BCS BVR JMR YSRCP SOCIALMEDIA

YSRCP ALURU constiuency 🇱🇸
busine virupakshi


BCS BVR JMR YSRCP SOCIALMEDIA

25-06-2026
కర్నూలు జిల్లా

ఈరోజు *ఆలూరులో బేలే గుండు ఆంజనేయస్వామి దేవాలయం* నందు హలహర్వి మండలం *_మైదహళ్ గ్రామవాసి నల్లన్న గారి కూతురు_* వివాహ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరై నూతన వధూవరులు ఆశీర్వదించారు *_ఆలూరు నియోజకవర్గం MLA శ్రీ బుసినే విరుపాక్షి గారు_*... ఈ కార్యక్రమంలో YSRCP నాయకులు కార్యకర్తలు BVR అభిమానులు పాల్గొన్నారు....

😎 TEAM BCS ALUR 🇸🇱

#YSJagan
#Busine_Virupakshi #Aluru_Constitunecy_MLA
#YSRCongressParty #YSRCP_2029

1 day ago | [YT] | 140

BCS BVR JMR YSRCP SOCIALMEDIA

25-06-2026

ఈరోజు పులివెందుల పర్యటనలో _మాజీ ముఖ్యమంత్రి వర్యులు అధినేత వైస్ జగన్ మోహన్ రెడ్డి గారిని_ మర్యాద పూర్వకంగా కలవడం జరిగింది.. _ఆలూరు నియోజకవర్గం MLA శ్రీ బుసినే విరుపాక్షి గారు_ అనంతరం _MLA గారు_ పలు సమస్యలు గురించి _అధినేత జగన్మోహన్ రెడ్డి గారి_ తెలియజేశారు...

😎 TEAM BCS ALUR 🇸🇱

#YSJagan
#Busine_Virupakshi #Aluru_Constitunecy_MLA
YSRCongressParty #TorgetBVR_2029

1 day ago | [YT] | 432

BCS BVR JMR YSRCP SOCIALMEDIA

భూమయ్యగారిపల్లె లక్ష్మీనరసింహ స్వామి దేవాలయ కలశ స్థాపనకు హాజరైన జగన్

దేవాలయంలో కలశ శంకుస్థాపన, సుదర్శన హోమంలో పాల్గొన్న జగన్.

2 days ago | [YT] | 64

BCS BVR JMR YSRCP SOCIALMEDIA

ఈ కూటమి ప్రభుత్వం చేతకాని దద్దమ్మ ప్రభుత్వం!!

ఆలూరు ఎమ్మెల్యే శ్రీ బుసినే విరుపాక్షి గారు

ఈరోజు ఆలూరు నియోజకవర్గ కేంద్రంలోని ఆలూరు గ్రామపంచాయతీ కార్యాలయం ముందు తాగు నీటి కోసం ఏర్పాటుచేసిన సమావేశంలో ప్రజలతో కలిసి ఎమ్మెల్యే శ్రీ బుసినే విరుపాక్షి గారు మాట్లాడుతూ

ఆలూరు నియోజకవర్గ కేంద్రంలో గత 16 రోజులుగా తాగునీరు లేక ఆలూరు గ్రామ ప్రజలు తీవ్రంగా అవస్థలు పడుతున్నారు.

కనీసం తాగునీరు ఇవ్వలేని ఈ కూటమి ప్రభుత్వం ఎక్కడుంది అని అడుగుతున్నాను

రెండేళ్ల నారాసుర పాలన.. రాష్ట్రానికి, ప్రజలకు వెన్నుపోటు

సూపర్‌ సిక్స్‌.. సూపర్‌ సెవెన్‌ సహా 143 హామీలిచ్చారు
చంద్రబాబూ.. ఈ హామీలన్నీ ఏమయ్యాయని ప్రజలు అడుగుతున్నారు

రైతులు, మహిళలు, యువత, విద్యార్థులు, ప్రతి కుటుంబాన్నీ మోసం చేశారు

చెప్పిన మాటలకు.. చేసిన పనులకు ఏమాత్రం పొంతనే లేదు

ప్రతి క్షణం మోసం, దగా, స్కామ్‌ల మయం..

రెండేళ్లుగా పచ్చి అబద్ధాల ప్రచారం, మోసం, కక్ష సాధింపులు, వివక్ష, అరాచకాలు, రెడ్‌బుక్‌ పాలన

కుప్పకూలిన వ్యవస్థలు.. ఎవరికీ రక్షణ లేదు.. జంగిల్‌ రాజ్‌లా రాష్ట్రాన్ని నడుపుతున్నారు
ప్రజలు ప్రతి హామీని గుర్తు పెట్టుకుని.. ప్రతి మోసాన్నీ లెక్కపెడుతున్నారు..

చంద్రబాబు అహంకార నిర్లక్ష్య పాలనకు వ్యతిరేకంగా ప్రజల తరఫున నా పోరాటం ఆగదు..

ప్రజల కోసం నిరంతరం పోరాటం చేస్తూనే ఉంటా... ఆలూరు నియోజకవర్గ ప్రజలకి తాగునీరు వచ్చే వరకు నా పోరాటం ఆగదు... ఈ ఆలూరు నియోజకవర్గం ప్రజలందరికీ అండగా ఉంటాను అని హామీ ఇస్తున్న... MLA బుసినే విరుపాక్షి గారు

ఈ కార్యక్రమంలో వైయస్సార్సీపి నాయకులు, కార్యకర్తలు BVR అభిమానులు ప్రజలు పాల్గొన్నారు....

😎TEAM BCS ALUR 🇸🇱

#YSJagan
#Busine_Virupakshi #Aluru_Constitunecy_MLA
#YSRCongressParty #TorgetBVR_2029

3 days ago | [YT] | 169

BCS BVR JMR YSRCP SOCIALMEDIA

ప్రతిపక్షం మీ తప్పులను ప్రశ్నిస్తే అణిచేస్తారా? అన్యాయంగా కేసులు పెడతారా?

ఎవరి స్థాయి ఏంటో నియోజకవర్గ ప్రజలకు బాగా తెలుసు..
ఎమ్మెల్యే శ్రీ బుసినే విరుపాక్షి గారు!!

ఈరోజు ఆలూరు నియోజకవర్గం కేంద్రంలోని R&B గెస్ట్ హౌస్ నందు ఏర్పాటుచేసిన మీడియా ప్రతినిధుల సమావేశంలో వైఎస్ఆర్సిపి నాయకులు, కార్యకర్తలతో కలిసి. ఎమ్మెల్యే శ్రీ బుసినే విరుపాక్షి గారు మాట్లాడుతూ!!

టీడీపీ ఇంచార్జ్ జ్యోతమ్మ గారు గ‌డిచిన రెండేళ్ల‌లో ఈ నియోజకవర్గ ఇన్చార్జిగా ఉన్న మీరు ఈ నియోజకవర్గ ప్రజల కొరకు అభివృద్ధి ఏమి చేశారు అని ప్ర‌శ్నిస్తే ఈ నియోజకవర్గ ప్రజల ప్రతినిధిగా
ఈ నియోజకవర్గ ఎమ్మెల్యేగా ఉన్న నాపై నిందలు వేస్తే ఎంత వ‌ర‌కు క‌రెక్ట్‌? అని నేను ప్రశ్నిస్తున్నాను...

ఒక మహిళా ప్రజాప్రతినిధిగా ఒక ఆడపడుచుగా నేను మిమ్మల్ని ఎన్నడూ వ్యక్తిగతంగా మాట్లాడలేదు
కానీ ఎందుకు మీరు ఆలూరు నియోజకవర్గం అభివృద్ధిపై దృష్టి పెట్టకుండా నిత్యం ప్రజల్లో ఉన్న నన్ను వ్యక్తిగతంగా దూషిస్తున్నారు.

వ్య‌వ‌స్థ‌ల‌ను మీ స్వార్థ రాజ‌కీయాల‌కు వాడుకోవ‌డం సుప‌రిపాల‌నా? ప్రజలకు మంచి చేయడం, ప్రజలకు ఉపాధి కల్పించడం, పేద ప్రజల జీవితాలకు ఏ సమస్య రాకుండా పాలన చేయడం మీ బాధ్యత కాదా? అలాంటి బాధ్యతలను నిర్వర్తించడంలో మీరు విఫలం చెందడం, పైగా మీరే నాపై బురద జల్లడం దుర్మార్గమైన విషయం కాదా? మీరు నియోజకవర్గ ఇన్చార్జిగా ప్రజల చేత ఎన్నుకోబడినరా. నాకు ప్రోటోకాల్ లేకుండా చేస్తున్నది రాజ్యాంగ ఉల్లంఘన కాదా? ఇలాంటి ఘటనలకు మీరు మూల్యం చెల్లించుకోక త‌ప్ప‌దు. ఎల్లకాలం ఇలాగే ఉండదు దేవుడు, ప్ర‌జ‌లు మీకు బుద్ధి చెప్పే రోజు ద‌గ్గ‌ర్లోనే ఉంది

ప్రతిపక్షంగా మీ తప్పులను ప్రశ్నిస్తే BC లు అని అణచివేయడం, అన్యాయంగా వ్యక్తిగతంగా నిత్యం ప్రజల్లో ఉన్న నన్ను దూషించడం సబబు కాదన్నారు...

గుడిసె కృష్ణమ్మ గారు మీరు ఒక బీసీ మహిళ ప్రతినిధి గా ఉన్నారు..

TDP జిల్లా అధ్యక్షురాలు అయిన గుడిసె కృష్ణమ్మ గారు బీసీల పట్ల మీకు చిన్న చూపు ఎందుకు అని ప్రశ్నిస్తున్నాను. ఒక బీసీ ఎమ్మెల్యేగా ఒక నియోజకవర్గ ప్రజా ప్రతినిధిగా ఉన్న నన్ను కించపరిచే విధంగా మాట్లాడడం సమంజసమా అని నేను అడుగుతున్నాను.
ఇకనైనా మీరు ఇలాంటి వ్యక్తిత్వహననం చేసే విధంగా కించపరిచే విధంగా మాట్లాడడం సబబు కాదని హెచ్చరిస్తున్నాను...
_ఆలూరు నియోజకవర్గం MLA శ్రీ బుసినే విరుపాక్షి గారు_

ఈ కార్యక్రమంలో వైయస్సార్సీపి నాయకులు కార్యకర్తలు పార్టీ అనుబంధ విభాగాల సభ్యులు BVR అభిమానులు పాల్గొన్నారు...

😎TEAM BCS ALUR 🇸🇱

#YSJagan
#Busine_Virupakshi #Aluru_Constitunecy_MLA
#YSRCongressParty #TorgetBVR_2029

3 days ago | [YT] | 149

BCS BVR JMR YSRCP SOCIALMEDIA

వైయస్సార్ జిల్లా

రేపటి నుంచి 3 రోజుల పాటు పులివెందులలో మాజీ సీఎం వైఎస్ జగన్ పర్యటన

రేపు 23వ తేదీ సాయంత్రం పులివెందుల చేరుకోనున్న వైఎస్ జగన్

తన క్యాంప్ కార్యాలయంలో ప్రజాదర్బార్ నిర్వహించనున్న వైఎస్సార్సీపీ అధినేత వైఎస్ జగన్

24వ తేదీ వేముల మండలం భూమయ్యగారిపల్లిలో లక్ష్మీనరసింహ స్వామి దేవాలయాన్ని సందర్శించనున్న వైఎస్ జగన్

వైఎస్ జగన్ సీఎంగా కోటిన్నరకు పైగా దేవాలయానికి మంజూరు

ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డి, పాడా నిధులతో మరికొన్ని పనులు

దాతల విరాళాలు కలుపుకుని రూ. 2.5 కోట్లతో దేవాలయ పునఃప్రతిష్ట

దేవాలయంలో ప్రత్యేక పూజల అనంతరం క్యాంపు కార్యాలయానికి మాజీ సీఎం వైఎస్ జగన్

మధ్యాహ్నం నుంచి ప్రజాదర్బార్

25వ తేదీ ఉదయం తిరుగు పయనం కానున్న వైఎస్ జగన్.

4 days ago | [YT] | 510

BCS BVR JMR YSRCP SOCIALMEDIA

ఆలూరు నియోజకవర్గం లో తెలుగుదేశం పార్టీకి భారీ ఎదురుదెబ్బ!!

చంద్రబాబు ప్రజా వ్యతిరేక పాలనకు వ్యతిరేకంగా తెలుగుదేశం పార్టీని వీడి వైయస్సార్సీపి పార్టీలోకి చేరిన 30 కుటుంబాలు...
ఎమ్మెల్యే శ్రీ బుసినే విరుపాక్షి గారు.

ఈరోజు MLA క్యాంపు కార్యాలయం నందు ఆలూరు నియోజకవర్గం హోళగుంద మండలం సులువాయి గ్రామం తెలుగుదేశం పార్టీకి చెందిన 30 కుటుంబాలు వైఎస్సార్సీపీలో చేరడం జరిగింది... పార్టీలోకి చేరిన వారికి కండువ వేసి ఆహ్వానించడం జరిగింది.. ఆలూరు నియోజకవర్గం MLA శ్రీ బుసినే విరుపాక్షి గారు

అనంతరం MLA శ్రీ బుసినే విరుపాక్షి గారు మాట్లాడుతూ

సీఎం చంద్రబాబు గారికి వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు YS జగన్ మోహన్ రెడ్డి గారు అంటే భయమని

చంద్రబాబు వచ్చిన తరువాత ఏం లేదు,చిన్న పిల్లలకు అమ్మఒడి ఎప్పుడు ఇస్తారో తెలియదు,పిల్లలను చదివించాలి అంటే ప్రజలు చాలా ఇబ్బందులకు గురవుతున్నారని..

అన్ని వర్గాలను మోసం చేసిన ఘ‌నుడు చంద్ర‌బాబు
రైతులకు గిట్టుబాటు ధర కల్పించడంలో ప్రభుత్వం ఫలమైందని ప్రకృతి వైపరీత్యాల సాయం, ఇన్‌పుట్ సబ్సిడీ, సున్నా వడ్డీ రుణాలను కూడా ఎగ్గొట్టిందని. రైతులు తీవ్ర నష్టాలు చవిచూస్తున్నా ప్రభుత్వం స్పందించడం లేదు...

ప్రజల సమస్యలపై ఉద్యమాలు మేము చేసిన తర్వాతే ఈ ప్రభుత్వం స్పందిస్తూ ఉందని చంద్రబాబు ఎన్నికల హామీలను అమలు చేయకుండా రైతులు, మహిళలు, యువత సహా అన్ని వర్గాలను మోసం చేశారు...

ఆడబిడ్డ నిధి, నిరుద్యోగ భృతి హామీలు కూడా
నెరవేర్చలేదని అన్నారు.

ఈ రాష్ట్రంలో గాడితప్పిన శాంతిభద్రతలకు నిదర్శనం .. కృష్ణలంక పోలీస్ స్టేషన్ లో ఘటన కాపు యువకుడు, జనసేన కార్యకర్త గాదే సాయికృష్ణను లాకప్‌ లో చంపేసిన తీరుని..

ఉసరవెల్లి పవన్ కళ్యాణ్‌ను తీరుని చూసి ఈ రాష్ట్ర ప్రజానీకం తీవ్ర ఆవేదనకు గురవుతున్నారని అన్నారు...

ఈ కార్యక్రమంలో మండల కన్వీనర్, గ్రామ వైయస్సార్సీపీ నాయకులు కార్యకర్తలు BVR అభిమానులు పాల్గొన్నారు..

😎TEAM BCS ALUR 🇸🇱

#YSJagan
#Busine_Virupakshi #Aluru_Constitunecy_MLA
#YSRCongressParty #YSRCP_2029

5 days ago | [YT] | 272

BCS BVR JMR YSRCP SOCIALMEDIA

20-06-2026

ఈరోజు చిప్పగిరి మండల కన్వీనర్ డేగులపాడు మల్లికార్జున గారి ఆహ్వానం మేరకు శ్రీ మద్దిలేటి లక్ష్మి నరసింహ స్వామి వారి దేవర మహోత్సవానికి ముఖ్య అతిథిగా హాజరై _శ్రీ మద్దిలేటి లక్ష్మి నరసింహ స్వామి వారినీ_దర్శనం చేసుకుని ప్రత్యేక పూజలు చేయడం జరిగింది.. _ఆలూరు నియోజకవర్గం MLA శ్రీ బుసినే విరుపాక్షి గారు_ అనంతరం ఆలయ అర్చకులు MLA గారికి తీర్థ ప్రసాదాలు ఇవ్వడం జరిగింది... ఈ కార్యక్రమంలో YSRCP నాయకులు, కార్యకర్తలు, BVR అభిమానులు పాల్గొన్నారు...

😎TEAM BCS ALUR 🇸🇱

#YSJagan
#Busine_Virupakshi #Aluru_Constitunecy_MLA
#YSRCongressParty #YSRCP_2029

6 days ago | [YT] | 131

BCS BVR JMR YSRCP SOCIALMEDIA

సాయి కృష్ణ మృతి, క్రాంతి కుమార్ ఆత్మహత్య ఘటనలపై ఎన్‌హెచ్‌ఆర్‌సీకి ఫిర్యాదు.

స్వతంత్ర విచారణ కోరిన ఎంపీ గురుమూర్తి, గుమ్మా తనూజారాణి.

విజయవాడలో చోటుచేసుకున్న గడే సాయి కృష్ణ అనుమానాస్పద మరణం, పి. క్రాంతి కుమార్ ఆత్మహత్య ఘటనలపై జాతీయ మానవ హక్కుల కమిషన్ తక్షణం జోక్యం చేసుకుని స్వతంత్ర, నిష్పాక్షిక విచారణ చేపట్టాలని తిరుపతి ఎంపీ మద్దిల గురుమూర్తి, గుమ్మా తనూజా రాణిలు కోరారు. వైఎస్సార్పా కాంగ్రెస్ర్ పార్టీ అధ్యక్షులు వైఎస్ జగన్మోహన్ రెడ్ది ఆదేశాల మేరకు శుక్రవారం ఎన్‌హెచ్‌ఆర్‌సీ చైర్‌పర్సన్‌కు ఫిర్యాదు చేశారు.

సాయి కృష్ణ మరణం కస్టడీ హింస అనుమానాలకు తావిస్తున్నదని, పోలీసు కస్టడీలో తమ బిడ్డ హింసకు గురయ్యాడని కుటుంబ సభ్యులు చెప్పడం చూస్తుంటే ఈ అంశం తీవ్ర ఆందోళన కలిగిస్తుందని ఎంపీ పేర్కొన్నారు. ఈ ఘటనకు సంబంధించిన అరెస్ట్, నిర్బంధం, వైద్య పరీక్షలు, సీసీటీవీ దృశ్యాలు, పోస్టుమార్టం నివేదికలు తదితర అన్ని ఆధారాలను పరిశీలించి పూర్తి స్థాయి విచారణ జరపాలని కోరారు.

అలాగే విజయవాడకు చెందిన పి.క్రాంతి కుమార్ మరణానికి ముందు విడుదలైన వీడియోలో కృష్ణలంక సర్కిల్ ఇన్‌స్పెక్టర్ నాగరాజు తనపై నిరంతరం వేధింపులకు పాల్పడ్డారని ఆరోపించిన విషయాన్ని ఎంపీ ఎన్‌హెచ్‌ఆర్‌సీ దృష్టికి తీసుకెళ్లారు. ఈ వీడియోతో పాటు మొబైల్ ఫోన్, కాల్ డేటా రికార్డులు, ఇతర డిజిటల్ ఆధారాలను భద్రపరిచి ఫోరెన్సిక్ పరీక్షలు నిర్వహించాలని విజ్ఞప్తి చేశారు.

ఈ రెండు ఘటనల్లోనూ ఒకే పోలీసు అధికారి పేరు వినిపించడం ప్రజల్లో తీవ్ర అనుమానాలకు దారితీస్తోందని, నిజానిజాలు వెలుగులోకి రావాలంటే స్వతంత్ర సంస్థ లేదా ప్రత్యేక దర్యాప్తు బృందం ద్వారా విచారణ జరపాల్సిన అవసరం ఉందని డాక్టర్ గురుమూర్తి అభిప్రాయపడ్డారు.

బాధిత కుటుంబాలకు న్యాయం జరిగేలా చర్యలు తీసుకోవడంతో పాటు మానవ హక్కుల ఉల్లంఘనలకు బాధ్యులైన వారిపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని ఆయన ఎన్‌హెచ్‌ఆర్‌సీని కోరారు. అలాగే బాధిత కుటుంబ సభ్యులు, సాక్షులకు రక్షణ కల్పించి, భవిష్యత్తులో ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా తగిన మార్గదర్శకాలు జారీ చేయాలని విజ్ఞప్తి చేశారు.

ప్రజాస్వామ్య వ్యవస్థలో చట్టపాలన, మానవ హక్కుల పరిరక్షణ అత్యంత ముఖ్యమని, ఈ రెండు ఘటనలపై పారదర్శక విచారణ జరగడం ద్వారా ప్రజల్లో న్యాయవ్యవస్థపై విశ్వాసం మరింత బలపడుతుందని ఎంపీ డాక్టర్ మద్దిల గురుమూర్తి పేర్కొన్నారు.

#AdminPost #NHRC #HumanRights
#JusticeForGadeSaiKrishna
#JusticeForKranthiKumar
#CustodialViolence #PoliceAccountability
#HumanRightsViolation #AndhraPradesh
#Vijayawada #ProtectHumanRights #TirupatiMP #MaddilaGurumoorthy

1 week ago | [YT] | 108

BCS BVR JMR YSRCP SOCIALMEDIA

హాలహర్వీ మండలం SIR (Special Incentive Revision) వైయస్సార్సీపి బూతు లెవెల్ ఏజెంట్ల సమావేశంలో ఆలూరు ఎమ్మెల్యే శ్రీ బుసినే విరుపాక్షి గారు!!

ఆలూరు నియోజకవర్గం హాలహర్వీ మండలం టీ.చాకిబండ, శ్రీధర్ హాల్ మరియు బేవినహాల్ గ్రామాలలో జరుగుతున్న SIR (Special IncentiveRevision) వైయస్సార్సీపి బూత్ లెవెల్ ఏజెంట్లతో ఏర్పాటు చేసిన సమావేశంలో ఆలూరు ఎమ్మెల్యే శ్రీ బుసినే విరుపాక్షి గారు పాల్గొనడం జరిగింది.

అనంతరం ఎమ్మెల్యే శ్రీ బుసినే విరుపాక్షి గారు పార్టీ బూత్ లెవెల్ ఏజెంట్ల తో మాట్లాడుతూ..

Sir ప్రక్రియ లో భాగంగా ప్రతి ఓటరు వివరాన్నిక్షుణ్ణంగా పరిశీలిస్తూ, ప్రజలకు ఎటువంటి ఇబ్బందులు కలగకుండా పార్టీ శ్రేణులు అప్రమత్తంగా పనిచేయాలని సూచించారు....

బూత్ స్థాయిలో పార్టీకి బలమైన నిర్మాణం ఉండాలని, ప్రతి కార్యకర్త ప్రజలతో నిరంతరం మమేకమై BLO లతో సమన్వయం చేసుకుంటూ పనిచేయాలని మరియు ప్రజల సమస్యలను తెలుసుకుని పరిష్కార దిశగా కృషి చేయాలని అన్నారు...

ప్రస్తుతం రాష్ట్రంలో ప్రజలకు ఇచ్చిన హామీల అమలులో కూటమి ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని విమర్శించారు. ప్రజల్లో పెరుగుతున్న అసంతృప్తిని పార్టీ శ్రేణులు ప్రజా సమస్యల రూపంలో బయటకు తీసుకురావాలని పిలుపునిచ్చారు...

ప్రజాస్వామ్య పరిరక్షణలో BLAల పాత్ర అత్యంత కీలకమని, ఓటరు జాబితాలో ఎలాంటి అక్రమాలు చోటు చేసుకోకుండా అప్రమత్తంగా వ్యవహరించాలని ముఖ్యంగా వైయస్సార్సీపి అనుకూల ఓట్లు తొలగించకుండా జాగ్రత్తగా ఉండాలని సూచించారు...

రాబోయే రోజుల్లో ఆలూరు నియోజకవర్గంలో పార్టీ కార్యక్రమాలను మరింత విస్తృతంగా చేపడతామని, ప్రతి గ్రామంలో పార్టీ కార్యకలాపాలు చురుకుగా కొనసాగించాలని శ్రీ బుసినే విరుపాక్షి గారు పేర్కొన్నారు... ఈ కార్యక్రమంలో YSRCP మండల కన్వీనర్, కో కన్వీనర్లు, MPP, వైస్ MPP, రాష్ట్ర & జిల్లా కమిటీ సభ్యులు, నియోజకవర్గం కమిటీ సభ్యులు మండల కమిటీ సభ్యులు సర్పంచ్లు, MPTC లు, BLA లు, YSRCP నాయకులు, కార్యకర్తలు, BVR అభిమానులు, పాల్గొన్నారు..

😎TEAM BCS ALUR 🇸🇱

#YSJagan
#Busine_Virupakshi #Aluru_Constitunecy_MLA
#YSRCongressParty #TorgetBVR_2029

1 week ago | [YT] | 88