Vijay sekhar
Janasena party ( State Secretary )
జనసేన పార్టీ ( రాష్ట్ర కార్యదర్శి )

#vijaysekharbethapudi


Vijei sekkhar

నేడు నేతాజీ సుభాష్ చంద్రబోస్ గారి 127వ జయంతి సందర్భంగా జనసేన పార్టీ మంగళగిరి నియోజకవర్గ ఇన్చార్జ్ చిల్లపల్లి శ్రీనివాసరావు గారి ఆదేశాల మేరకు మంగళగిరి నియోజకవర్గ కార్యాలయంలో నేతాజీ సుభాష్ చంద్రబోస్ గారి చిత్రపటానికి పూలమాలవేసి నివాళులర్పించిన పార్టీ నాయకులు, కార్యకర్తలు, వీర మహిళలు...

అనంతరం పార్టీ నాయకులు మాట్లాడుతూ స్వాతంత్ర సమరయోధులు, ఆజాద్ హింద్ ఫౌజ్ వ్యవస్థాపకులు నేతాజీ సుభాష్ చంద్రబోస్ జయంతి సందర్భంగా ఆ మహనీయుని సేవలను స్మరించుకుంటూ జనసేన పార్టీ తరఫున మా నివాళులు అర్పించడం జరిగిందని, ఆయనీ స్ఫూర్తితో మా పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారు జనసేన పార్టీని బలోపేతం చేస్తున్నారని, నేడు ఆంధ్ర రాష్ట్రంలో ప్రజలు మార్పు కోరుకుంటున్నారని అదేవిధంగా సైకో పాలన పోయి రాబోయే ఎన్నికల్లో జనసేన-టిడిపి ఉమ్మడి ప్రభుత్వం రాబోతుందని అన్నారు.

ఈ కార్యక్రమంలో జనసేన నాయకులు, పార్టీ కార్యకర్తలు, వీర మహిళలు, అభిమానులు పాల్గొన్నారు.

#SubhashChandraBose

#Janasena

Pawan Kalyan JanaSena Party JanaSena Veera Mahila Naga Babu Nadendla Manohar JanaSena Shatagni

2 years ago | [YT] | 2

Vijei sekkhar

నేడు సావిత్రిబాయి పూలే జయంతి

ఆడపిల్లల చదువు కోసం నిరంతరం పాటుపడిన మహిళా చైతన్యమూర్తి, సమాజంలో రుగ్మతలు రూపుమాపడానికి విశేష కృషి చేసిన సామాజిక ఉద్యమకారిణి సావిత్రిబాయి పూలే జయంతి సందర్భంగా వారికి ఘననివాళులు అర్పిస్తున్నాము.
@vijei_sekkhar ‪@JanaSenaParty‬ @pawankalyan

2 years ago | [YT] | 0

Vijei sekkhar

తేదీ:14/12/23

*అంగన్వాడీలకు అండగా జనసేన పార్టీ*

*గత మూడు రోజులుగా ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా అంగన్వాడి వర్కర్స్ రిలే నిరాహార దీక్షలు చేయడం జరుగుతుంది.దీనిలో భాగంగా తాడికొండ నియోజకవర్గం మేడికొండూరు మండలంలో ఈరోజు జనసేన పార్టీ తాడికొండ నియోజకవర్గ కోఆర్డినేటర్ బేతపూడి విజయ్ శేఖర్ మరియు మేడికొండూరు మండల పార్టీ అధ్యక్షులు రాచర్ల నాగబాబు మరియు పార్టీ నాయకులు రిలే నిరాహార దీక్షలో పాల్గొని అంగన్వాడీల దీక్షకు జనసేన పార్టీ అధ్యక్షులు శ్రీ పవన్ కళ్యాణ్ గారి తరపున సంఘీభావం తెలియజేయడం జరిగింది.

*ఈ సందర్భంగా బేతపూడి విజయ్ శేఖర్ మాట్లాడుతూ....

* అంగన్వాడీలు గ్రామాలలో గర్భిణి స్త్రీలకు మరియు చిన్న పిల్లలకు పౌష్టికాహారం అందించడంలో విశిష్టమైన సేవలు అందిస్తున్నారు.

* కేంద్ర ప్రభుత్వం మరియు రాష్ట్ర ప్రభుత్వాలు సంయుక్తంగా ఆయాలకు మరియు టీచర్లకు వేతనాలు ఇస్తున్న నేపథ్యంలో ప్రస్తుతం ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి పాదయాత్ర సమయంలో అంగన్వాడీలకు తెలంగాణ రాష్ట్రంతో పోల్చుకుంటే మన రాష్ట్రంలో వైసీపీ ప్రభుత్వం వచ్చాక వెయ్యి రూపాయలు ఎక్కువ ఇస్తానని హామీ ఇచ్చి గ్రాట్యూటీ,రిటైర్మెంట్ బెనిఫిట్స్ ఇస్తానని ఎన్నో హామీలు ఇచ్చి అంగన్వాడీల ఓట్లతో గద్దెనెక్కి ఈరోజు అంగన్వాడీలను అవమానకరంగా మాట్లాడటం బాధాకరమని తెలిపారు.

*ఈ సందర్భంగా అంగన్వాడి 25000 జీతం ఇవ్వాలని సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు గ్రాట్యూటీ పెంచాలని రిటైర్మెంట్ బెనిఫిట్స్ కింద 5 లక్షలు ఇవ్వాలని,PF, ESI, సదుపాయాలు కూడా కల్పించాలని జనసేన పార్టీ తరఫున డిమాండ్ చేశారు.

*అలాగే మేడికొండూరు మండల అధ్యక్షులు రాచర్ల నాగబాబు మాట్లాడుతూ.....

*జనసేన-టిడిపి ఉమ్మడి కూటమిలో ప్రభుత్వం ఏర్పడిన తర్వాత మొట్ట మొదటగా అంగన్వాడీల డిమాండ్లను తీర్చే దిశగా అడుగులు వేస్తుందని వారి సమస్యలను జనసేన అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారి దృష్టికి తీసుకువెళ్లి న్యాయం జరిగే వరకూ జనసేన-టిడిపి పార్టీల మద్దతు అంగన్వాడీలకు ఉంటుందని అన్నారు.

ఈ కార్యక్రమంలో మేడికొండూరు మండల ఉపాధ్యక్షులు కొరివి కుమార్,సోషల్ మీడియా కన్వీనర్ సైదియ్య, ఉపాధ్యక్షులు నాయక్,అలీ,రాజా,బ్రహ్మయ్య మరియు తదితర నాయకులు,కార్యకర్తలు పాల్గొనడం జరిగింది.

జై జనసేన
జై జై జనసేన

*ఇట్లు*
*జనసేన పార్టీ మేడికొండూరు మండల కార్యాలయం*
‪@JanaSenaParty‬

2 years ago | [YT] | 3

Vijei sekkhar

నేడు సర్దార్ వల్లభాయ్ పటేల్ గారి వర్ధంతి

స్వాతంత్య్ర సమరయోధులు, తొలి ఉప ప్రధాని, భారతదేశ ఐక్యతను ప్రపంచానికి చాటి చెప్పిన మహనీయులు, ఉక్కు మనిషి

శ్రీ సర్దార్ వల్లభాయ్ పటేల్ గారి వర్ధంతి సందర్భంగా వారికి ఘనంగా నివాళులు అర్పిస్తూ...

బేతపూడివిజయ శేఖర్ జనసేన పార్టీ రాష్ట్ర కార్యదర్శి
‪@JanaSenaParty‬

2 years ago | [YT] | 2

Vijei sekkhar

*నాదెండ్ల మనోహర్ గారి అరెస్టు అప్రజాస్వామికం...*

*ఆంధ్ర లో రాజా రెడ్డి రాజ్యాంగం నడుస్తుందా లేక భారత రాజ్యాంగం నడుస్తుందా...*

*వైసీపీ ప్రభుత్వానికి బీసీలు ఇప్పుడు గుర్తొచ్చారా..!*

- జనసేన మంగళగిరి ఇంచార్జ్ చిల్లపల్లి శ్రీనివాసరావు

తేదీ:12-12-2023(మంగళవారం)

ఈరోజు ఉదయం జనసేన పార్టీ మంగళగిరి నియోజకవర్గ కార్యాలయంలో మంగళగిరి ఇంచార్జ్ చిల్లపల్లి శ్రీనివాసరావు గారి అధ్యక్షతన మీడియా సమావేశం నిర్వహించడం జరిగింది.

ఈ సమావేశంలో చిల్లపల్లి శ్రీనివాసరావు గారు మాట్లాడుతూ

★విశాఖలో టైకూన్ జంక్షన్ మూసివేతను నిరసిస్తూ శాంతియుతంగా నిరసన తెలపడానికి వెళ్తున్న జనసేన రాజకీయ వ్యవహారాల కమిటీ ఛైర్మన్ శ్రీ నాదెండ్ల మనోహర్ గారిని విశాఖ నోవా టెల్ హోటల్ దగ్గర అడ్డుకుని పోలీసులు అరెస్టు చెయ్యడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నామని అన్నారు.

★స్థానిక ఎంపీ భవనానికి వాస్తు కోసం ప్రజలు నడిచే రోడ్డును ఎలా మూసివేస్తారు అని ప్రశ్నించడానికి వెళ్తే అడ్డుకోవడం పిరికి పంద చర్య అని తెలిపారు. ఈ వైసీపీ ప్రభుత్వంలో నిరసనలు తెలిపే అవకాశం లేదా!! ఆంధ్ర లో రాజా రెడ్డి రాజ్యాంగం నడుస్తుందా లేక భారత రాజ్యాంగం నడుస్తుందా అని మండిపడ్డారు.

★నాదెండ్ల మనోహర్ గారిని జనసేన నాయకుల పై పోలీసులు వ్యవహరించిన తీరను తప్పు బట్టారు. మునుముందు ప్రజా సమస్యలపై మరింత బలంగా పోరాటాలను ఈ ప్రభుత్వం ఎదుర్కోవాల్సి వస్తుందని తెలిపారు.

★మంగళగిరి వైసీపీ కొత్త ఇన్చార్జ్ 3 నెలలలో కూల్చివేసిన ప్రజావేదిక కడతారా, వైసీపీ ప్రభుత్వానికి బీసీలు ఇప్పుడు గుర్తొచ్చారని ప్రశ్నించారు.

★మంగళగిరి వైసీపీ ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి ఎమ్మెల్యే పదవికి, పార్టీకి రాజీనామా రాజకీయ ఎత్తుగడ అని ప్రజలందరూ గమనించాలని అన్నారు.

★జనసేన అధ్యక్షులు శ్రీ పవన్ కళ్యాణ్ గారు చేనేతలకు బ్రాండ్ అంబాసిడర్ గా ఉంటానని మాట ఇచ్చి మంగళగిరి నియోజకవర్గంలో బీసీ వర్గానికి చెందిన నన్ను జనసేన మంగళగిరి ఇన్చార్జిగా నియమించారని ఉన్నారు.

★ ఈ సందర్భంగా జనసేన నాయకులు మాట్లాడుతూ రాబోయే ఎన్నికల్లో మంగళగిరి నియోజకవర్గం లో కూడా జనసేన- టిడిపి ఉమ్మడి బీసీ వర్గానికి చెందిన అభ్యర్థికే ఎమ్మెల్యే సీటు ఇచ్చే విధంగా పార్టీ అధిష్టానాన్ని కోరుతామని అన్నారు.

ఈ మీడియా సమావేశంలో జనసేన పార్టీ రాష్ట్ర కార్యదర్శి బేతపూడి విజయ్ శేఖర్, గుంటూరు జిల్లా సంయుక్త కార్యదర్శి బడే కోమలి, MTMC అధ్యక్షులు మునగపాటి వెంకట మారుతీరావు, మంగళగిరి మండల అధ్యక్షులు వాసా శ్రీనివాసరావు, తాడేపల్లి మండల అధ్యక్షులు సామల నాగేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు.

2 years ago | [YT] | 4

Vijei sekkhar

🔯

2 years ago | [YT] | 0

Vijei sekkhar

2 years ago | [YT] | 82