్చు. సింహాచలం అంటే సింహం పర్వతం అని అర్థం. ఇక్కడ మహావిష్ణువు దశావతారాలలో నాల్గవదైన లక్ష్మీ నరసింహ అవతారమూర్తిగా వెలశాడు. ఇతిహాసం ప్రకారం రాక్షస రాజు హిరణ్యకశిపుడు విష్ణువుకు బద్ధవైరి. తన కుమారుడైన ప్రహ్లాదుడిని పుట్టుకతోనే విష్ణు భక్తుడు. అనేక విధాల ప్రయత్నించి, కుమారుని విష్ణు విముఖుణ్ణి చెయ్యలేకపోతాడు.
చివరికి చంపించేందుకు కూడా ప్రయత్నిస్తాడు. కానీ ప్రతిసారీ ప్రహ్లాదునిని విష్ణుమూర్తి రక్షిస్తాడు. విసిగిన హిరణ్యకశిపుడు 'విష్ణువు సర్వవ్యాప్తమని చెబుతున్నావు కదా, ఏడీ ఈ స్తంభంలో ఉన్నాడా? చూపించు' మని స్తంభాన్ని పగలగొట్టగా విష్ణువు నరసింహస్వామిగా స్తంభాన్ని చీల్చుకొనివచ్చి, హిరణ్యకశిపుని సంహరించి, ప్రహ్లాదుడిని రక్షించాడు.
స్థలపురాణం ప్రకారం ప్రహ్లాదుడు ఇక్కడ మొట్టమొదటగా వరాహనరసింహ స్వామి విగ్రహన్ని ఆరాదించాడు. ఆ తరువాతి కాలంలో చంద్రవంశానికి చెందిన పురూరవుడు అనే రాజు విమానం మీద వెళ్ళుతుండగా ఈ స్థలానికి ఉన్న అత్యంత ప్రశస్తమైన శక్తి ప్రభావం వల్ల పురూరవుడి విమానం క్రిందకు ఆకర్షించబడింది. అతడికి పుట్టలో కప్పబడి ఉన్న వరాహనరసింహస్వామి కనిపించాడు. విగ్రహాన్ని సంవత్సరకాలం పాటు చందనంతో కప్పి ఉంచి వైశాఖ శుద్ధ తదియ రోజు మాత్రమే చందనం లేకుండా నిజరూప దర్శనం కలిగే టట్లు చేయమని ఆకాశవాణి పురూరవుడికి చెబుతుంది.
ఆకాశవాణి పలికిన పలుకుల మేరకు పురూరవుడు వరాహనరసింహ స్వామికి దేవాలయాన్ని నిర్మించాడు. ఆ సాంప్రదాయం ఇప్పటికీ పాటించడుతోంది. స్వామిలోని వేడిని చల్లార్చడానికి చందనంతో పూత పూస్తుంటారు. వరాహం నరుడు, సింహం రూపాలు కలిసిన ఈ నరసింహుని అవతార నిజరూపం త్రిభంగ ముద్రలో (ఆసనంలో) వరాహం తల సింహం తోక కలిగిన మనిషి శరీరంతో ఉంటుంది. మిగిలిన సమయంలో చందనం కప్పబడి లింగాకృతిలో స్వామివారి నిత్యరూపం ఉంటుంది. ప్రతి సంవత్సరం వచ్చే వైశాఖ శుద్ధ తదియ (వైశాఖ పూర్ణిమకు దగ్గరలో) నాటికి చందనం తీసివేసి నిజరూప దర్శనం ఇస్తారు.
1 year ago | [YT] | 4
View 0 replies
Temples Network
కర్మ ఫలం ఒదిలించుకో తరం కానిది జాగ్రత్త !!!
కర్ణుడి రథచక్రం భూమిలో ఇరుక్కుపోవడంతో రథం దిగి దాన్ని సరిచేయడం ప్రారంభించాడు. ఆ సమయంలో అతడు ఆయుధాలు లేకుండా ఉన్నాడు... శ్రీకృష్ణుడు వెంటనే కర్ణుని బాణంతో చంపమని అర్జునుని ఆదేశించాడు.
భగవంతుని ఆజ్ఞను పాటించిన అర్జునుడు కర్ణుని లక్ష్యంగా చేసుకుని ఒకదాని తర్వాత ఒకటి బాణాలు ప్రయోగించాడు. కర్ణుడు నేలపై పడిపోయాడు.
మరణానికి ముందు నేలమీద పడిన కర్ణుడు శ్రీకృష్ణుడిని ఇలా అడిగాడు, "నీవేనా ప్రభూ ఇలా చేసింది ? ఇది నీ న్యాయమైన నిర్ణయమేనా! నిరాయుధుడిని చంపమని ఆజ్ఞ ఇచ్చావా
సచ్చిదానందమయుడైన శ్రీకృష్ణుడు చిరునవ్వు నవ్వి, "అర్జునుని కొడుకు అభిమన్యుడు కూడా చక్రవ్యూహంలో నిరాయుధుడై ఉన్నాడు, అందరూ కలిసి నిర్దాక్షిణ్యంగా అతన్ని చంపినప్పుడు,
అందులో నువ్వు కూడా ఉన్నావు కర్ణా. అప్పుడు నీ జ్ఞానం ఎక్కడ ఉంది, అప్పుడు అభిమన్యుడు నిరాయుధుడుగా ఉన్నాడని ఇది అధర్మం అని ఎప్పుడు అనిపించలేదా కర్ణా, ఇది కర్మ ప్రతిఫలం. ఇదే న్యాయం, అన్నాడు కృష్ణ పరమాత్మ.
ఆలోచనాత్మకంగా పని చేయండి. ఒకరి బలహీనతను ఉపయోగించుకోకండి. అదే కర్మ భవిష్యత్తులో మీ కోసం వేచి ఉంటుంది మరియు అది మీకు దాని ప్రతిఫలాన్ని ఇస్తుంది.
ఏ విత్తు నాటితే ఆ మొక్క మొలుస్తుంది గోడకు కొట్టిన బంతి తిరిగి వచ్చినట్టు. రామాయణ, భారతం మొదలగు ఇతిహాసాలు, చరిత్ర, కథలు, పురాణాలు చూసినా అదే బోధ పడుతుంది...స్వస్తీ.
ఓం నమో నారాయణాయ
1 year ago (edited) | [YT] | 2
View 0 replies
Temples Network
#arunachalam #Tiruvannamalai
అరుణాచలం వెళ్లకముందు వెళ్ళిన తర్వాత అని భగవంతుడు మధ్యలో ఒక గీత గీస్తాడు
కార్తీక పౌర్ణమి రోజు గిరి ప్రదక్షిణ చేస్తే ఎంతటి పుణ్యంమో దాని తరువాత చైత్రమాస మొదటి పూర్ణమ్మకు అంతే వశిష్ఠ ఉంది🙏 #కాశి మరియు అరుణాచలం వెళ్లడం మన చేతుల్లో ఉండదు #శివుడి ఆజ్ఞ ఉంటేనే వెళ్ళగలము
ఆ మహా దేవుడి అనుగ్రహంతో చైత్రమాస మొదటి పూర్ణిమ రోజు గిరిప్రదక్షిణతో పాటు స్వామివారిని దర్శించుకునే అదృష్టం కలిగింది
స్వామి వారు అక్కడ అగ్ని లింగం
దర్శనం చేసుకుంటుంటే అగ్ని లింగం నుండి వచ్చే వేడి మనకు తెలుస్తుంది ఇది నిజంగా అద్భుతం. దర్శనానికి వెళ్లడానికి ముందు ఒక సొరంగంలో శివలింగం దగ్గర రమణులు తపస్సు చేశారు ఆ ప్లేస్ కి వెళ్ళగానే మన ఒంటిమీద ఏదో తగిలినట్టు స్పర్శ తెలుస్తుంది మరియు మెదడులో ఏ ఆలోచనలు మేదలవు ఎందుకు అలా ఉంది అని అడిగితే రమణులు తపస్సు చేసిన ప్రదేశం కాబట్టి చాలా పవర్ఫుల్ అని చెప్పారు🙏 గుడి మొదటి గోపురం నుండి లోపలికి వెళుతుంటే ఐదారు గోపురాలు కనిపిస్తాయి అన్నిటిని దాటుకుని వెళుతూ ఉంటే ఆ గుడి అందం చెప్పడానికి మాటలు సరిపోవు
అక్కడ ఉండే #రమణాశ్రమం వర్ణన మాటల్లో చెప్పలేనిది అక్కడ అత్యధికులు విదేశీయులు ధ్యానం చేసుకునే వారే అక్కడ నుండి కొండమీదకు వెళ్ళే మార్గంలో స్కంద ఆశ్రమం విరూపాక్ష ఆశ్రమం ఉంటుంది. వి ఎస్ మూర్తి
ఇప్పటికీ గిరి ప్రదక్షిణ చేస్తున్నప్పుడు కొందరికి సిద్ధులు కనిపిస్తారు అని ప్రతీతి
ప్రతి హిందువు తప్పకుండా దర్శించవలసిన క్షేత్రం
🙏 ఓం శ్రీ అరుణాచల శివ అరుణాచల శివ
అరుణాచల శివ🌹
అరుణాచల శివ అరుణాచల శివ అరుణాచల శివ అరుణాచల శివ అరుణాచల శివ అరుణాచల శివ అరుణాచల శివ అరుణాచల శివ అరుణాచల శివ అరుణాచల శివ అరుణాచల శివ అరుణాచల శివ అరుణాచల శివ అరుణాచల శివ అరుణాచల శివ అరుణాచల శివ అరుణాచల శివ అరుణాచల శివ అరుణాచల శివ అరుణాచల శివ అరుణాచల శివ 🙏
1 year ago | [YT] | 2
View 0 replies
Load more