“గురు బ్రహ్మా, గురు విష్ణుః, గురు దేవో మహేశ్వరః గురుః సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః.”🙏
అందరికీ గురుపూర్ణిమ శుభాకాంక్షలు!🙏
గురుపూర్ణిమ అనేది గురువుల పట్ల కృతజ్ఞత, గౌరవం మరియు భక్తిని వ్యక్తం చేసే పవిత్రమైన రోజు. మన జీవితంలో అజ్ఞానాంధకారాన్ని తొలగించి జ్ఞాన వెలుగును ప్రసాదించే వారు గురువులు. తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు, ఆధ్యాత్మిక గురువులు మరియు మనకు మంచి మార్గం చూపే ప్రతి ఒక్కరూ గురువులే.
ఈ పవిత్రమైన గురుపూర్ణిమ సందర్భంగా మన గురువుల ఆశీస్సులు ఎల్లప్పుడూ మనపై ఉండాలని కోరుకుంటూ, వారి సేవలను, బోధనలను జీవితాంతం గుర్తుంచుకొని ఆచరిద్దాం.🙏🚩
#కాశీలోని ఏకాదశ రుద్రులలో ఈ స్వరూపం ప్రధానమైన శ్రీ కాశీ మనఃప్రకామేశ్వర మహాదేవాయనమః
స్కందపురాణంలోని కాశీఖండము మరియు ఇతర ధర్మశాస్త్రాల ప్రకారం భగవాన్ శివుడు పార్వతీ దేవితో ఇలా అన్నారు.
"ఓ దేవీ! ప్రాచీన కాలంలో దేవతలు మరియు మహర్షులు సంసారంలోని ఆధ్యాత్మిక, ఆధిభౌతిక, ఆధిదైవిక తాపత్రయాలతో బాధపడుతున్న జీవుల శ్రేయస్సు కొరకు నన్ను ప్రార్థించారు.
అప్పుడు నేను నా దివ్య తేజస్సుతో కాశీ నగరము మధ్యలో శ్రీ మనఃప్రకామేశ్వర స్వరూపంలో అవతరిం చాను.
సమస్త మనో కామనలను నెరవేర్చుట వలన ఈ స్వరూపము 'మనఃప్రకామ' అనే నామముతో ప్రసిద్ధి చెందింది.
కాశీలోని ఏకాదశ రుద్రులలో ఈ స్వరూపం ప్రధానమైనదిగా భావించ బడుతుంది. ఇది భక్తుల మనస్సుకు సంతృప్తిని ప్రసాదించి వారిని పరమసిద్ధి మరియు మోక్షమార్గం వైపు నడిపిస్తుంది. ఎవడు నిష్కపట హృదయంతో నన్ను ఆరాధిస్తాడో, అతని సమస్త మనోరథాలు నెరవేరుతాయి; నేను అతనిపై అత్యంత ప్రసన్నుడనై అనుగ్రహిస్తాను."
అప్పుడు పార్వతీ దేవి "ఓ భగవన్! మహావ్రత ధారి మహేశ్వరా! ఆ దివ్య శివలింగ మహిమ ఏమిటి? వేదవేత్తలు దాని దర్శనమునకు ఎటువంటి పుణ్యఫలాన్ని పేర్కొన్నారు?" అని అడుగగా భగవాన్ శివుడు “శ్రీ మనఃప్రకామేశ్వరుని దర్శన మాత్రంతోనే మనస్సులోని వికృతులు, కామము, క్రోధము మొదలైన దోషాలు నశించిపోతాయి. ఆయనను ఆరాధించిన సాధకుడు సమస్త పాపాల నుండి పవిత్రుడై జ్ఞాన సంపన్నుడవుతాడు. చివరకు శివసాయుజ్యము (మోక్షము) పొందుతాడు.
కాశీలోని ఏకాదశ రుద్రుల యాత్ర చేసి విధిపూర్వ కంగా శ్రీ మనః ప్రకామేశ్వ రుని పూజించిన భక్తుని అత్యంత దుర్లభమైన కోరికలు కూడా నెరవేరు తాయి. ఆయన పూజవల్ల యజ్ఞాలు, దానాలు, తపస్సులు, తీర్థస్నానాలు అన్నీ సఫలమవు తాయి. ఎందుకంటే ఈ దివ్య లింగములో స్వయంగా సదానంద స్వరూపుడైన భగవాన్ రుద్రుడు నిత్యం విరాజిల్లుచున్నాడు. దేవతలు, మహర్షులు కూడా ఆయనను ఎల్లప్పుడూ భక్తితో ఆరాధిస్తారు.
న తస్య దుర్లభం కించిత్ త్రిలోకే సచరాచరే। మనఃప్రకామేశభక్తస్య రుద్రలోకే మహీయతే॥
ఎవరు ఎల్లప్పుడూ భక్తి, శ్రద్ధలతో తమ శిరస్సును వంచి శ్రీ మనః ప్రకామేశ్వ రుని దివ్యలింగానికి నమస్కరిస్తారో, వారి పాదధూళిని పొందుటకు సమస్త తీర్థాలు, మహర్షులు కూడా వారి పాదాలను అనుసరిస్తు న్నట్లుగా భావించ బడుతుంది. అటువంటి భక్తులు స్వయంగా తీర్థస్వరూపులు, పూజనీయులు అవుతారు.
శ్రీ మనఃప్రకామేశ్వరుని భక్తునికి మూడు లోకాలలో చరాచరములలో ఏదీ దుర్లభంగా ఉండదు. అతడు జీవితంలో సమస్త శుభఫలాలను పొందు తాడు. దేహత్యాగానంత రం రుద్రలోకంలో గొప్ప గౌరవం మరియు దివ్య స్థానాన్ని పొందుతాడు.
శ్రీ మనఃప్రకామేశ్వర మహాదేవ ఆలయం, వారణాసిలోని విశ్వనాధ్ గల్లీలో గేట్ నంబరు 1, కోటిలింగేశ్వర ఆలయం మరియు ఉన్మత్త భైరవ ఆలయం ప్రాంగణంలో ఉన్నది. నిన్నటిరోజున కాశీ ఢూంఢే భక్త పరివార్ బృంద సభ్యులు ఈ ఆలయంలో విశేష అభిషేకము అర్చన నిర్వహించినారు.
హరహర మహాదేవ మన: ప్రకామేశ్వర మహాదేవ్
హర హర మహాదేవ్! పరమపవిత్రమైన కాశీ నగరంలో జరుగుతున్న కాశీ దేవాలయ నిత్యాభిషేక యాత్రలో భాగంగా, ఈ రోజు మేము శ్రీ మన: ప్రకామేశ్వర మహాదేవుని దివ్య సన్నిధికి విచ్చేశాము. శ్రీ మన: ప్రకామేశ్వర మహాదేవుని ఆలయం కాశీలోని ప్రసిద్ధ కాశీ విశ్వనాథ్ గల్లీలో ఉంది. విశ్వనాథ్ గల్లీ నుండి కాశీ విశ్వనాథ ఆలయం గేట్ నెం. 1 (ఢుండిరాజ్ గణపతి ద్వారం) వైపు వెళ్తూ ఉండగా, ముందుగా శ్రీ సాక్షి వినాయక స్వామివారి ఆలయం వస్తుంది. ఆ సాక్షి వినాయక ఆలయానికి ముందుగానే శ్రీవాస్తవ్ జీ గాజుల దుకాణం ఉంటుంది. అదే దుకాణ ప్రాంగణంలో శ్రీ ఉన్మత్త భైరవ స్వామితో పాటు శ్రీ మనప్రకామేశ్వర మహాదేవుడు కొలువై ఉన్నారు.
ఈ మార్గం దశాశ్వమేధ ఘాట్ నుండి కాశీ విశ్వనాథ ఆలయం వైపు వెళ్లే ప్రధాన దారి. ఇదే దారిలో సాక్షి వినాయక స్వామి, ఢుండిరాజ్ గణపతి మరియు కాశీ విశ్వనాథ ఆలయం గేట్ నెం. 1కు చేరుకోవచ్చు. మధ్యలోనే శ్రీవాస్తవ్ జీ వారి దుకాణం ఉండి, అక్కడ ఈ పవిత్ర దేవాలయాల గురించి సూచించే బోర్డు కూడా ఏర్పాటు చేయబడింది.
ఈ రోజు శ్రీ మన: ప్రకామేశ్వర మహాదేవుని సన్నిధిలో పవిత్ర అభిషేకం, విశేష పూజలు అత్యంత వైభవంగా నిర్వహించబడ్డాయి.
కాశీలో ప్రసిద్ధి చెందిన ఏకాదశ రుద్రులలో శ్రీ మన: ప్రకామేశ్వర మహాదేవుడు ఒకరు. మనసులో కలిగే అన్ని రకాల చంచలత్వాన్ని తొలగించి, భక్తులకు మనశ్శాంతిని ప్రసాదించే దయామూర్తి ఆయనే. అంతేకాక, ధర్మబద్ధమైన సత్కామనలను నెరవేర్చే వరప్రదాత కూడా శ్రీ మనప్రకామేశ్వర మహాదేవుడే.
మహిమాన్వితమైన ఆయనకు స్మృతి సమ్మత వేదోక్త విశేష అభిషేకం, అర్చన, పూజలు భక్తిశ్రద్ధలతో ఘనంగా నిర్వహించబడ్డాయి.
హర హర మహాదేవ్!
శ్రీ మనప్రకామేశ్వర మహాదేవునికి జయము! జయము!
(కాశీ వాసి చంద్రశేఖరద్రావిడ్ఘనపాఠిగారిచే హిందీలో తెలియజేసిన విశేషాలను తెలుగులో తెలియజేసిన వారు కొంపెల్ల.అప్పాజీగారు వారి సౌజన్యంతో)
4. దరిద్ర నివారణ దత్త మంత్రం.! 🕉️"దరిద్ర విప్రగేహే య: శాకం భుక్త్వోత్తమ శ్రియమ|| దదౌ శ్రీ దత్త దేవ: సదా దారిద్ర్యాత్ శ్రీ ప్రదోవతు||"
5. సంతాన భాగ్యం కోసం దత్త మంత్రం.! 🕉️"దూరీకృత్య పిశాచార్తిం జీవయిత్వా మృతం సుతం|| యో భూదభీష్టదః పాతు స నః సంతాన వృద్ధికృత్||"
6. సౌభాగ్యం కోసం దత్త మంత్రం.! 🕉️"జీవయామాస భర్తారం మృతం సత్యాహి మృత్యుహా|| మృత్యుంజయః స యోగీంద్రః సౌభాగ్యం మే ప్రయచ్ఛతు||"
7. అప్పులు తీరుటకు, అప్పుగా ఇచ్చిన ధనం తిరిగి రావడం కోసం దత్త మంత్రం.! 🕉️"అత్రేరాత్మ ప్రదానేన యోముక్తో భగవాన్ ఋ ణా త్||దత్తాత్రేయం తమీశానం నమామి ఋణముక్తయే||"
8. సర్వ పాప నివారణ దత్త మంత్రం.! 🕉️అత్రిపుత్రో మహాతేజా దత్తాత్రేయో మహామునిః||తస్య స్మరణ మాత్రేన సర్వ పాపైః ప్రముచ్యతే||
9. దత్తాత్రేయ అనుగ్రహ మంత్రం.! 🕉️అనసూయాసుత శ్రీశ జనపాతక నాశన|| దిగంబర నమో నిత్యం తుభ్యం మే వరదో భవ||
10. ఉన్నత విద్య కోసం దత్త మంత్రం.! 🕉️విద్వత్సుత మవిద్యం య అగతం లోక నిందితం|| భిన్న జిహ్వం బుధం చక్రే శ్రీ దత్తః శరణం మమ||
11. పోగొట్టుకున్న వస్తువులు, దొంగలించ బడ్డ ధనము లేక వస్తువుల తిరిగి పొందుటకు.! 🕉️కార్త వీర్యార్జునో నామ రాజా బాహు సహస్రవాన్|| తస్య స్మరణ మాత్రేన హృతం నష్టంచ లభ్యతే||
విధానం.! ఈ మంత్రాలలో మీ సమస్యకు తగట్టు ఏది అవసరమో ఆ మంత్రాన్ని రోజు 108 సార్లు లేక సమస్య తీవ్రతను బట్టి 1008సార్లు గాని రోజూ ఉదయం జపం చేయాలి. ఇలా 41 దినములు చేయాలి.
గమనిక: మంత్రజపం భక్తి, శ్రద్ధ, విశ్వాసంతో చేయాలి. ఫలితం దైవానుగ్రహం, కర్మ, పరిస్థితులపై ఆధారపడి ఉంటుంది. జై గురుదత్తా 🙏
శ్లోకం 1: శ్రీమదనంత శ్రీవిభూషిత అప్పలలక్ష్మీ నరసింహరాజా జయ విజయీభవ దిగ్విజయీభవ శ్రీమదఖండ శ్రీవిజయీభవ ॥ 1 ॥ అర్ధం: శ్రీమంతమైన మరియు అనంతమైన శుభాలతో, సంపదలతో విరాజిల్లేవాడా! అప్పలరాజు శర్మ గారి (నరసింహ అవతార స్వరూపుని) కుమారుడా! దత్త జ్యోతి స్వరూపుడా నీకు జయం కలుగుగాక! అన్ని దిక్కులా నీకు దిగ్విజయం కలుగుగాక! ఎన్నటికీ నాశనం లేని అఖండమైన విజయం కలుగుగాక!
శ్లోకం 2: శ్రీవిద్యాధరి రాధ సురేఖా శ్రీరాఖీధర శ్రీపాదా జయ విజయీభవ దిగ్విజయీభవ శ్రీమదఖండ శ్రీవిజయీభవ ॥ 2 ॥ అర్ధం: శ్రీవిద్యాధరి, రాధ మరియు సురేఖ అనబడే నీ ముగ్గురు అక్కల చేత రక్షా బంధనాన్ని (రాఖీని) కట్టించుకున్న సోదరుడా! శ్రీపాద శ్రీవల్లభా! నీకు జయం కలుగుగాక! దిగ్విజయం కలుగుగాక! అఖండమైన విజయం కలుగుగాక!
శ్లోకం 3: మాతా సుమతీ వాత్సల్యామృత పరిపోషిత జయ శ్రీపాదా జయ విజయీభవ దిగ్విజయీభవ శ్రీమదఖండ శ్రీవిజయీభవ ॥ 3 ॥ అర్ధం: నీ తల్లి అయిన సుమతీ మహారాణి కురిపించిన వాత్సల్యం అనే అమృతంతో పోషించబడిన వాడా! శ్రీపాద శ్రీవల్లభా! నీకు జయం కలుగుగాక! దిగ్విజయం కలుగుగాక! అఖండమైన విజయం కలుగుగాక!
శ్లోకం 5: సవితృకాఠకచయన పుణ్యఫల భరద్వాజ ఋషి గోత్ర సంభవ జయ విజయీభవ దిగ్విజయీభవ శ్రీమదఖండ శ్రీవిజయీభవ ॥ 5 ॥ అర్ధం: సవితృకాఠక చయనం అనే గొప్ప యజ్ఞం చేసిన పుణ్య ఫలంగా, భరద్వాజస మహాఋషి గోత్రంలో జన్మించిన వాడా! నీకు జయం కలుగుగాక! దిగ్విజయం కలుగుగాక! అఖండమైన విజయం కలుగుగాక!
శ్లోకం 6: దోచౌపాతీ దేవ్ లక్ష్మీ ఘన సంఖ్యా బోధిత శ్రీచరణా జయ విజయీభవ దిగ్విజయీభవ శ్రీమదఖండ శ్రీవిజయీభవ ॥ 6 ॥ అర్ధం: ఒక బ్రాహ్మణ గృహంలో భిక్ష అడుగుతూ 'దో చౌపాతీ దేవ్ లక్ష్మీ' (తల్లీ లక్ష్మీ, రెండు రొట్టెలు ఇవ్వు) అని అడిగి, అందులోని ఘనమైన సంఖ్యా శాస్త్ర, యోగ రహస్యాలను లోకానికి బోధించిన శ్రీచరణాలు కలవాడా! నీకు జయం కలుగుగాక! దిగ్విజయం కలుగుగాక! అఖండమైన విజయం కలుగుగాక!
శ్లోకం 7: పుణ్యరూపిణీ రాజమాంబసుత గర్భపుణ్యఫల సంజాతా జయ విజయీభవ దిగ్విజయీభవ శ్రీమదఖండ శ్రీవిజయీభవ ॥ 7 ॥ అర్ధం: సాక్షాత్తూ పుణ్యస్వరూపిణి అయిన నీ అమ్మమ్మ రాజమాంబ గారి కుమార్తె (నీ తల్లి సుమతీ మహారాణి) యొక్క గర్భ పుణ్య ఫలంగా జన్మించిన వాడా! నీకు జయం కలుగుగాక! దిగ్విజయం కలుగుగాక! అఖండమైన విజయం కలుగుగాక!
శ్లోకం 8: సుమతీ నందన నరహరి నందన దత్తదేవ ప్రభు శ్రీపాదా జయ విజయీభవ దిగ్విజయీభవ శ్రీమదఖండ శ్రీవిజయీభవ ॥ 8 ॥ అర్ధం: సుమతీ మహారాణికి మరియు అప్పలరాజు శర్మ (నరహరి స్వరూపుడు) గారికి ప్రియ పుత్రుడా! శ్రీ దత్తాత్రేయుని అవతారమైన ప్రభువైన శ్రీపాద శ్రీవల్లభా! నీకు జయం కలుగుగాక! దిగ్విజయం కలుగుగాక! అఖండమైన విజయం కలుగుగాక!
శ్లోకం 9: పీఠికాపుర నిత్య విహారా మధుమతి దత్తా మంగళరూపా జయ విజయీభవ దిగ్విజయీభవ శ్రీమదఖండ శ్రీవిజయీభవ ॥ 9 ॥ అర్ధం: తన జన్మస్థలమైన పీఠికాపురంలో (ప్రస్తుత పిఠాపురం, ఆంధ్రప్రదేశ్) భక్తుల కోసం నిత్యం సూక్ష్మ రూపంలో విహరించేవాడా! మధుమతి అనబడే గొప్ప యోగ విద్యను తన భక్తులకు అనుగ్రహించే దత్తాత్రేయ మంగళ స్వరూపుడా! నీకు జయం కలుగుగాక! దిగ్విజయం కలుగుగాక! అఖండమైన విజయం కలుగుగాక!
"దత్తుని స్మరణే మంగళం… దత్తుని శరణే జీవన సాఫల్యం." 🙏
👉 జూలై నుండి సెప్టెంబర్ 30 వరకు జరిగే పర్వదినాలు, ఉత్సవాల కారణంగా కొన్ని ప్రత్యేక రోజుల్లో వీఐపీ బ్రేక్ దర్శనాలు రద్దు చేయబడతాయి.
📌 జూలై - జూలై 14 – కోయిల్ ఆళ్వార్ తిరుమంజనం - జూలై 17 – ఆణివార ఆస్థానం - జూలై 19 – శ్రీ ఆండవన్ ఆశ్రమ స్వామీజీకి పెద్ద మర్యాద - జూలై 29 – జీయర్ స్వాముల చాతుర్మాస సంకల్పం
📌 ఆగస్టు - ఆగస్టు 22 – పవిత్రోత్సవాల అంకురార్పణ - ఆగస్టు 24 – పవిత్రోత్సవాల రెండో రోజు పవిత్రాల సమర్పణ
📌 సెప్టెంబర్ - సెప్టెంబర్ 8 – బ్రహ్మోత్సవాల సందర్భంగా కోయిల్ ఆళ్వార్ తిరుమంజనం - సెప్టెంబర్ 14 – బ్రహ్మోత్సవాల అంకురార్పణ - సెప్టెంబర్ 15 నుండి 23 వరకు – శ్రీవారి బ్రహ్మోత్సవాలు
⚠️ పై తేదీలకు ముందురోజు ప్రోటోకాల్ ప్రముఖులు మినహా వీఐపీ సిఫార్సు లేఖలు స్వీకరించబడవు.
🙏 భక్తులు తమ తిరుమల యాత్ర ప్రణాళికను ముందుగానే సిద్ధం చేసుకోవాలని టీటీడీ మనవి.
"భక్తికి కులమతాలు అడ్డుకావని నిరూపించిన సాలభేగ మహాభక్తుని అద్భుత గాథ." 🙏
"ముస్లిం తండ్రికి జన్మించిన ఒక భక్తుడి కోసం... స్వయంగా జగన్నాథుడే తన రథాన్ని ఆపాడంటే నమ్మగలరా? నేటికీ ఆ సంప్రదాయం కొనసాగుతుండటం ఈ కథలోని గొప్ప విశేషం!"
సాలభేగ 17వ శతాబ్దానికి చెందినవాడు. అతని తండ్రి లాల్బేగ్ మొఘల్ సైన్యంలో ఒక ముస్లిం సుబేదార్ (సేనాధిపతి). ఒకసారి లాల్బేగ్ దండయాత్రకు వెళ్లినప్పుడు, ఒరిస్సాలోని పూరీకి సమీపంలో ఉన్న దండముకుందపూర్ అనే గ్రామానికి చెందిన ఒక బ్రాహ్మణ విధవరాలు (లలిత) అందాన్ని చూసి మోహించి, ఆమెను బలవంతంగా ఎత్తుకెళ్లి వివాహం చేసుకున్నాడు.
వారిద్దరికీ జన్మించిన కుమారుడే సాలభేగ. ముస్లిం తండ్రి, హిందూ తల్లికి జన్మించడం వల్ల సాలభేగ చిన్నతనం నుంచే రెండు సంస్కృతుల మధ్య పెరిగాడు. తండ్రి లాగే యుద్ధ విద్యల్లో నిపుణుడై, మొఘల్ సైన్యంలో చేరాడు.
2. జీవితాన్ని మార్చిన యుద్ధం మరియు అద్భుతం ఒకసారి ఒక పెద్ద యుద్ధంలో సాలభేగ తీవ్రంగా గాయపడ్డాడు. అతని శరీరంపై ఉన్న గాయాలు కుళ్లిపోయి, భయంకరమైన వ్యాధిగా మారాయి.
ఆ కాలంలోని వైద్యులెవరూ ఆ వ్యాధిని నయం చేయలేకపోయారు. సాలభేగ మరణ పడకపై చేరి తీవ్రమైన బాధను అనుభవిస్తున్నాడు.
ఆ సమయంలో అతని తల్లి లలిత, "నాయనా! ఈ ప్రపంచంలో ఏ వైద్యుడూ నిన్ను రక్షించలేడు. కానీ ఆ బ్రహ్మాండ నాయకుడు, పూరీ జగన్నాథుడు అనుగ్రహిస్తే నీకు ప్రాణభిక్ష లభిస్తుంది. మనస్ఫూర్తిగా ఆ శంఖు-చక్ర ధారిని ప్రార్థించు" అని చెప్పింది.
తల్లి మాటలపై నమ్మకంతో సాలభేగ కళ్లు మూసుకుని రాత్రింబగళ్లు జగన్నాథుడిని ధ్యానించడం ప్రారంభించాడు.
"స్వామీ! నువ్వు నిజంగానే దీనజన రక్షకుడివైతే నన్ను ఈ నరకం నుంచి కాపాడు" అని ఏడ్చాడు.
కొన్ని రోజులకు సాలభేగకు ఒక అద్భుతమైన కల వచ్చింది. కలలో సాక్షాత్తు శ్రీకృష్ణ పరమాత్ముడు (జగన్నాథుడు) ప్రత్యక్షమై, అతనికి విభూతిని ప్రసాదించి అదృశ్యమయ్యాడు.
మరుసటి రోజు ఉదయానికి సాలభేగ ఒంటిపై ఉన్న గాయాలన్నీ మాయమై, పూర్తి ఆరోగ్యవంతుడిగా మారిపోయాడు!
3. పూరీ ప్రయాణం - ఆలయ ప్రవేశ నిరాకరణ ఈ అద్భుతంతో సాలభేగ హృదయం పూర్తిగా జగన్నాథుడి భక్తితో నిండిపోయింది. లౌకిక జీవితాన్ని, సైన్యాన్ని వదిలేసి, కేవలం స్వామిని దర్శించుకోవాలనే తపనతో పూరీ క్షేత్రానికి చేరుకున్నాడు.
కానీ, అక్కడ అతనికి పెద్ద నిరాశ ఎదురైంది. ముస్లిం తండ్రికి జన్మించడం వల్ల ఆ కాలపు ఆచారాల ప్రకారం ఆలయ పూజారులు అతడిని పూరీ జగన్నాథ ఆలయంలోనికి రానివ్వలేదు.
సింహద్వారం ముందే అతడిని నెట్టేశారు. సాలభేగ ఏడుస్తూ స్వామిని వేడుకున్నాడు, కానీ ఫలితం లేకపోయింది.
4. బృందావన యాత్ర - రథయాత్ర ప్రతిజ్ఞ ఆలయంలోకి ప్రవేశం దొరక్కపోవడంతో, సాలభేగ శ్రీకృష్ణుడి లీలలు జరిగిన బృందావనానికి వెళ్లాడు.
అక్కడ కొన్నేళ్ల పాటు సాధన చేసి, మహా భక్తుడిగా మారిపోయాడు. ఎన్నో అద్భుతమైన భక్తి కీర్తనలు (ఒరియా భాషలో వీటిని 'జనన' అంటారు) రచించాడు.
అయితే, పూరీ జగన్నాథుడిని చూడాలనే కోరిక అతనిలో అణుమాత్రం తగ్గలేదు. జగన్నాథుడికి జరిగే ప్రసిద్ధ రథయాత్ర సమయంలో, స్వామి స్వయంగా ఆలయం వెలుపలికి వచ్చి కులమతాల భేదం లేకుండా అందరికీ దర్శనమిస్తాడని సాలభేగకు తెలుసు. అందువల్ల రథయాత్ర సమయానికి పూరీ చేరుకోవాలని బృందావనం నుండి బయలుదేరాడు.
5. అనారోగ్యం మరియు రథం ఆగిపోవడం (మహా అద్భుతం) పూరీకి వస్తున్న దారిలో సాలభేగ హఠాత్తుగా తీవ్రమైన జ్వరానికి గురయ్యాడు.
శరీరం సహకరించడం లేదు, నడవలేని స్థితి. రథయాత్ర రోజు వచ్చేసింది. స్వామి రథం (నందిఘోష) గుండిచా మందిరం వైపు కదులుతోంది. సాలభేగ పూరీకి ఇంకా చాలా దూరంలో ఉన్నాడు.
ఆక్రందనతో సాలభేగ స్వామికి ఇలా ప్రార్థన చేశాడు: "తండ్రీ! నీ దర్శనం కోసం ఇన్నాళ్లు వేచి చూశాను. ఈ పాపిని నీ రూపం చూడకుండానే పోనిస్తావా? నేను వచ్చే వరకు దయచేసి నీ రథాన్ని ఆపు స్వామీ!" అని రోదించాడు.
అక్కడ పూరీలో ఒక విచిత్రం జరిగింది. సాలభేగ ఎక్కడైతే స్వామి రథాన్ని ఆపమని వేడుకున్నాడో (ప్రస్తుతం ఆ స్థలాన్ని 'బడదండ' అంటారు), కరెక్ట్గా అదే స్థలానికి రాగానే జగన్నాథుడి రథం నిలిచిపోయింది.
ఎంతమంది లాగినా, ఏనుగులను తెచ్చి లాగించినా రథం ఒక్క అంగుళం కూడా ముందుకు కదల్లేదు. రాజు, పూజారులు, ప్రజలంతా ఆందోళనలో పడ్డారు. అప్పుడు స్వామి ప్రధాన పూజారికి ఒక కల వచ్చింది. "నా పరమ భక్తుడైన సాలభేగ నా దర్శనం కోసం వస్తున్నాడు. అతడు వచ్చే వరకు నా రథం ముందుకు కదలదు" అని స్వామి ఆజ్ఞాపించాడు.
6. దర్శనం - ముక్తి చివరకు సాలభేగ ఎలాగోలా రథం ఆగిపోయిన చోటికి చేరుకున్నాడు. రథంపై ఉన్న జగన్నాథుడిని చూడగానే అతని కళ్లవెంట ఆనంద బాష్పాలు రాలాయి.
సాక్షాత్తు ఆ జగన్నాథుడే తన కోసం రథాన్ని ఆపాడు అని తెలియగానే సాలభేగ పరవశించిపోయాడు. సాలభేగ స్వామిని మనసారా దర్శించుకుని, స్తుతించిన వెంటనే... అంతవరకు కదలని ఆ రథం, కేవలం భక్తుల చేతి స్పర్శతో చాలా సులువుగా ముందుకు కదిలింది!
సాలభేగ తన జీవితాంతం పూరీలోనే ఉంటూ, స్వామిపై కీర్తనలు పాడుకుంటూ గడిపాడు. అతను మరణించిన తర్వాత, అతని భౌతిక కాయాన్ని ఎక్కడైతే రథం ఆగిపోయిందో (బడదండ) అక్కడే సమాధి చేశారు.
నేటికీ కొనసాగుతున్న సాంప్రదాయం ఈ కథ కేవలం చరిత్ర కాదు, నేటికీ సజీవ సాక్ష్యం. ప్రతి సంవత్సరం పూరీలో రథయాత్ర జరిగినప్పుడు, జగన్నాథుడి రథం 'బడదండ' వీధిలో ఉన్న భక్త సాలభేగ సమాధి వద్ద కొద్దిసేపు ఖచ్చితంగా ఆగుతుంది.
అక్కడ స్వామికి ప్రత్యేక పూజలు చేసి, ఆ తర్వాతే రథాన్ని ముందుకు తీసుకెళ్తారు. భగవంతుడు కేవలం భక్తికి మాత్రమే లొంగుతాడు, కులమతాలకు కాదు అని నిరూపించిన గొప్ప కథ ఇది.
"భక్తి ముందు జన్మ, కులం, మతం, సంప్రదాయం అన్నీ చిన్నవే. స్వచ్ఛమైన హృదయంతో పిలిచే భక్తుడి కోసం భగవంతుడే ఎదురుచూస్తాడని సాలభేగ జీవితమే సజీవ సాక్ష్యం." 🙏
గణేశుడు – కార్తికేయుడు: జ్ఞానం గెలిచిందా? వేగం గెలిచిందా?
కైలాస పర్వతంపై ఒక రోజు శివుడు, పార్వతీదేవి తమ ఇద్దరు కుమారులు గణేశుడు, కార్తికేయుడు ఎదుట కూర్చున్నారు. దేవతలందరూ అక్కడే ఉన్నారు. నారద మహర్షి ఒక దివ్యమైన జ్ఞానఫలాన్ని తీసుకొచ్చాడు.
ఆ ఫలాన్ని చూసి ఇద్దరు కుమారులు కూడా దాన్ని పొందాలని కోరుకున్నారు.
అప్పుడు శివుడు చిరునవ్వుతో ఇలా అన్నాడు:
> "మీలో ఎవరు ముందుగా ఈ మూడు లోకాలను ప్రదక్షిణ చేసి వస్తారో, ఆ జ్ఞానఫలం వారికి దక్కుతుంది."
ఇది విన్న వెంటనే కార్తికేయుడు తన నెమలి వాహనంపై వేగంగా బయలుదేరాడు.
కానీ గణేశుడి వాహనం చిన్న ఎలుక. అతడు ఆలోచించాడు.
"నేను ఎంత వేగంగా వెళ్లినా అన్నయ్యను అందుకోలేను. కానీ శాస్త్రం ఏమంటుందో తెలుసుకోవాలి."
వెంటనే గణేశుడు తన తల్లిదండ్రులైన శివపార్వతుల చుట్టూ మూడు ప్రదక్షిణలు చేశాడు.
ఆ తర్వాత నమస్కరించి ఇలా అన్నాడు:
> "తల్లిదండ్రులే మూడు లోకాలతో సమానం. వారిని ప్రదక్షిణ చేయడం అంటే విశ్వాన్ని ప్రదక్షిణ చేసినట్లే."
ఆ మాట విని దేవతలందరూ ఆశ్చర్యపోయారు.
శివుడు, పార్వతి ఆనందంతో గణేశుడికి ఆ జ్ఞానఫలాన్ని అందించారు.
కొంతసేపటికి మూడు లోకాలు తిరిగి వచ్చిన కార్తికేయుడు ఈ విషయం తెలుసుకొని బాధపడ్డాడు.
కానీ శివుడు ప్రేమగా ఇలా చెప్పాడు:
> "కుమారా! నీవు శౌర్యానికి ప్రతీక. గణేశుడు జ్ఞానానికి ప్రతీక. వేగం గొప్పదే, కానీ జ్ఞానం దానికి దారి చూపుతుంది."
కార్తికేయుడు కూడా ఆ మాటను అంగీకరించి తన తమ్ముడిని ఆలింగనం చేసుకున్నాడు.
ఆ రోజు నుంచి—
గణేశుడు విఘ్నాలను తొలగించే దేవుడిగా, బుద్ధి-జ్ఞానానికి అధిపతిగా ప్రసిద్ధి పొందాడు.
కార్తికేయుడు ధైర్యం, శౌర్యం, యుద్ధవిజయానికి ప్రతీకగా దేవసేనాధిపతిగా నిలిచాడు.
ఈ కథ చెప్పే నీతి
తల్లిదండ్రులను గౌరవించడం అంటే దేవుణ్ణి గౌరవించినట్టే.
వేగం కంటే జ్ఞానం గొప్పది.
శక్తి, బుద్ధి రెండూ సమానంగా అవసరం.
నిజమైన విజయం తెలివిగా ఆలోచించిన వారిదే.
"వేగం గమ్యానికి తీసుకెళ్తుంది... కానీ జ్ఞానం సరైన గమ్యాన్ని చూపిస్తుంది." 🙏🕉️
Mani Saibaba
3 days ago | [YT] | 1
View 0 replies
Mani Saibaba
“గురు బ్రహ్మా, గురు విష్ణుః, గురు దేవో మహేశ్వరః
గురుః సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః.”🙏
అందరికీ గురుపూర్ణిమ శుభాకాంక్షలు!🙏
గురుపూర్ణిమ అనేది గురువుల పట్ల కృతజ్ఞత, గౌరవం మరియు భక్తిని వ్యక్తం చేసే పవిత్రమైన రోజు. మన జీవితంలో అజ్ఞానాంధకారాన్ని తొలగించి జ్ఞాన వెలుగును ప్రసాదించే వారు గురువులు. తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు, ఆధ్యాత్మిక గురువులు మరియు మనకు మంచి మార్గం చూపే ప్రతి ఒక్కరూ గురువులే.
ఈ పవిత్రమైన గురుపూర్ణిమ సందర్భంగా మన గురువుల ఆశీస్సులు ఎల్లప్పుడూ మనపై ఉండాలని కోరుకుంటూ, వారి సేవలను, బోధనలను జీవితాంతం గుర్తుంచుకొని ఆచరిద్దాం.🙏🚩
2 weeks ago | [YT] | 7
View 0 replies
Mani Saibaba
కాశీలో ధర్మబద్ధమైన సత్కామనలను నెరవేర్చే వరప్రదాత శ్రీ మనప్రకామేశ్వర మహాదేవుని విశేషాలతో మిత్రులందరికీ శుభోదయం.
#కాశీలోని ఏకాదశ రుద్రులలో ఈ స్వరూపం ప్రధానమైన
శ్రీ కాశీ మనఃప్రకామేశ్వర మహాదేవాయనమః
స్కందపురాణంలోని కాశీఖండము మరియు ఇతర ధర్మశాస్త్రాల ప్రకారం భగవాన్ శివుడు పార్వతీ దేవితో ఇలా అన్నారు.
"ఓ దేవీ! ప్రాచీన కాలంలో దేవతలు మరియు మహర్షులు సంసారంలోని ఆధ్యాత్మిక, ఆధిభౌతిక, ఆధిదైవిక తాపత్రయాలతో బాధపడుతున్న జీవుల శ్రేయస్సు కొరకు నన్ను ప్రార్థించారు.
అప్పుడు నేను నా దివ్య తేజస్సుతో కాశీ నగరము మధ్యలో
శ్రీ మనఃప్రకామేశ్వర స్వరూపంలో అవతరిం చాను.
సమస్త మనో కామనలను నెరవేర్చుట వలన ఈ స్వరూపము 'మనఃప్రకామ' అనే నామముతో ప్రసిద్ధి చెందింది.
కాశీలోని ఏకాదశ రుద్రులలో ఈ స్వరూపం ప్రధానమైనదిగా
భావించ బడుతుంది. ఇది భక్తుల మనస్సుకు సంతృప్తిని ప్రసాదించి వారిని పరమసిద్ధి మరియు మోక్షమార్గం వైపు నడిపిస్తుంది. ఎవడు నిష్కపట హృదయంతో నన్ను ఆరాధిస్తాడో, అతని సమస్త మనోరథాలు నెరవేరుతాయి; నేను అతనిపై అత్యంత ప్రసన్నుడనై అనుగ్రహిస్తాను."
భగవన్! కిం తు మాహాత్మ్యం
తస్య లింగస్య సువ్రత।
దర్శనేన చ కిం పుణ్యం
కీర్యతే వేదవేదిభిః॥
అప్పుడు పార్వతీ దేవి "ఓ భగవన్! మహావ్రత ధారి మహేశ్వరా!
ఆ దివ్య శివలింగ మహిమ ఏమిటి? వేదవేత్తలు దాని దర్శనమునకు ఎటువంటి పుణ్యఫలాన్ని పేర్కొన్నారు?" అని అడుగగా భగవాన్ శివుడు “శ్రీ మనఃప్రకామేశ్వరుని దర్శన మాత్రంతోనే మనస్సులోని వికృతులు, కామము, క్రోధము మొదలైన దోషాలు నశించిపోతాయి. ఆయనను ఆరాధించిన సాధకుడు సమస్త పాపాల నుండి పవిత్రుడై జ్ఞాన సంపన్నుడవుతాడు. చివరకు శివసాయుజ్యము (మోక్షము) పొందుతాడు.
కాశీలోని ఏకాదశ రుద్రుల యాత్ర చేసి విధిపూర్వ కంగా శ్రీ మనః ప్రకామేశ్వ రుని పూజించిన భక్తుని అత్యంత దుర్లభమైన కోరికలు కూడా నెరవేరు తాయి. ఆయన పూజవల్ల యజ్ఞాలు, దానాలు, తపస్సులు, తీర్థస్నానాలు అన్నీ సఫలమవు తాయి. ఎందుకంటే ఈ దివ్య లింగములో స్వయంగా సదానంద స్వరూపుడైన భగవాన్ రుద్రుడు నిత్యం విరాజిల్లుచున్నాడు. దేవతలు, మహర్షులు కూడా ఆయనను ఎల్లప్పుడూ భక్తితో ఆరాధిస్తారు.
యే నమంతి సదా భక్త్యా
శిరసా లింగముత్తమమ్।
తేషాం పాదాగ్రలగ్నాని
తీర్థాని మునయస్తథా॥
న తస్య దుర్లభం కించిత్
త్రిలోకే సచరాచరే।
మనఃప్రకామేశభక్తస్య
రుద్రలోకే మహీయతే॥
ఎవరు ఎల్లప్పుడూ భక్తి, శ్రద్ధలతో తమ శిరస్సును వంచి శ్రీ మనః ప్రకామేశ్వ రుని దివ్యలింగానికి నమస్కరిస్తారో, వారి పాదధూళిని పొందుటకు సమస్త తీర్థాలు, మహర్షులు కూడా వారి పాదాలను అనుసరిస్తు న్నట్లుగా భావించ బడుతుంది. అటువంటి భక్తులు స్వయంగా తీర్థస్వరూపులు, పూజనీయులు అవుతారు.
శ్రీ మనఃప్రకామేశ్వరుని భక్తునికి మూడు లోకాలలో చరాచరములలో ఏదీ దుర్లభంగా ఉండదు. అతడు జీవితంలో సమస్త శుభఫలాలను పొందు తాడు. దేహత్యాగానంత రం రుద్రలోకంలో గొప్ప గౌరవం మరియు దివ్య స్థానాన్ని పొందుతాడు.
శ్రీ మనఃప్రకామేశ్వర మహాదేవ ఆలయం, వారణాసిలోని విశ్వనాధ్
గల్లీలో గేట్ నంబరు 1, కోటిలింగేశ్వర ఆలయం మరియు ఉన్మత్త భైరవ ఆలయం ప్రాంగణంలో ఉన్నది. నిన్నటిరోజున కాశీ ఢూంఢే భక్త పరివార్ బృంద సభ్యులు ఈ ఆలయంలో విశేష అభిషేకము అర్చన నిర్వహించినారు.
హరహర మహాదేవ
మన: ప్రకామేశ్వర మహాదేవ్
హర హర మహాదేవ్!
పరమపవిత్రమైన కాశీ నగరంలో జరుగుతున్న కాశీ దేవాలయ నిత్యాభిషేక యాత్రలో భాగంగా, ఈ రోజు మేము శ్రీ మన: ప్రకామేశ్వర మహాదేవుని దివ్య సన్నిధికి విచ్చేశాము.
శ్రీ మన: ప్రకామేశ్వర మహాదేవుని ఆలయం కాశీలోని ప్రసిద్ధ కాశీ విశ్వనాథ్ గల్లీలో ఉంది. విశ్వనాథ్ గల్లీ నుండి కాశీ విశ్వనాథ ఆలయం గేట్ నెం. 1 (ఢుండిరాజ్ గణపతి ద్వారం) వైపు వెళ్తూ ఉండగా, ముందుగా శ్రీ సాక్షి వినాయక స్వామివారి ఆలయం వస్తుంది. ఆ సాక్షి వినాయక ఆలయానికి ముందుగానే శ్రీవాస్తవ్ జీ గాజుల దుకాణం ఉంటుంది. అదే దుకాణ ప్రాంగణంలో శ్రీ ఉన్మత్త భైరవ స్వామితో పాటు శ్రీ మనప్రకామేశ్వర మహాదేవుడు కొలువై ఉన్నారు.
ఈ మార్గం దశాశ్వమేధ ఘాట్ నుండి కాశీ విశ్వనాథ ఆలయం వైపు వెళ్లే ప్రధాన దారి. ఇదే దారిలో సాక్షి వినాయక స్వామి, ఢుండిరాజ్ గణపతి మరియు కాశీ విశ్వనాథ ఆలయం గేట్ నెం. 1కు చేరుకోవచ్చు. మధ్యలోనే శ్రీవాస్తవ్ జీ వారి దుకాణం ఉండి, అక్కడ ఈ పవిత్ర దేవాలయాల గురించి సూచించే బోర్డు కూడా ఏర్పాటు చేయబడింది.
ఈ రోజు శ్రీ మన: ప్రకామేశ్వర మహాదేవుని సన్నిధిలో పవిత్ర అభిషేకం, విశేష పూజలు అత్యంత వైభవంగా నిర్వహించబడ్డాయి.
కాశీలో ప్రసిద్ధి చెందిన ఏకాదశ రుద్రులలో శ్రీ మన: ప్రకామేశ్వర మహాదేవుడు ఒకరు. మనసులో కలిగే అన్ని రకాల చంచలత్వాన్ని తొలగించి, భక్తులకు మనశ్శాంతిని ప్రసాదించే దయామూర్తి ఆయనే. అంతేకాక, ధర్మబద్ధమైన సత్కామనలను నెరవేర్చే వరప్రదాత కూడా శ్రీ మనప్రకామేశ్వర మహాదేవుడే.
మహిమాన్వితమైన ఆయనకు స్మృతి సమ్మత వేదోక్త విశేష అభిషేకం, అర్చన, పూజలు భక్తిశ్రద్ధలతో ఘనంగా నిర్వహించబడ్డాయి.
హర హర మహాదేవ్!
శ్రీ మనప్రకామేశ్వర మహాదేవునికి జయము! జయము!
(కాశీ వాసి చంద్రశేఖరద్రావిడ్ఘనపాఠిగారిచే హిందీలో తెలియజేసిన విశేషాలను తెలుగులో తెలియజేసిన వారు
కొంపెల్ల.అప్పాజీగారు వారి సౌజన్యంతో)
1 month ago (edited) | [YT] | 6
View 0 replies
Mani Saibaba
*తిరుమల సమాచారం:*
*11-07-2026*
🍁🍁🍁🍁🍁
👉🏻 తిరుమలలో కొనసాగుతున్న భక్తుల రద్దీ .
👉🏻 ఉచిత దర్శనం కోసం *అన్ని కంపార్ట్మెంట్లు నిండి, బాట గంగమ్మ గుడి దగ్గర* క్యూ లో చేరుతున్న భక్తులు .
👉🏻 ఉదయం 8 గంటల తరువాత వెళ్లే సర్వదర్శనం భక్తులకు *24-30 గంటల* సమయం పడుతుంది.
👉🏻 300 రూ.. శీఘ్రదర్శనంకు *4–6 గంటల* సమయం పడుతుంది.
👉🏻 సర్వ దర్శనమ్ టోకెన్ పొందిన భక్తులకు *5 నుండి 7 గంటల* సమయం పడుతుంది.
👉🏻 నిన్న స్వామివారిని దర్శించుకున్న భక్తుల సంఖ్య *73,265*
👉🏻 *39,690* మంది భక్తులు నిన్న స్వామివారికి తలనీలాలు సమర్పించారు.
👉🏻 నిన్న స్వామి వారి హుండీ ఆదాయం *₹4.26 కోట్లు*
👉🏻 నిన్న మొత్తం విక్రయించిన లడ్డూల సంఖ్య *4.09 లక్షలు*
👉🏻 నిన్న *అన్నప్రసాదాలు* స్వీకరించిన భక్తుల సంఖ్య *2.98 లక్షలు*
*ఓం నమో వేంకటేశాయ 🙏🙏🙏🙏🙏🙏🙏🙏*
1 month ago | [YT] | 6
View 0 replies
Mani Saibaba
#దత్తాత్రేయ స్వామి ఆశీస్సులు తో 🙏 🙏 🙏
#దత్తా దత్తా జై శ్రీగురుదత్త..!!🙏🙏
🙏గురుదత్తాత్రేయ మంత్రాలు..!🙏
1. సర్వ బాధ నివారణ మంత్రం.!
🕉️"నమస్తే భగవన్ దేవ దత్తాత్రేయ జగత్ ప్రభో ||
సర్వ బాధా ప్రశమనం కురు శాంతిం ప్రయచ్ఛమే||"
2. సర్వరోగ నివారణ దత్త మంత్రం.!
🕉️"నమస్తే భగవన్ దేవ దత్తాత్రేయ జగత్ ప్రభో||
సర్వ రోగ ప్రశమనం కురు శాంతిం ప్రయచ్ఛమే||"
3. సర్వ కష్ట నివారణ దత్త మంత్రం.!
🕉️"అనసూయాత్రి సమభూతో దత్తాత్రేయో దిగంబర: స్మర్తృగామీ స్వభక్తానాం ఉధ్ధర్తా భవ సంకటాత్||
4. దరిద్ర నివారణ దత్త మంత్రం.!
🕉️"దరిద్ర విప్రగేహే య: శాకం భుక్త్వోత్తమ శ్రియమ||
దదౌ శ్రీ దత్త దేవ: సదా దారిద్ర్యాత్ శ్రీ ప్రదోవతు||"
5. సంతాన భాగ్యం కోసం దత్త మంత్రం.!
🕉️"దూరీకృత్య పిశాచార్తిం జీవయిత్వా మృతం సుతం||
యో భూదభీష్టదః పాతు స నః సంతాన వృద్ధికృత్||"
6. సౌభాగ్యం కోసం దత్త మంత్రం.!
🕉️"జీవయామాస భర్తారం మృతం సత్యాహి మృత్యుహా||
మృత్యుంజయః స యోగీంద్రః సౌభాగ్యం మే ప్రయచ్ఛతు||"
7. అప్పులు తీరుటకు, అప్పుగా ఇచ్చిన ధనం తిరిగి రావడం కోసం దత్త మంత్రం.!
🕉️"అత్రేరాత్మ ప్రదానేన యోముక్తో భగవాన్ ఋ ణా త్||దత్తాత్రేయం తమీశానం నమామి ఋణముక్తయే||"
8. సర్వ పాప నివారణ దత్త మంత్రం.!
🕉️అత్రిపుత్రో మహాతేజా దత్తాత్రేయో మహామునిః||తస్య స్మరణ మాత్రేన సర్వ పాపైః ప్రముచ్యతే||
9. దత్తాత్రేయ అనుగ్రహ మంత్రం.!
🕉️అనసూయాసుత శ్రీశ జనపాతక నాశన||
దిగంబర నమో నిత్యం తుభ్యం మే వరదో భవ||
10. ఉన్నత విద్య కోసం దత్త మంత్రం.!
🕉️విద్వత్సుత మవిద్యం య అగతం లోక నిందితం|| భిన్న జిహ్వం బుధం చక్రే శ్రీ దత్తః శరణం మమ||
11. పోగొట్టుకున్న వస్తువులు, దొంగలించ బడ్డ ధనము లేక వస్తువుల తిరిగి పొందుటకు.!
🕉️కార్త వీర్యార్జునో నామ రాజా బాహు సహస్రవాన్|| తస్య స్మరణ మాత్రేన హృతం నష్టంచ లభ్యతే||
విధానం.!
ఈ మంత్రాలలో మీ సమస్యకు తగట్టు ఏది అవసరమో ఆ మంత్రాన్ని రోజు 108 సార్లు
లేక సమస్య తీవ్రతను బట్టి 1008సార్లు గాని
రోజూ ఉదయం జపం చేయాలి.
ఇలా 41 దినములు చేయాలి.
గమనిక: మంత్రజపం భక్తి, శ్రద్ధ, విశ్వాసంతో చేయాలి. ఫలితం దైవానుగ్రహం, కర్మ, పరిస్థితులపై ఆధారపడి ఉంటుంది.
జై గురుదత్తా 🙏
#దత్తాత్రేయ_సిద్ధ_మంగళ_స్తోత్రం - అర్ధసహితం
#దత్త కృపకు ద్వారం – శ్రీ దత్తాత్రేయుడు 🌸
శ్లోకం 1:
శ్రీమదనంత శ్రీవిభూషిత అప్పలలక్ష్మీ నరసింహరాజా
జయ విజయీభవ దిగ్విజయీభవ శ్రీమదఖండ శ్రీవిజయీభవ ॥ 1 ॥
అర్ధం:
శ్రీమంతమైన మరియు అనంతమైన శుభాలతో, సంపదలతో విరాజిల్లేవాడా! అప్పలరాజు శర్మ గారి (నరసింహ అవతార స్వరూపుని) కుమారుడా! దత్త జ్యోతి స్వరూపుడా నీకు జయం కలుగుగాక! అన్ని దిక్కులా నీకు దిగ్విజయం కలుగుగాక! ఎన్నటికీ నాశనం లేని అఖండమైన విజయం కలుగుగాక!
శ్లోకం 2:
శ్రీవిద్యాధరి రాధ సురేఖా శ్రీరాఖీధర శ్రీపాదా
జయ విజయీభవ దిగ్విజయీభవ శ్రీమదఖండ శ్రీవిజయీభవ ॥ 2 ॥
అర్ధం:
శ్రీవిద్యాధరి, రాధ మరియు సురేఖ అనబడే నీ ముగ్గురు అక్కల చేత రక్షా బంధనాన్ని (రాఖీని) కట్టించుకున్న సోదరుడా! శ్రీపాద శ్రీవల్లభా! నీకు జయం కలుగుగాక! దిగ్విజయం కలుగుగాక! అఖండమైన విజయం కలుగుగాక!
శ్లోకం 3:
మాతా సుమతీ వాత్సల్యామృత పరిపోషిత జయ శ్రీపాదా
జయ విజయీభవ దిగ్విజయీభవ శ్రీమదఖండ శ్రీవిజయీభవ ॥ 3 ॥
అర్ధం:
నీ తల్లి అయిన సుమతీ మహారాణి కురిపించిన వాత్సల్యం అనే అమృతంతో పోషించబడిన వాడా! శ్రీపాద శ్రీవల్లభా! నీకు జయం కలుగుగాక! దిగ్విజయం కలుగుగాక! అఖండమైన విజయం కలుగుగాక!
శ్లోకం 4:
సత్య ఋషీశ్వర దుహితానందన బాపనార్యనుత శ్రీచరణా
జయ విజయీభవ దిగ్విజయీభవ శ్రీమదఖండ శ్రీవిజయీభవ ॥ 4 ॥
అర్ధం:
సత్య ఋషీశ్వరుని కుమార్తె (సుమతీ మహారాణి)కి అనంతమైన ఆనందాన్ని కలిగించేవాడా! (సుమతీ మహారాణి తండ్రి) నీ తాతగారైన బాపనార్యుల వారిచేత కీర్తించబడిన పవిత్రమైన శ్రీచరణాలు కలవాడా! నీకు జయం కలుగుగాక! దిగ్విజయం కలుగుగాక! అఖండమైన విజయం కలుగుగాక!
శ్లోకం 5:
సవితృకాఠకచయన పుణ్యఫల భరద్వాజ ఋషి గోత్ర సంభవ
జయ విజయీభవ దిగ్విజయీభవ శ్రీమదఖండ శ్రీవిజయీభవ ॥ 5 ॥
అర్ధం:
సవితృకాఠక చయనం అనే గొప్ప యజ్ఞం చేసిన పుణ్య ఫలంగా, భరద్వాజస మహాఋషి గోత్రంలో జన్మించిన వాడా! నీకు జయం కలుగుగాక! దిగ్విజయం కలుగుగాక! అఖండమైన విజయం కలుగుగాక!
శ్లోకం 6:
దోచౌపాతీ దేవ్ లక్ష్మీ ఘన సంఖ్యా బోధిత శ్రీచరణా
జయ విజయీభవ దిగ్విజయీభవ శ్రీమదఖండ శ్రీవిజయీభవ ॥ 6 ॥
అర్ధం:
ఒక బ్రాహ్మణ గృహంలో భిక్ష అడుగుతూ 'దో చౌపాతీ దేవ్ లక్ష్మీ' (తల్లీ లక్ష్మీ, రెండు రొట్టెలు ఇవ్వు) అని అడిగి, అందులోని ఘనమైన సంఖ్యా శాస్త్ర, యోగ రహస్యాలను లోకానికి బోధించిన శ్రీచరణాలు కలవాడా! నీకు జయం కలుగుగాక! దిగ్విజయం కలుగుగాక! అఖండమైన విజయం కలుగుగాక!
శ్లోకం 7:
పుణ్యరూపిణీ రాజమాంబసుత గర్భపుణ్యఫల సంజాతా
జయ విజయీభవ దిగ్విజయీభవ శ్రీమదఖండ శ్రీవిజయీభవ ॥ 7 ॥
అర్ధం:
సాక్షాత్తూ పుణ్యస్వరూపిణి అయిన నీ అమ్మమ్మ రాజమాంబ గారి కుమార్తె (నీ తల్లి సుమతీ మహారాణి) యొక్క గర్భ పుణ్య ఫలంగా జన్మించిన వాడా! నీకు జయం కలుగుగాక! దిగ్విజయం కలుగుగాక! అఖండమైన విజయం కలుగుగాక!
శ్లోకం 8:
సుమతీ నందన నరహరి నందన దత్తదేవ ప్రభు శ్రీపాదా
జయ విజయీభవ దిగ్విజయీభవ శ్రీమదఖండ శ్రీవిజయీభవ ॥ 8 ॥
అర్ధం:
సుమతీ మహారాణికి మరియు అప్పలరాజు శర్మ (నరహరి స్వరూపుడు) గారికి ప్రియ పుత్రుడా! శ్రీ దత్తాత్రేయుని అవతారమైన ప్రభువైన శ్రీపాద శ్రీవల్లభా! నీకు జయం కలుగుగాక! దిగ్విజయం కలుగుగాక! అఖండమైన విజయం కలుగుగాక!
శ్లోకం 9:
పీఠికాపుర నిత్య విహారా మధుమతి దత్తా మంగళరూపా
జయ విజయీభవ దిగ్విజయీభవ శ్రీమదఖండ శ్రీవిజయీభవ ॥ 9 ॥
అర్ధం:
తన జన్మస్థలమైన పీఠికాపురంలో (ప్రస్తుత పిఠాపురం, ఆంధ్రప్రదేశ్) భక్తుల కోసం నిత్యం సూక్ష్మ రూపంలో విహరించేవాడా! మధుమతి అనబడే గొప్ప యోగ విద్యను తన భక్తులకు అనుగ్రహించే దత్తాత్రేయ మంగళ స్వరూపుడా! నీకు జయం కలుగుగాక! దిగ్విజయం కలుగుగాక! అఖండమైన విజయం కలుగుగాక!
"దత్తుని స్మరణే మంగళం… దత్తుని శరణే జీవన సాఫల్యం." 🙏
🕉️ శ్రీ గురుదేవ దత్త 🕉️
#సర్వేజనా సుఖినోభవంతు
1 month ago | [YT] | 5
View 0 replies
Mani Saibaba
🌿 తిరుమల భక్తులకు ముఖ్య సమాచారం🌿
👉 జూలై నుండి సెప్టెంబర్ 30 వరకు జరిగే పర్వదినాలు, ఉత్సవాల కారణంగా కొన్ని ప్రత్యేక రోజుల్లో వీఐపీ బ్రేక్ దర్శనాలు రద్దు చేయబడతాయి.
📌 జూలై
- జూలై 14 – కోయిల్ ఆళ్వార్ తిరుమంజనం
- జూలై 17 – ఆణివార ఆస్థానం
- జూలై 19 – శ్రీ ఆండవన్ ఆశ్రమ స్వామీజీకి పెద్ద మర్యాద
- జూలై 29 – జీయర్ స్వాముల చాతుర్మాస సంకల్పం
📌 ఆగస్టు
- ఆగస్టు 22 – పవిత్రోత్సవాల అంకురార్పణ
- ఆగస్టు 24 – పవిత్రోత్సవాల రెండో రోజు పవిత్రాల సమర్పణ
📌 సెప్టెంబర్
- సెప్టెంబర్ 8 – బ్రహ్మోత్సవాల సందర్భంగా కోయిల్ ఆళ్వార్ తిరుమంజనం
- సెప్టెంబర్ 14 – బ్రహ్మోత్సవాల అంకురార్పణ
- సెప్టెంబర్ 15 నుండి 23 వరకు – శ్రీవారి బ్రహ్మోత్సవాలు
⚠️ పై తేదీలకు ముందురోజు ప్రోటోకాల్ ప్రముఖులు మినహా వీఐపీ సిఫార్సు లేఖలు స్వీకరించబడవు.
🙏 భక్తులు తమ తిరుమల యాత్ర ప్రణాళికను ముందుగానే సిద్ధం చేసుకోవాలని టీటీడీ మనవి.
Disclaimer: Information purpose only.
1 month ago | [YT] | 14
View 0 replies
Mani Saibaba
*తిరుమల సమాచారం:*
*07-07-2026*
🍁🍁🍁🍁🍁
👉🏻 తిరుమలలో కొనసాగుతున్న భక్తుల రద్దీ .
👉🏻 ఉచిత దర్శనం కోసం *29* కంపార్ట్మెంట్లు లో వేచి ఉన్న భక్తులు .
👉🏻 ఉదయం 8 గంటల తరువాత వెళ్లే సర్వదర్శనం భక్తులకు *10-12 గంటల* సమయం పడుతుంది.
👉🏻 300 రూ.. శీఘ్రదర్శనంకు *3–4 గంటల* సమయం పడుతుంది.
👉🏻 సర్వ దర్శనమ్ టోకెన్ పొందిన భక్తులకు *4 నుండి 6 గంటల* సమయం పడుతుంది.
👉🏻 నిన్న స్వామివారిని దర్శించుకున్న భక్తుల సంఖ్య *81,692*
👉🏻 *35,361* మంది భక్తులు నిన్న స్వామివారికి తలనీలాలు సమర్పించారు.
👉🏻 నిన్న స్వామి వారి హుండీ ఆదాయం *₹4.72 కోట్లు*
👉🏻 నిన్న మొత్తం విక్రయించిన లడ్డూల సంఖ్య *4.17 లక్షలు*
👉🏻 నిన్న *అన్నప్రసాదాలు* స్వీకరించిన భక్తుల సంఖ్య *2.05 లక్షలు*
*ఓం నమో వేంకటేశాయ 🙏🙏🙏🙏🙏🙏*
1 month ago | [YT] | 5
View 0 replies
Mani Saibaba
🙏 నా భక్తుడి కోసం రథాన్ని ఆపిన జగన్నాథుడు! 🙏
"భక్తికి కులమతాలు అడ్డుకావని నిరూపించిన సాలభేగ మహాభక్తుని అద్భుత గాథ." 🙏
"ముస్లిం తండ్రికి జన్మించిన ఒక భక్తుడి కోసం... స్వయంగా జగన్నాథుడే తన రథాన్ని ఆపాడంటే నమ్మగలరా? నేటికీ ఆ సంప్రదాయం కొనసాగుతుండటం ఈ కథలోని గొప్ప విశేషం!"
సాలభేగ 17వ శతాబ్దానికి చెందినవాడు. అతని తండ్రి లాల్బేగ్ మొఘల్ సైన్యంలో ఒక ముస్లిం సుబేదార్ (సేనాధిపతి). ఒకసారి లాల్బేగ్ దండయాత్రకు వెళ్లినప్పుడు, ఒరిస్సాలోని పూరీకి సమీపంలో ఉన్న దండముకుందపూర్ అనే గ్రామానికి చెందిన ఒక బ్రాహ్మణ విధవరాలు (లలిత) అందాన్ని చూసి మోహించి, ఆమెను బలవంతంగా ఎత్తుకెళ్లి వివాహం చేసుకున్నాడు.
వారిద్దరికీ జన్మించిన కుమారుడే సాలభేగ.
ముస్లిం తండ్రి, హిందూ తల్లికి జన్మించడం వల్ల సాలభేగ చిన్నతనం నుంచే రెండు సంస్కృతుల మధ్య పెరిగాడు. తండ్రి లాగే యుద్ధ విద్యల్లో నిపుణుడై, మొఘల్ సైన్యంలో చేరాడు.
2. జీవితాన్ని మార్చిన యుద్ధం మరియు అద్భుతం
ఒకసారి ఒక పెద్ద యుద్ధంలో సాలభేగ తీవ్రంగా గాయపడ్డాడు. అతని శరీరంపై ఉన్న గాయాలు కుళ్లిపోయి, భయంకరమైన వ్యాధిగా మారాయి.
ఆ కాలంలోని వైద్యులెవరూ ఆ వ్యాధిని నయం చేయలేకపోయారు. సాలభేగ మరణ పడకపై చేరి తీవ్రమైన బాధను అనుభవిస్తున్నాడు.
ఆ సమయంలో అతని తల్లి లలిత, "నాయనా! ఈ ప్రపంచంలో ఏ వైద్యుడూ నిన్ను రక్షించలేడు. కానీ ఆ బ్రహ్మాండ నాయకుడు, పూరీ జగన్నాథుడు అనుగ్రహిస్తే నీకు ప్రాణభిక్ష లభిస్తుంది. మనస్ఫూర్తిగా ఆ శంఖు-చక్ర ధారిని ప్రార్థించు" అని చెప్పింది.
తల్లి మాటలపై నమ్మకంతో సాలభేగ కళ్లు మూసుకుని రాత్రింబగళ్లు జగన్నాథుడిని ధ్యానించడం ప్రారంభించాడు.
"స్వామీ! నువ్వు నిజంగానే దీనజన రక్షకుడివైతే నన్ను ఈ నరకం నుంచి కాపాడు" అని ఏడ్చాడు.
కొన్ని రోజులకు సాలభేగకు ఒక అద్భుతమైన కల వచ్చింది. కలలో సాక్షాత్తు శ్రీకృష్ణ పరమాత్ముడు (జగన్నాథుడు) ప్రత్యక్షమై, అతనికి విభూతిని ప్రసాదించి అదృశ్యమయ్యాడు.
మరుసటి రోజు ఉదయానికి సాలభేగ ఒంటిపై ఉన్న గాయాలన్నీ మాయమై, పూర్తి ఆరోగ్యవంతుడిగా మారిపోయాడు!
3. పూరీ ప్రయాణం - ఆలయ ప్రవేశ నిరాకరణ
ఈ అద్భుతంతో సాలభేగ హృదయం పూర్తిగా జగన్నాథుడి భక్తితో నిండిపోయింది. లౌకిక జీవితాన్ని, సైన్యాన్ని వదిలేసి, కేవలం స్వామిని దర్శించుకోవాలనే తపనతో పూరీ క్షేత్రానికి చేరుకున్నాడు.
కానీ, అక్కడ అతనికి పెద్ద నిరాశ ఎదురైంది. ముస్లిం తండ్రికి జన్మించడం వల్ల ఆ కాలపు ఆచారాల ప్రకారం ఆలయ పూజారులు అతడిని పూరీ జగన్నాథ ఆలయంలోనికి రానివ్వలేదు.
సింహద్వారం ముందే అతడిని నెట్టేశారు. సాలభేగ ఏడుస్తూ స్వామిని వేడుకున్నాడు, కానీ ఫలితం లేకపోయింది.
4. బృందావన యాత్ర - రథయాత్ర ప్రతిజ్ఞ
ఆలయంలోకి ప్రవేశం దొరక్కపోవడంతో, సాలభేగ శ్రీకృష్ణుడి లీలలు జరిగిన బృందావనానికి వెళ్లాడు.
అక్కడ కొన్నేళ్ల పాటు సాధన చేసి, మహా భక్తుడిగా మారిపోయాడు. ఎన్నో అద్భుతమైన భక్తి కీర్తనలు (ఒరియా భాషలో వీటిని 'జనన' అంటారు) రచించాడు.
అయితే, పూరీ జగన్నాథుడిని చూడాలనే కోరిక అతనిలో అణుమాత్రం తగ్గలేదు. జగన్నాథుడికి జరిగే ప్రసిద్ధ రథయాత్ర సమయంలో, స్వామి స్వయంగా ఆలయం వెలుపలికి వచ్చి కులమతాల భేదం లేకుండా అందరికీ దర్శనమిస్తాడని సాలభేగకు తెలుసు. అందువల్ల రథయాత్ర సమయానికి పూరీ చేరుకోవాలని బృందావనం నుండి బయలుదేరాడు.
5. అనారోగ్యం మరియు రథం ఆగిపోవడం (మహా అద్భుతం)
పూరీకి వస్తున్న దారిలో సాలభేగ హఠాత్తుగా తీవ్రమైన జ్వరానికి గురయ్యాడు.
శరీరం సహకరించడం లేదు, నడవలేని స్థితి. రథయాత్ర రోజు వచ్చేసింది. స్వామి రథం (నందిఘోష) గుండిచా మందిరం వైపు కదులుతోంది. సాలభేగ పూరీకి ఇంకా చాలా దూరంలో ఉన్నాడు.
ఆక్రందనతో సాలభేగ స్వామికి ఇలా ప్రార్థన చేశాడు:
"తండ్రీ! నీ దర్శనం కోసం ఇన్నాళ్లు వేచి చూశాను. ఈ పాపిని నీ రూపం చూడకుండానే పోనిస్తావా? నేను వచ్చే వరకు దయచేసి నీ రథాన్ని ఆపు స్వామీ!" అని రోదించాడు.
అక్కడ పూరీలో ఒక విచిత్రం జరిగింది. సాలభేగ ఎక్కడైతే స్వామి రథాన్ని ఆపమని వేడుకున్నాడో (ప్రస్తుతం ఆ స్థలాన్ని 'బడదండ' అంటారు), కరెక్ట్గా అదే స్థలానికి రాగానే జగన్నాథుడి రథం నిలిచిపోయింది.
ఎంతమంది లాగినా, ఏనుగులను తెచ్చి లాగించినా రథం ఒక్క అంగుళం కూడా ముందుకు కదల్లేదు. రాజు, పూజారులు, ప్రజలంతా ఆందోళనలో పడ్డారు. అప్పుడు స్వామి ప్రధాన పూజారికి ఒక కల వచ్చింది. "నా పరమ భక్తుడైన సాలభేగ నా దర్శనం కోసం వస్తున్నాడు. అతడు వచ్చే వరకు నా రథం ముందుకు కదలదు" అని స్వామి ఆజ్ఞాపించాడు.
6. దర్శనం - ముక్తి
చివరకు సాలభేగ ఎలాగోలా రథం ఆగిపోయిన చోటికి చేరుకున్నాడు. రథంపై ఉన్న జగన్నాథుడిని చూడగానే అతని కళ్లవెంట ఆనంద బాష్పాలు రాలాయి.
సాక్షాత్తు ఆ జగన్నాథుడే తన కోసం రథాన్ని ఆపాడు అని తెలియగానే సాలభేగ పరవశించిపోయాడు. సాలభేగ స్వామిని మనసారా దర్శించుకుని, స్తుతించిన వెంటనే... అంతవరకు కదలని ఆ రథం, కేవలం భక్తుల చేతి స్పర్శతో చాలా సులువుగా ముందుకు కదిలింది!
సాలభేగ తన జీవితాంతం పూరీలోనే ఉంటూ, స్వామిపై కీర్తనలు పాడుకుంటూ గడిపాడు. అతను మరణించిన తర్వాత, అతని భౌతిక కాయాన్ని ఎక్కడైతే రథం ఆగిపోయిందో (బడదండ) అక్కడే సమాధి చేశారు.
నేటికీ కొనసాగుతున్న సాంప్రదాయం
ఈ కథ కేవలం చరిత్ర కాదు, నేటికీ సజీవ సాక్ష్యం. ప్రతి సంవత్సరం పూరీలో రథయాత్ర జరిగినప్పుడు, జగన్నాథుడి రథం 'బడదండ' వీధిలో ఉన్న భక్త సాలభేగ సమాధి వద్ద కొద్దిసేపు ఖచ్చితంగా ఆగుతుంది.
అక్కడ స్వామికి ప్రత్యేక పూజలు చేసి, ఆ తర్వాతే రథాన్ని ముందుకు తీసుకెళ్తారు. భగవంతుడు కేవలం భక్తికి మాత్రమే లొంగుతాడు, కులమతాలకు కాదు అని నిరూపించిన గొప్ప కథ ఇది.
"భక్తి ముందు జన్మ, కులం, మతం, సంప్రదాయం అన్నీ చిన్నవే. స్వచ్ఛమైన హృదయంతో పిలిచే భక్తుడి కోసం భగవంతుడే ఎదురుచూస్తాడని సాలభేగ జీవితమే సజీవ సాక్ష్యం." 🙏
జై జగన్నాధ 🙏
1 month ago | [YT] | 0
View 0 replies
Mani Saibaba
శివపార్వతుల ఇద్దరు కుమారుల అద్భుత కథ
గణేశుడు – కార్తికేయుడు: జ్ఞానం గెలిచిందా? వేగం గెలిచిందా?
కైలాస పర్వతంపై ఒక రోజు శివుడు, పార్వతీదేవి తమ ఇద్దరు కుమారులు గణేశుడు, కార్తికేయుడు ఎదుట కూర్చున్నారు. దేవతలందరూ అక్కడే ఉన్నారు. నారద మహర్షి ఒక దివ్యమైన జ్ఞానఫలాన్ని తీసుకొచ్చాడు.
ఆ ఫలాన్ని చూసి ఇద్దరు కుమారులు కూడా దాన్ని పొందాలని కోరుకున్నారు.
అప్పుడు శివుడు చిరునవ్వుతో ఇలా అన్నాడు:
> "మీలో ఎవరు ముందుగా ఈ మూడు లోకాలను ప్రదక్షిణ చేసి వస్తారో, ఆ జ్ఞానఫలం వారికి దక్కుతుంది."
ఇది విన్న వెంటనే కార్తికేయుడు తన నెమలి వాహనంపై వేగంగా బయలుదేరాడు.
కానీ గణేశుడి వాహనం చిన్న ఎలుక. అతడు ఆలోచించాడు.
"నేను ఎంత వేగంగా వెళ్లినా అన్నయ్యను అందుకోలేను. కానీ శాస్త్రం ఏమంటుందో తెలుసుకోవాలి."
వెంటనే గణేశుడు తన తల్లిదండ్రులైన శివపార్వతుల చుట్టూ మూడు ప్రదక్షిణలు చేశాడు.
ఆ తర్వాత నమస్కరించి ఇలా అన్నాడు:
> "తల్లిదండ్రులే మూడు లోకాలతో సమానం. వారిని ప్రదక్షిణ చేయడం అంటే విశ్వాన్ని ప్రదక్షిణ చేసినట్లే."
ఆ మాట విని దేవతలందరూ ఆశ్చర్యపోయారు.
శివుడు, పార్వతి ఆనందంతో గణేశుడికి ఆ జ్ఞానఫలాన్ని అందించారు.
కొంతసేపటికి మూడు లోకాలు తిరిగి వచ్చిన కార్తికేయుడు ఈ విషయం తెలుసుకొని బాధపడ్డాడు.
కానీ శివుడు ప్రేమగా ఇలా చెప్పాడు:
> "కుమారా! నీవు శౌర్యానికి ప్రతీక. గణేశుడు జ్ఞానానికి ప్రతీక. వేగం గొప్పదే, కానీ జ్ఞానం దానికి దారి చూపుతుంది."
కార్తికేయుడు కూడా ఆ మాటను అంగీకరించి తన తమ్ముడిని ఆలింగనం చేసుకున్నాడు.
ఆ రోజు నుంచి—
గణేశుడు విఘ్నాలను తొలగించే దేవుడిగా, బుద్ధి-జ్ఞానానికి అధిపతిగా ప్రసిద్ధి పొందాడు.
కార్తికేయుడు ధైర్యం, శౌర్యం, యుద్ధవిజయానికి ప్రతీకగా దేవసేనాధిపతిగా నిలిచాడు.
ఈ కథ చెప్పే నీతి
తల్లిదండ్రులను గౌరవించడం అంటే దేవుణ్ణి గౌరవించినట్టే.
వేగం కంటే జ్ఞానం గొప్పది.
శక్తి, బుద్ధి రెండూ సమానంగా అవసరం.
నిజమైన విజయం తెలివిగా ఆలోచించిన వారిదే.
"వేగం గమ్యానికి తీసుకెళ్తుంది... కానీ జ్ఞానం సరైన గమ్యాన్ని చూపిస్తుంది." 🙏🕉️
1 month ago | [YT] | 5
View 0 replies
Mani Saibaba
*తిరుమల సమాచారం:*
*06-07-2026*
🍁🍁🍁🍁🍁
👉🏻 తిరుమలలో స్వల్పంగా తగ్గిన భక్తుల రద్దీ .
👉🏻 ఉచిత దర్శనం కోసం *24* కంపార్ట్మెంట్లు లో వేచి ఉన్న భక్తులు .
👉🏻 ఉదయం 8 గంటల తరువాత వెళ్లే సర్వదర్శనం భక్తులకు *8 గంటల* సమయం పడుతుంది.
👉🏻 300 రూ.. శీఘ్రదర్శనంకు *2–4 గంటల* సమయం పడుతుంది.
👉🏻 సర్వ దర్శనమ్ టోకెన్ పొందిన భక్తులకు *3 నుండి 5 గంటల* సమయం పడుతుంది.
👉🏻 నిన్న స్వామివారిని దర్శించుకున్న భక్తుల సంఖ్య *88,412*
👉🏻 *31,273* మంది భక్తులు నిన్న స్వామివారికి తలనీలాలు సమర్పించారు.
👉🏻 నిన్న స్వామి వారి హుండీ ఆదాయం *₹5.05 కోట్లు*
👉🏻 నిన్న మొత్తం విక్రయించిన లడ్డూల సంఖ్య *4.24 లక్షలు*
👉🏻 నిన్న *అన్నప్రసాదాలు* స్వీకరించిన భక్తుల సంఖ్య *2.55 లక్షలు
*ఓం నమో వేంకటేశాయ 🙏*
1 month ago | [YT] | 2
View 0 replies
Load more